Development Works Begin in Jammikunta Wards
జమ్మికుంట మున్సిపాలిటీ 3, 4,వ వార్డుల్లో సమస్యల పరిశీలన అభివృద్ధి పనుల ప్రారంభం
జమ్మికుంట,( నేటి ధాత్రి )
బుధవారం జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ దిలీప్ , వైస్ చైర్మన్ జావీద్, లు 3వ మరియు 4వ వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలు, ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నారు. స్థానికులతో మాట్లాడి, రోడ్లు మరియు మురుగు కాలువల (మోరీ)ల సమస్యలను పరిశీలించి, వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.దాదాపు 30 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న రహదారి పనులను బుధవారం నాడు ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ అజయ్, 3వ వార్డు కౌన్సిలర్ రాజు, 20వ వార్డు పరశురాంలతోపాటు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.వార్డుల సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తామని నాయకులు తెలిపారు.
