విద్యుత్ సబ్ స్టేషన్ల రూపకల్పన….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..
తంగళ్ళపల్లి మండలంలో. విద్యుత్ సరఫరా మరింత మెరుగుపరిచే విధంగా. తంగళ్ళపల్లి సెక్షన్ పరిధిలోని పాపాయిపల్లి గ్రామంలో ఏర్పాటు చేయనున్న నూతన.33/11. కే. వి. సబ్ స్టేషన్ ల.కు సంబంధించి. స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా. మాట్లాడుతూ నూతన.33/11. కే. వి. సబ్ స్టేషన్లకు సంబంధించి స్థలాలను .N.P.D.C.L. చీఫ్ ఇంజనీర్(ఆపరేషన్) శ్రీ అశోక్. పరిశీలిస్తూ సిరిసిల్ల ప్రాంతంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్.ను లోడ్ ను దృష్టిలో ఉంచుకొని వినియోగదారులకు నిరంతరాయంగా మరియు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు కొత్త సబ్ స్టేషన్లను ఏర్పాటు అత్యంత అవసరమని తెలుపుతూ. ప్రస్తుత పరిస్థితుల్లో లోడు పెరుగుదల కారణంగా ఏర్పడుతున్న వోల్టేజ్ సమస్యలను తగ్గించడంలో నూతన సబ్స్టేషన్లో కీలక పాత్ర పోషిస్తుందని. అదేవిధంగా సబ్ స్టేషన్ ఏర్పాటులో పాపాయ.పల్లె పరిసర గ్రామాలకు విద్యుత్ సరఫరా మరింత మెరుగైన విద్యుత్ సరఫరా అందించ.బడుతుందని. ట్రాన్స్ మిషన్. డిస్ట్రిబ్యూషన్. నష్టాల తగ్గి వ్యవస్థ సామర్థ్యం పెరుగుతుందని ఆయన వివరించారు. వినియోదారులకు అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తు డిమాండ్లు కూడా దృష్టిలో ఉంచుకొని ఈ సబ్ స్టేషన్ రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్ల ప్రాంతంలో విద్యుత్ మౌలిక వసతులు అభివృద్ధికి.( N.P.D.C.L.) ముందుంటుందని ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి పరిశీలన సందర్భంగా. సిరిసిల్ల సూపరిండెంట్ ఇంజనీర్ (ఆపరేషన్). శ్రీ. బి. బిక్షపతి. డివిజనల్ ఇంజనీర్ అంజయ్య. ఏడి. E. గోపీనాథ్. అసిస్టెంట్ ఇంజనీర్. మధుకర్. CH. పరశురాం. గ్రామ సర్పంచ్ తదితరులు అధికారులు పాల్గొన్నారు
