రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను అమ్మ ఆదర్శ పాఠశాల సందర్శనలో భాగంగా జిల్లా విద్యాశాఖ అధికారి సిహెచ్ జనార్ధన్ రావు సందర్శించారు. ఈసందర్భంగా అమ్మ ఆదర్శ పాఠశాలలో డ్రింకింగ్ వాటర్ పని పూర్తి త్వరగా చేయాలని డిఈవో తెలియజేయడం జరిగినది. ఈకార్యక్రమంలో మండల విద్యాధికారి వేణు కుమార్, సిఆర్పి, తదితరులు ఉన్నారు.