అక్రమ మద్యం సిండికేట్ ల పై ఏసిబి దాడులు చెయ్యాలి
భద్రాచలం నేటి ధాత్రి
మణుగూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో అశ్వాపురం, మణుగూరు, పినపాక, కరకగూడెం మండలాల్లో ఉన్న అక్రమ మద్యం సిండికేట్లను బెల్ట్ షాపులను అధిక ధరలను నియంత్రించాలని దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా పిచ్చయ్య మాట్లాడుతూ…. అశ్వాపురం, మణుగూరు, పినపాక, కరక గూడెం మండలాల్లోని మద్యం వ్యాపారులు అక్రమంగా సిండికేట్లు ఏర్పాటు చేసుకొని బెల్ట్ షాపులకు 20 రూపాయల నుంచి 30 రూపాయలు వరకు అధిక ధరలకు మద్యన్ని విక్రయిస్తున్నారు. ఈ బెల్ట్ షాపులు వాళ్ళు మరలా 20 నుంచి 30 రూపాయలకు అత్యధికంగా మద్యాన్ని విక్రయిస్తున్నారు. మద్యం సిండికేట్ దారులు అక్రమ దనార్జనే ధ్యేయంగా రోజురోజుకు బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నారు. గుడి, బడి అనే తేడా లేకుండా ఎక్కడబడితే అక్కడ బెల్ట్ షాపులు నిర్వహించడం వలన ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ బెల్ట్ షాపుల వలన కూలి పనులు చేసుకొని జీవించే నిరుపేద కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతూ కుటుంబ కలహాల వల్ల చిన్నాభిన్నం అవుతున్నాయి కుటుంబాలు. బెల్ట్ షాపులు ఎక్కడపడితే అక్కడ ఉండటం వలన మద్యం అందుబాటులో ఉండటం వలన యువకులు విద్యార్థులు మద్యనికి బానిసలై గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల విఘాతానికి కారకులవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగటానికి ప్రధాన కారణం ఈ బెల్ట్ షాపులే. ముఖ్యంగా మణుగూరు మండలంలోని దాదాపుగా 200 నుంచి 300 బెల్ట్ షాపులు నిర్వహిస్తూన్నారు. మణుగూరు పట్టణంలోని లారీ ఆఫీస్ నుంచి హనుమాన్ టెంపుల్ వరకు దాదాపుగా ప్రధాన రహదారికి ఇరువైపులా 150 బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి. మణుగూరు పట్టణంలో ప్రతి కాలనీలో నాలుగు నుంచి ఐదు బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. ఈ బెల్ట్ షాపులలో సిట్టింగులు ఏర్పాటు చేసి మరి విక్రయాలు జరుపుతున్నారంటే బెల్ట్ షాపుల్లో ఎంత అక్రమమధ్యం విక్రయిస్తున్నారో అర్థమవుతుందని అన్నారు. మద్యం వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడటం వల్ల ప్రతిరోజు కోట్లలో బ్లాక్ మనీ గా మారుతుంది. గతంలో మాదిరిగా ఈ సిండికేట్ ల మీద ఏసీబీ దాడులు జరపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తక్షణం అధికారులు స్పందించి ఈ అక్రమ సిండికేట్లను నియంత్రించి, బెల్ట్ షాపులను మరియు అధిక ధరలను నియంత్రించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.