పరకాల నేటిధాత్రి(టౌన్)
హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ప్రసిద్ధి గాంచిన శ్రీకుంకుమేశ్వర స్వామి దేవస్థానములో దేవీ శరన్నవరాత్ర మహోత్సవములు కోమాళ్ళపల్లి సంపత్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో అంగరంగా వైభవముగా నిర్వహించబడునని,ఉదయం 5గంటలకు సుప్రభాతసేవ,ఉత్సవఅనుజ్ఞ,సుగంధపరిమళద్రవ్యములతో అభిషేకం,ప్రధానకళశస్థాపన,
దీక్షాధారణ,అంకురారోపణ,
అఖండదీపస్థాపన, అగ్నిప్రతిష్ఠాపన శైలపుత్రి క్రమములో బ్రహ్మా చారిణీ శ్రీ గాయత్రి దేవిగా అలంకరించడం జరిగింది.
తెలిపారు.మంగళవారం అమ్మవారిని చంద్ర ఘంటా క్రమంలో శ్రీఅన్నపూర్ణా దేవిగా అలంకరించబడునని కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనలని దేవి ఆశీస్సులు పొందుకోవాలని ఆలయ చైర్మన్ గందే వెంకటేశ్వర్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో ఏకు రవికుమార్, కౌన్సిలర్ పూర్ణచారి భక్తులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ కుంకుమశ్వర ఆలయంలో అమ్మవారి అలంకరణ
