పంట పొలాల్లో మృత్యు పాశాలు…
పట్టించుకోని విద్యుత్ అధికారులు..
డబ్బులు చెల్లిస్తేనే మరమ్మత్తులు చేస్తామంటున్న అధికారులు..
జహీరాబాద్. నేటి ధాత్రి:
రైతులు పోలాల్లో సాగు చేసిన పంటలను కోత చేసి ఇంటికి తరిలించా లంటే విద్యుత్ వైర్ల కింది కి వేలాడడం వల్ల పంటను వదిలేయాల్సిన పరి స్థితి ఏర్పడింది. మండల కేంద్రమైన ఝరాసంగంలో ఓ రైతు పోలంలో
విద్యుత్ వైర్లు పోలాల్లో వేలాడడం కారణంగా చేతికి వచ్చిన పంటను కోయకుండా వదిలేయడంతో పాటు వైర్ల కింద దున్నకుండా వదిలేస్తు న్నారు. విద్యుత్ తీగలను సరిచేయాలని సంబంధిత విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. వేలా డుతున్న విద్యుత్ వైర్ల మధ్య లో విద్యుత్ స్తంభం ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారం అయిదానికి అధికారులు డబ్బులు చేల్లిస్తేనే మరమ్మతులు చేసా _మని చెప్పుతున్నారని వారు ఆరోపించారు. ప్రాణాలు పోతే తప్ప పట్టించు కోరా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని నెలల క్రితం ఝరాసంగం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మేకల మేత కోసం వెళ్ళి వేలాడుతున్న విద్యుత్ వైర్లు తాకడంతో మృతి చెందారు. ఇంత జరిగినా అధికారులు
పట్టించుకోకపోవడం దారుణంగా ఉందన్నారు.