కూకట్పల్లి జూలై 1 నేటి ధాత్రి ఇన్చార్జ్
124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మచెరు వులో గుఱ్ఱపుడెక్క పెరిగి దోమల బెడద ఎక్కువగా ఉందని పరిసర ప్రాంతాల ప్రజ లు సమస్యను స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కా ర్పొరేటర్ ఎంటమాలజీ సిబ్బందితో కలి
సి ఆకు తొలగించే యంత్రం సహాయంతో గుఱ్ఱపుడెక్కను తొలగించడం జరిగిం ది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లా
డుతూ దోమల నివారణలో భాగంగా ఎల్లమ్మచెరువులో ఉన్న గుఱ్ఱపుడెక్క
ను తొలగించడం జరుగు తుందన్నా రు.గుఱ్ఱపుడెక్కవల్ల దోమల వ్యాప్తి విపరీతంగా పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు.గుఱ్ఱపుడెక్కను తొలగించి చెరువును శుభ్రం చేస్తే దోమల బెడద తగ్గుతుందని తెలిపారు. ప్రజలు కూడా తమవంతు బాధ్యత వహించి పరిసరాలను పరిశు భ్రంగా ఉంచుకోవా లని అన్నారు.ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ కవర్లు, వ్యర్ధాలు చెరువులో కానీ నాలా
లో కానీ వేయొద్దని స్థానిక ప్రజలను కోరారు.చెత్తను వీధు ల్లోనూ కాలువలో ను కాకుండా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చెత్త సేకరించే ఆటో లలో మాత్రమే వేయాలని సూచించారు.వర్షాలు కురు స్తున్న నేపథ్యంలో అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ మీ ఇంటి దగ్గరికి వచ్చే ఎంటమాలజీ సిబ్బందికి సహకరించాలని అన్నారు. అదేవిధంగా ఇంటి పరిసరాల్లో ఎక్కువ రోజులు నీటి నిల్వలు లేకుండా చూసుకో వాలని చెప్పా రు.కార్యక్రమంలో సమ్మారెడ్డి,శివరాజ్ గౌడ్,బాలస్వామి,రాజుగౌడ్,ఎంటమాల
జీ సూపర్వైజర్ డి.నరసింహులు,ఎంట మాలజీ సిబ్బంది పాల్గొన్నారు.