
ముత్తారం :- నేటిధాత్రి
నవధాన్యాలను సాగు చేయడం ద్వారా జీవవైవిద్యం పెరిగి భూమికి ఎంతో మేలు జరుగుతుందని డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ కేశవాపూర్ రైతు ఉత్పత్తిదారుల సంస్థ క్షేత్ర పరిశీలకులు చెల్కల యుగేందర్,రాజశేఖర్ లు తెలిపారు.బుధవారం ముత్తారం మండలంలోని దర్యాపూర్ గ్రామంలో బిసిఐ క్షేత్ర పరిశీలకులు మాట్లాడుతూ నవధాన్యాలు భూమిలో చల్లిన సుమారు 20 రోజుల నేలలో కలియదున్నడం వలన నత్రజని స్థిరీకరించబడుతుందని,భూసారం పెరుగుతుందని,నేల గుల్లబారి మిత్ర పురుగులు వృద్ధి చెంది జీవవైవిద్యం పెరగడంలో దోహదపడతాయని,నేలలో తేమ శాతం పెరిగి,మొక్కకు కావాల్సిన పోషకాలు అందుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో కాల్వ శ్రీరాంపూర్ పియూ మేనేజర్ సాయి ప్రకాష్ రెడ్డి,రైతులు రాపెల్లి రాజయ్య,మందల కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు