కాంగ్రెస్ సిపిఐ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలి.
సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు పొత్తులో భాగంగా బలపరిచిన నలుగురు అభ్యర్థులతో పాటు 30 వార్డుల కౌన్సిలర్ అభ్యర్ధులను అధిక మెజార్టీతో గెలిపించాలని సిపీఐ జిల్లా కార్యదర్శి కొలిమి రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్ర వారం మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియ ముగిసిన సందర్భంగా స్థానిక కొమురయ్య భవన్లో మీడియాతో మాట్లాడారు.. కమ్యూనిస్టులు కాంగ్రెస్ అధికార పార్టీతో పొత్తుపెట్టు కోవడం జరిగిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మున్సిపల్ అభివృద్దిని కోరి ఉమ్మడి కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టు కోవడం జరిగిందని స్పష్టం చేశారు. నాలుగు వార్డులలో పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థులతో పాటు పొత్తు దర్మాన్ని పాటిస్తు 30 వార్డులలో అధిక కౌన్సిలర్ అభ్యర్ధులను గెలిపించుకొని మున్సివల్ చైర్మన్ వడవిని కాంగ్రెస్, కమ్యూనిస్టులు కైవసం చేసుకునే విధంగా ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని రాజ్ కుమార్ తెలిపారు.
సిపిఐ నుండి నామినేషన్ వేసిన కౌన్సిలర్ అభ్యర్థులు వీరే :
భూపాలపల్లి మున్సిపాలిటీలోని 30 వార్డులకు 2వ సాధారణ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది.ఈ మున్సిపల్ ఎన్నికలో ఉమ్మడి కమ్యూనిస్టులకు కాంగ్రెస్ పొత్తు కుదిరి సిపిఐకి 5,7,24,28 నాలుగు వార్డులు, సిపిఎంకి 27 ఒక్క వార్డును కేటాయించారు.అందు భాగంగా సిపిఐ నుండి 5వ వార్డులో గంగ సరం శ్రీనివాన్, 7వ వార్డులో నూకల భూలక్ష్మీచంద్రమౌళి, 24 వార్డు వేముల జ్యోతి శ్రీకాంత్,28 వార్డు సౌత్కు ప్రవీణ్ కుమార్ లు శుక్ర వారం నాలుగు వార్డుల్లో నామినేషన్ వేశారు. అట్లాగే 27 వార్డు సీపీఎం నుండి ఎర్రం అనూష సతీష్ కుమార్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.వీరుపార్టీకోసం, ప్రజాసమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది.గత మున్సిపల్ ఎన్నికల్లో రెండు వార్డులు సిపిఐ గెలుచుకోగా, ఈ సారీ మున్సిపల్ ఎన్నికల్లో 4 వార్డులు ఖచ్చితంగా సిపిఐ గెలుచుకునే అవకాశం ఉందని వారు ధీమా వ్యక్తం చేశారు
