గోవధ నిషేధం అమలు కఠినంగా అమలు చేయాలి – భజరంగ్ దళ్.
అచ్చంపేట/నేటి దాత్రి:
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శుక్రవారం డీఎస్పీని కలిసి, గోవధ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ అచ్చంపేట ప్రఖండా సంయోజక్ శివ చంద్ర మాట్లాడుతూ, గోవధ వల్ల సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. గోవులను రక్షించడం మనందరి బాధ్యత అని, దీనిని దృష్టిలో ఉంచుకొని అధికారులు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డీఎస్పీ గారు వినతి పత్రాన్ని స్వీకరించి, సమస్యను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో భజరంగ్ దళ్ కమిటీ సభ్యులు శివాజీ నరేష్, చందులాల్ చౌహాన్, అమర్, అజయ్, చైతన్య చారి, బాలకోటి తదితరులు పాల్గొన్నారు.