పోలీస్ స్టేషన్లో “రెడ్ హ్యాండెడ్” గా అవినీతి తిమింగలాలు

రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న “ఆనంద్ కుమార్”, రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ.

“నేటిధాత్రి” మేడ్చల్ జిల్లా

రాచకొండ పోలీసు కమిషనరేట్ కుషాయిగూడ పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై షఫీ, సీఐ వీరాస్వామిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. కుషాయిగూడకు చెందిన భరత్ రెడ్డి అనే వ్యక్తి తనకు చెందిన భూమికి సంబంధించి మరో వ్యక్తి భూ సమస్యపై గొడవలో బాగంగా రెవెన్యూ అధికారులు రెండు కేసులు నమోదు చేశారు. అయితే ఆ కేసులపై భరత్ రెడ్డి హైకోర్టుకు వెళ్లడంతో అతనిపై ఉన్న కేసుల్లో మార్పులు చేయాలని ఆదేశించారు. అయితే ఇందులో ఓ కేసుకు సంబంధించి భరత్ రెడ్డి పై కేసు పూర్తిగా తొలగించడానికి గాను మధ్యవర్తి ఉపేందర్ అనే వ్యక్తి ద్వారా ఎస్సై షఫీ, సీఐ వీరాస్వామిలు మూడు లక్షల రూపాయలకు డీల్ కుదుర్చుకుని అన్ని మాట్లాడుకున్న తర్వాత శుక్రవారం నాడు భరత్ రెడ్డి కుషాయిగూడలోని తన కార్యాలయంలో మధ్యవర్తి ద్వారా మూడు లక్షలు రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ కేసులో ఎస్సై షఫీ, సీఐ వీరాస్వామి, మధ్యవర్తి ఉపేందర్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని ఆనంద్ కుమార్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!