నిర్మాణ పనులను వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
https://youtu.be/NoviIp1TUK4?si=EohsYI-9HsxUTNf_
అమృత్ పథకంలో భాగంగా చేపట్టిన నీటి ట్యాంకుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.మంగళవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమృత పథకం క్రింద చేపట్టిన నీటి ట్యాంకుల నిర్మాణ పనులను మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు నిరంతరం త్రాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని,ఈ క్రమంలో అమృత్ పథకంలో భాగంగా చేపట్టిన నీటి ట్యాంకుల నిర్మాణం, పైప్ లైన్ల ఏర్పాటు పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం నస్పూర్ మండల కేంద్రంలో కొనసాగుతున్న బాల సదనం నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో 1 కోటి 34 లక్షల రూపాయల మిషన్ వాత్సల్య అంచనా నిధులతో బాలసదనం భవన నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని,పనులు త్వరగా పూర్తిచేసేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
