– 16 కోట్ల రూపాయలు బ్యాంకుకు ఎగనామం
– జర్నలిస్టుల దగ్గర డబ్బులు వసూలు చేసిన ఘనత
– ఎన్ని కోట్ల రూపాయలు తీసుకోని సిరిసిల్లలో పోటీ చేశావు
– రాణి రుద్రమదేవి పై మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు
సిరిసిల్ల, మే – 2(నేటి ధాత్రి):
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాముని వనిత, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు వెలుముల స్వరూప మాట్లాడుతూ నిన్నటి రోజున పొన్నం ప్రభాకర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన రాణి రుద్రమదేవి పైన తీవ్రంగా ధ్వజమెత్తారు. ఐదు కోట్ల రూపాయలు గంగుల కమలాకర్ దగ్గర తీసుకొని హుస్నాబాద్ లో పోటీ చేశారని నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. ఆధారాలు లేకుండా ఎది పడితే అది మాట్లాడం సరికాదని అన్నారు. 16 కోట్ల రూపాయలు బ్యాంకుకు ఎగనామం పెట్టిన ఘనత రాణి రుద్రమదేవికి ఉందని తెలిపారు. జర్నలిస్టుల దగ్గర డబ్బులు వసూలు చేసిన ఘనత నీకే ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ స్కామ్ ల పార్టీ కాదు స్కీముల పార్టీ గుర్తుపెట్టుకోనని అన్నారు. అంతేకాకుండా ఎక్కడినుండో వచ్చి సిరిసిల్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేశావు మీరెన్ని కోట్ల రూపాయలు తీసుకొని పోటీ చేశారని అన్నారు. తెలంగాణ పార్టీ పెట్టి ఆస్తులు రాయించుకున్న ఘనత మీదేనని అన్నారు. పొన్నం ప్రభాకర్ కరీంనగర్ ఎంపీగా గెలిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడైనా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి అన్నారు. ఖబర్దార్ రాణి రుద్రమదేవి ఇంకోసారి నోటికి వచ్చినట్టు మాట్లాడితే తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఇట్టి కార్యక్రమంలో కాముని వనిత మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు, వెలుముల స్వరూప పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలు, అరుణ ప్రధాన కార్యదర్శి, రోజా ఉపాధ్యక్షురాలు, జయలక్ష్మి వార్డు అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ స్కీముల పార్టీ
