కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ప్రజా భవన్ క్యాంపు కార్యాలయంలో కరకగూడెం మండలం రేగళ్ల గ్రామ పంచాయతీలోని మదన్నగూడెం చింతలగుంపు గ్రామాల రైతులు మరియు ప్రజల యెుక్క పోడు భూముల సమస్య మరియు కరెంట్ విద్యుత్ సదపాయం అందించాలని అక్కడి ప్రజలతో కలిసి పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లులకి వినతిపత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ,
ప్రజల యొక్క పూర్తి సమస్యలను క్లుప్తంగా తెలుసుకొని త్వరలో వారి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు..
ఈ కార్యక్రమంలో
మాజీ సర్పంచ్ కుంజా వసంతరావు, ఉప సర్పంచ్ బడిష లక్ష్మి నారాయణ మండల నాయకులు తొలెం నారాయణ ,కార్యకర్తలు యువకులు గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు…