సొంతింటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మున్సిపాలిటీ కేసముద్రం విలేజ్ పరిధిలోని ఎన్.టి.ఆర్ నగర్ లోని జాటో అమ్మి గారి ఇంటి నిర్మాణానికి భూమి పూజా కార్యక్రమం సోమవారం నిర్వహించ డం జరిగింది. ఈ కార్యక్రమంలో 16 వార్డు కౌన్సిలర్ వల్లందా ఉమా రవి మరియు ఇందిరమ్మ కమిటీ సభ్యులు కీర్తి శ్రీలత సో సు కాండ్ల సుభాష్ రెడ్డి అజ్మీరా రమేష్ పాల్గొని భూమి పూజ నిర్వహించి నూతన ఇందిరమ్మ ఇంటికి ముగ్గు పోయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహబూబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కీర్తి సురేందర్ మాట్లాడుతూ మహబూబాబాద్ నియోజకవర్గంలో ప్రతి అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకుంటున్న మహబూబాబాద్ శాసనసభ్యులు బొక్కి అమూరి నాయక్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. గత ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెప్పి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక మాట తప్పి మోసం చేసిందని అర్హులైన పేదవాళ్లకు డబుల్ బెడ్ రూమ్ తిండియకుండా పది సంవత్సరాలు కాలయాపన చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాట తప్పకుండా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన ప్రతి పేదవాళ్లకు మంజూరు చేస్తుందని పేదింటి కల నిజం చేస్తుందని రానున్న రోజులలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు .ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు కత్తెర శాల శ్రీనివాస్ నాయకులు ఒల్లందాస్ రవి పోలేపాక నాగరాజు తండావాసులు తదితర కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది.
