Congress Candidate Visits Ashram on Datta Jayanti
దత్త జయంతి సందర్భంగా ఆశ్రమాన్ని దర్శించిన కాంగ్రెస్ అభ్యర్థి
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచెల్మెడ గ్రామ పంచాయతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రుద్ర గాయత్రి, గురువారం దత్త జయంతి సందర్భంగా ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామంలోని ఆశ్రమానికి వెళ్లి శ్రీ శ్రీ శ్రీ వైరాగ్య శిఖామణి అవదూత గిరి మహారాజ్ ను దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు రుద్ర కృష్ణ, మాజీ సర్పంచ్ గాజుల బాల కిష్టయ్య, వార్డు అభ్యర్థులు, నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
