కూకట్పల్లి జూన్ 19 నేటి ధాత్రి ఇంచార్జ్
కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని కెపిహెచ్బి రోడ్ నెంబర్ 2 లో ఉన్న సాయిబాబా గుడి వద్ద గవర్నమెంట్ స్కూల్లోని విద్యార్థులకు బుక్స్, ఇతర సామాగ్రి పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.ఈ కార్యక్రమం 114 డివిజన్, 115 డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో ముఖ్యఅ తిథిగా కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రె
స్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ తో పాటు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డితో కలిసి మన ప్రధాని అభ్యర్థి ప్రియతమ నేత రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా ఇరువురు రమ్య గ్రౌండ్ వద్ద కేక్ కట్ చేసి పలువురు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కార్యకర్తలకు పంచి పెట్టారు.ఈ సందర్భంగా బండి రమేష్, శేరి సతీష్ రెడ్డి మాట్లాడుతూ…. బిన్న త్వంలో ఏకత్వం మన భారత దేశమని దాని కాపాడడానికి రాహుల్ గాంధీ భార త జూడో యాత్ర కొన్ని వేల కిలోమీటర్లు చేపట్టారని వారన్నారు.భవిష్యత్తులో కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ యేనని తెలిపారు.