అవగాహన కార్యక్రమం నిర్వహణ

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో దేశి(డిఎఈఎస్ఐ) రైతు శిక్షణ కేంద్రం కరీంనగర్ ఆద్వర్యంలో నలబై మంది డీలర్లకు రైతు ఎడవెల్లి కిషన్ రెడ్డి మల్బరీ తోటల పెంపకం, పట్టుపురుగుల పెంపక యూనిట్ లో మెళకువలు, రైతు బొమ్మరవేణి తిరుపతి మామిడితోటలో అంతర పంటలుగా సాగు చేస్తున్న కూరగాయల తోటలను సందర్శించి వాటిలో వచ్చే తెగుళ్ళు, యాజమాన్య పద్ధతులను వివరించారు. ఈకార్యక్రమంలో రైతు శిక్షణ కేంద్రం కరీంనగర్ వ్యవసాయ అధికారి మమత, వివిధ మండలాల డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!