అధైర్య పడొద్దు అండగా ఉంటాం
తొర్రూరు పట్టణంలో శ్రద్ధాంజలి, పరామర్శ కార్యక్రమాలు నిర్వహించిన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు.
తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి
తొర్రూరు పట్టణంలోని 16వ వార్డుకు చెందిన గుర్రాల మధుకర్ రెడ్డి కుమారుడు సాయి నవనీత్ రెడ్డి ఇటీవల మృతిచెందగా, ఈరోజు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
తదనంతరం, పట్టణంలోని 2వ వార్డులో సీతమ్మగారు ఇటీవల మృతిచెందిన నేపథ్యంలో, వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు, వారికి తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమాల్లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సోమరాజ శేఖర్, సీనియర్ నాయకులు పెద్దగాని సోమన్న, తునం శ్రావణ్, బసనా బోయిన రాజేష్ యాదవ్, చెవిటి సుధాకర్, అలాగే పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు పాల్గొన్నారు