ములుగు జిల్లా నేటిధాత్రి
ములుగు జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె పంతొమ్మిదో రోజుకు చేరుకుంది శనివారం రోజు సమ్మెలో భాగంగా వినూత్నంగా ఉద్యోగులంతా చెవిలో పువ్వు పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చల్లా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత సంవత్సరం టీపీసీసీ అధ్యక్షులుగా ఉండి సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాన్ని చెవిలో పువ్వు పెట్టినట్టుగా చేసి మాట తప్పకూ డదని ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నారు గనుక వెంటనే స్పందించి ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని ఆలస్యమైతే ఆలోపు పేస్కేల్ మరియు ప్రభుత్వ ఉద్యోగుల వలె సిసిఎల్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్షా ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేయాలని పిటిఐలకు 12 నెలల వేతనం ప్రతీ ఉద్యోగికి జీవిత భీమా 10 లక్షలు ఆరోగ్య భీమా 5లక్షలు మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు 61 సం.లు నిండిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇట్టి కార్యక్రమంలో బంజారా ఐక్యవేదిక ములుగు జిల్లా అధ్యక్షులు సోమానాయక్, ఆల్ పెన్షనర్స్ ములుగు జిల్లా జనరల్ సెక్రెటరీ దేవ్ సింగ్, కోశాధికారి బాలు నాయక్ మాజీ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ పోరిక రవీందర్ ములుగు జిల్లా సాంస్కృతిక కార్యదర్శి డాక్టర్ పోరిక శ్యామల నాయక్ బంజారా ఐక్యవేదిక సభ్యులు కొర్ర రాజన్న, అజ్మీర భావ్ సింగ్ లు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చల్లా భాస్కర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి సోమిడి కరుణాకర్ కోశాధికారి కుమార్ పాడియా ఉపాధ్యక్షులు ఎండీ ఫిరోజ్ కార్యవర్గ సభ్యులు సుజాత రమేష్ సమన్వయకర్తలు రాజేశ్వరి స్వప్నలత ప్రవీణ్ దేవేందర్ సుబ్బారెడ్డి తిరుమల చందన స్పెషల్ ఆఫీసర్లు భాగ్యలక్ష్మి పుష్పనీల అశ్విని వెంకటలక్ష్మి లలిత ఉమాదేవి ప్రతిభ శాంత విజయలక్ష్మి రమణి తదితరులు పాల్గొన్నారు