ప్రభుత్వ భూమి కబ్జా చేశారని కలెక్టర్ కు ఫిర్యాదు.

ప్రభుత్వ భూమి కబ్జా చేశారని కలెక్టర్ కు ఫిర్యాదు.

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దాయపల్లి గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారి దగ్గరలోని అయ్యప్ప దేవాలయం సమీపంలోని ఓ వెంచర్ లో అక్రమాలు జరిగాయని గురువారం కలెక్టర్ కు రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య ఫిర్యాదు చేశారు. సర్వే నెం. 102లో 2ఎకరాలు, సర్వే నెం.105లో 0.20 గుంటల భూమి కబ్జా చేశారని ఫిర్యాదులు తెలిపారు. ఆక్రమణకు గురైన భూమి విలువ బహిరంగ మార్కెట్లో ఎకరం రూ. 4 కోట్ల విలువ ఉందని అక్రమంగా ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేసిన వెంచర్ యజమాని పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!