ప్రభుత్వ కళాశాలలో ఘనంగా కాలేజ్ డే వేడుకలు

 లక్షెట్టిపేట (మంచిర్యాల) నేటి దాత్రి: స్థానిక లక్షెట్టిపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాలేజ్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులందరికీ భవిష్యత్తులో మంచి స్థానంలో ఉండాలని, కళాశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, ఏలాంటి చెడు వ్యసనాలకులోను కావద్దని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రిన్సిపల్ అజిత్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *