
Citizens Demand Divisional Panchayat Office
జహీరాబాద్ లో డివిజనల్ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేయాలనీ ప్రజావాణి పిర్యాదు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ప్రజా పాలన ప్రభుత్వం అని ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని పలుమార్లు ముఖ్యమంత్రి పదే పదే ప్రసంగాలు చేసి చేప్పు తున్నప్పటికి అవేవి పట్టనట్టు కొందరు అధికారులు వేవహరిస్తున్న తీరును విసుకుచ్చేంది. సోమవారం ప్రభుత్వం నిర్వహించే ప్రజావాణిలో జహీరాబాద్ లో డివిజనల్ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేయాలని జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలు ప్రజావాణి లో పిర్యాదు చేయడం జరిగింది.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చోరువ తీసుకొని డివిజన్ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజలకు అదుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. లేని పక్షంలో ముఖ్యమంత్రి పెషిలో మరియు పంచాయతీరాజ్ కమీషనర్ కార్యాలయం లో పిర్యాదు చేస్తామని పిర్యాదుదారులు తెల్పడం జరిగింది. ముఖ్యమంత్రి మాటలు అగౌరవపరచకుండా అధికారులు చూసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.