Independent Candidate Sirisha Promises Transparent Ward Development
ఇండిపెండెంట్ సర్పంచ్ వార్డ్ అభ్యర్థి గా చుక్క శిరీష
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని కౌకొండ గ్రామంలో సర్పంచ్ 2 వ వార్డు మెంబర్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా చుక్క శిరీష పోటీ చేస్తున్నారు. వార్డు అభివృద్ధి,ప్రజల సమస్యల పరిష్కారం, పారదర్శక సేవలే తన ప్రధాన లక్ష్యాలు అని ఆమె తెలిపారు.వార్డు ప్రజలకు మాటలతో కాక, పనులతో నిలబడే నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. చుక్క శిరీష మాట్లాడుతూ కౌకొండ వార్డులో ఇంకా పరిష్కారంకాని అనేక సమస్యలు ఉన్నాయి.బస్సు సర్వీస్,తాగునీరు,రోడ్లు, శుభ్రత,స్ట్రీట్లైట్లు,డ్రైనేజ్ వంటి ప్రాథమిక సదుపాయాల మెరుగుదలకు నేను ముందుండి పోరాడతా. ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే, మీలో ప్రతి ఒక్కరి ఇంటి సమస్యను నా ఇంటి సమస్యగా భావించి పని చేస్తా అని అన్నారు.పార్టీల వాగ్దానాలు కాక,ప్రజల మధ్యే ఉండి వారి మాట విని పనిచేయడం తన ధ్యేయమని శిరీష పేర్కొన్నారు.స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డా నా గ్రామ ప్రజలే నాబలం మీ నమ్మకం మీ ఆశీర్వాదమే నా విజయం.అభివృద్ధి కోసం ఒక సారి అవకాశం ఇవ్వండి సేవలో వెనుకాడను అని గ్రామ వార్డు ప్రజలను ఉద్దేశించి చుక్క శిరీష స్పష్టం చేశారు.
