
చిట్యాల, నేటిధాత్రి :
తిరుమలపూర్ లోబిఆర్ఎస్ నాయకులు నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి హాజరైన చిట్యాల జెడ్పీటీసీ గొర్రె సాగర్ భూపాలపల్లి నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణా రెడ్డి కారు గుర్తుకు ఓటు వేయాలని, కార్యకర్తలు అందరూ సమిష్టిగా పని చేస్తూ ముఖ్యమంత్రి చేసిన ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ పాలన అంటే కరెంటు కష్టాలు,
కాంగ్రెస్ పాలన అంటే* ఆడబిడ్డలు తాగునీటి కోసం ఖాళీ బిందెలతో ధర్నాలు,ఎరువుల కోసం రైతన్నలు క్యూలైన్లు,రైతన్నల ఆత్మహత్యలు,నేతన్నల ఆత్మహత్యలు ..అప్పట్లో కరెంటు ఉంటే వార్త. కానీ ఇప్పుడు కరెంటు పోతే వార్త అన్నట్లు కరెంటు సమస్యలను తీర్చాడు ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే *మహిళలందరికి నెలకు రూ.3000లభృతి..రైతుబంధును రూ.16000లకు పెంచుతాం.. గ్యాసి సిలిండర్ నాలుగు వందలకేఅందిస్తాము..ప్రతి ఇంటికి కేసీఆర్ బీమా కింద రూ.500000 ధీమా, సన్నబియ్యం పంపిణీ,ఆరోగ్య శ్రీని పదిహేను లక్షలకు పెంచుతాం.. పని చేసే ప్రభుత్వాన్ని దీవించండి. మీతో ఉంటా.మీ మధ్యలో ఉంటా “అని అన్నారు.ఈ కార్యక్రమంలో చిట్యాల, తిరుమలపూర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళ నాయకులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.