ఫోటో గ్రాఫర్ ను పరామర్శించిన చిలువేరు సమ్మి గౌడ్
కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి:
కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ బండారు శీనుకు ఇటీవల పక్షవాతం వచ్చి వరంగల్ హాస్పిటల్ నుండి తిరిగి ఇంటికి చేరుకున్న విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి గురువారం పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు…అనంతరం వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, ఇకనుండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఫిజియోథెరపీ ద్వారా త్వరగా కోలుకుంటావని, ఇక నుండి అన్ని విధాల మా యొక్క సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో చీకటి కిరణ్,బండారు గోపి పబ్బతి సారంగం, మోరపాక యాకయ్య, రేగుల వెంకటరమణ, ఎసల్ల సత్యనారాయణ, చాగంటి శ్రీను,కొండేటి కళాధర్,పబ్బతి ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.