ఖమ్మం, నేటి ధాత్రి:
సమస్త జీవావలి తమ మనుగడతో పాటు జీవవైవిధ్యాన్ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరు మొక్కలు నాటడమే కాకుండ వాటిని సంరక్షణ భాద్యత కూడా తీసుకున్నప్పుడే పర్యావరణ రక్షించబడుతుందని పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాకం శ్యామ్ బాబు, కార్యదర్శి కొండమీద వెంకట్ తెలిపారు. ఈరోజు బుధవారం స్థానిక పెవిలియన్ గ్రౌండ్ నందు వాకర్స్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా పెవిలియన్ గ్రౌండ్లో కరాటే శిక్షణ పొందుతున్న చిన్నారులతో కలిసి నడక సాదకుల ఆద్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి ఏటా జూన్ 5న పౌర సమాజం విధిగా జరుపుకుంటున్నారని అందరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడ్తారని తెలియజేశారు. పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రపంచ అవగాహనను పెంచడానికి ఈ రోజున ప్రభుత్వాలు కూడా కొన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. 1972 జూన్ 5 వ తేది నుంచి 16 వ తేది వరకు మానవ పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి సమావేశం అయిందని. ఈ సందర్భంగా 1972 లో యునైటెడ్ నేసన్స్ జనరల్ అసెంబ్లీ ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏర్పాటు చేయబడిందని. 1973 లో మొదటిసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నారని. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5 తేదిన అనేక నగరాలలో విభిన్న రీతులలో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని వైభవంగా జరుపుకుంటున్నారని తెలిపారు. ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అన్ని మొక్కలు నాటాలని అదేవిధంగా కుటుంబంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలలో కూడా మొక్కలు విధిగా నాటాలని కోరారు.
ఈ రోజు జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో కార్మిక నేత మంద వెంకటేశ్వర్లు, తోటపల్లి.కాశ్వీ, వెంకట్, సుదర్శన్ గ్రానైట్ భాస్కర్, మార్కెట్ రవి, హరిబాబు, శేఖర్, రమేష్ , భాస్కర్ రెడ్డి,కృష్ణయ్య, కరాటే మాస్టర్స్ బాబు, పాషా, షేక్ .షాకీరా, డి. ఝాన్సీ, కె.అశ్వీత,
యు.రామకృష్ట,కె.హర్ష, డి.సంగీతా, వి.రుషీకా, పి.సత్యకావలి,యం.వాహిణి వాసిని,యం.నిహారిక,యస్.డి.అలీషా, యస్.డి.అలీనా, యస్.డి. అలీఫా, వి.అర్షిత, వి. అక్షిత, ఆర్.ప్రసన్న, ఆర్. వరుణ్, పి.యుగేందర్ తదితరులు ఉన్నారు.