# గ్యారంటీ,వారంటీ లేని కాంగ్రెస్ పార్టీ పథకాలు చెత్త బట్టల్లోకే..
# ఐదేండ్ల నుండి పత్తలేని దొంతి మాధవరెడ్డి ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నాడు..
# ఇద్దరు మాజీలు రాత్రికి రాత్రే ఒక్కటయ్యారు.
# నర్సంపేటలో డాక్టర్ విద్య చదువుకునే వ్యసులుబాటు..
# నేను ప్రజా సేవకే అంకితం అయ్యాను..
# అరు పథకాలతో కాంగ్రెస్ పార్టీ కొత్త దుకాణం..
# నర్సంపేటకు వేల కోట్ల రూపాయల వరదలా తెచ్చిన బిద్దను..
# బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
# నల్లబెల్లి మండలంలో మొదలైన రెండవ విడత ఎన్నికల ప్రచారం..
# బోనాలు,బతకమ్మలు,మంగళ హారతులతో మహిళల నీరాజనాలు..
# ఎక్కడ చూసినా గులాబీ జెండాలే..
# గులాబీ శ్రేణుల్లో పెరిగిన రిట్టింపు ఉత్సాహం
నర్సంపేట,నేటిధాత్రి :
చావునోట్లో తలపెట్టీ తెలంగాణ తెచ్చిన వ్యక్తి కేసీఆర్,తెచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చిన వ్యక్తి కేసీఆర్,ప్రాజెక్టులు తెచ్చిన వ్యక్తి కేసీఆర్,రైతులకు అండగా నిలిచిన వ్యక్తి కేసీఆర్,సంక్షేమ పథకాలు తెచ్చిన వ్యక్తి కేసీఆర్,దేశం చూపు తెలంగాణ వైపుకు మళ్లించిన వ్యక్తి కేసీఆర్ ,దేశంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపిన వ్యక్తి కేసీఆర్ నేడు తెలంగాణకు రక్షకుడుగా మారింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని నర్సంపేట బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శనివారం రెండవ విడత ప్రచారాన్ని నల్లబెల్లి మండలంలోని పోచంపల్లి బోల్లోనిపల్లి గ్రామంలో ప్రారంభించారు.ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఆయా గ్రామాలలో,పల్లెల్లో బతుకమ్మలు, బోనాలు,మంగళ హారతులతో మహిళల నీరాజనాలు పలికారు.పలువురు మహిళలు వీర తిలకం దిద్ది గెలుపు ధీమాను వ్యక్తం చేశారు.డప్పు చప్పుళ్ళు,కోలాటాలు ప్రదర్శిస్తూ పూల వర్షాలు కురిపించారు.పోచంపల్లి బొల్లోనిపల్లి గ్రామం నుండి సాగిన ప్రచార యాత్ర కన్నారావుపేట,అర్షనపల్లి,శనిగరం, రుద్రగూడెం గ్రామాల మీదుగా నారక్కపేట గ్రామంలో ముగిసింది.ఆయా గ్రామాలలో సాగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ,భాజపా పార్టీలపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విరుచుకుపడ్డారు.60 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని ఎద్దేవా చేశారు.
గ్యారంటీ,వారంటీ లేని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో 6 పథకాలు చెత్త బట్టల్లోకే వెళ్ళడం ఖాయమని ఆరోపించారు.దొంతి మాధవరెడ్డిపై నమ్మకం లేని కాంగ్రెస్ పార్టీ 2014లో టికెట్ ఇవ్వలేదని గెలిచిన ఆయన నియోజకవర్గంలో తట్టెడు మట్టి పోయలేదని,నేడు కాలం చెల్లిన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వగా ఐదేండ్లుగా పత్తాలేని మాధవరెడ్డి మల్ల ఓట్ల కోసం వస్తున్నాడని విమర్శించారు.అరు పథకాలతో కాంగ్రెస్ పార్టీ కొత్త దుకాణం తెరిచి ప్రజలను మభ్యపెడుతున్నారని ఐనప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం పతాకాలపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని పేర్కొన్నారు.ఎమ్మెల్యేగా గెలిచిన రెండు సంవత్సరాలు కరోనా సమయానికే హృదా కాగా మిగిలిన 3 సంవత్సరాలలో నర్సంపేటకు వేల కోట్ల రూపాయల నిధులను వరదలా తెచ్చిన మీ బిద్దను అని చెప్పారు.
ఒక్క సారి గెలిస్తేనే ఇంత అభివృద్ధి చేసిన మరల అన్ను గెలిపిస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో ఆలోచించుకోవలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.వడగండ్ల వానకు పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు నష్టపరిహారం అందించినా.. దేశంలో ఎక్కడైనా ఉన్నదా.. అని ప్రజలను వివరించారు.పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చింది అలాగే నర్సంపేట విద్యార్థులకు డాక్టర్ విద్య చదువుకునే వ్యసులుబాటు తెచ్చానని,అవకాశం దొరికితే రైతులకు,ప్రజలకు ప్రత్యేక పథకాలు.పైలెట్ ప్రాజెక్టు పనులు తెచ్చిన మీ బిడ్డను అని పెద్ది తెలియజేశారు.గెలిచిన నాటి నుండి ప్రజలకు అందుబాటులో ఉంటూ
నేను ప్రజాసేవకే అంకితమయ్యానని ఎమ్మెల్యే పెద్ది పేర్కొన్నారు.ఇప్పటికే వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు పూర్తికాగా మరి కొన్ని పనులు వివిధ దశల్లో ఉన్నాయని అవి పూర్తి కావాలంటే మరోసారి నేనే గెలవాలని లేకుంటే ఎదుటి వాళ్ళు గెలిస్తే ఇప్పటి పథకాలు తుంగలో తొక్కేస్తారని ఎమ్మెల్యే పెద్ది వివరించారు.వార్డ్ మెంబర్ నుండి ముఖ్యమంత్రి వరకు బిఅర్ఎస్ ఉంటే అభివృద్ధి సాధ్యం అని తెలిపారు. నా మీద రాజకీయ కుట్రతో ఇద్దరు మాజీలు రాత్రికి రాత్రే ఒక్కటయ్యారని, ఒకరు ఇక్కడ మరొకరు బయటకు పోయారని ఆరోపించారు. నర్సంపేట గతంలో అల్లర్లలో ఉండేది ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పనుండి ప్రశాంతంగా ఉన్నదని బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.కాగా ఎమ్మెల్యే పెద్ది ప్రచారంలో గ్రామాలు గులాబీమయం కాగా బిఅర్ఎస్ శేణుల్లో రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోయారు.ఈ ప్రచార కార్యక్రమాలలో ఎమ్మెల్యే సతీమణి జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న,మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బానోతు సారంగపాణి,ఎంపిపి ఊడుగుల సునీత ప్రవీణ్ గౌడ్,వైస్ ఎంపిపి గందె శ్రీలత శ్రీనివాస్ గుప్తా,చెట్టుపెల్లి మురళీధర్ రావు,కక్కర్ల శ్రీనివాస్ గౌడ్,తిప్పని రవీందర్ గౌడ్,సృజన లింగమూర్తి గౌడ్,నిర్మల రవీందర్ రెడ్డి,సమ్మయ్య నాయక్,పలువురు ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.