చందుర్తి, నేటిధాత్రి:
గోదావరి జలాలు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని జోగారావు పంప్ హౌస్ ద్వారా సోమవారం నీటిని విడుదలకు మోటార్లు ప్రారంభించిన చందుర్తి మండల జెడ్పిటిసి నాగం కుమార్. ఈ సందర్భంగా నాగం కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చినంక గోదావరి జలాలను మన మండలంలోని అన్ని గ్రామాలకు మల్యాల గ్రామం పంప్ హౌస్ ద్వారా ప్రారంభించడం జరిగిందని తెలిపారు ప్రతి రైతు కాల్వల ద్వారా వచ్చే నీటిని వినియోగించుకుని పాడి పంటలను పండించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపండు రామస్వామి, ఈసరి శ్రీనివాస్, మల్లారం రాజయ్య, ఈర్ల రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.