*ప్రజా అభ్యున్నతికి కోసం పాటు పడే గొప్ప ప్రజా సేవకులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..
*జనం మెచ్చిన నేత, రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన రాజకీయ వేత్త..
*ముఖ్యమంత్రి పదవికే వన్నె తెచ్చిన ప్రజాప్రతినిధి తెలుగు ముద్దుబిడ్డ చంద్రబాబు..
*భావితరాలకు ఆదర్శనీయులు, అభివృద్ధికి మారు పేరు..
*చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను…
*చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు…
కుప్పం(నేటి ధాత్రి:
ప్రజా అభ్యున్నతికి కోసం పాటు పడే గొప్ప ప్రజా సేవకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు కొనియాడారు.
ప్రజల గురించి ఆలోచించే చంద్రబాబు లాంటి నిత్య శ్రామికులు మరొకరు లేరుని
కుండబద్దలు కొట్టారాయన.
మూడు రోజుల పర్యటన నిమిత్తం కుప్పం నియోజకవర్గానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మొదటి రోజు హెలిప్యాడ్ వద్ద సాదర స్వాగతం పలికిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.., రెండో రోజు కుప్పంలో నిర్వహించిన పేదల సేవలో ప్రజా వేదిక సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కలసి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర సాధనకు అహర్నిశలు శ్రమిస్తున్నారని, సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు చేరువ చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపి,
జనం మెచ్చిన నేతగా,..ప్రజలు హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని ప్రశంసించారు.
అలాగే సమకాలీన రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన రాజకీయ వేత్తగా ఎదిగారని,
ముఖ్యమంత్రి పదవికే వన్నె తెచ్చిన ప్రజాప్రతినిధిగా.., తెలుగు ముద్దుబిడ్డగా.., చంద్రబాబు ఖ్యాతి గడించారని అభినందించారు.
భావితరాలకు ఆదర్శప్రాయంగా.., అభివృద్ధికి చిరునామాగా చంద్రబాబు కీర్తి ప్రతిష్టలు ఆర్జించి, నవ సమాజానికి స్ఫూర్తిగా నిలిచారని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రశంసించారు.
చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ఆయన నాయకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉందని చెప్పిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, కుప్పం ప్రగతిలో తాను భాగస్వామ్యం కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని, అదే సమయంలో చిత్తూరు పార్లమెంటు ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, తనను ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు చెప్పారు.
