నస్పూర్, (మంచిర్యాల) నేటి ధాత్రి:
వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయాలని నస్పూర్ మండలం రజక సంఘం అధ్యక్షులు దొడ్డిపట్ల రవీందర్ అన్నారు. మంగళవారం నిప్పు కనిక చాకలి ఐలమ్మ 39 వ వర్ధంతి కార్యక్రమాన్ని నస్పూర్ లోని మార్కండేయ ఆలయం ముందు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ.. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, భూమికోసం భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం అలుపెరుగని వీరోచిత పోరాటాన్ని నడిపించిన వీరనారి కీర్తించారు. దేశ్ముఖ్ విసునూర్ దొర రామచంద్రారెడ్డిని అతని అనుచరులను, ముష్కర రజాకారుల మూకలను తరిమికొట్టిన ధైర్యశాలి అని కొనియాడారు. తెలంగాణ వ్యవసాయ విప్లవం రగిలించిన చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రజకుల చిరకాల కోరిక హైదరాబాద్ నడిఓడ్డున హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ పై ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తంగేళ్లపల్లి బాబు, మండల ప్రధాన కార్యదర్శి పుట్టపాక తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షులు నగునూరు సారయ్య, రాజయ్య, మండల ఉపాధ్యక్షులు సామ్ రాజ్ రమేష్, కొండపాక శ్రీనివాస్, గ్రామ అధ్యక్ష,కార్యదర్శులు పడిద్దా, తిరుపతి, రవి, మొగిలి, బాపు, మల్లేష్, అంజి, రాజయ్య, సమ్మయ్య లచ్చయ్య కుల బాంధవులు పాల్గొన్నారు.