తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో నేరెళ్ల పాక్స్ చైర్మన్ కొండూరు భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేముల స్వరూపతిరుపతిరెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాల్లోని విక్రయించాలని అలాగే ప్రభుత్వం కేటాయించిన మద్దతు ధరకు రైతులు వినియోగించుకోవాలని ముఖ్యంగా రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు తూకంలో ఎలాంటి పొరపాటు జరగకుండా సిబ్బందికి ఆదేశించామనిఈ సందర్భంగా తెలియజేశారు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అనేక పథకాలు తీసుకొచ్చిందని తద్వారా రైతులు రుణమాఫీ గాని రైతు బీమా గాని ఇతర సంబంధించిన ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను రైతులు వినియోగించుకోవాలని రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి రైతుల అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వం రాష్ట్ర రైతులకు ఎప్పటికీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలోపాక్స్ వైస్ చైర్మన్ డైరెక్టర్లు ఏఎంసీ డైరెక్టర్లు మాజీ సర్పంచులు ఎంపీటీసీలుకాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పార్టీ నాయకులురైతులు కార్యకర్తలు ప్రజలుతదితరులు పాల్గొన్నారు