ఘనంగా పిజేపిఎస్ 8 వ వార్షికోత్సవం.
ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఎన్నిక..
నర్సంపేట:నేటిధాత్రి
పాకాల పత్రిక విలేకరుల పరస్పర సహకార సంఘం 8 వ వార్షికోత్సవం నర్సంపేట పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్ లో సంఘం అధ్యక్షుడు కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సోమవారం ఘనంగా నిర్వహించారు.నర్సంపేట ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో జర్నలిస్టుల అభివృద్దే లక్ష్యంగా గత 8 సంవత్సరాలు జర్నలిస్టుల పరపతి సహకార సంఘం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్ తెలిపారు.ఒకరికొరకు పరస్పరం సహకారం చేసుకుంటూ ముందుపోవాలని ఈ సందర్భంగా సూచించారు.అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఎన్నిక..
పాకాల పత్రిక విలేకరుల పరస్పర సహకార సంఘం నూతన కమిటీని ఎన్నికల అధికారులుగా పోడేటి అశోక్, కాసర్ల నరసింహరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహింఛారు. నూతన అధ్యక్షులుగా కోదాటి గోపాలకృష్ణ,కార్యదర్శిగా రడం శ్రీనివాస్ గౌడ్,ఉపాధ్యక్షులుగా పాలంచ సత్యనారాయణ,
కోశాధికారిగా సామల అనిల్ కుమార్,సహాయ కార్యదర్శిగా కందుల శ్రీనివాస్ గౌడ్,గౌరవ అధ్యక్షులుగా వేములపల్లి వెంకటరామయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పిట్టల కుమారస్వామి,శీలం రమేష్,వడ్లకొండ పవిత్రన్ గౌడ్,తాళ్లపల్లి చంద్రమౌళి గౌడ్,కర్ల వెంకటరెడ్డి, మచ్చిక రమేష్ గౌడ్, పెండెం శివానంద్,జూలూరి హరిప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.