Water Facility Provided to Mandepalli ITI
గ్రామాల రక్షణకు సీసీ కెమెరాలు: ఎస్సై సుజిత్
జహీరాబాద్ నేటి ధాత్రి:
హద్నూర్ ఎస్సై డి. సుజిత్, న్యాల్కల్ మండలంలోని నూతనంగా ఎన్నికైన సర్పంచులతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, గ్రామాల రక్షణ కోసం ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తమ గ్రామాల్లో త్వరలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని సర్పంచులు తెలిపారు.
