కూకట్పల్లి, జూలై 31 నేటి ధాత్రి ఇన్చార్జి
124 డివిజన్ ఆల్విన్ కాలనీ పరిధిలో
ని నవోదయా కాలనీలో నిర్మాణ పను
లు జరుగుతున్న సీసీ రోడ్లను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరి శీలించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా సీసీ రోడ్ల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రోడ్డును మంచిగా లెవెలింగ్ చేసి వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, షౌకత్ అలీ మున్నా, ఫారూఖ్, రాజిరెడ్డి, లక్ష్మణ కుమార్, శ్రీనివాస్
రావు, నాగేశ్వరరావు,రమేష్.వర్క్ ఇస్పెక్టర్ రవి కుమార్,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.