
విశ్వక్రీడల్లో క్రికెట్.. ఒలింపిక్స్లో క్రికెట్కు చోటు
క్రికెట్ అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఒలింపిక్స్లో క్రికెట్కు చోటు కల్పిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 2028లో లాస్ ఏంజిలెస్లో జరగబోయే ఒలింపిక్స్లో టీ20 క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐవోసీ ట్వీట్ చేసింది. వచ్చే ఒలింపిక్స్లో క్రికెట్తోపాటు బేస్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, లాక్రోసీ, స్క్వాష్ క్రీడలకు కూడా చోటు కల్పించారు. చివరగా 1900 ఒలింపిక్స్లో క్రికెట్ పోటీలు జరిగాయి. మళ్లీ ఇప్పుడు 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్ క్రీడల్లో…