మామిడి తోటలో గూడుపుఠాణి!?

`మహబూబాబాద్‌ పొలిటికల్‌ కహానీ!

`కవితే..నా! అసలు కిరికిరి!?

`సిట్టింగ్‌ స్థానంలో సిగపట్లేమిటి?

`ప్రతిపక్షాలకు అవకాశమివ్వడమేమిటి?

` జిల్లా అధ్యక్షురాలై వుండి ఇదేం పని?

` పార్టీ నిలబెట్టే పని వదిలేసి, పొగబెట్టడమేమిటి?

`సమన్వయం వదిలేసి ఎగదోయడేమిటి?

` జిల్లాలో ఈ లుకలుకలేమిటి?

`ఇప్పటికే మూడు పదవులు మీ ఇంటికి?

`మళ్ళీ కొత్త పంచాయతీ ఏమిటి?

`బలమైన చోట బలహీనం చేయడమేటి?

`జిల్లా అధ్యక్షురాలిగా ప్రతిపక్ష పాత్రకర్థమేమిటి?

` తెలిసి జరుగుతోందా? తెలియాలనే జరుగుతోందా?

`సమస్య సర్థుమనగకపోతే అన్ని వేళ్లు కవితవైపే?

`ఏక కాలంలో ఎన్ని పదవులు కావాలేమిటి?

`డోర్నకల్‌ కాదనుకోవడంలో అసలు తిరకాసేమిటి?

`గెలిపించాల్సిన స్థానంలో కూర్చొని అస్త్ర సన్యాసమేమిటి?

`సిట్టింగ్‌ స్థానం ఆశించడంలో ఔచిత్యమేమిటి?

`పార్టీ శ్రేణుల ఆందోళన గుర్తించే వారేరీ!

 

హైదరబాద్‌,నేటిధాత్రి:                                      

తెలంగాణలో బలం లేక ప్రతిపక్షాలు బాదపడుతున్నాయి. అధికార పార్టీ బలముండి తలనొప్పులను కొని తెచ్చుకుంటోంది. ఎదురులేని చోట కుంపటి రగించుకుంటున్నారు. ఆదిపత్య రాజకీయాలలో పార్టీ పరువును తీస్తున్నారు. జిల్లా అధ్యక్ష స్ధానంలో వుండి పార్టీకి నష్టం చేకూర్చే పనులు చేస్తున్నట్లు కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు ప్రతిపక్షాలు ఎలా బలపడాలని ఎదురుచూస్తున్నా, ప్రజలు వారివైపు చూడడం లేదు. ప్రతిపక్షాలను నమ్మేందుకు ప్రజలు సిద్దంగా లేదు. కారణం ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలన. నాయకులు ఎలా వున్నా, వారి వ్యవహారం ఎలా వున్నా, ప్రజలు కేవలం ముఖ్యమంత్రి కేసిఆర్‌ అందిస్తున్న పాలనవైపు చూస్తున్నారు. ఇది తెలిసిన కొందరు నేతలు సొంత బలం లేకపోయినా, నాయకుల మధ్య చిచ్చు పెట్టి టిక్కెట్‌ సాధించాలన్న ఆలోచనలు చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాల వల్ల పార్టీకే తీరని నష్టం జరుగే అవకాశం వుం ది. తెలంగాణలో కొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదన్నదానిపై కూడా చర్చ సాగుతోంది. అయితే అక్కడ కొత్త వారికి అవకాశం ఇవ్వడం న్యాయం. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి అవకాశం ఇవ్వడం అసవరం. కాని ఎలాంటి నాయకత్వ సమస్య లేని చోట, గందరగోళలం సృష్టించి, లేని వివాదాలు రగిలించి రాజకీయాలు కూడా కొందరు చేస్తున్నారు. పెద్దన్న పాత్ర పోషించే స్ధాయిలో వున్న నేతలు కూడా పార్టీలో కయ్యానికి తెరతీయడం అన్నది సరైందికాదు. 

మహబూబాద్‌ జిల్లాలో ఇప్పుడు ఇదే జరుగుతుందని తెలుస్తోంది. 

 మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ తెలంగాణ ఉద్యమకారుడు. ఉద్యోగం వదులుకొని మరీ తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాడు. అక్కడ ఉద్యమాన్ని భుజాన వేసుకొని నడిపాడు. ముందుండి కొట్లాడిన నేత శంకర్‌ నాయక్‌. ఉద్యమకాలంలో నెగ్గుకు రాగలిగిన శంకర్‌ నాయక్‌ ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి రావడం శోచనీయం. ఉద్యమకారుడిని కూడా ఇబ్బందులకు గురిచేసే పరిస్ధితులు సృష్టిస్తున్నారు. నిజానికి ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ వల్ల, ఆ నియోజకవర్గ పరిధిలో ప్రతిపక్షాలు చోటు లేకుండా పోయింది. అటు ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలన, ఇటు ఎమ్మెల్యే పనితీరుతో ప్రజలు సంతోషంగానే వున్నారు. పార్టీకి పటిష్టం చేయడంలో శంకర్‌ నాయక్‌ పాత్ర కూడా ఎంతో వుంది. భవిష్యత్తులో తన రాజకీయానికి ఎదురులేకుండా చూసుకోవడంలో, ప్రతిపక్షాలకు ఉనికి లేకుండా చేశాడు. బిఆర్‌ఎస్‌కు కంచుకోటను చేశాడు. అదే ఇప్పుడు ఆయనకు తెలనొప్పిని తెచ్చిపెట్టేలా చేస్తోంది. బలమైన నేతగా వున్న ఆయన స్ధానం కోసం జిల్లా అధ్యక్షురాలు, పార్లమెంటు సభ్యురాలు కవిత ఎప్పటినుంచో ప్రతయ్నం చేస్తోందన్న ప్రచారం బలంగానే వుంది. అందుకే ఇదంతా జరుగుతోందన్న ప్రచారం వుండనేవుంది. ఆమె తండ్రి రెడ్యానాయన్‌ పక్కనే వున్న డోర్నకల్‌ నియోజకవర్గంలో కొన్ని దశాబ్ధాలుగా రాజకీయాలు శాసిస్తున్నారు. ఆ స్ధానం మాలోతు కవిత కోరుకుంటోందంటే అర్ధముంది. కాని డోర్నకల్‌ వద్దనుకొని, మహబూబాబాద్‌ కావాలని కోరుకోవడం అంటే పార్టీలోనే చిచ్చు రేపడమౌతుంది. 

మాలోతు కవిత. ఇప్పటికే పార్లమెంటు సభ్యురాలు.

 ఆమె పదవీకాలం ఇంకా ఏడాదికిపైగా వుంది. ఆమె పోటీ చేయాలనుకుంటే డోర్నకల్‌ నియోజకవర్గం వుంది. కాని అక్కడ ఆమె తండ్రి రెడ్యానాయక్‌పై ప్రజలు తిరగబడుతున్న పరిస్దితులు చూస్తున్నాం. దాంతో ఆమె అక్కడ పోటీ చేస్తే మొదటికే మోసానికి వస్తుందేమో? అన్న అనుమానంతో బిఆర్‌ఎస్‌ బలంగా వున్న మహబూబాబాద్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేను తప్పించే ఎత్తుగడ వేస్తోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమెకు ఇప్పటికే రెండు పదవులున్నాయి. ఒకటి పార్టీ జిల్లా అధ్యక్షపదవి వుంది. మరొకటి ప్రజా ప్రతినిధిగా పార్లమెంటు సభ్యురాలుగా వున్నారు. అయినా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటే ఆమెకు మరో రెండు నియోజకవర్గాలు కూడా ఎంచుకునే అవకాశం వుంది. ఆమె పార్లమెంటు పరిధిలో వున్న ములుగు, డోర్నకల్‌ కూడా వుంది. ములుగులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క వుంది. ఆమెను ఓడిరచి, బలమైన నాయకురాలుగా గుర్తింపు పొందాలన్న తపన వుంటే ఆ నియోజకవర్గం ఎంచుకుంటానంటే పార్టీ కూడా స్వాగతించేందుకు ఆస్కారం వుండేది. డోర్నకల్‌ కూడా అందుబాటులోనే వుంది. ఈ రెండూ కాదని మహబూబాబాద్‌ కావాలని అక్కడ అస్ధిర రాజకీయాలకు ఆజ్యం పోయడం అంటే పార్టీకి తీరని నష్టం కల్గించడమే అవుతుంది. 

                ఈ మధ్య ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ ముఖ్యమంత్రిని కలిసినట్లు సమాచారం అందిన వెంటనే మహబూబాబాద్‌లో ఓ నాయకుడి మామిడి తోటలో బిఆర్‌ఎస్‌ ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి మహబూబాబాద్‌ నియోజకవర్గంలో ప్రజలు ఎక్కడా ఇంత వరకు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడిరది లేదు. తమ నియోజకవర్గం అభివృద్ది జరగలేదని చెప్పింది లేదు. ఎక్కడా పేచీ లేదు. రైతులు కూడా తమకు నీళ్లు రావడం లేదనో, కరంటు సరిగ్గా రావడం లేదనో కూడా రోడ్డెక్కింది లేదు. ఇతర సంక్షేమ పధకాల అమలులో ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ పట్టించుకోవడం లేదనో, ఇబ్బందులకు గురి చేస్తున్నాడనో వార్తలు కూడా రాలేదు. కాని ఎన్నికల తరుణం దగ్గరకు వస్తున్న సమయంలో అదును చూసి, కొంత మంది ఎమ్మెల్యేను వ్యతిరేకించే ప్రయత్నం చేస్తున్నారు. 

ఇలాంటి సమయంలో జిల్లాపార్టీ అధ్యక్షురాలుగా వున్న మాలోతు కవిత సమస్యను ఇక్కడే పరిష్కరించాల్సిన బాధ్యత ఆమెపై వుంది.. 

కాని సమస్యకు అసలు కారణమే ఆమె అన్న తేలడంతో ఇక పార్టీ శ్రేణులు ఏం చేయాలో అన్న ఆందోళనలో వున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నియోకవర్గం వరకు ఎమ్మెల్యేలే సుప్రిం అన్నది అనేక సార్లు స్పష్టం చేశారు. ఎంపిలైనా, ఎమ్మెల్సీలైనా సరే ఎమ్మెల్యేకు తెలియకుండా ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దన్న ఆదేశాలు కూడా వున్నాయి. అయినా శంకర్‌నాయక్‌ సీటు మీద కన్నెసిన మాలోతు కవితే, పార్టీ అధ్యక్ష స్ధానంలో వుండి కూడా సమస్యకు ఆజ్యం పోస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా బలమైన స్ధానంలో సొంత పార్టీలోనే ఇలాంటి సిగపట్లు వుంటే , ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్లౌవుంది. లుకలుకలు లేని చోట అనవసర రాద్దాంతాలు సృష్టించి, పార్టీని పరువును బజారున పడేసుకోవడాన్ని ప్రజలు కూడా స్వాగతించరు. కాంగ్రెస్‌ పార్టీలోనే ఇలాంటి రాజకీయాలు వుంటాయని ఇంత కాలం చెప్పుకుంటున్న ప్రజలు మహబూబాబాద్‌ రాజకీయాలు చూసి బిఆర్‌ఎస్‌ కూడా తక్కువేం కాదన్న విమర్శలు చేసే దాకా తెచ్చుకోవద్దు. పార్టీకి నష్టం చేకూర్చే పనులు ఎవరూ చేసుకోవద్దు. అధికారంలో లేక ప్రతిపక్షాలు మధనపడుతుంటే, అధికారంలో పార్టీలో లుకలుకలు మంచిది కాదు. నాయకుల తీరు కూడా ప్రజాతీర్పు మీద ప్రభావం చూపుతుందని మర్చిపోవద్దు.

‘‘బాబు’’ ఆట..’’రేవంత్‌’’ కుట్ర!?

`కూడికలో తీసివేత తంత్ర!!

`రేవంత్‌ వల్ల కాంగ్రెస్‌ కు ఒరిగిందేమీ లేదు.

`మూడు ఉప ఎన్నికల్లో ఓటమికి పరోక్షంగా రేవంతే కారణం?

`అంతకు ముందు కనీసం డిపాజిట్లైనా వచ్చేవి?

`రేవంత్‌ వచ్చాకా అవి కూడా కరువయ్యాయి.

`రేవంత్‌ అనుచరుల నినాదాలు మాత్రమే కనిపిస్తాయి.

`కాంగ్రెస్‌ పతనమే చంద్రబాబు రేవంత్‌ లా పన్నాగం?

`చంద్రబాబు ఆదేశమే రేవంత్‌ కు శిరోధార్యం?

`చంద్రబాబు ఆగర్భ కుట్ర కోణం?

`బిజేపి మేలు కోసం చంద్రబాబు మరో ప్రయత్నం?

`ఆచరణకు రేవంత్‌ ఎల్లప్పుడూ సిద్ధం?

`అప్పుడు ఓటుకు నోటు గరు దక్షిణ అసంపూర్ణం?

`కాంగ్రెస్‌ ఖతంతో పరిపూర్ణం లక్ష్యం?

`చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం రేవంత్‌ వంతుల వారి త్యాగం?

`కాంగ్రెస్‌ సీనియర్లు ఇంత కాలం మొత్తుకుంటున్నదిదే?

`అధిష్టానానికి అర్థం కాకపోయే?

`చంద్రబాబు చూపెప్పుడూ రెండు కళ్ల సిద్ధాంతం?

`ఎప్పుడూ ఎవరో ఒకరితో పొత్తు లేకుండా సాగని చంద్రబాబు రాజకీయం?

`ఇప్పుడు మళ్ళీ బిజేపి అవసరమొచ్చింది.

`కాంగ్రెస్‌ కు పంగనామం పెట్టి ఎత్తుగడ మొదలైంది?

`కాంగ్రెస్‌ ను మోసం చేయడానికి సమయం ఆసన్నమైంది.

`అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే హస్తానికి టాటా!

`సైకిల్‌ సవారితో మళ్ళీ మొదలుపెట్టొచ్చు ఆట!

హైదరబాద్‌,నేటిధాత్రి: 

కాంగ్రెస్‌ పార్టీకి గ్రహచారం బాగాలేనట్లుంది. ఎప్పుడు ఊపొస్తుందో..ఎవరి వల్ల పోతుందో అర్ధం కాని పరిస్ధితుల్లో కొట్టుమిట్టాడుతోంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పార్టీ పరిస్ధితి మరింత ఆగమ్య గోచరంగా మారింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో 23 సీట్లు గెలిస్తే 17 మంది బిఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో 14 మంది గెలిస్తే 12 మంది ఆ పార్టీని వదిలేశారు. అధికార బిఆర్‌ఎస్‌ తీర్ధం పుచ్చుకున్నారు. ఇక కాంగ్రెస్‌ లేవడం కష్టమని నిర్ణయం తీసుకున్నారు. ఇక పదవులు రాని వారు, పార్టీని వదిలి వెళ్లినా ప్రయోజనం లేనుకున్నవారు మాత్రమే కాంగ్రెస్‌లో వున్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణలో నామరూపాలు లేకుండాపోవడంతో రేవంత్‌రెడ్డి కన్ను కాంగ్రెస్‌ మీద పడిరది. తాను ఎలాగైనా కాంగ్రెస్‌లో క్రియాశీలకం కావాలనుకున్నారు. నిజానికి తెలుగుదేశం పార్టీలోనే తెలంగాణ పార్టీకి అధ్యక్షుడు కావాలని రేవంత్‌ రెడ్డి ఆశపడ్డాడు. అప్పుడు తెదేపాలో వున్న ప్రస్తుత మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంటివారు రేవంత్‌ను ముందుకు రానివ్వలేదు. తేదేపా తెలంగాణ అధ్యక్షుడి ఆశలు నెరవేరనివ్వలేదు. దాంతో ప్రస్తుతం బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా వున్న ఎల్‌.రమణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడయ్యాడు. క్రమంగా తెలుగుదేశం పార్టీ మరింత కనుమరుగయ్యే పరిస్దితికి చేరుకున్నది. తెలుగుదేశం పార్టీలో క్రియాశీల నాయకత్వం చేసిన చాలా మంది నేతలు వరుసగా బిఆర్‌ఎస్‌ గూటికిచేరుకున్నారు. ముందు ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావుతో మొదలైన వలసలు ఒక్కొక్కరుగా ఆ జిల్లా తెదేపా నేతలందరూ బిఆర్‌ఎస్‌ గూటికి చేరుకున్నారు. అలా ఒక్క జిల్లానే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా వున్న తెలుగుదేశం నాయకులు చాలా మంది బిఆర్‌ఎస్‌ లో చేరిపోయారు. కాని రేవంత్‌కు బిఆర్‌ఎస్‌ గుమ్మం తొక్కే పరిస్దితి లేదు. నిజాఇకి రేవంత్‌ రెడ్డి రాజకీయం మొదలైందే బిఆర్‌ఎస్‌లో…కాకపోతే తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని అస్ధిరపర్చాలన్న దురుద్ధేశ్యంతో తెలంగాణకు తీరని అన్యాయం చేయడానికి ప్రయత్నించి జైలు పాలయ్యాడు. రాజకీయంగా కూడా అది సరైనది కాదు. నైతికంగా అసలు అలాంటి పనులు చేయడం ఎంత మాత్రం మంచిది కాదు. ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రకు తెరతీసిన చంద్రబాబుకు సహకరించి, మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో సునామీ సృష్టించాలని చేసిన ప్రేయత్నం బెడిసికొట్టింది. అసలు విషయం ముందే తెలిసి, ముఖ్యమంత్రి కేసిఆర్‌ రాజకీయ చాణక్యంతో రేవంత్‌ను పట్టుకున్నారు. రేవంత్‌ దుర్మార్గం బైటపెట్టారు. ఈ కుతంత్రానికి అసలు బాధ్యుడైన చంద్రబాబును తెలంగాణ నుంచి తరిమేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వున్నంత కాలం చంద్రబాబు హైదరాబాద్‌ రావడానికి కూడా సాహసించలేదు. అలాంటి స్ధితిని చేజేతులా తెచ్చుకొని తెలంగాణలో నామరూపాలుగా లేకుండాపోయిన పార్టీ తెలుగుదేశంలో మనుగడ లేక రేవంత్‌ రాజకీయం ఆగమ్య గోచరమైంంది. పైగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో ఆశలు లేవు. ఆ పార్టీకి మనుగడ లేదు. దాంతో కాంగ్రెస్‌లో చేరి తన రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకోవడం, పదిలం చేసుకోవడం కోసం చంద్రబాబు సాయం కోరాడు. ఆయన కూడా సమ్మతించాడు. 

 2018 మధ్యంతర ఎన్నికల సమయంలో చంద్రబాబు మద్దతు కాంగ్రెస్‌ కొంప ముంచింది.

 2009 ఎన్నికల్లో అదికార బిఆర్‌ఎస్‌ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోలేదా? అంటూ తెలంగాన ప్రజలను ఏమార్చే ప్రయత్నం చంద్రబాబు చేశారు. కాంగ్రెస్‌ను నిండా ముంచారు. అసలు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి కొడంగల్‌లో ఓడిపోయాడు. తర్వాత మాల్కాజిగిరి నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. అప్పటి నుంచి పిసిసి. పదవిపై కన్నేశాడు. నిజానికి ఆ సమయంలో కాంగ్రెస్‌కు ఊపు తెచ్చే నాయకుడు కావాల్సివచ్చింది. 2014లో పిసిసి. అధ్యక్షుడైన పొన్నాలతో కొన్ని సీట్లు సీట్లు గెల్చుకున్నా, పార్టీని నడపడం ఆయన వల్లకాలేదు. మూడేళ్లు పార్టీని నడిపిన పొన్నాల పక్కకు తప్పుకున్నాడు. ఆ తర్వాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వచ్చాడు. కాని ఉత్తరకుమారుడే అన్న నానుడి సార్ధకం చేసుకున్నాడు. ఆయన ఆధ్వర్యంలో కూడా కాంగ్రెస్‌ బొక్క బోర్లా పడిరది. పైగా ఆయన బిఆర్‌ఎస్‌ పార్టీ కోవర్టు అన్న ముద్ర బలంగానే పడిరది. ఇలాంటి సమయంలో అధికార బిఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కొనే నాయకుడుగా రేవంత్‌ రెడ్డి కనిపించారు. దానికి తోడు తాను పార్టీ కోసం ఎంతైనా ఖర్చు చేస్తాను. పార్టీని మోస్తాను అని రేవంత్‌ చెప్పిన మాటలు పార్టీ అధిష్టానం గుడ్డిగా విశ్వసించింది. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన నుంచి తనదైన రాజకీయం చేస్తున్నాడని తెలిసినా సీనియర్లు ఏం చేయలేకపోయారు. నాడు మాణిక్యం ఠాకూర్‌ అయినా, నేడు మానిక్‌ఠాకూర్‌ అయినా రేవంత్‌ ఏది చెబితే అదే నమ్ముతూ వస్తున్నారు. కాని రేవంత్‌రెడ్డి అసలు రాజకీయం అర్దం చేసుకోలేపోతున్నారు. 

   రేవంత్‌ వల్ల కాంగ్రెస్‌కు ఇసుమంతైనా లాభం జరిగిందా? 

అంటే లేదనే చాలా మంది అంటారు. ఔనని ఏ ఒక్కరూ సమాధానం చెప్పడానికి సిద్దంగా లేదు. ఎందుకంటే రేవంత్‌ వల్ల వచ్చిన ఊపు లేదు. బలం అంతకన్నా లేదు. పైగా ఆయన సారధ్యంలో వచ్చిన ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా పోవడం గమనార్హం. రేవంత్‌ రెడ్డి పిసిసి. అధ్యక్షుడైన వెంటనే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వచ్చింది. ఆ సమయంలో కొత్త ఊపుతో రేవంత్‌ ఏదో పొడిచేస్తాడన్నంతగా పార్టీ గంపెడాశలు పెట్టుకున్నది. కార్యకర్తలు ఎంతో ఊపును ఊహించుకున్నారు. కాని మొదటి ఎన్నికలోనే రేవంత్‌రెడ్డి అస్త్ర సన్యాసం చేశాడు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 60 వేల ఓట్లు వస్తే, ఉప ఎన్నికల్లో మాత్రం మూడు వేలే వచ్చాయి. కాంగ్రెస్‌ ఓట్లన్ని ఎటు పోయాయని సీనియర్‌ నేతుల ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక వచ్చింది. నోముల నర్సింహయ్య మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడ భగత్‌ పోటీచేశారు. ప్రత్యర్ధిగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఇంకా చెప్పుకునే జానారెడ్డి పోటీచేశారు. కాని ఏమైంది? కాంగ్రెస్‌ ఓటమిని చూడాల్సి వచ్చింది. దీంతో రేవంత్‌ నేతృత్వం కూడా ఐరన్‌ లెగ్‌ అన్నది కన్ఫర్మ్‌ అయ్యింది. అంతే కాదు ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. రేవంత్‌ రెడ్డి తెలుగుదేశంలో చేరిన తర్వాత ఆ పార్టీ అదికారంలోకి రాలేదు. పైగా తెలంగాణ రాకతో తెలంగాణలో లేకుండానే పోయింది. ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా అదే రుచి చూస్తోంది. అసలు విషయం ఇప్పుడిప్పుడే కాంగ్రెస్‌ పార్టీ గ్రహిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీని రేవంత్‌ రెడ్డి ఓడిస్తూ వస్తున్నాడని పార్టీ కొంత తెలుసుకుంటోంది. మునుగోడు ఉప ఎన్నికతో రేవంత్‌ రాజకీయం మొత్తం బట్టబయలైంది. ఓ వైపు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి చావో రేవో తేల్చే ఉప ఎన్నిక ప్రచారం గాలికి వదిలేసి, రాహుల్‌ గాంధీ జోడో యాత్రకు హజరౌతూ వచ్చారు. అంటే మునుగోడును ముంచాలని ముందే నిర్ణయించుకున్నాడు. కాంగ్రెస్‌కు డిపాజిట్‌ కూడా రాకుండా చేశాడు. 

ఇదంతా రేవంత్‌ ఎందుకు చేస్తున్నాడు? అన్నది ఏ సీనియర్‌కు అర్ధం కాని ప్రశ్న. 

కాని దీన్ని అంత లోతుగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఉప ఎన్నికల్లో ఆయన క్రియాశీలమైతే ఆ క్రెడిట్‌ గెలిచే సీనియర్లకు వస్తుంది. నాగార్జున సాగర్‌లో గెలిస్తే జానారెడ్డి మళ్లీ క్రియాశీలకమౌతాడు. మునుగోడులో గెలిస్తే పాల్వాయి స్రవంతి పేరు మారిమోగిపోతుంది. ఇదిలా వుంటే మొత్తం కాంగ్రెస్‌లో తన వర్గమే వుండాలి. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్ధానాలు తన వర్గంతోపాటు, తనతో తెలుగుదేశం నుంచి వచ్చిన వారు మత్రమే కనిపించాలి. ఏది జరిగినా వాళ్లంతా తనతోనే వుండాలి. తాను కాంగ్రెస్‌లో వుంటే వారికి ప్రాదాన్యత కల్పించాలి. ఒక వేళ ఏదైనా జరగకూడదనిది జరిగితే జంప్‌ కావడానికి వాళ్లంతా సిద్దంగా వుండాలి. ఇదీ మొదటి నుంచి రేవంత్‌ నెరుపుతున్న అంతర్గత రాజకీయం. ఇదంతా చంద్రబాబు నాయుడుకు తెలుసు. అయితే అనూహ్యంగా తెలంగాణ రాజకీయాల్లోకి షర్మిల వచ్చింది. కాని తెలంగాణ ప్రజలు ఆమెను వ్యతిరేకించడం లేదు. పైగా బిఆర్‌ఎస్‌ జాతీయ స్ధాయి పార్టీ అయిన తర్వాత ఇతర పార్టీలన ప్రశ్నించలేదు. దాంతో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తెస్తే ఎలా వుంటుందన్న ఆలోచన మొదలైంది. పైగా కాంగ్రెస్‌లో నిత్యం కల్లోలం కన్నా తెలుగుదేశంలో చేరితే అక్కడ కూడా తన హవానే సాగుతుంది. చంద్రబాబు ఎలాగూ రేవంత్‌కు ఫ్రీ హాండ్‌ ఇస్తాడు. కాంగ్రెస్‌లో కలహాలకాపురం, నిత్యం కష్టపడడం కన్నా, ఆ పార్టీని నిండా ముంచి, తన వర్గాన్నంతా తెలుగుదేశం పార్టీకిచేర్చి అక్కడ రాజకీయం చేయడమే మేలని నిర్ణయించుకున్నాడట. అందుకే కాంగ్రెస్‌లో కరంటు మంటలు పెట్టి, పోతున్నాడట?

తానా సభల్లో తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు

 

ఎన్టీఆర్‌ అభిమానులను తన్నిన లోకేష్‌ అనుచరులు.

చదువుకున్న మందబుద్దులు.

అమెరికా చేరినా మానని చిల్లర చేష్టలు?

ఆధిపత్య పోరులో తెలుగుదేశం రాజకీయాలు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు, నారా లోకేష్‌ అభిమానులు అమెరికా లో ఆటా వేధిక వేడుక సాక్షిగా తన్నకున్నారు. చొక్కాలు చించుకున్నారు. వీధి రౌడీల్లా బిహేవ్‌ చేశారు. రాయాలంటే సిగ్గనిపిస్తోంది. చెప్పాలంటేనే అసహ్యం వేస్తోంది. ఇంతేనా మీ తెలివి అని తిట్టాలనిపిస్తోంది. అంత దూరం వెళ్లినా కురచ మనస్తత్వాలుగా మిగిలిపోవడం విచిత్రంగా వుంది. విడ్డూరంగా వుంది. చదివేస్తే వున్న మతి పోతుందని పెద్దలెందుకన్నారో ఆటా వేధికగా అమెరికా ప్రవాస తెలుగు వాళ్లు నిరూపించారు. ఎంతో సరదాగా, సందడిగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా , వేడుకల్లా సాగాల్సిన సభలలో వివాదాలేమిటి? అసలు అక్కడ రాజకీయాలేమిటి? అందనంత దూరంలో వున్నారు. ఏడాదికోసారి కూడా మాతృ భూమికి రాలేరు. ఇక్కడ బతకడం కష్టమనే వెళ్లారు. ఉపాధి వెంట పరుగులు పెట్టారు. విలాసవంతమైన జీవితం కోరుకున్నారు. ఇక్కడ ఓటు హక్కు చాలామందికి లేకపోవచ్చు. అలాంటి వారికి రాజకీయాలతో పనేంటి? అందులోనూ హీరోల కోసం కొట్టుకోవడం ఏమిటి? రాజకీయాల కోసం తన్నుకోవడం ఏమిటి? ఇక్కడ నారా కుటుంబం, నందమూరి కుటుంబం కలిసే వుంది. వాళ్ల బంధుత్వం బాగానే సాగుతోంది. దేశం కాని దేశంలో బతుకు దెరువు కోసం వెళ్లిన తెలుగు వాళ్లు ఆప్యాయత, ఐక్యత మర్చిపోయి, ఎవరికోసమో.. కొట్టుకోవడం ఏమిటి? చిన్నతనం అనిపించడం లేదా? అక్కడ కూడా ఇదే ఆధిపత్యం, తెలుగు పౌరుషం అనుకుంటే అమెరికా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగండి. తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకుంటారు. అలా కొట్టుకోకండి. దేశ ప్రజలు తెలుగువారంటే అసహ్యించుకుంటారు. మళ్ళీ రిపీట్‌ కాకుండా చూసుకోండి.

హస్తానికి రేవంత్‌ బైబై!?

-కాంగ్రెస్‌ లో కరివేపాకు కాకముందే నిర్ణయం!

-కాంగ్రెస్‌ లో పెట్టిన కరంటు మంటలే అందుకు కారణం!

-కాంగ్రెస్‌ నుంచి రేవంత్‌ జంప్‌!?

-సొంత గూటికి రేవంత్‌!?

-టిడిపి, బిజేపి పొత్తులో భాగమే!

– రేపో మాపో టిడిపి గూటికి..?

-18 మందితో బైటకి!

-షర్మిల ప్రస్తావనే రేవంత్‌ కు ఇష్టం లేదు?

– రేవంత్‌ వద్దన్నా ఆగే పరిస్థితి కనిపించడం లేదు?

-ఎవరి కోసమో కష్టపడడం వృధా?

-కాంగ్రెస్‌ లో వున్న రేవంత్‌ వర్గమంతా హాండిచ్చేందుకు రెడీ!

-కాంగ్రెస్‌ ను వదిలేయడం ఖాయం!

– అమెరికా లో అన్ని విషయాలపై సమాలోచన.

-అటు ఉద్యమకారులు, ఇటు పూర్వ టిడిపి నాయకులు!

– కాంగ్రెస్‌ కు ఎంత సేవ చూసినా వృధానే?

-ఈ కష్టమేదో టిడిపి లో పడితే లాభమే!

-అక్కడ ఎదురులేని స్థానమే!

– ఇప్పటికీ టిడిపి ఎంతో కొంత ఉనికిలో వున్నదే?

– హైదరాబాద్‌, రంగారెడ్డి సీట్లు వశమే!

-ఖమ్మం, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ లలో పాగా వేయడమే?

-ఇదే సరైన అదును…బిజేపితో కలిసి పొత్తు కుదిరెను!

-ఇప్పటికీ జిల్లాల్లో టిడిపికి బలమైన నేతలున్నారు?

 హైదరబాద్‌,నేటిధాత్రి: 

రాజకీయాలు ఎంత కలిసొచ్చినట్లు కనిపించినా కంటి మీద కునుకులేకుండా పోవడం దురదృష్టకరమే. సరిగ్గా అలాంటి పరిస్ధితే తెలంగాణ ప్రదేశ్‌కమిటీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎదుర్కొంటున్నారు. రాజకీయాల్లో ఇంతటి నరకం ఆయన ఎప్పుడూ అనుభవించకపోవచ్చు. తెలుగుదేశం పార్టీలో వున్నంత కాలం హాయిగా సాగిన రేవంత్‌ రాజకీయం ఓటుకు నోటుతో తిరగబడిరది. 2014 ఎన్నికల్లో గెలిచిన రేవంత్‌రెడ్డిని, 2018లో ఓడిపోయేదాకా తెచ్చింది. అయినా నిలదొక్కుకున్నారు. కాని ఎప్పుడైతే కాంగ్రెస్‌లో చేరారో అప్పటినుంచి ఆయనకు చికాకు తప్ప ఏమీ మిగలడం లేదు. అందుకే ఆయన ఆ రోజునుంచే తన మనసంతా తెలుగుదేశం వైపే లాగుతున్నట్లుంది. ఎంత ఇష్టంతో కాంగ్రెస్‌లో చేరారో అంత కష్టంగా కాలం గడవడం కూడా ఇబ్బందే..అందుకే ఇక కాంగ్రెస్‌లో వుండడం కన్నా, మళ్లీ తెలుగుదేశంలో చోటు చూసుకోవడమే మేలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అది అమెరికాలో జరిగిన నాటా సభల సమయం కలిసొచ్చినట్లు కూడా చెప్పుకుంటున్నారు. నిజానికి కాంగ్రెస్‌ నుంచి వెళ్లిపోవడానికి ఏదో ఒక బలమైన కారణం కావాలి. అందుకే అమెరికా నుంచి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. కాంగ్రెస్‌ అంటే నేనే…నేనంటేనే కాంగ్రెస్‌ అన్నారు. అది పెద్దగా పేలలేదు. మీడియా కూడా దాన్ని పట్టించుకోలేదు. పెద్దగా ప్రచారం చేయలేదు. దాన్ని వార్తగా కూడా ముందు ప్రాధాన్యత నివ్వలేదు. ఆ తర్వాత సీతక్క సీఎం అన్నది చెప్పారు. చెప్పిన సందర్భం ఏదైనా ఆ వ్యాఖ్య కాంగ్రెస్‌లోని కొన్ని వర్గాలకు ఆగ్రహం తెప్పించింది. అందులోనూ ఆది నుంచి రేవంత్‌రెడ్డి అంటే అడుగడుగునా వ్యతిరేకిస్తున్న భువనగిరి ఎంపి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ విషయంపై స్పందించారు. ముప్పై, నలభై ఏళ్ల నుంచి కాంగ్రెస్‌కే సేవ చేసిన వాళ్లుఎంతో మంది వున్నారు. అంటూ ఇతర నాయకుల పేర్లు చెప్పి, రేవంత్‌ వ్యాఖ్యలను ఖండిరచారు. అయినా అది కూడా పెద్దగా పేలలేదు. దాంతో ఉచిత విద్యుత్‌ మీద రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఇది జరగాలని ముందే రేవంత్‌ నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో ఒక్కొక్కటిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఆఖరున తెలంగాణలో రైతులకు ఎకరాకు గంట చొప్పున, మూడు ఎకరాలకు మూడు గంటల కరంటు సరిపోతుందన్న మాటలు దుమారం రేపాయి. ఏది ఏమైనా ఎంత సమర్ధించుకున్నా చెప్పిన సందర్భం గురించి ఇప్పుడు ఎంత వివరించినా అందులో నిగూడార్ధం మాత్రం అదే..అన్నది తెలంగాణ సమాజం గుర్తించింది. కాంగ్రెస్‌ పార్టీకూడా తల పట్టుకున్నది. ఇదే అదునుగా అధికార బిఆర్‌ఎస్‌ పార్టీ ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. పొరపాటును కాంగ్రెస్‌ను నమ్మితే నట్టెట ముంచుతారన్నది ప్రజల్లోకి చర్చకు తెరతీశారు. 

అయితే రేవంత్‌రెడ్డి కోరుకున్నది కూడా ఇదే..జరుగుతున్నది కూడా అదే కావడంతో ఆయన సక్సెస్‌ అయ్యారనే చెప్పుకోవాలి. 

నిజానికి కాంగ్రెస్‌ ఎంత పుంజుకున్నా, ఒక వేళ వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించినా కాని రేవంత్‌ ముఖ్యమంత్రి కావడం కలగానే మిగిలిపోయే అవకాశం వుంది. ఆ ప్రమాదాన్ని ముందే రేవంత్‌ రెడ్డి గమనించారు. అందుకే ఇప్పుడే అస్త్ర సన్యాసం చేస్తే కాంగ్రెస్‌ పార్టీ కకావికలమైపోతుంది. పైగా కాంగ్రెస్‌ పార్టీ నడిచేందుకు అవసరమైన పెట్టుబడి సాయం అందిస్తున్నది కూడా రేవంత్‌కు చెందని వర్గమే అన్నది అందరికీ తెలిసిందే. ఇంత చేసి, పార్టీకి ఎంత బలం తెచ్చినా, ఉపు తెప్పించినా ముఖ్యమంత్రి ఎవరు అన్న ప్రశ్న వచ్చే సరికి రేవంత్‌రెడ్డి అన్నది ఎక్కడా వినిపించడం లేదు. ఒప్పుకునే సీనియర్లు లేదు. పైగా ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలోకి చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాక కూడా రేవంత్‌కు సుతారం ఇష్టం లేదు. పొంగులేటి వచ్చిన తర్వాత ఆయన కన్నా బలమైన నేత మరొకరు లేరన్నంత ప్రచారం బలంగా సాగుతోంది. పొంగులేటి కాంగ్రెస్‌లో చేరిన మరునాడే వైఎస్‌. షర్మిల కాంగ్రెస్‌లోకి రాక..అన్న దానిపై చర్చ మొదలైంది. నిజానికి ఆమె వైఎస్‌ఆర్టీ పార్టీ రిజిస్టర్‌ చేసుకున్నారు. సొంతంగానే పార్టీని నడుపుతున్నారు. అయినా ఆమె తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకం కావడం లేదు. అందుకు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ముందు కాంగ్రెస్‌లోకి పంపి, ఆ తర్వాత షర్మిలను తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. 

షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి రావడం రేవంత్‌రెడ్డికి ఆది నుంచి సుతారం ఇష్టం లేదు.

ఆమెను కాంగ్రెస్‌లోకి తీసుకురావడం అసలే ఇష్టంలేదు. అయినా ఆమెను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మురంగా జరుగుతున్నాయి. అంతే కాకుండా పొంగులేటి లేదు లేదనుకుంటూనే, కాదు..కాదనుకుంటూనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ను కలుస్తున్నారు. తాజా రాజకీయాలు వివరిస్తున్నారు. ఆయన సూచనలు సలహాలు స్వీకరిస్తున్నారు. ఇదంతా చూస్తున్న రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌ను బతికించడం కన్నా , సొంత పార్టీ తెలుగుదేశం పార్టీకి జీవం పోయడం తన రాజకీయ జీవితానికి ఉపయోగమని భావించినట్లున్నారు. అందుకే చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇవ్వడాన్ని ఆనాడు జగన్‌ పూర్తిగా వ్యతిరేకించాడు. పైకి ఆర్టికల్‌ 3 ప్రచారం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూనే, మరో వైపు పార్లమెంటులో ప్లకార్డు పట్టుకున్నాడు. తీరా తెలంగాణ ప్రకటన జరిగే సమయంలో సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకున్నాడు. తెలంగాణ వ్యతిరేకతను ప్రదర్శించాడు. అందుకు షర్మిల కూడాపూర్తిగా సహకరించింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆమె కూడా పాల్గొన్నది. తెలంగాణలో జగన్‌కు ఆనాడు బలంగా మద్దతు పలికిన కొండా సురేఖలాంటివారిని కూడా జగన్‌ మోసం చేశాడన్నది అందరికీ తెలిసిన విషయమే. పైగా దివంగత వైఎస్‌. బతికున్నంత కాలం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తే. తెలంగాణ ఇస్తే ఆంధ్రా ప్రజలు వీసా తీసుకొని వెళ్లాలా? అంటూ అసంబద్ద ప్రకటనలు చేశాడు. తెలంగాణ ప్రజలు మనోభావాలు దెబ్బతీశాడు. అలాంటి రాజశేఖరెడ్డి బిడ్డనంటూ, తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామంటూ షర్మిల రావడాన్ని ఏ తెలంగాణ వ్యక్తి జీర్ణించుకోలేని విషయం. అదే స్పందన రేవంత్‌రెడ్డి కూడా వ్యక్తంచేశాడు. అయినా ఆమెను పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అందుకే రేవంత్‌ ఇక తెలుగుదేశం పార్టీని నిలబెట్టడం ముఖ్యమన్న ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. 

తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించిన షర్మిలనే తెలంగాణ రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు , తెలంగాణ కోసం ఉత్తరం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ తెలంగాణలో రాజకీయం చేయడం అవసరమని రేవంత్‌ రెడ్డి భావిస్తున్నారు.తెలంగాణ లో తెలంగాణ నాయకులే నాయకత్వం వహించే అవకాశం వుంది. తెలంగాణలో ఇంకా తెలుగుదేశం బలంగానే వుందన్న భావన వ్యక్తమౌతోంది. హైదరాబాద్‌ నగరంతోపాటు, పూర్వ రంగారెడ్డి జిల్లాలో కూడా తెలుగుదేశం బలంగానే వుంది. ఖమ్మం, నిజామాబాద్‌లలో కూడా తెలుగుదేశం నాయకులున్నారు. అందువల్ల తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు సాధించినా మేలే..అన్న నిర్ణయానికి రేవంత్‌రెడ్డి వచ్చినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఆయన మళ్లీ తెలుగుదేశం పార్టీకి వెళ్తే ఆయన స్వయం నిర్ణయాలకు తావుంటుంది. చంద్రబాబు సహాకారం కూడా పూర్తిగా వుంటుంది. రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌లోకి వెళ్లిన నాయకులే కాదు, ఇప్పుడు రేవంత్‌రెడ్డి వర్గంగా ముద్ర పడిన నాయకులు కూడా ఆయనతోపాటు బైటకు వచ్చే అవకాశం వుంది. దాంతో తెలుగుదేశం పార్టీ బలపడే అవకాశం కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఇతర పార్టీలకు వెళ్లిన వారు సైతం ఎన్నికల ముందు మళ్లీ సొంత గూటికి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అదే జరిగితే కాంగ్రెస్‌ పుట్టి మునగడం ఖాయం…తెలుగుదేశం మళ్లీ చిగురించడం రేవంత్‌కు అవసరం.

చిత్ర పటానికి నివాళులు అర్పించిన – నారబోయిన రవి ముదిరాజ్

మునుగోడు మండల కేంద్రానికి చెందిన శ్రీరామోజు సుబ్రమణ్యా చారి గారి ప్రధమ సంవత్సరిక కార్యక్రమానికి హాజరై చిత్ర పటానికి నివాళులు అర్పించిన *బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ గారు

ఈ కార్యక్రమంలో మునుగోడు ఎంపీటీసీ బొడ్డు శ్రావణి నాగరాజు గౌడ్ గారు చోల్లేడు ఎంపీటీసీ వనం నిర్మల యాదయ్య గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

ఖబడ్దార్ రేవంత్ ! తెలంగాణ రైతులకుక్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టం

రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న – నారబోయిన రవి ముదిరాజ్

నేటిధాత్రి మునుగోడు

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మరియు విద్యుత్ శాఖ మాత్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపు మేరకు, రైతులకు మూడు గంటల కరెంటు చాలు అని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి గారి మాటలకు నిరసనగా నేడు మునుగోడు మండల కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేసి వారి వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజలకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్.

ఈ కార్యక్రమంలో మునుగోడు బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ఎంపీటీసీ లు సర్పంచ్లు ముఖ్య నాయకులు ఆయా గ్రామాల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వార్డ్ సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్‌ లో కరంటు ముసలం!

 

` రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలతో అయోమయం!

`ఒక్క మాటతో రైతుల్లో ఆగ్రహం.

`కాంగ్రెస్‌ దిష్టి బొమ్మలు తెలంగాణ వ్యాప్తంగా దగ్థం.

`కాంగ్రెస్‌ పార్టీలో అంతర్మధనం!`బిఆర్‌ఎస్‌ కు దొరికిన అస్త్రం?

`కాంగ్రెస్‌ ను బిఆర్‌ఎస్‌ ఆటాడుకుంటున్న వైనం?

`అమెరికాలో వుండి, తెలంగాణ కాంగ్రెస్‌ ను ఇరికించాడు?

`నేనే కాంగ్రెస్‌… కాంగ్రెస్‌ అంటే నేనే! అన్న రేవంత్‌.

`మొన్న సీతక్క సీఎం. అన్నాడు?

`నేడు ఎకరాకు మూడు గంటల కరంటు చాలని ప్లగ్‌ లో వేలుపెట్టాడు.

`మైండ్‌ గేమ్‌ ఆడాడు!

`గేమ్‌ చెయింజర్‌ కావాలనుకున్నాడు?

`బోల్తా పడ్డాడు!

`అసలు రేవంత్‌ రెడ్డి ఎవరు? అని కోమటి రెడ్డి ప్రశ్నించారు.

`రేవంత్‌ రెడ్డి మాట చెల్లదన్న కోమటి రెడ్డి.

` అదును కోసం ఎదురు చూస్తున్న కోమటి రెడ్డి.

`దొరికిన అవకాశంతో రేవంత్‌ పై కోమటి రెడ్డి ఎదురుదాడి.

`నేను స్టార్‌ కాంపెయినర్‌ ని నాకంటే రేవంత్‌ రెడ్డి గొప్ప కాదు.

`కలహాల కాంగ్రెస్‌ తెలంగాణ లో ఖతం.

హైదరబాద్‌,నేటిధాత్రి:                                                   

అక్కడ అమెరికాలో రేవంత్‌రెడ్డి ఉచిత విద్యుత్‌ మీద అగ్గిరవ్వలు రాజేస్తే, నిప్పురవ్వలై తెలంగాణ కాంగ్రెస్‌లో కరంటు మంటలు రేగాయి. సమయం సందర్భంలేని మాటలు అనేక తంటాలు తెచ్చిపెడుతుంటాయి. అయినా నాయకులు ఈశ్వరుడు నోరిచ్చారు కదా! అని మాట్లాడడం మానుకోరు. వివాదాలు ముసురుకోకుండా జాగ్రత్త పడరు. ఎంత వివాదాలు సృష్టిస్తే అంత గొప్ప పబ్లిసిటీ వస్తుందన్న దీమా కొన్ని సార్లు కొంప ముంచుతుందంటే ఇదే..ఇంత కాలం కాంగ్రెస్‌ను కాపాడుకుంటూ వచ్చినా, ఎన్ని విమర్శలు జడివానలు చూసినా, నోటి దూల తెచ్చే తుఫాను నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. ఉన్నతాన వుండకుండా ఉప్పును నిప్పుమీద వేసి ఎట్లా చిటపటలాడుతుందో చూద్దామనుకుంటే, ఎగిరొచ్చి కళ్ల మీద పడితే మంటే పుడుతుంది. హాయిగా వుండదు. ఇంత కాలం కాంగ్రెస్‌ను నడి భజారులో నిలుపుదామా? అని ఎదురుచూస్తున్న బిర్‌ఎస్‌కు రేవంత్‌ వ్యాఖ్యల రూపంలో మంచి ఆయుధం దొరికింది. మొన్నటిదాక ఇక కాంగ్రెస్‌ పని అయిపోయిందనుకుంటే, కర్నాటక ఫలితాలతో జోష్‌ నిండినట్లు ఓవర్‌ యాక్షన్‌ చేసింది. ఏమైంది రేవంత్‌ చేసిన ఒక్క ముక్కతో అంతా తుడిచిపెట్టుకుపోయింది. రైతులు దూరం చేసేలా చేసింది. అసలు రేవంత్‌రెడ్డి వెళ్లిన పనేమిటి? చేసిన వ్యాఖ్యలేమిటి? అన్నది ఒకసారి నిశితంగా పరిశీలిస్తే తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయంలో సెల్ఫ్‌ గోల్‌ చేసుకున్నట్లే. 

రేవంత్‌రెడ్డి అమెరికాలో ఆటా సభలువెళ్లాడు. 

ఇంత వరకు బాగానే వుంది. మేధావులు, విద్యావంతులు వేదికలను పంచుకున్నట్లు, నేనెందుకు లెక్చర్లు ఇవ్వొద్దనుకున్నాడో ఏమో? అధికార పార్టీ నాయకులేనా? విదేశీ గడ్డమీద మాట్లాడేది?నేనెందుకు మాట్లాడకూడదు…అనుకున్నాడో ఏమో? కాని అక్కడి ప్రజలతో కలిసి సమావేశమయ్యాడు. అక్కడ కూడా రాజకీయ ప్రచారం చేసుకున్నా తప్పు లేదు. కాని అక్కడ తన ప్రతాపం అవసరం లేదు. తాను గొప్ప అని చెప్పుకోవడం అవసరమే కాని, తానే గొప్ప అన్నది చెప్పుకోవడం ఎవరికీ మంచిది కాదు. సోమవారం అవసరమైతే సీతక్కను సిఎం చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలే వివాదం రేపాయి. పార్టీలో చర్చకు దారి తీశాయి. దానిపై పెద్దఎత్తున రేవంత్‌ మీద ఎదురుదాడి మొదలైంది. కాంగ్రెస్‌ పార్టీలో ఇక సీనియర్లు లేరా? ఎస్సీ, ఎస్టీ బిడ్డలు ఇంకా లేరా? రేవంత్‌రెడ్డి ఎలా అలా అంటారు? ఆయనకు ఏం హక్కుంది? అంటూ ఇప్పటికే అనేక మంది సీనియర్‌ నాయకులు మీడియాతో తమ అభిప్రాయాలు వెల్లడిస్తూనే వున్నారు. 

 సీతక్క ఏమైనా తెలంగాణ కోసం కొట్లాడిరదా? 

రేవంత్‌రెడ్డి జై తెలంగాణ అన్నాడా? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌! తెలంగాణ కోసం కూడా అధికారంలో వుండి కొట్లాడిరది కాంగ్రెస్‌. అప్పుడు కాంగ్రెస్‌లో రేవంత్‌ లేడు. సీతక్క లేదు. రెండు కళ్ల సిద్దాంతంతో తెలంగాణను నిండా ముంచిన చంద్రబాబుతో వున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో వున్నారు. అంత మాత్రాన పదవులు ఎవరికి వారు డిసైడ్‌ చేసుకునే వెలుసుబాటు కాంగ్రెస్‌లో వుండదు. ఈ విషయం మీద వివాదం ముదురుతుందని గమనించే రేవంత్‌ రెడ్డి మరో వ్యాఖ్యానం కూడాచేశారు. రేవంత్‌ అంటే కాంగ్రెస్‌..కాంగ్రెస్‌ అంటే రేవంత్‌? అని చేసిన వ్యాఖ్యలపై కూడా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మరింత కోపంగా వున్నారు. అది చల్లారకముందే తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్‌పై రేవంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సాగుకు ఇరవై నాలుగు గంటలు అవసరం లేదని రేవంత్‌రెడ్డి చెప్పడం తన బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. పైగా ఎకరా పొలం తడిచేందుకు గంట సమయం చాలు…అని భాష్యం చెప్పడం అంతకన్నా భావ దారిద్య్రం. తెలంగాణలో 80శాతం మంది రైతులు మూడెకరాల రైతులే వున్నారంటూ కొత్త కితాబిచ్చాడు. వారికి మూడు గంటల ఉచిత విద్యుత్‌ చాలన్నాడు? తెలంగాణలో వుండే భూముల రకాలు ఎన్ని వుంటాయన్నదానిపై ఏనాడైనా అధ్యయం చేశాడా? ఇసుక నెలల్లో జరిగే సాగుకు ఎంత నీరు అవసరమౌతుందో తెలిసే చెప్పాడా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతాయి. అంతే కాకుండా ఈ వివాదం మొత్తం కాంగ్రెస్‌ మెడకు చుట్టుకునేలా చేశాడు. 

అటు కాంగ్రెస్‌ నేతలు, ఇటు అధికార బిఆర్‌ఎస్‌ పార్టీ రేవంత్‌ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. 

ముఖ్యంగా బిఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ దిష్టిబొమ్మలు దగ్ధం చేసింది. కరంటుపై కాంగ్రెస్‌ అసలు విధానం బైట పడిరదని ప్రచారం చేసింది. కాంగ్రెస్‌వస్తే మళ్లీ చీకటి రోజులే అని రైతులకు వివరించింది. గత పరిస్ధితులు ఎలా వుండేవో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. పేరుకే ఉచిత విద్యుత్‌ అయినా ఉదయం వేళ మూడు గంటలు, రాత్రిళ్లు మూడు గంటలు ఇచ్చేవారు. అందులోనూ నాణ్యమైన విద్యుత్‌ సరిగ్గా అందేది కాదు. రైతులు రాత్రుళ్లు బావుల వద్ద నిద్ర పోవాల్సివచ్చేది. ఎండనక, వానన కూడా బావుల వద్ద జీవితాలు గడిచేవి. రాత్రిళ్లు బావుల వద్దకు వెళ్తూ అనేక మంది రైతులు ప్రాణాలు కోల్పోయిన సందర్భం వుంది. తెలంగాణ వచ్చిన తర్వాత అలాంటి పరిస్దితి లేదు. రైతు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎప్పుడు వీలైతే అప్పుడు కరంటు వినియోగించుకునే అవకాశం ఏర్పడిరది. నిరంతరంగా 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణంలో పెరిగిన భూగర్భ జలాలతో సమృద్దిగా పంటలు పండుతున్నాయి. ఇవన్నీ తెలిసినా, రేవంత్‌రెడ్డి లేనిపోని వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్‌ పార్టీని ఇరుకున పెట్టారు. 

రేవంత్‌ రెడ్డి చేసిన సీతక్క సిఎం? 

 ఉచిత విద్యుత్‌ అవసరం లేదన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర అంతర్మధనం జరుగుతోంది. ఈ విషయంపై స్పందించిన భువనగరి ఎంపి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదును దొరికింది కదా? అని రేవంత్‌ను తూర్పార పట్టేశాడు. అసలు రేవంత్‌ ఎవరు? రేవంత్‌ రెడ్డి మాట కాంగ్రెస్‌లో చెల్లదు? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సమయం కోసం ఎదరుచూస్తున్న కోమటిరెడ్డికి రేవంత్‌ను అధిష్టానం వద్ద దోషిని చేయడానికి మంచి అస్త్రం దొరికినట్లైందనుకున్నాడు. పనిలో పనిగా సీతక్క సిఎం? అన్నదానిపై కూడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగానే స్పందించారు. అసలు కాంగ్రెస్‌ దళిత సిఎం నిర్ణయం తీసుకోవాలని మంచిర్యాల సభలో మొదట చెప్పిందే నేనంటూ చెప్పుకొచ్చారు. పైగా కాంగ్రెస్‌లో పార్టీ కోసం దశాబ్ధాలుగా పనిచేస్తున్న వారు అనేక మంది వున్నారని, కొత్తగా వచ్చిన వారు ఎవరికి వారు, సిఎంలమనుకోవద్దని సూచించారు. ఒక రకంగా అటు రేవంత్‌కు చురకలు అంటించాడు. అటు కాంగ్రెస్‌లో ముసురుకుంటున్న తుఫాను ఎప్పుడు ఆగిపోతుందేమో? కాని తెలంగాణ రైతుల ఆగ్రహం మాత్రం ఇప్పట్లో చల్లారకపోవచ్చు. కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు క్షమించకపోవచ్చు.

నా వార్తే రావాలి! నేనే కనబడాలి!! నా మాటే వినపడాలి!!!

 

`నా తర్వాత షర్మిల వార్తలే వుండాలి?

`నా వార్తలకే ప్రాధాన్యమివ్వాలి?

`కాంగ్రెస్‌ నుంచి ఎంతటి వారి వార్తలైనా పరిమితంగా వుండాలి.

`నా వార్తలే నిత్యం రావాలి?

`షర్మిల వార్తలు హైలెట్‌ అవుతుండాలి?

`కాంగ్రెస్‌ పార్టీ మొత్తం షర్మిల కోసం ఎదురుచూస్తున్నట్లుండాలి!

`షర్మిలను కాంగ్రెస్‌ వర్గాలు ఆహ్వానిస్తున్నట్లే వార్తలుండాలి.

`షర్మిల వస్తేనే పార్టీ పూర్వ వైభవాన్ని చూస్తుందనేలా రాయాలి!

`షర్మిలను మించిన నాయకురాలు లేదనే చర్చ జరగాలి?

`షర్మిలకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారి వార్తలు తగ్గించాలి?

 `తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పగ్గాలు షర్మిల చేతికొచ్చే కృషి జరగాలి?

`అటు మీడియా తో, ఇటు అనుచరులకు పొంగులేటి సూచన?

`పెద్ద ఎత్తున సోషల్‌ మీడియా వింగ్‌ ఏర్పాటుకు కసరత్తు!

`యూ ట్యూబ్‌ నిండా మన వార్తలే వుండాలి.

`మన వార్తలే ట్రెండిరగ్‌ కావాలి?

`నా నాయకత్వం మీద ఎక్కువ ఫోకస్‌ వుండాలి?

`తెలంగాణ మొత్తం పొంగులేటి వార్తలు కనిపించాలి.

`ఇది ప్రచార యుగం.. ఎంతైనా ఖర్చు చేద్దాం?

`నేనేంటో చూపిస్తా! కాంగ్రెస్‌ లో నా తర్వాతే ఎవరైనా అనేలా చేస్తా!!

`నా రాజకీయం అందరికీ రుచి చూపిస్తా!

హైదారబాద్‌,నేటిధాత్రి: 

ఇకపై ప్రధాన మీడియా స్రవంతిలోనైనా, ఇతర మీడియా సంస్ధల్లోనైనా, మన ఆధ్వర్యంలో నడిచే సోషల్‌ మీడియాతోపాటు, కాంగ్రెస్‌ పార్టీ మీడియా వింగ్‌లోనూ తన వార్తలే కనిపించాలి. తాను ఎవరెవరిని కలుస్తున్నాను…తనను ఎవరు కలుస్తున్నారు? తనకెంత బలముంది? అన్నది ఎప్పటికప్పుడు ఫోకస్‌ చేస్తూ వుండాలి. అందుకే నిత్యం కాంగ్రెస్‌ పార్టీ వార్తల పేరుతో నేనే మీడియాలో కనిపించాలి. నా వార్తలు మాత్రమే పెద్దగా హైలెట్‌ కావాలి. మొత్తంగా నా మాటే మీడియాలో కూడా వినిపించాలి. ఇది కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన అనుచరులతో చెబుతున్న మాట? ఆ తర్వాత మన తరుపున త్వరలో కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేయనున్న వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల వార్తలకు ప్రాధాన్యత కల్పించాలి. ఇప్పటికే ఆమె పాలేరు నుంచిపోటీ చేస్తానని చెబుతూ వస్తున్నారు. తెలంగాణలో సుమారు 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు. త్వరలో పాలేరులో కూడా పాదయాత్ర జరగనుంది. అక్కడే నివాసం కూడా వుంటానని చెబుతోంది. అందువల్ల ఆమె కాంగ్రెస్‌లో చేరుతున్నట్లుగా, పార్టీ నేతలు ఆమెను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు కూడా పెద్ద ఎత్తున వార్తలు వండి వార్చాలని సూచిస్తున్నారట. ముందుగా తన వార్తలకు ప్రాధాన్యత కల్పిస్తూ, తర్వాత షర్మిల వార్తలను ఎక్కువగా ఫోకస్‌ చేయాలని ఖచ్చితంగా సూచనలు చేసినట్లు తెలిసింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ వార్తల విషయంలో తన వార్తలే నిత్యం రావాలని, మిగతా కాంగ్రెస్‌ నేతల వార్తలకు అంత ప్రాదాన్యత కల్పించొద్దని కూడా మీడియా వర్గాలను మేనేజ్‌ చేసుకునే పనిలో శ్రీనివాస్‌రెడ్డి వున్నాడట. ముఖ్యంగా షర్మిల వార్తలను తెలంగాణ సమాజంలోకి విసృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం వుందని తేల్చిచెప్పినట్లు తెలిసింది. అంతే కాదు షర్మిల వస్తేనే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం దక్కుతుందని, ఇప్పటికీ కాంగ్రెస్‌లో షర్మిలను మించిన నాయకులు లేరన్నది జనంలోకి బాగా తీసుకెళ్లాలని కూడా సూచిస్తున్నట్లు తెలుస్తోంది. సమీప భవిష్యత్తులో షర్మిలకు కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు అందుకునేంతగా పార్టీ నేతలు కోరుకుంటున్నారన్న సంగతిని జాతీయ కాంగ్రెస్‌ నేతలు తెలుసుకునేలా జాతీయ మీడియాను కూడా మేనేజ్‌ చేసుకుంటామని కూడా చెప్పుకుంటున్నారట. త్వరలో పెద్ద ఎత్తున సోషల్‌ మీడియా వింగ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అనుచరుల సమావేశంలో పొంగులేటి వివరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వాటిలో మొత్తం పొంగులేటి వార్తలు, షర్మిల వార్తలు మాత్రమే కనిపించేలా ఇప్పనుంచే డిజైన్‌ చేయాలని చెబుతున్నారట. ఏ యూట్యూబ్‌ చానల్‌ చూసినా తన వార్తలు, షర్మిల వార్తలు మాత్రమే విసృతంగా అప్‌లోడ్‌ చేయాలన్నారట. పెద్దఎత్తున పాజిటివ్‌ వార్తలు ట్రెండిరగ్‌లో వుండేలా సోషల్‌ మీడియా వింగ్‌ 24 గంటలు పనిచేసేలా వుండాలని చెప్పారట. ఇది ప్రచార యుగం..దాని కోసం ఎంత ఖర్చు చేస్తే అంత లాభం అని, అందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడేది లేదని కూడా పొంగులేటి స్పష్టం చేసినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. నేనోంటో చూపిస్తా…నా రాజకీయం ఏమిటో చూపిస్తా…కాంగ్రెస్‌ పార్టీలో నా పాత్ర ఎలా వుంటుందో చూపిస్తా…నేను చెప్పిందే పార్టీ మొత్తం వినేలాచేస్తా…నా తర్వాతే పార్టీలో ఎవరైనా అనేలే చేస్తా…ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మాహన్‌రెడ్డి రుణం తీర్చుకుంటా? షర్మిలను తెలంగాణ ముఖ్యమంత్రి చేయడం కోసం అహర్నిషలు పనిచేస్తా..ముందు అది ఖమ్మం జిల్లా నుంచే మొదలుపెడుతా…నేను సూచించే వారికే టిక్కెట్లు ఎలా దక్కాలో స్కెచ్‌ వేస్తా..అంటూ తన అనుచురులలో ఉత్సాహం నింపినట్లు విశ్వసనీయ సమచారం. 

 తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌లో వర్గపోరులో మరో కొత్త కుంపటి రాజేసుకోనున్నది. 

ఇసంత రమ్మంటే ఇళ్లంతా నాదే అన్నట్లు మాజీ ఎంపి.పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తనదంటూ, తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఇప్పటినుంచే ఏర్పాటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా పార్టీని మొత్తం తన వైపు తిప్పుకునే ఎత్తుగడలు ఇప్పటినుంచే వేస్తున్నట్లు కూడా సమాచారం. తాను దూర సందు లేకపోయినా, మెడకో డోలు అన్నట్లు తాను కాంగ్రెస్‌లో చక్రం తిప్పడమే కాకుండా, షర్మిలను క్రియాశీలం చేయడానికి అసరమైన కసరత్తు మొదలుపెట్టినట్లు విశ్వసనీయ వర్గాలనుంచి అందుతున్న సమచారం. కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి ఆ పార్టీల త్వరలో కల్లోలం రేపే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా ఆయనను కలుస్తున్న నాయకులు, ఆయన పిలుస్తున్న నాయకులు ఖమ్మంలో ముందు పెంచుకోనున్న పట్టు అన్నదానిపై అడుగులు పడుతున్నాయి. ఆ అడుగులన్నీ షర్మిల కోసమే అన్నది కూడా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కళ్లలో ఆనందం చూడడానికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సరికొత్త రాజకీయం మొదలుపెడుతున్నాడని వినికిడి. ఇదిలా వుంటే రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇప్పటికే వున్న అనేక గ్రూపులతో సతమతమౌతూ వుంది. తెలంగాణ వచ్చిన తర్వాత నాయకత్వ లేమితో కొట్టు మిట్టాడుతున్న కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న ఫలంగా కర్నాటక ఫలితాలతో కనిపించని ఊపు వచ్చిందని నమ్ముతున్నారు. ఇదే నిజమని ఎవరికి వారు నా మాటే చెల్లాలన్న రాజకీయాలు మొదలుపెడుతున్నారు.ఇలాగే గతంలో రేవంత్‌రెడ్డి కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భువనగిరి ఎంపి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కూడా అంటుండేవారు. ఎక్కడికెళ్లినా, ఏ సభనైనా రేవంత్‌రెడ్డి సీఎం అంటూ నినాదాలు చేసే బ్యాచ్‌ అంతటా రెడీగా వుంటుందంటుండేవారు. పైగా అసలైన కాంగ్రెస్‌ నేతలు పార్టీనుంచి పారద్రోలేలా రేవంత్‌రెడ్డి సోషల్‌మీడియా సైన్యం జగ్గారెడ్డి, ఇతర నాయకుల మీద పెద్దఎత్తున ట్రోల్‌ చేస్తూ వారిని మానసికంగా ఇబ్బందులు పెట్టిన సందర్భం కూడా వుంది. వాటిపై పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదులు చేస్తామని కూడా జగ్గారెడ్డి, హనుమంతరావులు హెచ్చరించిన సందర్భాలున్నాయి. ఒక దశలో జగ్గారెడ్డి కూడా పార్టీని విలేస్తానని, అవసరమైతే సొంత పార్టీ ఏర్పాటు చేస్తానని, రేవంత్‌ సంగతి చూస్తానని కూడా హెచ్చరికలు జారీచేశారు. రేవంత్‌రెడ్డికి పోటీగా జగ్గారెడ్డి కూడా తిరంగ యాత్ర చేపట్టిన వైనం చూశాం. ఇప్పుడు సరిగ్గా అదే పనిని పొంగులేటి చేసి, రేవంత్‌రెడ్డికి చుక్కలు చూపించే పనిలో పడుతున్నాడని కూడా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే మొదట పొంగులేటి కాంగ్రెస్‌లో రావాలనుకుంటున్నట్లు వార్తలు వచ్చిన తొలి దశలో వ్యతిరేకించింది రేవంత్‌ రెడ్డే. షర్మిల విషయంలోనూ ముందు స్పందించింది కూడా రేవంత్‌ రెడ్డే. తెలంగాణలో మేం..మేం చూసుకుంటాం? నీ రాజకీయాలు, సేవలు మా తెలంగాణ ప్రజలకు అక్కర్లేదు అని ప్రకటించింది కూడా రేవంత్‌రెడ్డే. ఎక్కడైతే ప్రభుత్వ ఏర్పాటుకోసం, ఏ అన్న కోసం పనిచేశావో అక్కడే రాజకీయాలు చేసేకో అంటూ సూచనలు కూడా రేవంత్‌ రెడ్డి ఇచ్చారు. ఆఖరకు ఇప్పుడు షర్మిల తెలంగాణలో కాంగ్రెస్‌లో చేరేందుకు అధిష్టానం నుంచి మార్గం సుగమమం చేసుకుంటున్నారు. అదే జరిగితే ఇక రేవంత్‌రెడ్డికి చుక్కలే…కోరికోరి కుంపటి నెత్తిన పెట్టుకోవడం అంటేఇదే మరి…ఏం జరుగుతుందో చూద్దాం. అయితే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన ధనబల రాజకీయంతో షర్మిలను ముందుకు తీసుకొస్తే, సామాజిక పరంగా ములుగు ఎమ్మెల్యే సీతక్కను రేవంత్‌ రెడ్డి ముందుకు తెచ్చి రసవత్తరమైన రాజకీయాన్ని అడేందుకు సిద్దపడుతున్నట్లు కూడా కనిపిస్తోంది. రాజకీయాలు ఇక ముందు ముందు మరింత రసవత్తరంగా వుంటాయని చెప్పడానికి ఇది ట్రైలరే అంటున్నారు.

బిజేపోళ్లు బిత్తరపోయారు?

`సభ ఎందుకు పెట్టినట్లో అనుకుంటూ జుట్టు పీక్కున్నారు?

`మోడీ సభ అంటూ బాగానే బిల్డప్పిచ్చారు?

`అందరి గాలి మోడీ చల్లగా తీశాడు.

`డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అన్న ముచ్చట తీయలేదు.

`ప్రభుత్వంతో కొట్లాడండి అని చెప్పలేదు.

`రాష్ట్ర నేతలు చెప్పింది చెప్పినట్లు, అప్పజెప్పిపోయాడు.

`బిజేపి నేతలు తెల్ల మొహం వేశారు.

`కనీసం జై తెలంగాణ అని కూడా అనలేదు.

`అబ్‌కి బార్‌ బిజేపి సర్కార్‌ అని ముగించారు.

` బిజేపి శ్రేణులకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప దనం తెలిసేలా చేశాడు.

`ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనా దక్షతతో తెలంగాణకున్న ప్రాధాన్యత గురించి చెప్పి వెళ్లారు.

`మీకు అర్థమౌతుందా?

`స్టేజిని చూసి మోడీ నిరాశ చెందినట్లున్నాడు

`వలసవాదులను చూసి అవాక్కైనట్లున్నాడు.

`అందుకే ఎవరి పేరు ఉచ్చరించకుండానే స్పీచ్‌ ఇచ్చారు.

`ఆర్‌ఎస్‌ఎస్‌ బీజేపీ మూలాలు ఉన్నవాళ్లు ఇద్దరూ ముగ్గురే

`మిగిలిన వాళ్ళందరూ అవసరానికి వచ్చిన వాషింగ్‌ పౌడర్‌ నిర్మాలే?

`ప్రజలను చూసి సంతోషపడ్డాడు! స్టేజిని పై ఉన్న వాళ్లని చూసి నిరాశ చెందినట్లున్నాడు!!

`ఒక్క బండి సంజయ్‌ మీద ప్రజలకు ఉన్న అభిమానాన్ని చూసి మోడీ సంతోషించినట్లున్నాడు.

`బండి సంజయ్‌ మార్పుపై మధనపడ్డట్లున్నారు.

`కిషన్‌ రెడ్డికి అంత పవర్‌ లేదని తెలుసుకున్నట్లున్నాడు.

`బిజెపిని రెడ్లు ఆక్రమించేసి బీసీలకు దూరం చేస్తున్నారేమో అనుకున్నట్లున్నాడు.

హైదరబాద్‌,నేటిధాత్రి: 

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారైంది. వరంగల్‌ వస్తున్నాడు. 8వ తేదీ ఎప్పుడొస్తుంది? ఇక రాష్ట్ర ప్రభుత్వం మీద విరుచుకుపడుతాడు? పార్టీ శ్రేణులుకు పూర్తి భరోసా కల్పిస్తాడు. దిశానిర్ధేశం చేస్తాడు. పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో హిత బోధ చేస్తాడు. అగ్రహోదగ్రుడిలాగా బిఆర్‌ఎస్‌ మీద ఆరోపణాస్త్రాలు సంధిస్తాడు. విమర్శల జడివాన కురిపిస్తాడు. సగటు బిజేపి శ్రేణుల్లో ఉత్సాహం నింపి వెళ్తాడు. తెలంగాణ బిజేపికి ఒక ఊపు తీసుకొస్తాడు. డబుల్‌ ఇంజన్‌ సర్కారు ప్రస్తావన తెస్తాడు. దేశంలో జరుగుతున్న అభివృద్ధిని పూసగుచ్చినట్లు వివిరిస్తాడు. తెలంగాణను ఏం చేశామో చెబుతాడు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులిచ్చిందో లెక్కలు చెబుతాడు. భవిష్యత్తులో తెలంగాణకు ఏం చేస్తామో చెప్పి వెళ్తాడు. ఇతర బిజేపి పాలిత రాష్ట్రాలలో జరుగుతున్న అభివృద్దిని వివరిస్తాడు. గుజరాత్‌ మోడల్‌ను గుర్తు చేస్తాడు. అక్కడి ప్రగతిని తెలంగాణ ప్రజల ముందు ఆవిష్కరిస్తాడు. మేకిన్‌ ఇండియా గొప్పదనం అందరికీ వినిపించేలా చెప్తాడు. పనిలో పనిగా తెలంగాణ ప్రభుత్వాన్ని తూర్పారపడతాడు. తెలంగాణ ప్రభుత్వం అవినీతి అంటూ ప్రభుత్వంపై చర్యలు తీసుకుంటామని గిర్జస్తాడు. ఇక కొట్లాడండి అని బిజేపి శ్రేణులను ఉత్సాపరుస్తాడు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి, పార్టీకి ఊపరి సల్పకుండా చేస్తాడు? ఇది శనివారం ఉదయం వరకు రాష్ట్ర బిజేపి పెద్దలు, నాయకులు, శ్రేణులు, సగటు కార్యకర్తలు కొంత కాలంగా నిద్రాహరాలు మాని ఎదురుచూసిన తరుణం. 

 పాపం..వాళ్లు ఒకటి ఆలోచిస్తే..ప్రధాని మోడీ మరొకటి చెప్పాడు. ఒక్కసారిగా నిద్రలో వున్న వాళ్లకు మెలకువ వస్తే ఎలా ఉలిక్కిపడతారో..అలా బిజేపి నేతలు ఏం జరుగుతుందో తేరుకునే లోపే ప్రధాని తన ప్రసంగం ముగించారు.

 ఇదీ ఈ రోజు బిజేపి నేతలకు కళ్లు బైర్లు కమ్మిన రోజు. ఇన్ని రోజుల పాటు ఎదరుచూసిన దానిలో కనీసం ఒక వంతు కూడా ప్రధాని మోడీ ప్రసంగం సాగలేదు. ఇటీవల జరిగిన కాంగ్రెస్‌ సభను మించి బిజేపి సభ జరుగుతుందని గొప్పలకు పోయారు. పెద్ద భహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకటన కూడా పెద్ద విదామైంది. పత్రికా ప్రకటలనపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రాహుల్‌ గాంధీ సభను మించిన సభ జరుగుతుందని అందరూ ఊహించారు. ప్రధాని మోడీ ప్రసంగంపై బిజేపి శ్రేణులు పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ప్రజలు ఊహించినంత స్ధాయిలో రాష్ట్ర బిజేపి సభ నిర్వహించలేదు. బిజేపి శ్రేణులు కలగన్నట్లు ప్రధాని మోడీ ప్రసంగం సాగలేదు. అటు, ఇటూ సప్పగానే తోచింది. బిజేపి కార్యకర్తలకు కొంత కోపం వచ్చింది. వారి ఆశలు అడియాసలయ్యాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంత కాలం పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, బిఆర్‌ఎస్‌ మీద విరుచుకుపడుతున్న బిజేపి నేతల గాలి ప్రధాని మోడీ తీసి వెళ్లిపోయారు? ఇది ఎవరో అంటున్న మాట కాదు…సాక్ష్యాత్తు సభ దగ్గరే బిజేపి శ్రేణులు తిట్టుకున్న వ్యాఖ్యలు?

వరంగల్‌ సభ ప్రధాని మోడీకి నచ్చనట్లు వుంది. ఆ సభా వేదిక మీదకు రాగానే ప్రధాన మంత్రి మోడీకి అది బిజేపి వేదికలాగా కనిపించినట్లునట్లుంది.

 కింద వున్న కార్యకర్తలు బిజేపిని అనువణువూ నింపుకున్న వాళ్లు. కాని వేదిక మీద వున్నవాళ్లు అద్దె నేతలు. అరువు నేతలు. అవకాశవాదం కోసం బిజేపిలో చేరిన వాషింగ్‌ పౌడర్‌ నిర్మాలు. వారి రాజకీయ భవిష్యత్తు కోసం కాషాయకండువా కప్పుకున్నవారు. అంత పెద్ద వేదిక మీద అసలు బిజేపి నేతలుగా కనిపించింది ముగ్గురే..ఒకరు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌. కొత్త రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మూడు బండిసంజయ్‌. అంతే ముందు వరసలో చూసినా, వెనక వరుసలో వున్న వాళ్లంతా రాజకీయ అవసరార్ధం చేరిన వాళ్లే…అందుకే ప్రధాన మంత్రి మోడీ బిజేపి సభలో ఏ ఒక్క నాయకుడిని పేరును ప్రస్తావించలేదు. కనీసం సభ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు చెప్పలేదు. ఆఖరకు సభకు విచ్చేసిన బిజేపి శ్రేణులకు అభివాదం కూడా చేయకుండానే వెనుదిరిగారు. ఆఖరున ఔర్‌ ఏక్‌ బార్‌ బిజేపి సర్కార్‌ అని మూడుసారు శ్రేణులతో అనిపించి ముగించారు. అంటే ఆయనకు ఆ సభ నిర్వహణ మీద ఎలాంటి సదాభిప్రాయం లేదన్నది అర్దమైంది. కేవలం బండి సంజయ్‌ వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మాత్రమే ప్రధాని మోడీ ఆసక్తిగా గమనించారు. బండి సంజయ్‌ మాట్లాడుతుంటే పార్టీ శ్రేణులు ఈలలు వేస్తుంటే సంతోషించాడు. అంతకు మించి ప్రధాని మోడీ ఒక్కసారి కూడా వేదికపై చిరునవ్వు నవ్వలేదు. గతంలో బండి సంజయ్‌ నేతృత్వంలో జరిగిన రెండు మూడు సభల్లో ప్రదాని మోడీ పలు మార్లు చిరునవ్వులు చిందించారు. బండి సంజయ్‌ను భుజం తట్టారు. ప్రజలను బండికే చూపిస్తూ మురిసిపోయాడు. వరంగల్‌ సభలో అలాంటి సన్ని వేశం కనిపించలేదు. ఎవరినీ ప్రధాని మోడీ ఎవరినీ భుజం తట్టలేదు. వరంగల్‌ సభలో మాత్రం ఎలాంటి దూకుడు ప్రదర్శించలేదు. కనీసం సంతోషంగా వున్నట్లు కూడా కనిపించలేదు. అంతే కాదు ప్రధాని ఊహించిన దానికి బిజేపి ఏర్పాటు చేసిన సభను చూసిన తర్వాత కొత్త అధ్యక్షుడైన కిషన్‌రెడ్డి పనితనం ఏమిటో కూడా అర్దమైనట్లుంది. 

 ఇదిలా వుంటే ప్రధాని మోడీ పదినిమిషాల వ్యవధిలో చెప్పిన రెండు రకాల వ్యాఖ్యలకు బిజేపి శ్రేణులు బిత్తరపోయాయనే చెప్పాలి.

 ఓ వైపు తెలంగాణ రాష్ట్రం దేశానికి ఎంత కీలకమో చెప్పారు. తెలంగాణ ఎంత అభివృద్ది చెందిందో చెప్పారు. ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో చెప్పారు. అంతే కాకుండా కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చి తెలంగాణ గొప్పదనాన్ని వివరించారు. అంటే ఇదంతా పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసినట్లే..ముఖ్యమంత్రి కేసిఆర్‌ పనితీరుకు కితాబిచ్చినట్లే…అయితే బిజేపి ఏర్పాటు చేసిన సభలో ఏదో ఒకటి మాట్లాడాలి. అందువల్ల ప్రధాని తనదైన శైలికి భిన్నంగా తెలంగాణ బిజేపి నేతలు ఏం చెప్పారో అవే విషయాలు ఉటంకించారే తప్ప, ఆయన కొత్తగా చెప్పినట్లు లేదు. గట్టిగా చెప్పినట్లు అసలే లేదు. దాంతో బిజేపి శ్రేణులు అయోమయానికి గురయ్యాయి. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. ఇదే సభలో అటు ఈటెల రాజేందర్‌ , కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తోడుగా ప్రధాని పంచులు వుంటాయని అనుకున్నారు. కాని ప్రధాని కనీసం మాటల మతాబులు కూడా పేల్చలేదు. ఇదీ సంగతి..అర్ధమైందా? రేపటి భవిష్యత్తు ఇదే అని బిజేపి శ్రేణులకు అర్దమైనట్లుంది. 

 ఇదిలా వుంటే ప్రధాని మోడీ సభ పూర్తయిన వెంటే బిఆర్‌ఎస్‌ నేతలు ప్రత్యారోపణలు సంధించారు.

 కేంద్ర బిజేపి వైఫల్యాలు ఎండగట్టారు. తెలంగాణకు కేంద్రం ప్రభుత్వం ఇచ్చిందేమీ లేదని లెక్కలు చెప్పారు. ఇవ్వాల్సిన వాటి గురించి ప్రజలు వివరించారు. తెలంగాణకు బిజేపి తీరని అన్యాయం చేస్తోందన్న సంగతి చెప్పారు. తెలంగాణకు రావాల్సిన గిరిజన యూనివర్సిటీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బయ్యారం స్టీల్‌ ప్యాక్టరీ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణకు మెడికల్‌ కాలేజీల మంజూరులో ఎందుకు వివక్ష అని ప్రశ్నించారు. కనీసం నవోదయ పాఠశాలలు కూడా ఇవ్వకపోవడం వివక్ష కాదా? అని రాష్ట్ర్రమంత్రులు, ఎమ్మెల్యేలు, బిఆర్‌ఎస్‌ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని తూర్పారపట్టారు. ఇదీ అసలు సిసలు కొసమెరుపు.

రాష్ట్ర భాజాపాలో మొదలైన వర్గ విభేదాలు

# ప్రధాని మోడీ వస్తున్న వేళ బండి వర్గంపై దెబ్బ

# అదునుచూసి దెబ్బకొట్టిన భాజపా చీఫ్ కిషన్ రెడ్డి వర్గం

వరంగల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వర్గ విభేదాలు మొదలయ్యాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి జాతీయ అధ్యక్షుడు జేసీ నడ్డా ఇచ్చిన హామీ నెరవేరగా ముందే ఆయన వర్గంపై వేటు మొదలైంది. బండి సంజయ్ భాజపా రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న సమయంలోనే దేశ ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ జిల్లా పర్యటన ఖరారైంది. ప్రధాని రాక ముందుగానే భాజపా అధ్యక్ష పదవిపై మార్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ జిల్లాకు రానున్న 24 గంటల ముందే బండి వర్గంపై మొదటి దెబ్బ పడింది. బండి సంజయ్ వర్గం పై రేటు పడిందని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వర్గం కొండేటి శ్రీధర్, రేవూరి ప్రకాష్ రెడ్డిలు అదును చూసి దెబ్బకొట్టారనే ఆరోపణలు మరోవైపు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ జర్నలిస్టు యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమదేవి తన సోదరుడు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ యువజన నాయకుడు డాక్టర్ గోగుల రాణా ప్రతాపరెడ్డి తో కలిసి గత సంవత్సరంనర క్రితం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో భాజపాలో చేరారు. ముందుగా మున్సిపాలిటీ ఎన్నికలకు ముందు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుండి భాజపాలు చేరారు. నర్సంపేట పట్టణంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో పోటీ చేసేవారు కూడా లేనప్పటికీ కొన్ని వార్డులలో వారు డిపాజిట్లు గల్లంతైన సందర్భాలు ఉన్నాయి. నర్సంపేట నియోజకవర్గంలో బిజెపి పాత క్యాడర్ తో పాటు రేవూరి వర్గం కలిసిపోలేని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన యువజన నాయకుడు డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన తన సంఖ్యాబలాన్ని పెంచుతూ భారతీయ జనతా పార్టీలో యువతను చేర్పించారు. త్వరలో జరగబోయే ఎన్నికలలో భాజపా అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తుందన్న సాంకేతాలు వినబడుతున్న నేపథ్యంలో రాణా ప్రతాప్ రెడ్డి ని పార్టీ నుండి సస్పెండ్ చేయడం పట్ల భాజాపాకు గట్టి దెబ్బ తగిలినట్టే అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బండి సంజయ్ కి ప్రధాన అనుచరులుగా ఉన్న వర్గం నుండి రాణా ప్రతాప్ రెడ్డి ని సస్పెండ్ చేయడం బండి సంజయ్ వర్గాన్ని తొక్కే క్రమంలోనే ఇది మొదటి దెబ్బ నర్సంపేట నియోజకవర్గ నుండే మొదలైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భాజపా లో చేరిన నాటినుండి రానా ప్రతాప్ రెడ్డి యువతను చేర్పించి పార్టీని ఉవ్వెత్తున లేపుతూ క్యాడర్ను పెంచాడని ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేయడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు. టిడిపి నుండి బిజెపిలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి భాజపా పాత కార్డును కాపాడలేదు అలాగే కొత్తవారిని చేర్చలేదని తెలుగుదేశం నుంచి వచ్చిన రేవూరి నేడు బిజెపిలో కొనసాగుతాడా లేక కాంగ్రెస్ పార్టీకి పోతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నర్సంపేట నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయాల రీత్యా రానా ప్రతాప్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ నుండి సస్పెండ్ చేయడం పట్ల పార్టీలో ఉన్న క్యాడర్ అయోమయంలో పడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు.

మహదేవపూర్ ఎంపీపీ పై అవిశ్వాసం.

ఆర్డీవోకు అవిశ్వాస పత్రాన్ని సమర్పించిన ఎంపీటీసీలు.

మహాదేవపూర్- నేటిధాత్రి;

మహదేవపుర్ మండల పరిషత్ అధ్యక్షుల పై ఈరోజు ఆర్డీవో కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం కొరకు అవిశ్వాస పత్రాన్ని ఆర్డీవో కు అందజేయడం జరిగింది. భారత రాష్ట్ర సమితి పార్టీ కు చెందినటువంటి ఎంపీపీ బన్ సోడా రాణి బాయ్ మండల పరిషత్ అధ్యక్షురాలు గా గత నాలుగు సంవత్సరాల నుండి కొనసాగుతున్న క్రమంలో ఇతర పార్టీలకు చెందిన ఎంపీటీసీలు మాత్రం ముగ్గురు ఉన్నారు. మెజారిటీ మాత్రం భారత రాష్ట్ర సమితి ఎంపీటీసీలే ఉన్నప్పటికీ ప్రస్తుత ఎంపీపీ పై అవిశ్వాసం పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అవిశ్వాస పత్రం స్థానిక ఆర్డీవోకు 8 మంది ఎంపీటీసీలు అవిశ్వాస పత్రంలో పేర్కొన్నప్పటికీ అవిశ్వాస పత్రాన్ని అందజేసే సమయంలో ఆరుగురు ఎంపీటీసీలు కలిసి ఆర్డిఓ కు అవిశ్వాస పత్రాన్ని అందజేయడం జరిగిందని ఆర్డీవో నేటిధాత్రి విలేఖరికి తెలియపరచారు. ఇక ఎంపీపీ పోయా అవిశ్వాసం వెనుక ఏ రాజకీయ పార్టీ హస్తముంది భారత రాష్ట్ర సమితి నుండి కాంగ్రెస్ లోకి ఎంపీటీసీలు వెళ్తున్నారా లేక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు భారత రాష్ట్ర సమితిలోకి వస్తున్నారా అనేది వేచి చూడాలి. గుట్టు చప్పుడు కాకుండా ఎంపీపీ పై అవిశ్వాస తీర్మానం మంథని నియోజకవర్గ రాజకీయంలో ఒక పెను మార్పు అని చెప్పవచ్చు.

అందరూ బిఆర్‌ఎస్‌ బాటలోనే! అన్ని పార్టీలు బడుగుల జపమే!!

`బలమైన నాయకుడు కేసిఆర్‌ అడుగుజాడలే…

`అన్ని పార్టీలలో ఆమోదమే..

`ఈసారి బడుగులకు బిఆర్‌ఎస్‌ లో అత్యంత ప్రాధాన్యత.

`సిట్టింగులను తప్పించనున్న చోట్ల ఎక్కువగా బడుగులకే పెద్దపీట.

`అసమ్మతి రాగాలున్న చోట కూడా అదే లెక్క.

`బిఆర్‌ఎస్‌ అంటే బడుగులకు అండ సంకేతాలు.

`అదే బాటలో బిజేపి పయనం.

`ఈటెల ఎంపికలో అదే పరమార్ధం.

`కాంగ్రెస్‌ లో కూడా మొదలైన బడుగుల జపం.

`పొన్నాల లక్ష్మయ్య డిమాండ్‌ తో ఒక్కసారిగా కలకలం.

`కాంగ్రెస్‌ ను ఇంత కాలం కాపాడిరది బడుగు నేతలే.

`కాంగ్రెస్‌ కు ఎల్లకాలం ఓటు బ్యాంకు బడుగులే.

`అందరూ ఇప్పుడు బడుగుల నినాదమే.

`పటించేది బడుగుల మంత్రమా!

 పార్టీల కొంగ జపమా!?

హైదరబాద్‌,నేటిధాత్రి:                                   

తెలంగాణ రాజకీయాల్లో ఏ విషయం గమనించినా అందులో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ముద్రనే స్పష్టంగా కనిపిస్తుందే తప్ప, ప్రతిపక్షాల ఆలోచన ఒక్కటి కూడా కనిపించడం లేదు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్షాలను కేసిఆర్‌ వేలు పట్టుకొని నడిపిస్తున్నాడా? లేక ప్రతిపక్షాలే కేసిఆర్‌ వేలు పుట్టుకొని నడుస్తున్నాయో? అర్ధం కావడం లేదు. రాష్ట్రంలో అమలౌతున్న పథకాలు విమర్శించే ప్రతిపక్ష కాంగ్రెస్‌,బిజేపిలు అవే పధకాలకు మరింత ఆర్ధికమద్ది ప్రచారాస్త్రాలు చేసుకుంటున్నాయి. దానికి తోడు ప్రతి క్షణం ముఖ్యమంత్రి కేసిఆర్‌ వేసే ప్రతి అడుగును నిశితంగా గమనిస్తూ, వాటినే అనుసరించడం కూడా ప్రతిపక్షాలు అలవాటు చేసుకుంటున్నాయి. తాజాగా బిఆర్‌ఎస్‌ ఈసారి వచ్చే ఎన్నికల్లో బడుగులకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు పసిగట్టాయి. గత కొంత కాలంగా ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలనీ బడుగుల ఆర్ధిక స్వేచ్ఛ ,స్వాలంబన మిలితమై వుంటున్నాయి. అందులో భాగంగానే వేసే ప్రతి అడుగు పేదలైన బడుగులు సంక్షేమం కోసం చేస్తున్నారు. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించి ఆది నుంచి అమలు చేస్తున్న ఆసరా ఫించన్లు కూడా పేదలైన బడుగుల జీవితాల్లో వెలుగుల నింపేందుకు, వారి జీవితాలకు భరోసా కల్పించేందుకు ఎంతో ఉపయోపడుతున్నాయి. అయితే ఆసరా అన్నది కేవలం పేదరికమే ప్రాతిపదికగా అమలు చేస్తున్నారు. కళ్యాణలక్ష్మి , షాదీ ముబాకర్‌ లాంటవి కూడ అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయి. అయినా బగుడుల్లో ఎక్కడో అసంతృప్తి కనిపిస్తోంది. ఆయా వర్గాలు అటు రాజకీయంగా, ఇటు ఆర్ధికంగా సమానత్వాన్ని సాధించాలి. ఇది ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలోచన. అందుకే తెలంగాణలో దళిత బంధు అనే పధకం ప్రారంభించారు. నిజానికి ఇది గొప్ప పధకం. దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఇలాంటి పథకం అమలు జరగలేదు. ప్రపంచానికి సమానత్వ పాఠాన్ని చెప్పిన ప్రాన్స్‌లో కూడా ఇలాంటి గొప్ప పధకాలు ఏనాడు లేదు. ఎందుకంటే ప్రపంచ గతినే మర్చిన ప్రాన్స్‌ విప్లవం ఒక గొప్ప మలుపు. ఒక్క రొట్టె ముక్క కోసం వచ్చిన విప్లవం ప్రాన్స్‌ విప్లవం. ఆకలి కోపం ఎలా వుంటుందో పాలకులకు రుచి చూపించిన విప్లవం ప్రాన్స్‌ విప్లవం. అలాంటి దేశంలో కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాత్వ్రుం వున్నప్పటికీ పేదల సంక్షేమం, ఆర్ధిక స్వావలంబన కోసం ఏనాడు కృషి చేసింది లేదు. ఆకలి, ఆర్ధిక, సామాజిక అసమానత్వాలు ఎప్పుడో ఒకప్పుడు పెద్ద అగాధాన్ని సృష్టిస్తాయి. అందుకు ప్రాన్స్‌ విప్లవం ఒక ఉదాహరణ. బాస్టిలీ జైలు ఉదంతం ఒక నిర్ధారణ. అయినా ప్రాన్స్‌లో సహజంగా వచ్చిన మార్పులోనే అన్ని వర్గాలు అక్కడ ఎదిగాయి. కాని మొదటిసారి ప్రపంచ చరిత్రలోనే ముఖ్యమంత్రి కేసిఆర్‌ సంక్షేమం అన్న పదానికి కొత్త అర్ధం చెప్పారు. దళిత బంధు ప్రకటించారు. దళిత బంధు వల్ల ఇప్పటికే కొన్ని వేల మంది దళితుల కుటుంబ జీవితాల్లో వెలుగులొచ్చాయి. తెలంగాణలోని మొత్తం దళిత సమాజాన్ని ఆర్థికంగా గట్టెక్కించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ఒక పథకం ప్రకారం వారి జీవితాలను దీర్చిదిద్దుతున్నారు. దశల వారిగా దళిత బంధు విడుదల చేస్తూ వారికి ఆర్దిక ప్రోత్సాహం అందిస్తున్నారు. ఆదుకుంటున్నారు. ఆ తర్వాత గిరిజన బంధు ప్రకటించారు. అంతకు ముందే పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పారు. తాజాగా వాటిని కూడ గిరిజనులకు అందజేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా పోడు భూముల సమస్యల ఒక్క తెలంగాణలో తప్ప ఎక్కడా పరిష్కారం కాలేదు. అలా గిరిజనుల జీవితాలను కూడా పండగ చేస్తున్నారు. ఈ మధ్య బిసిలకు లక్ష సాయం పథకం ప్రకటించారు. త్వరలో అది కూడా అమలు కానున్నది. ఇలా బిడుగుల కోసం ఒక్కొక్కటీ చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం వారి జీవితాలలో వెలుగులు నింపుతోంది. సమాజంలో అసమానతలు రూపు మాపే కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తోంది. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చేయాలో అర్ధం కావడంలేదు. ప్రజలకు వచ్చేఎన్నికల్లో ఏం చెప్పాలో తోయడం లేదు. దళిత బంధును పెంచి ప్రకటిస్తామా? అంటే అది బిఆర్‌ఎస్‌ పార్టీని కాపీ కొట్టినట్లే అవుతుంది. ఏ పధకం ప్రకటించాలన్నా వాటికి పేటెంట్‌ రైట్లు బిఆర్‌ఎస్‌ వే అన్న భావన కల్గుతోంది. తాజాగా ఆయా పార్టీలు రాజకీయాల్లో బడుగులను మరింత ప్రోత్సహించాలన్న ఆలోచన చేయకముందే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఈసారి ఎన్నికల్లో బడుగు నేతలుకు ఎక్కువ టిక్కెట్లు ఇస్తేఎలా వుంటుందన్న ఆలోచన చేస్తున్నాడని తెలిసి ప్రతిపక్షాల్లో వణుకు మొదలైంది. ఇప్పుడు ఆయా పార్టీలు కూడా బిడుగుల జపం చేస్తున్నట్లే కనిపిస్తోంది. 

బిజేపి తీసుకున్న తాజాగా నిర్ణయాల్లో కూడా బడుగుల వైపు బిజేపి కూడా అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది. 

అందుకే పైకి కిషన్‌రెడ్డిని అధ్యక్షుడిని చేసినా, ఈటెల రాజేందర్‌ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తేనే పార్టీకి మెరుగైన ఫలితాలు లభించే అవకాశాలున్నాయన్న అంచనాకు బిజేపి పెద్దలొచ్చారు. అందుకే కర్నాటక ఎన్నికల తర్వాత బిజేపి సినారియా మారింది. గత కొంత కాలంగా అటూ, ఇటూ డైలమా కొనసాగించినా, తెలంగాణలో బిజేపి బతికి బట్ట కట్టాలంటే ఖచ్చితంగా బడుగుల కార్డు వినియోగించుకుంటే తప్ప మనుగడ సాగించలేమన్నది గుర్తించింది. నిజానికి తెలంగాణలో కూడా బడుగుల నేత సంజయ్‌ నేతృత్వంలోనే పార్టీకి ఊపు వచ్చింది. కాని ఆయన దూకుడే పార్టీని కొంప ముంచేలా వుందన్న తేలిపోయింది. ఆయనే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగితే, పార్టీ ఖాళీ అయ్యే పరిస్ధితికి వచ్చింది. అధికార బిఆర్‌ఎస్‌ను ఎదుర్కొవాలంటే బండి సంజయ్‌ బలం సరిపోదు. ఆయన వుంటే పార్టీ నేతలు కూడా సహకరించే పరిస్ధితి కనిపించడం లేదన్నది తెలిపోయింది. బిజేపిలోఒక్కసారిగా పెరిగిన అరువు నేతలే, పార్టీని ముంచడమా? తేల్చడమా? అన్నదాకా రావడంలో వారిని కాపాడుకోవాల్సిన అవసరం బిజేపికి కల్గింది. దాంతో బిజేపి కూడా బిసి జపం చేయాల్సి వస్తోంది. ఎందుకుంటే బిఆర్‌ఎస్‌ మీద ప్రతిపక్షాలు ఓ ముద్ర వేశాయి. కాంగ్రెస్‌ మీద మరో ముద్ర వుండనేవుంది. దాంతో బిఆర్‌ఎస్‌ అన్నది ఇటీవల బడుగుల పార్టీ ప్రజలు అక్కున చేర్చుకునేందుకు అనేక పధకాలు అమలు కూడా చేస్తున్నారు. ఇక మిగిలింది రాజకీయమే…దాన్ని కూడా అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఇక మిగిలింది కాంగ్రెస్సే…మేమేం తక్కువ..మాకేం తక్కువ. మాకు వున్న ఓటు బ్యాంకు బలమే బడుగులు అన్నది తెరమీదకు తెచ్చేందుకు కాంగ్రెస్‌ కూడా కొత్తఎత్తులకు సిద్దపడుతోంది. 

 కాంగ్రెస్‌లో మాత్రం ఒక తరహా తిరుగుబాటు కూడా మొదలైనట్లే కనిపిస్తోంది. 

మాజీ పిసిసి. అద్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తాజగా విడుదల చేసిన బిసి నేతల జాబితాతో కాంగ్రెస్‌లో ఒక కల్లోలం మొదలైనట్లే లెక్క. ఇప్పటి వరకు కాంగ్రెస్‌కు ఓట్లు బడుగులవి..సీట్లు రెడ్లవి అన్న నానుడి వుండేది. వారి పెత్తనమే ఎప్పుడూ సాగేది. అటు ఉమ్మడి రాష్ట్రమైనా ఇప్పుడు తెలంగాణ వచ్చినా అదే దోరణ కనిపిస్తోంది. మొదటి అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను నియమించినా, ఆ తర్వాత ఇద్దరూ రెడ్డి నేతలను పిసిసిలుగా నియమించారు. నేను పిసిసి అధ్యక్షుడినౌతా అంటూ విహెచ్‌. హనుమంతరావు , దామోదర రాజనర్సింహా లాంటి వాళ్లు ఎంత మొత్తుకున్నా చేసేవారు లేరు. వారి గోడు వినేవారు లేరు. కాని జగ్గారెడ్డి, కోమటి రెడ్డి లాంటి వారి వార్తలు మాత్రం చక్కర్లు కొడతాయి. ఇదీ కాంగ్రెస్‌ తీరు. మరి ఈసారైనా జెండా ఎగరేయాలంటే అదే మూస కాంగ్రెస్‌ వెళ్తుందో..లేక బడుగుల జపం చేస్తుందో చూడాలి.

నటి రంజిత ఇప్పుడు కైలాస ప్రధాని!

తమిళనాడుకు చెందిన బాబా నిత్యానంద బెంగళూరులో ఆశ్రమం నడుపుతున్న సమయంలో అతనిపై లైంగిక వేధింపుల ఫిర్యాదు నమోదైంది. 

ఆ తర్వాత అతడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. కొన్నేళ్ల క్రితం భారత్‌ నుంచి పారిపోయిన నిత్యానంద తన శిష్యులతో కలిసి కైలాస అనే ఏకాంత ద్వీపంలో నివసిస్తున్నట్లు పేర్కొన్నాడు.

ఈ దేశానికి ప్రత్యేక పాస్‌పోర్టు, రూపాయి నాణేలు, ప్రత్యేక జెండా ప్రకటించి అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునేలా పలు దేశాల అధికారులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. 

అదేవిధంగా, నిత్యానంద నినార్క్ నగర పాలక సంస్థ నిత్యానంద కైలాసాన్ని సార్వభౌమ రాజ్యంగా గుర్తించింది. నిత్యానంద భౌతికంగా గాయపడ్డారని ఇటీవల వార్తలు వచ్చిన తర్వాత, ఆమె లింక్డ్‌ఇన్ పేజీలో రంజిత ఫోటోను నిత్యాంత మాయి స్వామి అని చూపించారు. 

Ranjitha

దాని క్రింద కైలాస ప్రధాని అని పేర్కొన్నారు. ఈ సమాచారం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దీనిని బట్టి కైలాస ద్వీపానికి రంజితను ప్రధానిని చేసినట్లు తెలుస్తోంది.

నాగుర్ల వెంకన్న కు పరకాల టికెట్ ఇవ్వాలి

నాగుర్ల వెంకన్నను పరకాల నియోజక వర్గం బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించాలి.

పరకాల నియోజక వర్గం నుండి వెనుక బడిన సామాజిక వర్గం ఆరె కులానికి అవకాశం ఇవ్వాలి.

తేది: 7-7-2023 రోజున ఉదయం 11.00 గం. పరకాల పట్టణం లోని మయూరి గార్డెన్స్ లో ఆరె కుల సంక్షేమ సంఘం సదస్సు పరకాల మండల ప్రధాన కార్యదర్శి అడగాని జనార్ధన్ అద్యక్షతన జరిగినది. ఈ సదస్సుకు ముఖ్య అతిదులుగా జిల్లా అధ్యక్షులు హింగె శివాజీ, ప్రధాన కార్యదర్శి వజ్ర కిషన్ రావు జిల్లా కమిటి సభ్యులు హాజరైనారు.

అనంతరం జరిగిన పత్రికా సమావేశంలో ఆరె సంక్షేమ సంఘం జిల్లా అద్యక్షుడు హింగె శివాజీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లోని ఆరె కులస్తులు ఆర్ధిక,సామాజిక రాజకీయ సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది.ఈ సమస్యలు అన్ని పరిష్కారం కావాలంటే ఆరె కులస్థుల నుండి కొందరు చట్టసభలలో ఉండాలి,అప్పుడు మాత్రమే మా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఆరె కుల ముద్దు బిడ్డ నాగుర్ల వెంకన్న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుండి నేటి భారత రాష్ట్ర సమితి రూపాంతరం చెందే వరకు పార్టీకి అధిష్టానానికి విధేయుడుగా ఉంటూ పార్టీ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించడం జరుగుతుంది. పరకాల నియోజక వర్గం లో పుట్టి పెరిగి అన్ని వర్గాల ఆశీర్వాదం పొందుతున్న నాయకుడు సౌమ్యుడు వివాద రహితుడు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు, బడుగు బలహీన వర్గాల గొంతుక నాగుర్ల వెంకన్న. కాబట్టి మా ఆరె కులం నుండి పరకాల నియోజక వర్గం బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్దిగా నాగుర్ల వెంకన్న గారికి అవకాశం ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖర్ రావు గారికి విజ్ఞప్తి చేస్తున్నాము.

జిల్లా ముఖ్య సలహా దారులు పేర్వాల లింగమూర్తి మాట్లాడుతూ పరకాల నియోజక వర్గం లో ఆరె కుల సామాజిక వర్గం ఓట్లు సుమారు గా 20,000 వరకు ఉంటాయి. ఆరె కులస్థులు తెలంగాణా రాష్ట్రం లోని 20 నియోజక వర్గాలలో గెలుపు, ఓటములను నిర్ణయించే బలమైన సామాజిక వర్గంగా ఉన్నారు. కాబట్టి పరకాలలో నాగుర్ల వెంకన్న గారికి టికెట్ ఇవ్వడం వల్ల 20 నియోజక వర్గాలలో ఉన్న మా అరె కులస్థులు పూర్తిగా బి.ఆర్.ఎస్ వెంట నడుస్తారు. తెలంగాణ ఉద్యమ తొలినాళ్లలో తెలంగాణ సాధిస్తామని ఆశ లేని రోజులలో తెలంగాణ సాధన కోసం కేసీఆర్ గారు వేసిన అడుగులో అడుగై కేసీఆర్ గారి పిలుపునందుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన అతి ముఖ్య నాయకులలో నాగుర్ల వెంకన్న ఒకరు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి ఊరూరా జండా గద్దెలు నిర్మించి తెలంగాణ నినాదాన్ని పల్లె పల్లెకు మోసుకెళ్లిన ఉద్యమకారుడు నాగుర్ల వెంకన్న. పార్టీ ఒడుదుడుకుల సమయంలో కూడా కేసీఆర్ గారి వెన్నంటి ఉన్న నాయకుడు,పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించిన క్రమశిక్షణ కలిగిన నాయకుడు, పార్టీ ఏ అవకాశం ఇచ్చిన ఆ పదవికి వన్నెతెచ్చిన శ్రమజీవి, పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు ఎన్నో రకాలుగా త్యాగం చేసినటువంటి ఉద్యమకారుడు, మచ్చ లేని నాయకుడు నాగుర్ల వెంకన్న.

నాగుర్ల వెంకన్న గారి సేవలను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఈసారి బి.ఆర్.ఎస్ పార్టీ పరకాల నియోజకవర్గం అభ్యర్థిగా నాగుర్ల వెంకన్నను ప్రకటించాలని ఆరె కులం నుండి విజ్ఞప్తి చేస్తున్నాము. 

ఈ కార్య క్రమం లో జిల్లా కమిటి సభ్యులు కొల్లూరి కండేరావు, కుడ్లే మనోహర్ రావు,నాగుర్ల రాజేశ్వర్ రావు, హింగే భాస్కర్, వరికెల కిషన్ రావు, కుడ్లే సుధాకర్ రావు, సిరిసె చందర్ రావు, వాడికారి లక్ష్మన్ రావు, తుమ్మనపల్లి శ్రీనివాస్,అవేలి శ్రీనివాస్,

అంబీరు శ్రీనివాస్,

పరకాల మండల కమిటి సభ్యులు వాడికారి శివాజీ,నాగుర్ల శ్రీనివాస్,ఇజ్జిగిరి రాజేందర్,బాదరగాని రాకేష్

నడికూడ మండల అద్యక్షులు లోకటి నగేష్, వాంకే రాజు, గుబిరే సుధాకర్,పేర్వాల రత్నాకర్ వరికెల రాజు, నాగుర్ల రాజీరు, సూరావు కిషన్ రావు, సురావు బాబురావు, సురావు శివరావు,మోకిడే రాజు, లోనె సతీష్ , నాగుర్ల బాబు రావు,సురావు నర్సింగరావు, భూపాల పల్లి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ వాడికారి కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.

ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటన.. షెడ్యూల్‌

హైదరాబాద్‌

నేటిధాత్రి  జులై 07

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈనెల 8న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారైంది. శనివారం 8న ప్రత్యేక విమానంలో ప్ర ధాని ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 9.50కి హకీంపేట విమానాశ్రయంలో దిగుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 10.35 కి వరంగల్‌ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

ఉదయం 10.45 నుంచి 11.20 వరకు వరంగల్‌లో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొనడంతో పాటు వివిధ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 11.30 గంటలకు హనుమ కొండ ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.15కి వరంగల్‌ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 1.10 గంటలకి తిరిగి హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరు కుంటారు. అక్కడి నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు..

లేని పెత్తనం’పొంగు’తోంది!?

`‘కమ్మ’ను దాటి ఖమ్మంలో ‘రెడ్డి’ గెలిచేనా?

`‘రెడ్డి’ ముందు ‘రావు’లు సాగిలపడేనా?

`మొత్తంగా కాంగ్రెస్‌ కొంప మునిగేనా?

`పొంగులేటి లేని పోరు కాంగ్రెస్‌ వల్ల కాదా?

 `పొంగులేటి ముందు పార్టీ మోకరిల్లడమా?

`డబ్బు చుట్టూ ఖమ్మం కాంగ్రెస్‌ రాజకీయమా?

`ఖమ్మంలో ప్రజా బలం వున్న నాయకులకు కొదువా?

-పార్టీని నిలబెడుతున్న భట్టి బలం చాలదా?

– రేణుకా చౌదరి అభయం, అనుభవం సరిపోదా?

-పార్టీని బతికిస్తున్న నాయకుల బలానికి కొదువా?

-అసలుపొంగులేటి పవరెంత?

`డాబు,డాంబికమంత!?

`డబ్బు తోనే రాజకీయాలు సాగవు?

`పైన పటారం లోన లొటారం!

`పొంగులేటి అంత బలవంతుడైతే గత ఎన్నికలలో బిఆర్‌ఎస్‌ కు సీట్లెందుకు రాలేదు?

హైదరబాద్‌,నేటిధాత్రి:  

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీని చూస్తే జాలేస్తోంది. 135 సంవత్సరాల పార్టీ అని చెప్పుకునే పార్టీకి దిక్కూ దివానం లేనట్లు, కొత్తగా ఎవరైనా పార్టీలో చేరితేనే బతికి బట్టకడుతుందన్నట్లు సాగుతున్న వ్యవహారం విచిత్రంగా వుంది. పైగా కర్నాకట గెలుపుతోనే కాంగ్రెస్‌కు ఆశలు చిగురించినట్లు, అంతకు ముందు కాంగ్రెస్‌ పార్టీకి జీవమే లేనట్లు ఆత్మహత్యా సాదృష్యమైన ప్రచారం, ఆ పార్టీకి తీరని నష్టం చేకూర్చుతుందే తప్ప లాభం కాదు. ఇదిలా వుంటే నేటిధాత్రి చాలా స్పష్టంగా ఇప్పటికే చెప్పింది. పొంగులేటి రాజకీయం వెనకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాత్ర వున్నట్లు రాయడం కూడా జరిగింది. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గురువారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలిసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అంతే కాకుండా ఏ లక్ష్యం కోసమైతే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరాడో అది నెరవేరకపోయే పరస్ధితులు ఎదురయ్యేలా సూచనలు కనిపిస్తున్న విషయం జగన్‌కు వివరించినట్లు తెలుస్తోంది. నిజానికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేత ఏకంగా సొంతంగా పార్టీని ఏర్పాటు చేసే యోచన జగన్‌ చేశారని సమాచారం. అప్పటికే షర్మిల కూడా పార్టీ కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో పొంగులేటి పెట్టిన పార్టీలో షర్మిల జాయిన్‌ అయినా తెలంగాణ వ్యతిరేకి అన్న సంకేతాలు వెళ్తాయి. ఒక వేళ షర్మిల పార్టీలో శ్రీనివాస్‌రెడ్డి చేరితే తాను ఏం చేయదల్చుకున్నాడో..చెప్పదల్చుకున్నాడో చెప్పకుండానే తెలిసిపోతుంది. అందుకే ఉభయకుశలోపరిగా కాంగ్రెస్‌లో పొంగులేటి జాయిన్‌ అయితే, ఆ తర్వాత షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే సరిపోతుంది. అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. తెలంగాణ కాంగ్రెస్‌లో షర్మిల పెత్తనం మొదలౌతుంది. ఇదీ అసలు స్కెచ్‌. అదే దారిలో పక్కా ప్రణాళిక సాగుతోంది. అందుకే షర్మిల కర్నాటకకు చెందిన డి.కే. శివకుమార్‌ను అభినిందించినట్లు ప్రచారం చేశారు. తర్వాత షర్మిల కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నట్లు ఫీలర్లు వదిలారు. ప్రజల స్పందన తెలుసుకునే ప్రయత్నం జరిగింది. ఎక్కడా తెలంగాణ ప్రజలు వ్యతిరేకించినట్లు కనిపించలేదు. షర్మిల ఒక్కతే తెలంగాణ రాజకీయాలు చేయడం అంత సులువు కాదు. ఆమెను నమ్మెందుకు ప్రజలు కూడ సిద్దంగా లేదు. ఆంధ్రప్రదేశ్‌లో పవన్‌ కళ్యాణ్‌ పరిస్ధితి ఎలా వుంటుందో ఇక్కడ షర్మిల రాజకీయం అంతే వుంటుందని అంచనా వేశారు. దాంతో ఎలాగైనా తెలంగాణ రాజకీయాల్లో షర్మిల కీలకం కావాలి. చక్రం తిప్పగలగాలి. తెలంగాణ రాజకీయాలను శాసించే దాకా పెరగాలి. అందుకు జగన్మోహన్‌రెడ్డి ఆర్ధిక సహాకారం, కేవిపి. చాణక్యం తోడవ్వాలి. ఇదీ అసలు సంగతి. అందుకే రాహుల్‌ గాంధీ ఖమ్మం సభ తర్వాత గన్నవరంలో కేవిపి కలిశారు. మరునాడు ఉదయమే షర్మిల గురించి కేవిపి. రామంచంద్రరావు ప్రకటన చేశారు. ఇదంతా పైకి కనిపిస్తున్నట్లు కొత్త విషయం కాదు. చాలా కాలంగా జరిగుతున్న కసరత్తు అన్నది నేటిధాత్రి ముందు నుంచి చెబుతోంది…తెలంగాణ రాజకీయాల్లో వేలుపెట్టేందుకు , గుప్పిట్లోకి తీసుకునేందుకు షర్మిలను తెలంగాణ నాయకురాలను చేసేందుకు జగన్మోహన్‌రెడ్డి వేసిన ప్లాన్‌ ఇప్పటిదికాదు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజకీయాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎప్పుడో గమనించారు. అందుకే ఆయనను ఎప్పుడో పక్కనపెట్టారు. తెలంగాణ రాజకీయాలను , కేసిఆర్‌ వ్యూహాలను ఎప్పటికప్పుడు పసికట్టేందుకే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బిఆర్‌ఎస్‌లోకి పొంగులేటిని పంపించారన్నది దీనితో స్పష్టమైంది. అంతే కాదు బిఆర్‌ఎస్‌నుంచి బైటకు వెళ్లిన వెంటనే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జగన్‌ను కలవడం జరిగింది. అప్పుడే నేటిధాత్రి ఆ మైత్రిలో ఆంతర్యాన్ని అంచనా వేసింది. తర్వాత పరిణామాలను తెలియజేస్తూవస్తోంది. ఖమ్మం సభ జరిగిన తర్వాత ఇదే విషయాన్ని నేటిధాత్రి రాయడం జరిగింది. కాంగ్రెస్‌లో వైఎస్‌. అనుచరగణమంతా ఏకమౌతోంది? పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఏకాకిచేసే ఎత్తుగడ వేస్తున్నారన్నది తెలియజేయడం జరిగింది. 

ఒక్కసారి పొంగులేటి ఎపిసోడ్‌ను పూర్తిగా పరిశీలిస్తే, ఏ ఒక్క కాంగ్రెస్‌ నాయకుడు కూడా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాకను ప్రశ్నించలేదు.

 కేవలం ఒక్క రేణుకా చౌదరి మాత్రమే పొంగులేటి రాకను వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇప్పటికీ ఆమె అదే స్టాండ్‌ మీద వున్నట్లు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే పొంగులేటి కాంగ్రెస్‌లో చేరడం అంటే అదేదో అద్భుతం జరిగిపోతుందన్నంతగా ప్రచారం చేస్తూ వచ్చారు. అసలు అంతటి ప్రచారం గతంలో ఏ కాంగ్రెస్‌ నేతకు జరగలేదు. పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పుడు కూడా ఇందులో కనీసం పదో వంతు ప్రచారం కూడా జరలేదు. అటు, ఇటూ అంటూ గోడ మీద పిల్లిలా పొంగులేటి ఎటు చూస్తే అటు, ఆ పార్టీకి ఇక తిరుగులేదన్నట్లు ప్రచారం జరిగింది. చివరికి కాంగ్రెస్‌లోకి పొంగులేటి వెళ్లడాన్ని ఈ దశాబ్ధికే ఒక అధ్భుతమైన ఘట్టం ఆవిషృతమైనంత గొప్పగా వందిమాగదలు ప్రచారం చేశారు. కాని అసలు లోగుట్టు తెలుసుకోలేకపోయారు. అసలు తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకులే లేనట్లు, ఆ పార్టీలో చీకటిలో వున్నట్లు, పొంగులేటి ఒక వెలుగు సూర్యుడైనట్లు ఏం ప్రచామది? కాంగ్రెస్‌లోకి పొంగులేటి రావడమే ఒక వరమన్నట్లు ఇంకా ప్రచారం సాగుతూనేవుంది. పొంగులేటి కాంగ్రెస్‌లోకి వచ్చి అంపశయ్య మీద వున్న కాంగ్రెస్‌కు తులిసి తీర్ధమందించినట్లు కూడా గొప్పలకు పోతున్నారు. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్‌కు ఇన్‌స్టంట్‌ శక్తికోసం పొంగులేటి గ్లూకోస్‌ అవసరం అన్నంతగా ఆయన రాకకోసం కొందరు కాంగ్రెస్‌ నాయకులు పాకులాడారు. ఆయన ఇంటికి పరుగులు పెట్టారు. ఇక భవిష్యత్తు కాంగ్రెస్‌కు జవసత్వాలు రావాలంటే పొంగులేటి అనే హర్లీక్స్‌ లేకపోతే కాంగ్రెస్‌కు కష్టమే అన్నంతగా నాయకులు ఆయన రాకకోసం ఆరాటపడినంతగా సాగిలపడడం విచిత్రం. కొత్తగా ఇప్పుడే కాంగ్రెస్‌ నేతలు కాజు, బాదంలు తింటున్నట్లు, బలవంతులౌతున్నట్లు మరీ విచిత్రం చేస్తున్నారు. ఖమ్మం లాంటి సభలు గతంలో నిర్వహించనట్లు, నా సభ చూశారా…నా ప్రతానం చూశారా…అన్నట్లు పొంగులేటి గొప్పలు చెప్పుకోవడం చూస్తే కాంగ్రెస్‌ను శాసించేది నేనే అన్నంతగా పొంగులేటి ధీమా చూపిస్తున్నాడు. పొంగులేటి రాకతో సీనియర్‌ నాయకులుంతా పక్కకుపోయినంత పనైంది. కాని ఆయన మాత్రం కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన భరోసా ప్లకార్డును పక్కన పెడేసినట్లు, ఎప్పుడైనా కాంగ్రెస్‌ను నిండా ముంచడం ఖాయమన్నది ఆరోజే తెలిపోయింది. అంతే కాదు నేను లేనిదే కాంగ్రెస్‌ లేదన్నట్లు, బతికి బట్టకట్టేలా లేదన్నట్లు పొంగులేటి మీడియా సమావేశాలు చూస్తే అర్ధమౌతోంది. కాంగ్రెస్‌లో రూపాయి పెట్టే శక్తి వున్న నాయకుడు ఎవరూ లేరన్నట్లు , తన డబ్బులతోనే కాంగ్రెస్‌ బతకాలన్నట్లు శాసించే స్ధాయిలో వున్నట్లు కూడా ఆయన హవభావాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రపార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇక్కడ కూడా ఘోర పరాభవాన్ని చూసే రోజులు కళ్లముందు కనిపిస్తున్నాయా? అన్న అనుమానం సగటు కాంగ్రెస్‌ కార్యకర్త కూడా వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే ఖమ్మంలో కాంగ్రెస్‌ పార్టీ ఆది నుంచి బలంగానే వుంది. తెలంగాణ వచ్చాక కూడా ఖమ్మంలో 2014లో 9 సీట్లు కాంగ్రెస్‌ గెల్చుకున్నది. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లు సాధించింది. మరి గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌లోవున్న పొంగులేటి ఆ పార్టీని ఎందుకు గెలిపించలేదు. ఇప్పుడు బిఆర్‌ఎస్‌ను అసెంబ్లీ గేటు తాకనివ్వనంటూ చేసిన బీరాలు పలికారు. నిజంగా పొంగులేటికి అంత బలమేవుంటే సొంతంగా పార్టీ పెట్టి, తన బలం నిరూపించాలి. కాని ఆయన హిడెన్‌ ఎజెండా ఏమిటో తెలిపోయింది. బిఆర్‌ఎస్‌లో చేరి ఆపార్టీని చెడగొట్టాలని చూశాడు. కాని కుదరలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ను ఖతం చేసి, షర్మిల చేతిలో పెట్టేందుకు జగన్‌ పద్మ వ్యూహంలో పొంగులేటి తనకు తానుగానే చిక్కుకుంటున్నాడు. అంతే…!

ఆ గెట్టు లక్ష..ఈ గెట్టు కోటి!

`అటు ఆంద్రా…ఇటు మహారాష్ట్ర.

` మధ్యలో తెలంగాణ… సిరుల మాగాణ.

` భూముల ధరలు ఎక్కడ విన్నా కోటి.

` తెలంగాణ వెలుగుల దివిటీ

` దేశంలోనే తెలంగాణ భూమి మేటి.

` అటు సాగులో కనీవినీ ఎరగని పురోగతి…ఇటు పారిశ్రామిక ప్రగతి.

` నిన్న బీడు నేల…నేడు బంగరు నేల.

` తెలంగాణ భూములు బొచ్చెడు పిరం…

` పొరుగు రాష్ట్రాల రైతులది దుఖం.

` నిన్న దుఖమెల్లవోసిన నేల…

`ఇప్పుడు ఎల్లకాలం నూతుల నిండా జల.

` నాడు చుక్కకేడ్చింది…నేడు పొలం మురుస్తోంది.

` పదేళ్ల కింద వలసలు…నేడు బంగారు పంటలు.

`నిన్న దేశాలు పట్టుకొని పోయి…నేడు ఊరిలో శ్రీమంతుడై..

` తెలంగాణ రైతు రాజయ్యాడు…

హైదరబాద్‌,నేటిధాత్రి:                                    

మనిషికైనా, మానుకైనా, పక్షికైనా, ప్రకృతికైనా, ఏ జీవికైనా, చెట్టుకైనా, పుట్టకైనా, భూమికైనా, పాడికైనా , పంటకైనా నీరే ఆధారం. ఆ నీరు లేక గోపడిన తెలంగాణ ఇప్పుడు నీటి గంగాళమైంది. నీటి గోస లేని తెలంగాణ ఆవిష్కృతమైంది. తెలంగాణ గోదారి నీళ్లతో కళకళలాడుతోంది. అన్నింటికీ నీరే జీవాధారం. ఒకనాడు కాకతీయ కాలమైనా, సర్కారు నిజామైనా నీటి జాడలలు తొనికసలాడిన తెలంగాణ. ఉమ్మడి రాష్ట్రంలో విలవిలలాడిరది. చుక్క నీటి కోసం ఎదురు చూసింది. కనికరం లేని ఉమ్మడి పాలకుల చేతిలో కన్నీటిని దిగమింగుకున్నది. తెలంగాణ సాగు నీటి వనరైన చెరువులు ద్వంసం చేయబడ్డాయి. ప్రాజెక్టులు సాధ్యం కాదని తేల్చి, చెప్పి రైతును కష్టాల పాలు చేశారు. ఆ పాలనకు చరమగీతం పాడి, తెలంగాణ చైతన్య గీతికను ఆలపించి, ఉద్యమించి, పోరాటాన్ని ఉరకలెత్తించి, ఉక్కు సంకల్పంతో, పిడికిళ్లు బిగించి, మూడున్న కోట్లు గొంతులు సవరించి, జై తెలంగాణ నినాదాన్ని దిక్కులు పిక్కటిల్లేలా నినదించి, డిల్లీ గల్లీలో కూడా తెలంగాణ రణ నినాదం చేసి తెలంగాణ సాధించిన వీరుడు కేసిఆర్‌. తెలంగాణ తలరాత మార్చిన తనయుడు కేసిఆర్‌. తెలంగాణ బతుకు చిత్రాన్ని మార్చిన నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌…

తెలంగాణ వచ్చింది ఏం మారింది?

ఇది తెలంగాణలోని కొంత మంది కనులుండీ చూడలేని వారి ప్రశ్న. కాని తెలంగాణ వచ్చాక తెలంగాణ పూర్తిగా మారిపోయింది. అసలు ఒకప్పటి తెలంగాణేనా అని అనిపిస్తోంది. హైదరాబాద్‌కు వెళ్లే ఎక్కడున్నామన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇది తెలంగాణకు వస్తున్నవారు చెబుతున్న మాట. సీమాంధ్రకు చెందిన ఒకప్పటి పాలక నేతలు కూడా చెబుతున్న మాట. తెలంగాణ వస్తే ఇక చీకట్లే అన్న వారు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. తాము తెలంగాణ అభివృద్ది కాంక్షించలేకపోయామని, సహకరించలేకపోయామని సిగ్గుపడుతున్నారు. తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాదని చెప్పి తమ చేతగాని తనాన్ని నిరూపించుకుమని అంటున్నారు. అసలు తెలంగాణ ప్రాంతమే తొండలు గుడ్లు పెట్టడానికి కూడా పనికి రావని అన్న వాళ్లు , తెలంగాణ ఇలా నీళ్లుతో తడుస్తుందని కలలో కూడ అనుకోలేదంటున్నారు. తెలంగాణ చీకటౌతుందనుకున్నాం? కాని అన్నింటినీ అధగిమించింది. సీమాంధ్రను మంచిపోయింది. తెలంగాణ కూడా అన్న పూర్ణగా మారింది. ధాన్యరాసులు పండుతున్నాయి. భూములకు విపరీతమైన ధర వస్తోంది. దేశంలోనే ఇంత డిమాండ్‌ వున్న స్ధలాలు లేవు. దిక్షిణభారత దేశంలోని రాష్ట్రాల గురించి చెప్పుకున్నా ఒకప్పుడు చెన్నై అంటే ఎంగో గొప్పగా చెప్పుకునేవారు. కాని అక్కడ మంచినీటి కటకట. కర్నాకట రాష్ట్రంలోని బెంగుళూరును సిలికాన్‌ వ్యాలీ అంటారు. కాని అక్కడ కూడా పొల్యూషన్‌ విపరీతంగా పెరిగిపోయింది. నగరం పెరిగేందుకు స్ధలం లేకుండాపోయింది. హైదరాబాద్‌ సుందరీకరణ అంటే ఒక అద్భుతం. ఎంతో మంది చెబుతున్నారు. ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేసిన ప్రగతి మాయాజాలం. అభివృద్ధి మంత్రం. తెచ్చిన తెలంగాణను బంగారు తునక చేయాలన్న లక్ష్యం. అందుకే తెలంగాణ ఒక అపురూపంగా మారింది. తెలంగాణ అద్భుత కట్టడాలతో అలరాలుతోంది. ప్రతి జిల్లా ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దబడుతోంది. అభివృద్ధి అన్ని జిల్లాలకు సమానంగా పంచబడుతోంది. అన్ని జిల్లాలు సర్వతోముఖాభి వృద్ధి సాధిస్తున్నాయి. హైదరాబాద్‌ సౌకర్యాలు తెలంగాణలోని దాదాపు అన్ని నరగాల్లోనూ అందుతున్నాయి. అందుకే తెలంగాణ మొత్తం అభివృద్ధి జరిగింది. తెలంగాణ భూముల విలువ అమాంతం పెరిగింది. 

 తెలంగాణలో భూముల ధరలు దేశంలో ఎక్కడా లేనంతగా పెరిగాయి.

 ప్రజల స్ధిర చరాస్ధులు గణనీయంగా పెరిగిపోయాయి. అందుకు కారణం తెలంగాణ పరిపాలనలో అదొక అద్భుత ఆవిష్కారం. ఒకప్పుడు సీమాంధ్రలో ఒక ఎకరం అమ్ముకుంటే తెలంగాణలో నాలుగు ఎకరాల స్ధలం కొనుక్కొవచ్చు అన్న మాటలే వినపడేది. కాని ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌ పరిసరాల్లో ఒక ఎకరం భూమి అమ్ముకుంటే, సీమాంద్రలో కనీసం వంద ఎకరాలు కొనుగోలు చేసుకోవచ్చు. అని సాక్ష్యాత్తు ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట. అంటే తెలంగాణ ఎంతలా అభివృద్ది చెందిందో అర్దం చేసుకోవచ్చు. తెలంగాణలోని ఏ ప్రాంతంలో భూముల రేట్లు చూసిన అంతే గొప్పగా వున్నాయి. ఒకప్పుడు ఆదిలాబాద్‌ జిల్లా అంటే ఎంతో వెనుకబడిన ప్రాంతం అంటూ వుండేవారు. కాని నేడు అదే ఆదిలాబాద్‌ జిల్లాలో కూడా ఎకరం భూమి కోటి రూపాయలు దాటి పలుకుతోందంటే ప్రజల జీవన ప్రమాణాలను ప్రభావితం చేస్తున్నట్లు కాదు. అదే ఆ పక్కన వున్న మహారాష్ట్రలో ఎకరం కనీసం లక్ష రూపాయలు కూడా పలకడం లేదు. ఇటు వెళ్తే కర్నాకట బోర్డర్‌లో కూడా పెద్దగా భూములకు విలువ లేదు. కొద్దో గొప్పొ ఆంధ్ర ప్రాంతానికి చెందిన భూములకు విలువున్నా, తెలంగాణ భూములతో పోల్చితే ఎక్కడో అట్టుడుగునే వున్నాయి. తెలంగాణ రాక ముందు సరిగ్గా పదేళ్ల క్రితం హైదరాబాద్‌ తప్ప, తెలంగాణలోని ఏ ప్రాంతంలోనైనా ఎకరం లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల లోపే వుండేది. కాని నేడు ఏ మారు మూల ప్రాంతమైనా సరే కనీసం రూ.50లక్షలకు తక్కువ లేదు. ఏ జిల్లా కేంద్ర చుట్టు పక్కల ప్రాంతాలైనా సరే కోటి రూపాయలకు తక్కువ లేదు. ఇదీ తెలంగాణ భూముల విలువ. 

అటు ఆంధ్రా, ఇటు మహారాష్ట్ర, ఆ పక్కనున్న కర్నాకట రాష్ట్రాల ప్రజలు తెలంగాణను చూసి అబ్బుపడుతున్నారు.

మురిసిపోతున్నారు. ఒకప్పుడు మన తెలంగాణ నుంచి పొరుగు రాష్ట్రాల సరిహద్దుల ప్రాంతాలకు కూలీ పనులకు వెళ్లేవారు. తెలంగాణ పల్లెలను వదిలి ప్రజలు బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి అంటూ వసలు వెళ్లేవారు. పాలమూరు గోస గురించి, వలస గురించి ప్రత్యేకంగాచెప్పాల్సి వస్తే రాస్తే రామాయణమంత , వింటే భారతమంతా! వుంటుంది. అదీ పదేళ్ల క్రితం తెలంగాణ బతుకు. కాని తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేని, ఓర్వలేని తనంతో ప్రతిపక్షాలు సాగిస్తున్న అసత్య ప్రచారం ప్రజలు నమ్మరు. అయినా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూనే వున్నారు. నిజానికి తెలంగాణ ఇంతలా అభివృద్ది జరుగుతుందిన కాంగ్రెస్‌, బిజేపి పార్టీలు కలగనలేదు. కలలో కూడా ఊహించలేదు. తెలంగాణ వస్తే ఏం చేస్తారో…చూద్దాం అన్నట్లు సీమాంధ్ర నాయకులు ఎదురుచూశారు. తెలంగాణ అభివృద్ది అంటే నీళ్లు తేవడం అంత సులభం కాదని కాంగ్రెస్‌ అనుకుంటూ వచ్చింది. కాని తెలంగాణ తెచ్చిన మూడు నెలల్లో కరంటు వెలుగులు కనిపించే సరికి కాంగ్రెస్‌, బిజేపిల కళ్లు బైర్లు కమ్మాయి. నిరంతర విద్యుత్‌ తెలంగాణలో సరఫరా అవుతుంటే ఇదెలా సాధ్యమౌతుందంటూ ఆశ్చర్యపోయాయి. మనసుంటే మార్గం వుంటుంది. అభివృద్ది చేయాలన్న చిత్తశుద్ది పాలకుల్లో వుంటే ఏదైనా సాధ్యమౌతుంది. ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతోంది. ఊరు వదిలి వలస వెళ్లిన రైతు తిరిగి పల్లెకు వచ్చాడు. కన్న తల్లి లాంటి ఊరును వదలి, ఆస్ధిగా భావించే సాగు భూమిని వదిలి పొట పట్టుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. ఇప్పుడు ఆ రైతే పల్లెకు మళ్లీ చేరుకున్నాడు. కళ్ల నిండా నీళ్లు చూస్తూ, కడుపారా పొలానికి నీరందిస్తున్నాడు. బంగారు పంటలు పండిస్తున్నాడు. తెలంగాణ రైతు రాజయ్యాడు. ఇదందా సాధ్యం కావడానికి కారణం ఒక్క పేరు..అదే కేసిఆర్‌. ఆయనే తెలంగాణ తల రాత మార్చిన యుగకర్త. తన ప్రాంతం మీద మమకారంతో ప్రాణలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసి, తెలంగాణ సాధించిన కేసిఆర్‌ ఖచ్చితంగా దైవాంశ సంభూతుడే…ఆయన పేరు తెలంగాణ చరిత్రలో తరతరాలు చెరిగిపోని నిఘంటువే!

*అభ్యర్థుల ఎంపికలో భట్టి కీ రోల్…నివేదిక కోరిన రాహుల్..?*


Rahul Gandhi gave importance to Bhatti :

తెలంగాణ వ్యవహారాలను రాహుల్ గాంధీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీఎల్పీ నేత భట్టికి ప్రాధాన్యత పెంచారు. పీపుల్స్ మార్చ్ తో తెలంగాణలో పార్టీ జోష్ కి కారణమైన భట్టికి తాజాగా రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఖమ్మం సభ తరువాత గన్నవరం బయల్దేరిన రాహుల్ తనతో పాటుగా భట్టిని వెంట బెట్టుకెళ్లారు.

ఆ సమయంలో రాష్ట్రంలో పార్టీలోని పరిస్థితులపైన ఆరా తీసారు. నేతల సమన్వయంపైన చర్చించారు.రాహుల్ గాంధీ స్వయంగా తెలంగాణలో కాంగ్రెస్ పరిణామాల పై ఆరా తీస్తున్నారు. కర్ణాటక తరువాత తెలంగాణ పైన కాంగ్రెస్ అధికారం దక్కించుకోవాలనే కసితో అడుగులు వేస్తోంది. ఈ సమయంలో ఎక్కడ ఏ విషయంలోనూ ఉపేక్షించ కూడదని రాహుల్ నిర్ణయించినట్లు కనిపిస్తోంది. పీపుల్స్ మార్చ్ యాత్ర ద్వారా భట్టి కష్టాన్ని రాహుల్ గుర్తించారు. తన సుదీర్ఘ యాత్ర ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపటంతో పాటుగా పేదల వద్దకు పార్టీ ని తీసుకు వెళ్ళటం, వారితో మమేకం అవ్వటం, వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించటం పార్టీకి మైలేజ్ పెంచిందని రాహుల్

విశ్వసించారు. అందులో భాగంగానే తానే స్వయంగా వచ్చి ఖమ్మం సభలో భట్టిని సత్కరించారు. ప్రత్యేకంగా భట్టి యాత్రను ప్రశంసించారు. సభ ముగిసిన తరువాత భట్టిని తనతో పాటుగా తీసుకెళ్లిన రాహల్ కీలక మంతనాలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

రాహుల్ కారులోనే భట్టికి పార్టీ వ్యూహాల పైన కీలక సూచనలు చేసారు. ఎన్నికల మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక కీలకం కావటంతో వీటి పైన భట్టి అభిప్రాయాలను కోరినట్లు సమాచారం. పార్టీలో నెలకొన్న పరిస్థితులను వివరించిన భట్టి.. టికెట్ల ఖరారు ఎంపిక పైన తన అభిప్రాయాలను వివరించారని తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా..సామాజిక వర్గాల సమీకరణాలు దెబ్బ తినకుండా పూర్తి అంచనాలతో నివేదిక కోరినట్లు విశ్వసనీయ సమాచారం. అభ్యర్థి ఎవరైనా గెలుపే ప్రామాణికం కావాలని భట్టి, రాహుల్ మంతనాల్లో నిర్ణయించారు. మొత్తం నియోజకవర్గాలకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిస్థితులు..అభ్యర్థుల ఎంపికలో ఆయా నియోజకవర్గాల్లో తీసుకోవాల్సిన అంశాల పైన నివేదిక కోరినట్లు సమాచారం. దీంతో, భట్టికి రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించినట్లైంది.

రాహుల్ కారులోనే భట్టికి పార్టీ వ్యూహాల పైన కీలక సూచనలు చేసారు. ఎన్నికల మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక కీలకం కావటంతో వీటి పైన భట్టి అభిప్రాయాలను కోరినట్లు సమాచారం. పార్టీలో నెలకొన్న పరిస్థితులను వివరించిన భట్టి.. టికెట్ల ఖరారు ఎంపిక పైన తన అభిప్రాయాలను వివరించారని తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా..సామాజిక వర్గాల సమీకరణాలు దెబ్బ తినకుండా పూర్తి అంచనాలతో నివేదిక కోరినట్లు విశ్వసనీయ సమాచారం. అభ్యర్థి ఎవరైనా గెలుపే ప్రామాణికం కావాలని భట్టి, రాహుల్ మంతనాల్లో నిర్ణయించారు. మొత్తం నియోజకవర్గాలకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిస్థితులు..అభ్యర్థుల ఎంపికలో ఆయా నియోజకవర్గాల్లో తీసుకోవాల్సిన అంశాల పైన నివేదిక కోరినట్లు సమాచారం. దీంతో, భట్టికి రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించినట్లైంది.

వాళ్లంతా ఒక్కటే! రేవంత్‌ ఒంటరే!!

`రేవంత్‌ నమ్మిన పొంగులేటి కట్టప్ప రూపమే!

`రేవంత్‌ కు షర్మిల రిటన్‌ గిఫ్ట్‌ కోసమే!

`కాంగ్రెస్‌ కోసం రేవంత్‌ ఎంత కష్టపడ్డా వృధానే!

`తెలంగాణ వచ్చినా కాంగ్రెస్‌లో వున్న బానిసలంతా వైఎస్‌ వీర విధేయులే?

`ఇప్పటికీ వాళ్లు చేసేది వైఎస్‌ జపమే!

`తెలంగాణలో షర్మిల రాకకు కారకులే!

`కొట్లాడిరది రేవంత్‌ ఒక్కడే?

` రేపు రేపు రేవంత్‌ కు చుక్కలే?

`షర్మిలను ముందు పెట్టి రేవంత్‌ ను పక్కకు నెట్టుడే!

`పొంగులేటి రూపంలో పొగబెట్టుడే?

`కోమటి రెడ్డి రూపంలో ఇక మొదలైనట్లే?

`ఘర్‌ వాపసీ రేవంత్‌ మెడకే!

`షర్మిల అడుగుతో మళ్ళీ మొదటికే!

`పొంగులేటి కాంగ్రెస్‌ లో చేరడం వెనక వున్నది జగనే!

`ఇదంతా షర్మిల రాజకీయ భవిష్యత్తుకు మార్గమే!

`తెలంగాణలో వైఎస్‌ కుటుంబం పెత్తనం లక్ష్యమే?

`జగన్‌ ను కాదన్న కాంగ్రెస్‌ ను కాళ్లకాడికి తెచ్చుకోవడం కోసమే!

`కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పెత్తనం ఆంద్రా వాళ్లదే?

`షర్మిలను తెచ్చుకొని నెత్తిమీద కుంపటి పెట్టుకోవడమే!

`తెలంగాణ కాంగ్రెస్‌ నేతలది బానిస మనస్తత్వమే!

`షర్మిల రాకను వ్యతిరేకించే రేవంత్‌ ను అదను చూసి సాగనంపుడే?

`బానిస నేతలు మొదటగా చేసే పని ఇదే?

 

హైదరబాద్‌,నేటిధాత్రి:                                   

కొన్ని విషయాలు లోతుగా వుంటాయి. కొన్ని సార్లు గంభీరంగా వుంటాయి. పైకి చిన్నవిగా కనిపిస్తాయి. కాని సార్లు ఉపద్రవాలు సృష్టిస్తాయి. రాజకీయాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఒక వ్యక్తి కోసం కొన్ని సార్లు సాగిలపడిపోతుంటాయి. మరి కొన్ని సార్లు వ్యక్తికోసం వ్యవస్థనే కుప్పకూలుస్తాయి. ఇప్పుడు సరిగ్గా తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయాల్లో అదే జరుగుతుందా? అన్న అనుమానం కల్గకమానదు. ఆది నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి రేవంత్‌ రెడ్డి రావడం చాలా మందికి ఇష్టం లేదు. కాని ఆయనకు ఆయనగా పట్టుబట్టి మారీ వచ్చారు. ఇలా కాంగ్రెస్‌లోకి వచ్చిన వారు ఆ పార్టీలో మనుగడ సాగించడం చాలా కష్టం. రేవంత్‌రెడ్డి ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎంతో ఓపికతో వాటని అదిగమిస్తూ వస్తున్నారు. అయినా అడుగడుగునా ఏదో ఒక ఉపద్రవం వచ్చి వాలుతూనే వుంది. కాని ఈసారి షర్మిల రూపంలో, కేవిపి. రామచంద్రరావు నీడలో వస్తుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది పూర్తి స్ధాయిలో వాస్తవ రూపం దాల్చితే మాత్రం రేవంత్‌రెడ్డికి పదవీ గండం తప్పదు. కాంగ్రెస్‌ పార్టీ పతనం అంతకన్నా తప్పదు. అందుకే కాంగ్రెస్‌ను ఎవరూ చెడగొట్టలేరు. ఎవరూ బాగు చేయలేరు అంటారు. చెడొగొట్టుకున్నా వాళ్లే, బాగు చేసుకున్నా వాళ్లే అన్నది నానుడి. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ను పాత రోజులకు తీసుకోవడం కోసం అందులో వున్న నాయకులే కృషి చేస్తున్నారని చెప్పకప్పదు. ఇక్కడే కేవలం కేవిపి రామచంద్రరావు తన వ్యక్తిగత స్వార్ధం కోసం, జగన్‌ కుటుంబానికి దగ్గరవ్వడం కోసం కొత్త ఎత్తుగడ వేస్తున్నాడు. షర్మిలను తెలంగాణ రాజకీయాల్లో కీలకం చేసి, మళ్లీ ఆ కుటుంబానికి దగ్గరవ్వాలనుకుంటున్నాడు. ఈ లోతైన విషయంపై అవగాహన లేని కాంగ్రెస్‌ నాయకులు షర్మిల రాకను చాల మంది స్వాగతిస్తున్నారు. కాని షర్మిల తెలంగాణ రాకతో మొదటగా రేవంత్‌ కు నష్టం చేస్తే, ఆపై తెలంగాణ రాజకీయాలు మొత్తం ఆగం కావడం ఖాయం. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎపిసోడ్‌ మొత్తం ఒకసారి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వెనకుండి కథ స్క్రీన్‌ ప్లే పక్భందీగా నడిపిస్తున్నారనిపిస్తోంది. 

షర్మిల తెలంగాణ రాజకీయాలలోకి వస్తూనే ఖమ్మం జిల్లా రాజకీయాలను తనవైపు తిప్పుకోవడం మొదలుపెట్టింది. నిజానికి తెలంగాణ రాజకీయాల్లో షర్మిలకు చోటు లేదు. తన మొదటి సభను ఖమ్మంలోనే ఏర్పాటు చేసింది. పాలేరు నుంచి పోటీ చేస్తానంటూ ప్రకటించింది. పాదయాత్ర చేపట్టింది. అయితే కాంగ్రెస్‌ దరి చేరడం ఎలా అన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్న సమయంలో కర్నాటక ఎన్నికల ఫలితాలు షర్మిల రాజకీయాలకు మార్గం వేశాయి. నిజానికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బిఆర్‌ఎస్‌ నుంచి బైటకు రావడానికి ఇంత కాలం పట్టడానికి కూడా జగనే కారణం అన్నది తెలుస్తోంది. అదును చూసి పొంగులేటి పాచికను జగన్‌ వాడుకున్నాడు. అందుకు పొంగులేటి కూడా సై అన్నాడు. అయితే బిజేపి వైపు మొగ్గు చూపుతున్నట్లు కొంత కాలం ఎపిసోడ్‌ నడిపారు. పొంగులేటి బిజేపిలో చేరినా షర్మిల బిజేపిలో చేరడం కుదరదు. అందుకే ముందు బిఆర్‌ఎస్‌ నుంచి శ్రీనివాస్‌రెడ్డిని బైటకు రప్పించారు. అంతకు ముందే షర్మిలను తెలంగాణ రాజకీయాల్లోకి దింపేశారు. ఈ విషయం తెలియక రేవంత్‌రెడ్డి అటు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని తొలుత వ్యతిరేకించాడు. షర్మిల తెలంగాణరాజకీయాల్లోకి రావడాన్ని తప్పుపట్టారు. తెలంగాణలో మాకు మేము రాజకీయాలు చేసుకుంటామంటూ చెప్పాడు. దాంతో షర్మిల వీలు చిక్కినప్పుడల్లా రేవంత్‌ను ప్రశ్నిస్తూ వచ్చేది. రేవంత్‌రెడ్డి చేసిన పాదయాత్రపై సెటైర్లు వేస్తూ వచ్చింది. ఇదంతా ముందు నుంచి ఒక పథకం ప్రకారం సాగుతోంది. ఇది రేవంత్‌కు తెలియక పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నారు. కాని తెరవెనుక రేవంత్‌ను వ్యతిరేకిస్తున్న వర్గంలో ముఖ్యమైననాయకులైన కోమటి రెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి,జానారెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే వున్నారు. వీరిలో దివంగత వైఎస్‌కు అనుచరులుగా వున్నవారే ఎక్కువ. వాళ్లుంతా ఇప్పుడు షర్మిల రాకను స్వాగతిస్తున్నారు. పొంగులేటి రూపంలో సహకారాన్ని తీసుకుంటూ తెలంగాణలో కాంగ్రెస్‌ రాజకీయాల్లో వైఎస్‌ కుటుంబానికి చోటు కల్పించి, కృతజ్ఞత తీర్చుకోవాలని చూస్తున్నారు. పరోక్షంగా కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానానికి తీరని ద్రోహానికి కూడా వీళ్లు పాల్పడుతున్నారు. ఖమ్మం సభపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి తయారు చేయించిన పోస్టర్‌లో పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లేకపోవడం గమనార్హం. 

 వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబానికి అండగా వుంటూ వచ్చిన కేవిపి తొలుత జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని శతవిధాల ప్రయత్నించాడు. 

కాని ఆయన ఎత్తులు పారలేదు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నం చేశాడు. సోనియాగాందీ కేవిపి. సూచనలు పట్టించుకోలేదు. అయినా సమయం చూసి జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని కేవిపి అనుకున్నారు. కాని జగన్‌ అంత కాలం ఆగేందుకు ఇష్టపడలేదు. పైగా ఓదార్పు యాత్ర చేపటొద్దన్న అధిష్టానం సూచనలు జగన్‌ పట్టించుకోలేదు. కేవివి. జగన్‌కు నచ్చ జెప్పే ప్రయత్నాలు చేశాడు. కాంగ్రెస్‌లోనే వుండాలంటూ జగన్‌పై ఒత్తిడి తెచ్చాడు. అయినా జగన్‌ వినలేదు. దాంతో కాంగ్రెస్‌ పార్టీ జగన్‌పై కేసులు నమోదు.. వంటివి చకచకా జరిగిపోయాయి. ఆ సమయంలో కేవిపి కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ప్రశ్నించలేదు. జగన్‌కు మద్దతుగా నిలవలేదు. ఇది జగన్‌ కుటుంబంలో అసంతృప్తిని పెంచింది. జగన్‌ కు కేవిపిని దూరం చేసింది. ఆప్పటి నుంచి జగన్‌ కుటుంబానికి కేవిపి దగ్గరయ్యే ప్రయత్నం చేసినా, జగన్‌ సానుకూలంగా స్పందించలేదు. అప్పుడు జగన్‌ వినలేదు. తాను జగన్‌వైపు నిలవలేదు. ఇప్పుడు షర్మిలకైనా రాజకీయ భవిష్యత్తును సృష్టించి మళ్లీ ఆ కుటంబానికి దగ్గరయ్యే రాజకీయం తెలంగాణలో మొదలుపెట్టారు. ఆ బాధ నుంచి తేరుకునేందుకు ఈ ఎత్తుగడ వేశాడు. కాకపోతే ఇందులో జగన్‌ కూడా షర్మిలకు పరోక్షంగా మద్దతు ప్రకటిస్తూనే, కుటుంబ తగాదాలున్నట్లు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అసలు విషయం బైట పడుతోంది. కేవిపి. రామచంద్రరావుకు కాంగ్రెస్‌ అధిష్టానంలో మంచి పలుకుబడి వుంది. కర్నాకట ఉప ముఖ్యమంత్రి డికే.శివకుమార్‌కు వైఎస్‌కుటుంబానికి మంచి అనుబంధం వుంది. ముందు షర్మిలను అటువైపు నుంచి కాంగ్రెస్‌కు దగ్గర చేసే ఎత్తుగడ మొదలు పెట్టారు. అది సక్సెస్‌ పుల్‌ అ య్యింది. ఇక ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో చేరడం మాత్రమే మిగిలి వుంది. షర్మిల ఎలాగూ రేవంత్‌ నాయకత్వంలో పనిచేయదు. కొత్తగా చేరిన నాయకులెవరూ రేవంత్‌కు మద్దతు ఇవ్వరు. ఎందుకంటే జూపల్లి కృష్ణారావు లాంటి వారు కూడా వైఎస్‌ నామస్మరణ ఇప్పటికీ చేస్తున్నవాళ్లే..అందువల్ల రేవంత్‌కాంగ్రెస్‌లో ఇక ఒంటరే… భవిష్యత్తు బైటకే…! చూద్దం ఏం జరుగుతుందో!!

*బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ రాజీనామా

నూతన అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి

ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటెల రాజేందర్

నేటిధాత్రి హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ మంగళవారం రాజీనామా చేశారు. రెండు రోజులుగా ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తదితర జాతీయ నాయకులతో భేటీ ముగిసిన అనంతరం సంజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించారు. అలాగే ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటెల రాజేందర్ ను నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కాగా, ఎంపీ అయిన బండి సంజయ్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును తొలగించి ఆయన స్థానంలో మాజీ మంత్రి పురంధేశ్వరిని నియమించింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version