కెనడాలో ఘనంగా జరిగిన త్రిభాషామహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 1250వ అష్టావధానం

తెలుగువాహిని, ఒంటారియో తెలుగు ఫౌండేషన్ మరియు తెలుగుతల్లి కెనడా ఆధ్వర్యంలో టొరంటోలో ఉన్న దుర్గా దేవి గుడిలో అష్టావధానం అత్యద్భుతంగా సాగింది. శరవేగంతో జరిగిన పూరణ లేఖకుల కలాలకి అందలేదు. చమత్కారమైన సంభాషణతో మొదలైన సభ, అప్రస్తుత ప్రసంగంతో ఇంకా చురుకై, ఆద్యంతమూ సభ్యులను నవ్వుల జల్లులులో ముంచెత్తింది.

చాలా సంవత్సరాల తరువాత అవధాన ప్రక్రియని వ్యక్తిగతంగా చూడడం ఎంతో ఆనందంగా ఉందని సీనియర్ సిటిజన్లు హర్షం వెలిబుచ్చగా, తెలుగులో ఇలాంటి ప్రక్రియ ఒకటి ఉందని తెలుసుకోవడం తమ అదృష్టమని యువత ఆనందం వ్యక్తం చేసారు. ఆ విధంగా అన్ని వయసుల వారిని ఉర్రూతలూగిస్తూ పద్మాకర్ గారు చేసిన అష్టావధానంతో తెలుగు సాహితీ కాంతులు కెనడాలో వెల్లివిరిసాయి.

గత రెండునెలలుగా బ్రహ్మశ్రీ వద్ధిపర్తి పద్మాకర్ గారు అమెరికా, కెనడా దేశాలలో చేస్తున్న ఆధ్యాత్మిక, సాహితీ పర్యటనలో భాగంగా అమెరికాలో వివిధ రాష్ట్రాలలో ప్రవచానాలు, ఒక అష్టావధానము, ఒక శతావధానము కూడా నిర్వహించి ఇప్పుడు కెనడాలో మరొక అష్టావధానం చేశారు. సమస్య, ఆశువు, వర్ణన, అప్రస్తుతప్రసంగం ఇలా అన్ని అంశాలతో సభను మరింత రక్తికట్టించిన పృచ్ఛకులను, తెలుగువాహిని, ఒంటారియో తెలుగు ఫౌండేషన్ మరియు తెలుగుతల్లి కెనడా సంస్థలను శ్రీ పద్మాకర్ గారు ప్రశంసించారు. అత్యంత వైభవంగా నిర్వహించబడిన ఈ సాహితీసదస్సు తెలుగు భాషాప్రియులకు కన్నులపండుగ అని పలువురు వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. 

తెలుగుతల్లి కెనడా వ్యవస్థాపకురాలు శ్రీమతి లక్ష్మి రాయవరపు గారు మాట్లాడుతూ ” ఏ దేశమేగినా ఎందు కాలిడినా చక్కటి తెలుగు మా ప్రాణ ప్రదం, తల్లి భూమి భారతిని గౌరవించడమే జాతికి నిండుతనం అన్న భావంతో తెలుగు తల్లి కెనడా నెలకొల్పబడింది. తెలుగుతల్లి పత్రిక కెనడాలో ఉన్న తెలుగు ప్రతిభనంతా ఒక చోటికి చేర్చే వేదిక” అని చెప్పారు.  

తెలుగువాహిని అధ్యక్షులు శ్రీ త్రివిక్రం సింగరాజు గారు మాట్లాడుతూ ” శ్రీకృష్ణ దేవరాయల ఆముక్త మాల్యద చదవడం నించి, సభ్యులలో భావుకత పెంచే నేటి తరం వచన కవితలు వ్రాయించే దాకా పూచీ తెలుగువాహినిది” అని తెలియజేసారు. 

 

ఓంటారియో తెలుగు ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులు శ్రీ మురళి పగిడేల గారు మాట్లాడుతూ ” ఓంటారియోలో ఉంటున్న తెలుగువారికి కావలసిన సహాయం చేసి, సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడడమే ఓటీ ఎఫ్ ముఖ్య ఉద్దేశ్యమ”ని తెలిపారు.

జగనే మళ్ళీ సిఎం!

` పేద ప్రజల మద్దతు జగన్‌ కే.

` నేటిధాత్రి, డి.ప్యాక్‌ సర్వేలో ప్రజలు జగన్‌ వైపే మొగ్గు.

` జగన్‌ పై అభిమానం చెక్కు చెదరలేదు.

` రాజధాని అంశంలో ప్రజల్లో కొంత వ్యతిరేకత నిజం.

` మూడు రాజధానులు అవసరం లేదంటున్న కొందరు.

`అమరావతి అన్ని ప్రాంతాలకు అనుకూలమనే భావన వ్యక్తం.

`జగన్‌ సంక్షేమ పథకాలపై ప్రజలు పూర్తి సంతృప్తి.

` రియలెస్టేట్‌ ప్రభావం… ఉపాధి కొంత దూరం.

` పోలవరం పూర్తి అయితే బాగుండేదని ప్రజల అభిప్రాయం.

` రాజధాని, పోలవరం రెండు అంశాలే జగన్‌ కు కొంత ఇబ్బందికరమేమో!

` ఇప్పటికీ మించిపోయింది లేదు…పోలవరం ముందుకు సాగితే ఎంతో మేలు.

` జగన్‌ పై తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసహనం.

` జగన్‌ కారణంగానే గెలిచామన్నది ఆ ఎమ్మెల్యేలు మర్చిపోయారన్నది చెబుతున్న జనం.

`మద్యం విషయంలోనూ కొంత గందరగోళం.

`అది కూడా వైసిపికి కొంత నష్టం చేకూర్చే అంశం.

` విద్య విషయంలో ఆంద్రప్రదేశ్‌ బెస్ట్‌ అనే మాట వినబడుతోంది.

`వైద్యం విషయంలో కొంత వెనుకబాటు వుందనిపిస్తోంది.

`రాజధాని మీద క్లారిటీ ఇస్తే చాలు…వైసిపికి తిరుగులేదు.

`కొంత మంది ఎమ్మెల్యేలను మార్చాల్సిందే…లేకుంటే నష్టమే…

`ఆంద్రలో ఆరు నెలలుగా డీ ప్యాక్‌ సాగిస్తున్న విస్తృత సర్వే…

`కర్నాటక ఫలితాలతో డి. ప్యాక్‌ గణాంకాలపై ఆంద్రప్రదేశ్‌ లోనూ ఆసక్తి.

` డి.ప్యాక్‌ మీద పెరిగిన మరింత నమ్మకం.

` ఆంద్రప్రదేశ్‌ రాజకీయాలపై డి. ప్యాక్‌ ఏం చెబుతోందో అని చాలా మంది ఎదురుచూపు.

`ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసిపికి వంద సీట్లు.

హైదరబాద్‌,నేటిధాత్రి:                             

సహజంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఎవరికైనా ఆసక్తి ఎక్కువ. తెలంగాణలో ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్దితి ఎలా వుంది? అనిశ్చితి వుందా? అంతా సవ్యంగానే వుందా? అదికార పార్టీలే మళ్లీ గట్టెక్కుయా? ప్రతిపక్షాలకు ఏమైనా అవకాశం వుందా? అన్న సందేహాలు అనేకం వ్యక్తమౌతూనే వుంటాయి. ఏ నలుగురు ఒక్క చోట చేరినా గతంలో కుటుంబాలు, కుటుంబ సమస్యల గురించి మాట్లాడుకునే రోజులు పోయాయి. తెలుగు రాష్ట్రాల రాజకీయాలు మాట్లాడుకోవడం ఎక్కువైంది. పైగా మీడియా పెరిగిపోవడం కూడా ప్రజల్లో ఇలాంటి చర్చ ఎప్పుడూ జరుగుతూనే వుంటోంది. ఒక రకంగా చెప్పాలంటే నిరంతరం జరుగుతూనే వుందని చెప్పాలి. ఎన్నికలు ముగిసేదా సాగే చర్చలు, సర్వేలు…ఎన్నికలు పూర్తయి ప్రభుత్వం కొలువు తీరిన మరుక్షణం నుంచి వచ్చే ఎన్నికల గురించి మాట్లాడుకోవడం రాజకీయ పార్టీలకు అలావాటుగా మారింది. ప్రజలు తీర్పిచ్చి అధికారం అప్పగించిన మరుక్షణమే వచ్చే ఎన్నికల్లో కూడా మేమే గెలుస్తామని అప్పటినుంచే చెప్పే రాజకీయాలు నేడు వున్నాయి. గతంలో నాలుగున్నరేళ్లు ప్రజలు, పాలన, ఆరు నెలల ముందు రాజకీయాలు అని చెప్పేవారు. ఆ పరిస్ధితులు పూర్తిగా మారిపోయాయి. ఈ ఏడాది ఎన్నికలు జరిగితే ఎవరు అధికారంలోకి వస్తారు? అన్న దగ్గర నుంచి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారన్న చర్చలు, సర్వేలు జరిగేదాకా వచ్చేశాయి. అంతే కాదు పాలనలో వున్నవారు, ప్రతిపక్ష పార్టీలు సైతం ఐదేళ్లలో నిరంతరం సర్వేలు నిర్వహించుకుంటున్నాయి. రాజకీయాలు పాలనపై కన్నా సర్వేల మీద ఎక్కువ దృష్టిపెడుతున్నాయని చెప్పడంలో సందేహం లేదు. అందుకు ఈ పార్టీ, ఆ పార్టీ అన్న తేడా లేదు. దేశంలో వున్న అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నవే..అనుసరిస్తున్నవే..అయితే ఇటీవల ఎక్కువ సక్సెస్‌ రేటు ఏ సర్వే సంస్ధకు వుందన్న దానిని కూడా ప్రజలు బాగా గమనిస్తున్నారు. సర్వేలపై ఆసక్తి కనబర్చుతున్నారు. ఈ మధ్య కాలంలో ఖచ్చితమైన లెక్కలతో సహా సర్వే వివరాలు అందిస్తున్న డిప్యాక్‌ సర్వే సంస్ధ, నేటిధిన పత్రికతో కలిసి చేస్తున్న సర్వేలపై దేశం మొత్తం చర్చ జరుగుతోందని చెప్పడంలో సందేహం లేదు. గతంలో కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన డి.ప్యాక్‌ సర్వే దేశ వ్యాప్తంగా కూడా మంచి పేరు సంపాదించిందనే చెప్పాలి. కర్నాటక ఎన్నికల్లో ఏ సర్వే సంస్ధ చెప్పని లెక్కలు చెప్పింది ఒక్క డిప్యాక్‌ మాత్రమే. అందుకే ఆంధ్రప్రదేశ్‌రాజకీయాలపై డిప్యాక్‌ సర్వేచేస్తుందని తెలిసి, అనేక మంది సంస్ధ ప్రతినిధులకు ఫోన్లు చేస్తూ, పరిస్ధితులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వారి ఆసక్తి, ప్రజలకు డిప్యాక్‌పై వున్న నమ్మకం నేపధ్యంలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రజలు అభిప్రాయాలను కొన్నింటిని విడుదల చేయాలని నిర్ణయించాం. అందులో భాగమైన కొన్ని విషయాలు, వివరాలు పాఠకుల కోసం వెల్లడిస్తున్నాం.

ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగితే వైసిసి మరోసారి విజయం సాధిస్తుందని తెలుస్తోంంది. 

సరే వైసిపి పార్టీ, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఏకంగా 175 సీట్లు సాధిస్తామని చెబుతూ, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. అది వేరే సంగతి. కాని డిప్యాక్‌ సంస్ధ, నేటిధాత్రి తో కలిసి గత రెండేళ్లుగా సర్వేలు చేస్తూనే వుంది. అయితే ఆరు నెలలుగా మరింత కీలకంగా సర్వేను జరుపుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజల నాడిని పూర్తిగా అంచనా వేసే ప్రయత్నం లోతుగా చేస్తూ వస్తోంది. ప్రజలనుంచి సమాచారం సేకరించడంలో డిప్యాక్‌ సంస్ధది ప్రత్యేక శైలి. అందుకే ఎవరూ అంతుచిక్కని రహస్యాలు కూడా చెప్పడంలో డిప్యాక్‌ అందరికంటే ముందుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో వస్తున్న మార్పులపై మీడియా చేస్తున్న హడావుడికి, డిప్యాక్‌ చేస్తున్న సర్వేకు వున్న తేడా ఏమిటో వివరించే ప్రయత్నం చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్‌లో మూడు పార్టీలు కలిస్తే..అన్న చర్చ అప్పుడే జరిగి, అప్పుడే చల్లారిపోయే రాజకీయాలను చూసి లెక్కలేసుకోవడం సరైంది కాదు. ప్రజలు క్షేత్రస్ధాయిలో పార్టీలపట్ల వున్న అభిప్రాయాన్ని పూర్తిస్ధాయిలో వడపోయాల్సిన అవసరం వుంది. అందుకే లోతైన సర్వేలు చేయడంలో ఆరితేరిన డిప్యాక్‌ కొన్ని కఠినమైన వాస్తవాలు చెప్పడం జరుగుతోంది. ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే డిప్యాక్‌ పూర్తిగా ప్రజల పక్షంలో సర్వేచేయడం వల్లనే ఖచ్చితమైన లెక్కలు చెబుతోందని చెప్పగలుగుతున్నాం. 

వైసిసి ఈసారి ఎందుకు విజయం సాధిస్తుందని చెప్పడానికి ప్రధాని కారణం నవరత్నాలు ప్రజలకు ఎంతో భరోసా కల్గించాయని మాత్రం చెప్పగలం.

 పేద ప్రజల మద్దతు మాత్రం ఇప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి, వైసిపికి మాత్రమే వుందని స్పష్టంగా తెలుస్తోంది. అంతే కాదు కేవలం జగన్మోహన్‌రెడ్డికి విధేయులకు మాత్రమే ఈసారి కూడా విజయం వరిస్తుందని కూడా చెప్పగలం. జగన్‌తో విభేదిస్తున్న నాయకులకు మాత్రం ప్రజాక్షేత్రంలో కష్టమే అని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ,పార్టీకి బాధ్యులుగా వ్యవహరించని నేతలు, మీడియా చేస్తున్న హడావుడిని నమ్మి, తెలుగుదేశం వైపు చూస్తున్నవారికి ప్రజలనుంచి వ్యతిరేకత తప్పదని మాత్రం అర్ధమౌతోంది. జగన్‌పై ఆంద్రప్రదేశ్‌ ప్రజల్లో వున్న నమ్మకం చెక్కుచెదరలేదు. కాకపోతే ఐదేళ్ల పాలన తర్వాత ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత రావడం అన్నది సహజం. ముఖ్యంగా రాజధాని అంశం వైసిపికి కొంత ఇబ్బంది కరమే అన్నది నిర్వివాదాంశం. రాజధాని అన్నదానిపై ప్రభుత్వం పిల్లి మొగ్గలు వేయడాన్ని ప్రజలు కూడా ఆహ్వానించడం లేదు. తొలుత మూడు రాజధానులు అన్నదానిపై ప్రజలు కూడా ఆసిక్తిని కనబర్చారు. కాని అటుగా ఇప్పటి వరకు అడుగులు పడలేదు. స్పష్టంగా ఒక రాజధాని అంటూ అభివృద్ధి కాలేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో విపరీతంగా పడిపోయిన భూముల ధరలు, రాజధాని చుట్టుపక్కల కూడా భూములు విలువ తగ్గిపోవడం అన్నది రాష్ట్రానికి నష్టదాయకంగా పరిణమించిందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌లో వైసిసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి అవకాశాలు కనిపించక, తెలంగాణకు లక్షలాది మంది వలసలు వస్తున్నారన్నది నిజం. వాళ్లంతా జగన్‌ అంటే ఇష్టమంటూనే, బతకాలి కదా? అంటున్నారు. అంటే జగన్‌ పాలనలో ఉపాధి లోటు అన్నది కనిపిస్తోంది. దానికి తోడు రియలెస్టేట్‌ వ్యవస్ధ కుప్పకూలిపోయింది. విశాఖ రాజధాని నగరంగా అక్కడి ప్రజలు కూడా పూర్తిగా స్వాగతించడం లేదు. అందువల్లమూడు రాజధానుల మాట ఇప్పటికైనా పక్కనపెట్టి, కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించిన అమరావతి అభివృద్ధి మీద దృష్టి పెడితే ప్రజలంతా మళ్లీ జై జగన్‌ అనడం ఖాయం. అంతే కాకుండా పోలవరం గురించి కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. పోలవరం దివంగత వైఎస్‌ కల. జగన్‌ ఆ కల పూర్తిచేస్తాడన్న నమ్మకం ప్రజల్లో వుంది. కాని పనులు నత్తనడకన సాగడం అన్నది ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. పోలవరంలో రివర్స్‌ టెండరింగ్‌తో మొదలైన నత్తనడక..ఇంకా అలాగే సాగడాన్ని రైతుల్లో కూడా అసంతృప్తి వ్యక్తమౌతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్య మాత్రం సూపర్‌ అంటున్నారు. ఏ ప్రభుత్వ బడిలోనూ సీట్లు లేవు అన్న బోర్డులు కనిపించడం విశేషం. కరోనా సమయంలో ప్రభుత్వ బడులను తీర్చిదిద్ది, అత్యాధునిక వసతులు ఏర్పాటుచేసి, డిజిటల్‌ విద్యను, ఆంగ్ల విద్యను ప్రోత్సహించడాన్ని అన్నివర్గాలు స్వాగతిస్తున్నాయి. దానికి తోడు అమ్మఒడి కూడా ప్రజలకు ఎంతో మేలు చేస్తోంది. అయితే ఆరోగ్య రంగం కొంత కంటుపడిరదనే ప్రజలు అంటున్నారు. మద్యం పాలసీపై కూడా ప్రజలు గుర్రుగా వున్నారు. బ్రాండ్‌ల విషయంలో అందరూ చెప్పుకుంటున్నదే ప్రజలు కూడా చెబుతున్నారు. ఎంత సంక్షేమం చేపట్టినా, ప్రజల జీవితాల మీద ప్రభావం చూపే, వైద్యం, మద్యం, వ్యవసాయ రంగానికి అవసరమై పోవలరం, రాజధాని నిర్మాణం మీద ప్రభుత్వం దృష్టిపెడితే జగన్‌కు తిరుగులేదు. అయినా ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా వైసిపికి వంద సీట్లు గ్యారెంటీ…ఈ పనులన్నీ పూర్తిచేస్తే మరోసారి డబుల్‌ గ్యారెంటీ…!

ట్రెండ్ సెట్టర్ గా భట్టి పాదయాత్ర..కర్ణాటక సీఎం ఆసక్తి.. డీకే శివకుమార్ ఆరా..

 

 

తెలంగాణ కాంగ్రెస్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ట్రెండ్ సెట్ చేస్తోంది. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావటం..రాహుల్ ను ప్రధానిని చేయటమే లక్ష్యంగా భట్టి పాదయాత్ర కొనసాగుతోంది. భట్టి యాత్ర తో తెలంగాణ కేడర్ లో జోష్ పెరిగింది. ఇవే నివేదికలతో కాంగ్రెస్ నాయకత్వం భట్టి చొరవను ప్రశంసించింది. కర్ణాటక సీఎం సిద్ద రామయ్య తెలంగాణలో భట్టి యాత్ర పైన ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను ఆరా తీసారు. భట్టి పాదయాత్రకు వస్తున్న అనూహ్య స్పందనతో కాంగ్రెస్ నాయకత్వం ప్రశంసిస్తోంది. రాహుల్ ను ప్రధానిగా చేయటం ఈ సారి దక్షిణాది రాష్ట్రాలు కీలక భూమిక పోషించనున్నాయి. అందునా తెలంగాణ ప్రధాన భూమిక పోషించనుంది. ఆ దిశగా భట్టి తన పాదయాత్రలో వేస్తున్న అడుగులు సత్ఫలితాలిస్తున్నాయి.

తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు ప్రజల్లో ఆదరణ ఉంది. పదేళ్ల గులాబీ పార్టీ పాలన పైన విసుగెత్తిపోయారు. ప్రతిపక్షాలను అణిచివేయాలనే కుట్రలు కొనసాగుతున్నాయి. కేంద్ర…రాష్ట్రంలో ప్రజా సమస్యలు లేవనెత్తకుండా అక్కడ బీజేపీ..ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయి. ఈ సమయంలో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరరకు జోడో యాత్ర నిర్వహించారు. రాహుల్ స్పూర్తి తో తెలంగాణలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రారంభించారు. మార్చి 16న ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో ప్రారంభమైన భట్టి యాత్ర నిరాటంకంగా కొనసాగుతోంది. అనారోగ్య సమస్యలు వచ్చినా..యాత్ర కొనసాగింపులో వెనుకడుగు వేయలేదు. పార్టీ ప్రముఖులు..సీనియర్లు..కేడర్ భట్టి యాత్రకు అండగా నిలిచింది.

భట్టి పాదయాత్ర ప్రణాళికా బద్దంగా కొనసాగిస్తున్నారు. తన పాదయాత్ర ద్వారా అన్ని వర్గాల ప్రజల మధ్యకు వెళ్లారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు ఓదార్పు ఇచ్చారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. పేదలకు మంచి జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని వివరిస్తున్నారు. కేంద్రంలో ప్రధానిగా రాహుల్.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జరిగే మంచిని ప్రజల మధ్య విశ్లేషించారు. భట్టికి అన్ని వర్గాల ప్రజల నుంచి ఆదరణ కనిపించింది. ప్రజల నుంచి వస్తున్న స్పందన పార్టీ అధినాయకత్వం వరకు వెళ్లింది. తెలంగాణలో పార్టీ కోసం భట్టి చేస్తున్న పాదయాత్ర పైన స్వయంగా రాహుల్ గాంధీ తెలంగాణ పార్టీ ఇంఛార్జ్ థాక్రే నుంచి ఆరా తీసారు. భ‌ట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర కొన‌సాగిన నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం కావ‌డంతో పాటు.. కేడ‌ర్ లో స‌రికొత్త జోష్ నెల‌కొందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఇదే సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలంగాణలో భట్టి పాదయాత్రకు వస్తున్న ఆదరణ పైన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను వివరాలు కోరారు. సిద్దరామయ్య ఆదేశాలతో డీకే తెలంగాణలో భట్టి పాదయాత్ర గురించి ఆరా తీసారు. పాదయాత్రలో భాగంగా గిరిజ‌నులు, ఆదివాసీలు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలు, మైనారీటీలు, అట్ట‌డుగు వ‌ర్గాలు, అణ‌గారిన ప్ర‌జ‌లతో భట్టి మమేకమవుతున్న తీరు.. వస్తున్న స్పందన బాగుందని సర్వే సంస్థలు డీకేకు..పార్టీ అధినాయకత్వానికి నివేదికలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పాద‌యాత్ర‌లో 500 వందలకు పైగా గ్రామాలు.. తండాలు, ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు కవర్ అయ్యాయి.వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని గెలుపుతీరాలకు చేర్చటం లక్ష్యంగా ఈ పాద‌యాత్ర ముందుకు కొనసాగుతోందని డీకే సేకరించిన సమాచారంలో వెల్లడైనట్లు తెలుస్తోంది.

ఈ సారి అధికారంలోకి రావాలనే కాంగ్రెస్ కేడర్ కు ఈ యాత్ర మరింత విశ్వాసం నింపుతోందని గుర్తించారు. కర్ణాటక తరువాత ఇప్పుడు దక్షిణాదిలో కాంగ్రెస్ కు తెలంగాణ కీలకంగా మారుతోంది. 2024లో రాహుల్ ని ప్రధాని చేయడంలో దక్షిణాది రాష్ట్రాలుకిలకంగా మారుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం..2024లో రాహుల్ ప్రధాని కావటం తన లక్ష్యమని భట్టి స్పష్టం చేస్తున్నారు. పార్టీ భవిష్యత్ కోసం భట్టి చేపట్టిన పాదయాత్ర ఈనెల 25 నాటికి 101 రోజులు పాదయాత్ర పూర్తి అవుతుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఇప్పుడు భట్టి పాదయాత్ర కాంగ్రెస్ నేతలను ఆకర్షిస్తోంది.

Political Heat Rises in Telangana: తెలంగాణలో ఆ రెండు పార్టీల మధ్యే పోటీ

 

గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ సాధించిన ఎమ్మెల్యే సీట్లు ఎన్ని? ఒక్కటంటే… ఒక్కటి! రాజా సింగ్ మాత్రమే తన స్వంత బలంతో ఓల్డ్ సీటీలో గెలిచాడు. మిగతా అన్ని చోట్లా కాషాయం కొట్టుకుపోయింది. అయితే, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు ఎంపీ సీట్లు రావటంతో కమలం క్యాంపులో కాస్త కళ వచ్చింది. రాజా సింగ్ కు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ తోడవ్వటంతో టీ అసెంబ్లీలో బీజేపీ బలం ‘ఆర్ఆర్ఆర్’ అయింది! అయినా కూడా ‘ట్రిపుల్ ఆర్’ ఎమ్మెల్యేలతో కమలం ఇంకా హస్తం కంటే బాగా వెనుకబడే ఉంది! అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు…
తెలంగాణలో 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారం చేజిక్కించుకుంది. కేసీఆరే సీఎంగా కొనసాగుతున్నారు. అయితే, ఆయనపై అలుపెరుగని పోరాటం చేస్తోంది మాత్రం… గత దశాబ్ద కాలంగా… కాంగ్రెస్ పార్టీయే. ఇప్పటికిప్పుడు కూడా తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం హస్తం పార్టీయే. మరి బయట బోలెడు ప్రగల్భాలు పలికే బీజేపీ పరిస్థితి ఏంటి? హిమాచల్ మొదలు కర్ణాటక దాకా అనేక చోట్ల ఓడిపోతోన్న కమల దళం తెలంగాణలో ఏ మాత్రం ఎదిగే సూచనలు కనిపించటం లేదు. ఈటెల రాజేందర్ గెలిచాక ఆయనను చేరికల కమీటి అంటూ ఒకటి ఏర్పాటు చేసి… దానికి నాయకుడ్ని చేశారు. అయినా చేరికలూ జరగలేదు. తీసివేతలు కాలేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది టీ బీజేపీ పరిస్థితి. పైగా గత కొన్ని రోజులుగా తెలంగాణ కమలంలో ముసలం పుడుతోంది…
టీ బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్ పోకడలు ఈటెల మొదలు ధర్మపురి అరవింద్ వరకూ చాలా మందికి నచ్చటం లేదట. ఈ విషయం వారు స్వయంగా అంగీకరించనప్పటికీ అనేక లుకలుకలైతే ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. బీజేపీ దిల్లీ హైకమాండ్ వద్దకి బండి సంజయ్ వ్యతిరేకులు బృందంగా వెళ్లి రావటం కూడా బహిరంగ రహస్యమే! అలాగని వారి కోసం బండిని అధ్యక్ష పదవి నుంచీ తొలగిస్తారా? మోదీ, అమిత్ షా అటువంటి నిర్ణయం తీసుకుంటారా? అబ్బే అలా జరగదంటున్నారు బీజేపీలోని వారే! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడిపోతోన్న వేళ ప్రెసిడెంట్ ని మార్చితే గందరగోళం అవుతుందని వారి వాదన!
బీఆర్ఎస్ ను అధికారంలోంచి దించి భాగ్యనగరంలో కాషాయ జెండా ఎగురవేస్తామని ప్రగల్భాలు పలికిన టీ బీజేపీ నాయకులు ఇప్పుడు అంతర్యుర్ధాలతో సతమతం అవుతున్నారు. మరోవైపు, దిల్లీ కాషాయ పెద్దలు కేసీఆర్ కుమార్తె విషయంలో మొదట్లో తెగ హడావిడి చేశారు. కవితని అరెస్ట్ చేస్తాం అన్నట్టుగా వాతావరణం సృష్టించారు. ఇప్పుడు చూస్తుంటే లిక్కర్ కేసు మత్తు మొత్తం దిగిపోయినట్టే కనిపిస్తోంది. కవిత అరెస్టు ఒట్టి మాటేనని బీజేపీలోని వారే ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటున్నారు. కవిత ఎపిసోడ్ వల్ల జనం ముందు బీజేపీ చులకనైందని వారి ఆవేదన. బీఆర్ఎస్ తో గట్టిగా పోరాడేది బీజేపీ కాదు కాంగ్రెస్సేనని క్షేత్రస్థాయిలో జనం భావిస్తున్నారట!
ప్రస్తుతానికి బీఆర్ఎస్, టీ కాంగ్రెస్ ల తరువాతి స్థానంలో ఎక్కడో సుదూరంగా ఉన్న బీజేపీ ఆలు లేదు చూలు లేదు అన్న చందంగా అప్పుడే అనేక సమస్యలతో కుదేలవుతోంది. జనంలో నమ్మకం కలిగించలేక, పార్టీలోని నేతల్లో ఐకమత్యం తీసుకురాలేక కమల దళం చేతులు ఎత్తేస్తోంది. అందుకు మంచి ఉదాహరణే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావుల వ్యవహారం. మొదట్లో వారిద్దరూ కాషాయ కండువా కప్పేసుకుంటారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంత వరకూ అది జరగలేదు. మరోవైపు, కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత పొంగులేని, జూపల్లి టీ కాంగ్రెస్ నాయకులతో టచ్ లోకి వచ్చారట. వారిని ఎలాగైనా పార్టీలోకి తీసుకోవాలని హస్తం పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే జరిగితే వలసలపై బీజేపీ పెట్టుకున్న ఆశలు ఆడియాశలే అవుతాయి. బీఆర్ఎస్ వద్దనుకున్న వారికి కాంగ్రెస్సే ఛాయిస్ గా మారుతుంది. బీజేపీ 2018లో మాదిరిగానే… మరోసారి మూడు, నాలుగు సీట్లతో మూడో స్థానానిక పరిమితం అవుతుంది!
ఈ సంవత్సరం చివర్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీఆర్ఎస్, టీ కాంగ్రెస్ మధ్య మాత్రమే. కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ హస్తం పార్టీ చరిత్ర సృష్టిస్తే బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం అవుతుంది. మరి బీజేపీ సంగతేంటి? ఆటలో అరటి పండుగా మిగలటమే!

పచ్చగా తిన్నదెక్కడ ! వెచ్చగా పన్నదెక్కడ!?

రేవంత్‌ తర్కం రమ్మన్నట్టా!

 వద్దన్నట్టా!! 

`రండి..రండి అంటున్నట్లా?

`మీ ఖర్మ అని జాలిపడినట్లా?

`రేవంత్‌ వ్యాఖ్యలెవరి కోసం?

`కమలం నుంచి హస్తానికి క్యూ..నిజమేనా?

`ఒక్క సీటిస్తాం..పది సీట్ల ఖర్చు అప్పగిస్తాం!

`ఆప్షన్‌ లేదు…ఈటెలకూ బిజేపి మీద నమ్మకం లేదు?

`రెడ్డి రాజకీయంలో రేవంత్‌ వింత పోకడ?

`బిజేపి రెడ్డీలంతా కాంగ్రెస్‌ గూటికా!

`గుండుగుత్తగా జంపా!?

`జూపల్లి రావడం ఇష్టం లేకనా?

`పొంగులేటి రాకుండానే పొగబెట్టడమా?

`పది మెట్లు దిగుతా అన్నది ఇందుకేనా?

`పాపం పొంగులేటి..జాలి పడేవారు లేకుండా పోయిరి?

`అయినా కాంగ్రెస్‌ తప్ప దిక్కులేకుండా చేసుకుంటిరి?

`ఈటెలకు ఉమ్మడి కరీంనగర్‌ ఖర్చులు?

`పొంగులేటి కి ఖమ్మం లెక్కలు?

`నల్గొండ వెంకటరెడ్డికి అప్పగింతలు?

`బోనస్‌ ఎల్‌ బి.నగర్‌ తమ్ముడు రాజగోపాల్‌ రెడ్డి కి?

`రంగారెడ్డి ఎవరికి?

`జితేందర్‌ రెడ్డికి దిక్కేమిటి?

`రాములమ్మ కూడా కాంగ్రెస్‌ గూటికి…?

`భబ్రాజమానం భజగోవిందం!

`ఆలస్యం కొంప ముంచుతుందేమోనని భయం!

`తట్టా బుట్టా సర్థుకొని అంతా సిద్ధం?

`బిజేపిలో మొదలైన అంతర్మధనం!

`ఈటెల అందుకే ఈ మధ్య దూరం.. దూరం.

హైదరబాద్‌,నేటిధాత్రి: 

రాజకీయాల్లో చీమ చిటుక్కుమన్నా తెలిసే రోజులు. అలాంటి కాలంలో కూడా నాయకులు ప్రజలను మభ్యపెట్టాలని, తాము పబ్బం గడుపుకోవాలని చూస్తే ప్రజలు తెలియకుండా పోతుందా? తాజా రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా బిజేపి, కాంగ్రెస్‌ పార్టీలు విచిత్రమైన వైఖరిని అనుసరిస్తున్నాయి. అనుభవిస్తున్నాయి. ఎటు పోతున్నామో తెలియని దారిలో పయనిస్తున్నాయి. ఎవరు తోడు వస్తారో తెలియని వైపు అడులేస్తున్నాయి. ముఖ్యంగా అధికార బిఆర్‌ఎస్‌ నుంచి ఎవరు వస్తారో అని ఎదురుచూస్తున్నాయి. గతంలో ఇలాంటి రాజకీయాలు ఎన్నడూ విన్నది లేదు. చూసింది లేదు. ఎన్నికల తరుణం వచ్చేసిందటే ప్రతిపక్షాలు బలంగా వున్నట్లు కనిపించేవి. ప్రజలు కూడా ముందే సంకేతాలిచ్చినంత పనిచేసేవారు. కాని టెక్నాలజీ పెరిగిన తర్వాత నాయకులు వేసే వింత వేషాలు చూసి, ప్రజలు కూడ తమ తమ పాత్రను బాగానే పోషిస్తున్నారు. నొప్పింపక తానోవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అన్నట్లు ప్రజలు అందరినీ ఆదరిస్తున్నారు. ఎన్నికల్లో మాత్రం చుక్కలు చూపిస్తున్నారు. గత ముందస్తు ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్‌ ఊపు మీద వుందన్న ప్రచారం జోరుగా సాగింది. కాని ఏమైంది? బొక్కా బోర్లాపడిరది. మళ్లీ కోలుకోలేనంత దెబ్బ పడిరది. అయినా ఆ పార్టీలో వచ్చిన ఊపు లేదు. కొత్త బలం లేదు. బిఆర్‌ఎస్‌ నుంచి ఎవరొస్తారా? లేక బిజేపి నుంచి ఎవరొస్తారా? అని ఎదురుచూస్తోంది. అదేవిధంగా బిజేపికూడా ఎదురుచూస్తోంది. కాంగ్రెస్‌ నుంచి ఎవరు వస్తారా? బిఆర్‌ఎస్‌ నుంచి ఎంత మంది వస్తారా? అన్నదానిపై ఆశలు పెట్టుకొని రాజకీయాలు చేస్తోంది. కర్నాకట ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్‌తో బిజేపికి మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. ఇక కోలుకోలేకపోతోంది. అదలా వుంటే వచ్చినవారు వుంటారా? లేదా? అన్న ఆందోళన బిజేపిలో మొదలైంది. 

 ఉన్న ఫలంగా బిజేపిలో చేరిన నేతలందరూ కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారన్న పెద్దఎత్తున జరుగుతున్న ప్రచారం.

మరో వైపు బిఆర్‌ఎస్‌ బహిషృత నేతలు ఖమ్మం మాజీ ఎంపి. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మడి పాలమూరుకు చెందని మాజీ మంత్రి జూపల్లికృష్ణారావులు బిజేపి వైపు అడుగులేస్తున్నారన్న వార్తలు, కాస్త మాయమై, కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికీ ఆ ఇద్దరు నేతలు ఎటు వెళ్తారన్నదానిపై వారికే స్పష్టత లేదు. కాకపోతే కాంగ్రెస్‌ , వామపక్షాలు ఐడియాలజీలున్న నాయకులంతా కాంగ్రెస్‌ వైపు చూస్తున్న చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. బిజేపిలో చేరి తమ ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించుకొని, ఇంకా అక్కడే వుంటే ప్రజలు కూడా మర్చిపోతారని భయపడుతున్న నేతలంతా కాంగ్రెస్‌కు క్యూ కడుతున్నారన్న వార్తలు మాత్రం గుప్పుమంటున్నాయి. వారిలో బిజేపిలో చేరి ఆ పార్టీలో కొంత కాలం సంచలనంగా మారిన ఈటెల రాజేందర్‌ కూడా తీవ్ర అసంతృప్తిలో వున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటున్నట్లు చెబుతున్నారు. ఆయన కూడా మూటా ముళ్లె సర్ధుకునేందుకు సిద్దంగా వున్నారని ప్రచారం. ఆయన ఒక్కడు బిజేపినుంచి వెళ్తే ఆయనతో వచ్చిన వారంతా కూడా వెళ్లిపోతారనేది సహజంగా వచ్చే అనుమానమున్నదే. .ఈటెల వెంటే వాళ్లంతా వెళ్తారన్నది జగమెరిగిన సత్యమే. ఈటెలతో సంబంధం లేకుండా బిజేపిలో చేరి సొంత గూటికి చెరినట్లు, పుట్టింటికి చేరినట్లుందని చెప్పిన రాములమ్మ ( విజయశాంతి) కూడా బిజేపిపై తీవ్ర అసంతృప్తితో వున్నట్లు చెబుతున్నారు. కనీసం కాంగ్రెస్‌లో వున్నప్పుడు అడపా దడపానైనా మీడియాలో వుండే అవకాశం వుండేది. కాని బిజేపిలో చేరిన తర్వాత పూర్తిగా పక్కన పెట్టేశారన్నది ఆమెకు అర్ధమైంది. అందుకే మళ్లీ కాంగ్రెస్‌వైపు చూస్తోందని సమాచారం. మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి డి.కే . అరుణ కూడా మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరేందుకు సంసిద్దతమౌతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ప్రియాంకా గాంధీ పర్యటన సందర్భంగా ఆమె కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇక జితేందర్‌రెడ్డి లాంటి మాజీ ఎంపి, కొండా విశ్వేశ్వరెడ్డిలు కూడా త్వరలో కాంగ్రెస్‌ తీర్ధంపుచ్చుకుంటారని అంటున్నారు. 

 ఇక ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఒక రకంగా తెలంగాణలో రాజకీయ దుమారాన్నే సృష్టించాడని చెప్పొచ్చు.

ఆయన ప్రకంపనలు సృష్టిస్తాడని కూడా చాలా మంది ఊహించారు. కాని తానే ఎటుకాకుండా చౌరస్తాలో నిలబడాల్సి వస్తుందని మాత్రం ఆయన కూడా కలలో ఊహించి వుండకపోవచ్చు. తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రభంజనమైపోతా? అన్నంతగా పొంగిన పొంగులేటి పాల పొంగు చల్లారినంత సేపు కూడా ఆయన రాజకీయం సాగలేదన్నది వాస్తవం. ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు. కొంత కాలం క్రితం వరకు మా పార్టీకి పొంగులేటి వస్తున్నాడు? అని కాంగ్రెస్‌…లేదు..లేదు మా పార్టీకే వస్తున్నాడంటూ బిజేపి చెప్పుకున్నాయి. కాని ఈటెల రాజేందర్‌ చెప్పిన ఒక్క విషయంతో అటు బిజేపి, ఇటు కాంగ్రెస్‌లతోపాటు, ఆఖరుకు పొంగులేటి కూడా తన పరవు తాను తీసుకున్నాడు. ఈటెల రాజేందర్‌ రాజకీయాన్ని ఒక్కసారి దెబ్బతీశాడు. తాను బిజేపిలో చేరడం కాదు. నువ్వొస్తే మరో వేధిక ఏర్పాటు చేద్దామంటూ తనకే కౌన్సిలింగ్‌ ఇచ్చారని ఎప్పుడైతే ఈటెల చెప్పారో అప్పటి నుంచి ఆయన మనసు కూడా చెదిరినట్లే వుంది. బిజేపిలో ఇన్ని తలనొప్పులు భరించడం తన వల్ల కాదన్న నిర్ణయానికి కూడా ఈటెల వచ్చినట్లు తెలుస్తోంది. పైగా ఈటెల కాంగ్రెస్‌లోకి వస్తానంటే మాత్రం కళ్లకు అద్దుకొని తీసుకుంటారనేది మాత్రం వాస్తవం. మరి ఊగిసలాడుతున్న పొంగులేటి వ్యవహారాన్ని మాత్రం కాంగ్రెస్‌ ఇప్పటికే జీర్ణించుకోలేకపోతోంది. 

  తాజాగా పిపిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పొంగులేటికి ద్వారాలు మూసినట్లా? తెరిచినట్లా? అన్నది అర్ధంకాకుండాపోయింది.  

పచ్చగా వున్న చోట తిని, వెచ్చగా వున్న చోట పందామని చూస్తున్నట్లునున్నారు…అంటూ పొంగులేటి, జూపల్లి ల గురించి చెప్పినట్లు పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. ఓ వైపు తాను పది మెట్లు దిగుతానంటూ ఓ వైపే రేవంత్‌రెడ్డి ప్రకటిస్తూనే మరోవైపు ఇలా చురకలంటిండంలో ఆంతర్యమేమిటన్నది ఎవరికీ అర్ధంకాకుండావుంది. అయితే ఇదంతా పొంగులేటి ఇక తప్పని పరిస్ధితుల్లో కండువా కప్పుకున్నా, ఖమ్మంలో ఒక్క సీటు తప్ప మరే సీట్లు ఇవ్వమని పరోక్షంగా ఇచ్చిన సంకేతంగా భావించొచ్చన్నది కొందరు కాంగ్రెస్‌ సీనియర్లు చెబుతున్న మాట. అంతే కాదు ఒక్క సీటిచ్చి, ఖమ్మం పది సీట్లు గెలిచే ఖర్చు కూడా పొంగులేటే పెట్టుకునేలా షరతు కూడా పెట్టేందుకు కాంగ్రెస్‌ సిద్దంగా వున్నట్లు సమాచారం. అయితే ఒక్క పొంగులేటితోనే కాకుండా కాంగ్రెస్‌వైపు చూస్తున్న ఈటెలకు కూడా ఉమ్మడి కరీంనగర్‌ బాధ్యతలు అప్పగించి, ఖర్చు బాధ్యతుల కూడా ఆయనకే అప్పగించాలని చూస్తున్నారట. నల్గొండ బ్రాండ్‌ అంబాసిడర్లుగా చెప్పుకున్న కోమటి రెడ్డి సోదరుల్లో ఒకరైన రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బిజేపిలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన మనసు మళ్లీ కాంగ్రెస్‌ వైపు మళ్లిందని సమాచారం.. అందుకే ఆయనకు ఎల్‌బినగర్‌ టిక్కెట్‌ ఇస్తే, ఉమ్మడి నల్లగొండ ఖర్చులు చూసుకునేందుకు ఆ సోదరులు కూడా సిద్దమైనట్లు చెప్పుకుంటున్నారు. ఇదంతా జరిగుతుందా? లేదా? అన్నది ఇప్పటికప్పుడు తేలకపోయినా, జూన్‌ లో రావాల్సిన రుతుపవనాలు ఎలా ఊరిస్తున్నాయో? నాయకులు కూడ అలాగే ఆలస్యం చేస్తున్నారు. వర్షాకాలం వచ్చినా ఎండలు మండిపోతున్నట్లు, రాజకీయాలు వేడెక్కిస్తున్నారు…మరి చినుకులెప్పుడు పడతాయో? ఈ నాయకులంతా ఎప్పుడు పార్టీలు మారుతారో..అని మాత్రం మీడియా ఎదురుచూస్తోంది. ఎందుకంటే మీడియా హడావుడి లేకపోతే…రాజకీయాలే సప్పగా వుంటాయి.

నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవానికి హాజరై చిన్నారిని ఆశీర్వధించిన – నారబోయిన రవి ముదిరాజ్

మునుగోడు 

చౌటుప్పల్ మండలం దామెర గ్రామ వాస్తవ్యులు కోరే ప్రకాష్ -మమత గార్ల చిన్నారులు అభిజ్ఞ – అక్షర గారి నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం కళా శ్రీ ఫంక్షన్ హల్ చౌటుప్పల్ కి హాజరై చిన్నారులని ఆశీర్వధించిన *బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ గారు

ఈ కార్యక్రమంలో మునుగోడు వైస్ ఎంపీపీ అనంత స్వామి గౌడ్ గారు, మండల విశ్వనాధ్ గారు, వల్కి దిలీప్ గారు, బిఆర్ఎస్ పార్టీ మండల కార్మిక విభాగం అధ్యక్షులు కట్కూరి శంకర్ గారు, మునుగోడు పట్టణ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బండారు మల్లేష్ గారు, గోదాల సాగర్ రెడ్డి గారు, మరియు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ లో మరో సంచలనం – అయన రూపంలో వైఎస్ కదలాడతారు!

 

గంగా నది మన దగ్గరకు రాదు. వేల మైళ్లు ప్రయాణించి అయినా మనమే గంగ దగ్గరికి వెళ్లాలి. ప్రజాస్వామ్యంలో జనమే… గంగా ప్రవాహం లాంటి వారు! వాళ్ల మధ్యకి వెళ్లి కలిసి నడిచిన వారే జన నేతలు అవుతారు!
‘జనం మధ్యలో జన నేత’ అంటే మనకు ఎవరు గుర్తుకు వస్తారు? పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా తెలుగు వారందరికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కళ్ల ముందు కదలాడతారు! తలపై పాగా, తెల్లటి పంచె, స్వచ్ఛతలో ఒక దానితో ఒకటి పోటీ పడే ఆయన లాల్చీ, చిరు నవ్వులు… మనల్ని గతంలోకి తీసుకు వెళ్లిపోతాయి. అదుగో… ఆ రాజన్న ఇప్పుడు పేదలు, బడుగు, బలహీన వర్గాల వారికి మరోసారి గుర్తుకు వస్తున్నారు. తమని ఆదుకునే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని వాళ్ల కళ్లలో ఆశలు మిలమిల మెరుస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క ‘పీపుల్స్ మార్చ్’ అంటూ పోరుబాట పట్టిన విషయం మనకు తెలిసిందే! ఆయన ప్రస్తుతంలో ఎర్రటి ఎండల్లోనూ జనం మధ్య, జనంతో మమేకం అవుతున్నారు…
మార్చ్ లో ప్రారంభమైన భట్టి పాదయాత్ర దివంగత రాజశేఖర్ రెడ్డిని జనానికి తలపిస్తూ ముందుకు సాగుతోంది. వైఎస్ లాగే పంచెకట్టుతో, భరోసా ఇచ్చే చిరు నవ్వుతో, రైతుల్లో రైతుగా మారిపోయి… సామన్యుల్లో సామాన్యుడై… మన తెలంగాణ భూమి పుత్రుడు అడుగులు వేస్తున్నారు. జనం ఆయనతో తమ కష్ట, నష్టాలు చెప్పుకుంటూ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం కోసం కంకణాలు కట్టుకుంటున్నారు. హస్తానికే తమ ఓటు అంటూ ప్రతిజ్ఞలు చేస్తున్నారు.
వైఎస్ ను తలపించే రూపం, హావభావాలు మాత్రమే కాదు… భట్టి విక్రమార్క మరో మారు రాజన్న రాజ్యాన్ని కాంగ్రెస్ మార్కు పథకాలు, పాలనతో తాను తీసుకు వస్తానని సూటిగా, స్పష్టంగా చెబుతున్నారు. పేదల గోడు వినని ప్రస్తుత దొరల పాలనకు తమ ప్రభుత్వం పూర్తి భిన్నంగా ఉంటుందని ఆయన ప్రకటించారు. ప్రగతి భవన్, ఫామ్ హౌజ్ ల్లోనే తొమ్మిదేళ్లు గడిపేసిన కేసీఆర్ తన రాజ ప్రాసాదాల్లోకి కామన్ మ్యాన్ కి నో ఎంట్రీ అనేశాడు. సచివాలయంలోకి కూడా సామాన్యుడు రాకుండా పోలీసుల్ని కాపాలా పెట్టేశాడు! కాంగ్రెస్ వస్తే రాజశేఖర్ రెడ్డి హయాంలో మాదిరిగా ప్రజాదర్భార్, రచ్చబండ కార్యక్రమాలు పునః ప్రారంభం అవుతాయని భట్టి అంటున్నారు. జనం సీఎం వద్దకు రావచ్చని… సీఎం జనం వద్దకు వచ్చి తీరుతాడని ఆయన హామీ ఇచ్చారు! రాబోయే ఖచ్చితంగా… పేదలకు, సామాన్యులకు ఆపన్న ‘హస్తం’ అందించే… రాజన్న రాజ్యమే!

తెలంగాణ రాజకీయంలో కీలక పరిణామం చోటు చేసుకోనుందా..?

తెలంగాణలో కాంగ్రెస్ వైపుకి రెడ్డి సామాజిక వర్గం, బ్రాహ్మణులు మొదలు దళితులు, గిరిజనుల దాకా, మైనార్టీలతో సహా… అన్ని వర్గాల్లోనూ కాంగ్రెస్ కు ఓటర్ల బలంగా ఉన్నారు! ఇది మనకు స్వతంత్రం వచ్చిన నాటి నుంచీ నిరూపితం అవుతోన్నదే! అయితే, తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు అతి పెద్ద బలం రెడ్డి సామాజిక వర్గం. వాళ్లు మొదటి నుంచీ హస్తంతోనే కొనసాగుతున్నారు. ఇతర వర్గాల ధోరణి ఎలా ఉన్నా… ఎన్నికలు వచ్చిన ప్రతీ సారి రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు చేతి గుర్తుకే చేయెత్తి జైకొడుతున్నారు. అయితే, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణలోనూ రెడ్లు ఎప్పటిలాగే కాంగ్రెస్ ను ఆదరిస్తూ వచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాస్త మార్పు కనిపించింది!
జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ తెలంగాణ రెడ్డి సామాజిక వర్గాన్ని కొంత వరకూ అప్పట్లో ప్రభావితం చేసింది. కేసీఆర్ తో స్నేహం చేసిన జగన్ కారు గుర్తుకు ఓటు వేయాలంటూ పనిగట్టుకుని తెలంగాణలో ప్రచారం చేయించాడు. అనధికారికంగా వైసీపీ మీటింగులు పెట్టి కేసీఆర్ వైపుకు రెడ్డి ఓట్లను మళ్లించింది. అయితే, అయిదేళ్ల తరువాత ఇప్పుడు మరో మారు ఆ సామాజికవర్గం కాంగ్రెస్ వైపుకే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది!
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కుచుకుళ్ల దామోదర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి,ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కీలక నేత కేఎల్ఆర్ అలియాస్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మళ్ళీ యాక్టివ్ అవ్వడం.. ఇలా అనేక మంది రెడ్డి సామాజిక నేతలు, ప్రముఖులు హస్తంతో చేతులు కలుపుతున్నారు. ఎన్నికలు దగ్గరపడేకొద్ది టీ కాంగ్రెస్ లోకి మరింత మంది రెడ్డి  సామాజికవర్గం నేతలు వలససొచ్చే అవకాశాలున్నాయని బలమైన టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే బీఆర్ఎస్ సీఎం కూర్చీపై ఆశలు వదులుకోవాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే, తెలంగాణలో ఆర్థిక, రాజకీయ పలుకుబడిలో రెడ్లదే మొదటి స్థానం. అలాగే, ఓటర్లుగా కూడా రెడ్డి కులస్థులు గణనీయంగా ఉంటారు. ఏక కాలంలో… అటు రెడ్డి నేతలు, ఇటు రెడ్డి ఓటర్లు… కాంగ్రెస్ కు జైకొడితే… కర్ణాటక తరువాత దక్షిణాదిలో మరో రాష్ట్రం హస్తం వశం కాకుండా… ఎవరూ ఆపలేరంటున్నారు రాజకీయ పండితులు!

జల జీవం..జన జీవనం కేసీఆర్‌

` రైతు క్షేమ వరదాత కేసిఆర్‌.

` కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో అభివృద్ధిని వివరిస్తూ, విశ్లేషిస్తూ చెప్పిన అంశాలు..ఆయన మాటల్లోనే…

` తెలంగాణ సాధక కేసిఆర్‌.

`తెలంగాణ విధాత కేసిఆర్‌.

`ప్రగతి ప్రధాత కేసిఆర్‌.

` బంగారు తెలంగాణ సృష్టి కర్త కేసిఆర్‌.

`అద్భుతమైన నిర్మాణాల కాణాచి తెలంగాణ.

`అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న మన తెలంగాణ.

` రైతు కలలు నెరవేర్చిన కాళేశ్వరం..

` తెలంగాణలో కొత్త రూపుతో యాదాద్రి దివ్య క్షేత్రం.

` పాలనాపరమైన సరికొత్త నిర్మాణం సచివాలయం.

` వంతెనల్లో అద్భుతమైన వారధి కేబుల్‌ బ్రిడ్జి

` మొహంజాహీ మార్కెట్‌ కు మరింత శోభ.

` పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ బిల్డింగ్‌ అద్భుతం.

` దేశానికే తెలంగాణ రోల్‌ మోడల్‌.

` నిర్మాణాలైనా, సంక్షేమాలైనా తెలంగాణే ఫస్ట్‌.

` దేశంలో కేసిఆర్‌ పాలనే బెస్ట్‌.

` తెలంగాణలో బిఆర్‌ఎస్‌ హాట్రిక్‌.

`దేశంలో అనేక రాష్ట్రాలలో అప్‌ కమింగ్‌.

నా ప్రజలను నేనెప్పుడూ ఇరుముడిలా నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నా..

` ప్రజల కష్టాలు తీర్చిన..

`కన్నీళ్ళు తుడిచినా..

`అందుకే ప్రజల గుండెల్లో వున్న…

`తాగు నీరు అందించిన..

` చెరువులు బాగు చేయించిన,

` రోడ్లేయించిన…

` నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చేసిన..

`ప్రజల సమస్యలు తెలుసుకొని తీర్చిన..

` విద్య, వైద్య సదుపాయాలు కల్పించిన

`జిల్లాకు మెడికల్‌ కాలేజీ సాధించిన

`నాకు ఎదురులేదు..పోటీ అసలే లేదు.

` నా సేవ మీద నా ప్రజలకు విశ్వాసం వుంది.

హైదరబాద్‌,నేటిధాత్రి:  

జలమే జీవం..జీవనం. ఆ ప్రదాతే దైవం. తెలంగాణ పాలిట కేసిఆర్‌ ప్రదాత అందించిన జలజీవం..తెలంగాణకు జీవన వేదం. ..తెలంగాణ సస్యశ్యామలం..పసిడి వన్నెలద్దిన పల్లెకు జీవితం. తెలంగాణకు పచ్చని కాంతులు తెచ్చిన కేసిఆరే ఆరాధ్యం. ఏ నీటి చుక్క కోసం తెలంగాణ తల్లిడిల్లిందో ఆ నీటి జలదాధను తెలంగాణకు మళ్లించిన వరదాత తెలంగాణ పోరాట యోధుడు, తెలంగాణ స్వాప్నికుడు, ఉద్యమ వీరుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌. చుక్క నీరిచ్చేందుకు కూడా వీలు లేదు..సాధ్యం కాదు.. సాగు కోసం తెలుగు సంపద ఖర్చు చేయలేం…ఎత్తిపోతలు చేపట్టలేమంటూ తెలంగాణ జీవితాలను ఎగతాలి చేసి చిద్రం చేసిన పరాయి పాలన నుంచి విముక్తి ప్రసాధించిన ముక్తి ప్రదాత కేసిఆర్‌. అంటున్న కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా పదేళ్లలో జరిగిన అభివృద్ధి ఒక సంచలనం. ప్రపంచంలో ఇంతటి వేగవంతమైన ప్రగతిని అందించిన పాలకుడు మవరెవరూ లేరు. అది కేసిఆర్‌తోనే సాధ్యమైందంటూ, ఆ విశేషాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే…

                         తెలంగాణ సాధించి ఎండిన చెరువుల బాగు చేసి, కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టి, తెలంగాణ చుట్టూ రిజర్వాయర్లును చేపట్టి ఏక కాలంలో అటు ఎండిన బీళ్లకు, ఇటు తడారిన గొంతులను తడిపిన అపర భగీరధుడు కేసిఆర్‌. ఏక కాలంలో రెండు చేతులతో యుద్దాలు చేసిన అర్జునుడు ఎలా సవ్యసాచి అన్నారో…ఏక కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టి, సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన కేసిఆర్‌ కంటే గొప్ప విలుకాడు…ప్రకృతిని విల్లును చేసి, తెలంగాణ సమస్యలపై పోరాటం చేసి, విజయం సాధించిన విజయుడు కేసిఆర్‌. సాగు పలాలు, నీటి సంపదలు, విద్యుత్‌ వెలుగులు, సంక్షేమ కాంతులు అందించిన అభినవ సవ్యసాచి కేసిఆర్‌. తెలంగాణ సాధనతో, అతి తక్కువ కాలంలో తెలంగాణ రూపు రేఖలు మార్చిన కేసిఆర్‌ లాంటి గొప్ప దార్శనికుడు చరిత్రలో లేడు. భవిస్యత్తులో రాడు.

మోడు వారిన జీవితాలకు భరోసా కల్పించి, తెలంగాణ తెచ్చుకున్న జీవితాలకు వెలుగులు నింపి, వయసు పైబడిన వారికి ఆర్ధిక భరోసా కల్పించి, ఆసరా అందిస్తున్న తెలంగాణ పెద్ద కొడుకు కేసిఆర్‌. ఈ రోజు తెలంగాణలోని కుటుంబాలన్నీ చల్లగా వున్నాయంటే, ఆ కుటుంబల్లో కలతలు లేని సంసారాలు సాగుతున్నాయంటే, ముదిమి వయసు తల్లిదండ్రులకు వేళకు ముద్ద, తగిన గౌరవం దక్కుతున్నాయంటే కారణం కేసిఆర్‌ అందిస్తున్న ఆసరా ఫించన్లే…ఆ భరోసానే…దివ్యాంగుల జీవితాలకు ఓ దారి చూపి వారికి ఫించన్‌ను తెలంగాణ వచ్చాక రెండు వేలు, తర్వాత మూడు వేలు. ఇప్పుడు మరో వెయ్యి పెంచిన నాలుగువేలపదహార్లు ఇస్తున్న దేవుడు కేసిఆర్‌. పేదింటి పెళ్లికి పెద్దగా, కళ్యాణలక్ష్మి, షాదీ ముభారక్‌లతో ఆర్ధిక సాయం అందించి పెళ్లిచేస్తూ దీవిస్తున్న పెద్దన్న కేసిఆర్‌. కుల మతాల తేడా లేకుండా, పేదింటి ఆడబిడ్డ పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మి తెచ్చిన కళ్యాణ రాముడు కేసిఆర్‌. ఆ ఆడ పిల్ల తల్లిగా మారే క్షణం కడుపులో బిడ్డ పురుడు పోసుకున్న నుంచి బిడ్డ ప్రసవంతో ప్రపంచాన్ని చూసే వరకు ఆ బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేందుకు కేసిఆర్‌ న్యూట్రీషన్‌ కిట్‌, కేసిర్‌ కిట్‌ల పేరుతో తల్లీబిడ్డల ఆరోగ్య సంక్షేమం కేసిఆర్‌ రామరాజ్య పాలనకు నిదర్శనం. తెలంగాణ సాధించి దశాబ్ధ కాలం గడుస్తున్న వేళ ఇంత తక్కువ సమయంలో సాధించిన విజయాలు నభూతో నభవిష్యతి. తెలంగాన చిమ్మచీకట్లలో మగ్గిపోతూ, కరంటు మీద ఆధారపడి సాగే సాగుకు కరంటు లేక అల్లాడిన రోజులవి. ఆకాశంలో మబ్బు వైపు చూసి, చినుకు చుక్కను నమ్మిన విత్తు పండిరది లేదు. రైతు సంతోషపడిరది లేదు. కళ్లనిండా పంటను చూసింది లేదు. కరంటు అందక, బావులు, బోర్లు ఎండిపోయి ఎండిన పంటలను జీవితాలను దహిస్తున్నా, సాగు వదులుకోలేక రైతు విలవిలలాడిన నాటి శాపగ్రస్త తెలంగాణకు విముక్తి ప్రసాదించిన ముక్తి ప్రదాత కేసిఆర్‌. తెచ్చిన తెలంగాణకు కావాల్సినన్ని నీళ్లు తెచ్చాడు. తెలంగాణ అంతా నీటి గంగాళం చేశాడు. ఎక్కడ చూసినా నీటి పరవళ్లు తాండవించేలా కాలువల పరవళ్లు చూపించాడు. ఎటు చూసినా తెలంగాణ పచ్చని మాగాణం చేశాడు.

                         చినుకు పడిన వేళ రైతు చిన్న బోయి కూర్చోకుండా, ఎవరి ముందు చేయి చాచి అప్పు కోసం ఎదురు చూడకుండా, అఫ్పుల పాలు కాకుండా, రైతు బంధుతో ఆదుకుంటున్న తెలంగాణ పెద్ద రైతు అభినవ బాంధవుడు కేసిఆర్‌. కాలం వక్రీకరిస్తే రైతు భీమాతో ఆదుకుంటున్న ఆపద్భాందవుడు కేసిఆర్‌. ఎన్ని ఎకరాలు వున్నా, బుక్కెడు బువ్వకోసం ఏడ్చిన తెలంగాణ రైతుకు కన్నీటిని తూడ్చి ఆనందాన్ని పంచాడు. నీటిని, కరంటును ఇచ్చి సాగును పండగ చేశాడు. తెలంగాణ రైతులో సంతోషం నింపాడు. ఆనందాన్ని పంచిపెట్టాడు. వలసలు పోయిన వారిని తిరిగి తెలంగాణ పల్లెలకు రప్పించి సంపద సృష్టికర్తలను చేశాడు. తెలంగాణ పల్లెలను పరిపుష్టం చేశాడు. సంపద కేంద్రాలను చేశాడు. రైతులను రాజును చేశాడు. పల్లెలు వెలిగిపోయేలా సౌకర్యాలు కల్పించాడు. పల్లె ప్రగతితో పచ్చదనం, పట్టణ ప్రగతితో అభివృద్ది వేగవంతం చేశాడు. ఎక్కడిక్కడ తెలంగాణను అభివృద్ది కేంద్రం చేశాడు. విద్యా వ్యవస్ధలో నూతన ఒరవడిక శ్రీకారం చుట్టాడు. గురుకులాలను ఏర్పాటు చేసి, పేదలకు విద్యను మరింత చేరువ చేశాడు. చదువుకోలేని పేదలందరికీ విద్యను అందుకునేందుకు ఆశ్రయం కల్పించాడు. విద్య అందరి సొత్తు అన్నది నిజం చేస్తున్న విద్యావేత్త కేసిఆర్‌. ఆరోగ్య తెలంగాణ నిర్మాణం చేపడుతున్నాడు. తెలంగాణలో ఆరోగ్య విప్లవం సృష్టిసున్నాడు. పేదలందరికీ ఉచితంగా అతి ఖరీదైన వైద్యం అందేలా చేస్తున్న తెలంగాణ ధన్వంతరి కేసిఆర్‌. ఇలా చెప్పుకుంటూ పోతే కేసిఆర్‌ చేసిన అభివృద్దికి కొల మానం లేదు. సమయం చాలదు. 

ఆ ఆదర్శమూర్తి కేసిఆర్‌ పాలనలో కామారెడ్డిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ప్రజలకు అనేక సంక్షేమ ఫలాలు అందిస్తున్నాను. నన్ను నమ్మి గెలిపిస్తూ వస్తున్న ప్రజలను అయ్యప్ప స్వామి ఇరుముడిని నెత్తిన పెట్టుకున్నట్లు పెట్టుకొని చూసుకుంటున్నాను. తెలంగాణ అభివృద్ధిలో భాగంగా కామారెడ్డిని కూడా బంగారు తనకను చేస్తున్నాను. కేసిఆర్‌ ఆశీస్సులతో ప్రజల కష్టాలు అనేకం తీర్చాను. కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేశారు. చెరువులు దగ్గరుండి అభివృద్ధి చేయించాను. ఊళ్లను సస్యశ్యామలం చేయించాను. అందుకే కామారెడ్డి ప్రజల గుండెల్లో నేనే వున్నాను. ఒకనాడుకు సాగుకు కన్నీరొలికిన కామారెడ్డికి నీటిని తెచ్చి సాగు విప్లవం తెచ్చాను. ప్రతి రైతు కళ్లలో ఆనందం నింపాను. ఇంటింటికీ మిషన్‌ భగీరధ ద్వారా మంచినీళ్లు అందించాను. తెలంగాణలో ఏ నియోజకవర్గంలో కనిపించని డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టి, గూడు లేని పేదలకు అందించాను. మోడల్‌ గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టాను. చెరువులు బాగు చేయించి, నియోకవర్గంలో వున్న సమారు చెరువులకు పూర్వ కళ తెచ్చాను. ఇటీవల చెరువుల పండగను ఘనంగా జరుపుకున్నాము. ప్రతి పల్లెకు రోడ్లు వేయించాను. ప్రతి పల్లెలలో సిసి రోడ్లు వేయించాను. ప్రతి పల్లెను అనుసంధానం చేస్తూ తళతళ లాడే రోడ్లు నిర్మాణం చేయించాను. కామారెడ్డి పట్టణానికే కొత్త కళ తెచ్చాను. నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశాను. ప్రజల సమస్యలు తెలుసుకొని తీర్చాను. కామారెడ్డిని విద్యా కేంద్రం చేశాను. ఆధునిక వైద్యం అందుబాటులోకి తెచ్చాను. ముఖ్యమంత్రి కేసిఆర్‌ను కోరి కామారెడ్డి జిల్లా సాధించాను. కామారెడ్డి జిల్లాకు మెడికల్‌ కాలేజీ తెప్పించాను. ముఖ్యమంత్రి కేసిఆర్‌ అందుకు రూ.50 కోట్లు ప్రకటించారు. కామారెడ్డిని అభివృద్దికి కేరాఫ్‌ చేశాను. నాకు ప్రజల మీద విశ్వాసం..వారికి నాపై వున్న నమ్మకమే మళ్లీ నన్ను గెలిపిస్తుంది. తెలంగాణలో బిఆర్‌ఎస్‌ హాట్రిక్‌ సాధిస్తుంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆశీస్సులతో కామారెడ్డికి మరిన్ని అందాలు అద్దుతాను.

KLR focus on Malkajigiri : మల్కాజిగిరిపై కేఎల్ఆర్ దృష్టి… మంత్రులపై ఫోకస్‌!

 

కాంగ్రెస్ పార్టీ కీలక నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్)గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రాంత వాసులకి అత్యంత సుపరిచితులైన మన డైనమిక్ లీడర్. ప్ర‌స్తుతం ఆయ‌న‌ హై కమాండ్ ఆదేశాలతో ఎలక్షన్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఏక కాలంలో కేసీఆర్ క్యాబినెట్‌లోని ఇద్ద‌రు మంత్రులు, ఒక మాజీ మంత్రి నియోజకవర్గాలపై గురి పెట్టారు. ఈ మూడింట్లో ఏదొక నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయన బరిలోకి దిగుతారని కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి వలస వెళ్లిన సబితా ఇంద్రా రెడ్డి ప్రస్తుతం మహేశ్వరం ప్రాంతంలో సెగ్మెంట్‌లోని ఆమె ప‌నితీరు, లోటు పాట్లపై కేఎల్ఆర్ దృష్టి సారించారు. మంత్రిగా కూడా అధికారం వెలగబెడుతోన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు చేసిందేమీ లేదని తెలుస్తోంది. అలాగే, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మరో మంత్రి మల్లారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంపై కూడా ఫోకస్ చేస్తున్నారు. మేడ్చల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆయన రేయింబవళ్లూ సీఎం కేసీఆర్, కేటీఆర్ భజనలో తరిస్తుంటారు. జనానికి చేసిన మేలు మాత్రం అంతంతమాత్రమే. రానున్న ఎన్నికల్లో కేఎల్ఆర్‌ను మేడ్చల్ నుంచి కూడా అధిష్టానం బరిలో దింపవచ్చట.

ఇక తాండూరులో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి లేదా సిట్టింగ్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని కిచ్చన్నగారి లక్ష్మారెట్టి ఢీకొట్టే అవకాశం ఉంది. మాజీ మంత్రిపై ఉన్న వ్య‌తిరేకత‌తో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి పైలెట్ రోహిత్ రెడ్డిని ప్ర‌జ‌లు గెలిపించారు. అయితే, ఆప‌రేష‌న్ ఆకర్ష్‌లో భాగంగా రోహిత్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడ‌డంతో పార్టీ క్యాడెర్‌, ప్ర‌జ‌లు ఆగ్ర‌హంగా ఉన్నారు. ఒక‌వేళ కేఎల్ఆర్ ఇక్క‌డ నుంచి బ‌రిలోకి దిగితే కేసీఆర్ టీమ్‌లోని బలమైన నేతగా ఉన్న మహేందర్ రెడ్డికి క‌ష్ట‌కాలం త‌ప్ప‌దని వినికిడి. మొత్తానికి ఈ మూడు స్థానాల్లో కేఎల్ఆర్ ఎక్క‌డ నుంచి బ‌రిలోకి దిగిన‌ కాంగ్రెస్‌కు ఒక సీటు కన్ ఫర్మ్ అని తెలుస్తోంది.

డోలారోహన కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వధించిన – నారబోయిన రవి ముదిరాజ్

 

మునుగోడు – చౌటుప్పల్ మున్సిపాలిటీ తంగడపల్లి వాస్తవ్యులు చింతల రాజు – అశ్విని గార్ల కూతురు డోలారోహన కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వధించిన *బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ గారు.*

 

ఈ కార్యక్రమంలో మునుగోడు మండల వైస్ ఎంపీపీ అనంత స్వామి గౌడ్ గారు, బొల్లమోని శ్రీకాంత్ గారు, బండి చంటి గారు, బండి రాజు గారు, బిఆర్ఎస్ పార్టీ మునుగోడు మండలం ఆర్గనైజింగ్ సెక్రటరీ జెట్టి గణేష్ ముదిరాజ్ గారు, బిఆర్ఎస్ పార్టీ మునుగోడు పట్టణ సీనియర్ నాయకులు బండారు మల్లేష్ గారు, మరియు తదితరులు పాల్గొన్నారు.

నిజం..ఇజం..నేటిధాత్రి నైజం.

`నేటిధాత్రి అక్షరం నిజం పరిధి దాటలేదు.

`అబద్దాలు మోయలేదు..

` ఎవరికీ లొంగిపోలేదు.

`ఎంతటి వారైనా సరే తూర్పారపట్టకుండా వుండలేదు.

` మంచిని మంచిగానే చెబుతుంది.

`తప్పు చేస్తే చీల్చి చెండాడుతుంది.

` 19 ఏళ్లలలో ఆగింది లేదు..అలసట లేదు..

`తొందరపాటుకు గురికాలేదు..తొట్రుపాటు అసలేదు.

` నిజానికి నిజరూపం… నిజాయితీకి నిలువెత్తు అక్షరం.

` నిందలకు వెరవలేదు…నీతి మాలిన వాళ్లను వదలలేదు.

`కేసులకు భయపడలేదు.. అదిరింపులకు బెదరిపోలేదు.

` తప్పు చేస్తే అధికార పార్టీ నాయకులను ఏనాడు వెనకేసుకురాలేదు.

`ఎంతటి పలుకుబడి నేతలనైనా నిలదీయకుండా ఊరుకోలేదు.

` సూచనలిచ్చే చోట నచ్చచెప్పాం.

`ఎత్తి చూపే చోట హితవు పలికాం.

`వినకపోతే భవిష్యత్తు కూడా కళ్లకు కట్టినట్టు చెప్పాం.

` ఇప్పుడు రాజకీయంగా సతమతమౌతున్న వాళ్లకు ఎన్నో సలహాలిచ్చాం.

`నాడు నేటిధాత్రి చెప్పినా వినకపోతిమి అని మధనపడేవాళ్లను చూస్తున్నాం.

`అదీ నేటిధాత్రి అక్షరలెక్క..ఆచరించేవారికి ఎదురేదీ వుండదింక.

`అటు రాజకీయం.. ఇటు ప్రజాభిప్రాయం..భవిష్యత్తు కాలం.

` నేటిధాత్రి అక్షరంలో నిండిన వర్తమానం.

`డిప్యాక్‌ తోడుగా, నేటిధాత్రి అడుగుగా సాగుతున్న ఎదురులేని అక్షర ప్రయాణం.

`మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ముందే చెప్పింది నేటిధాత్రి.

` కర్ణాటక ఎన్నికల ఫలితాలు లెక్కలతో సహా ఖచ్చిత ఫలితమిచ్చింది.

`ఏ సర్వే సంస్థకు అందని లెక్కను కూడా పర్ఫెక్ట్‌ గా నేటిధాత్రి మాత్రమే చెప్పింది.

` ప్రజాభిప్రాయాన్ని సేకరించడంలో డి ప్యాక్‌ స్టైలే వేరని నిరూపించింది.

`సర్వే లలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.

`అంచనా లెక్కలు కాదు…అసలు సిసలు లెక్కలు చెప్పడం నేటిధాత్రి కే సాధ్యమౌతుంది.

 

హైదరబాద్‌,నేటిధాత్రి:               

అక్షరం తల్చుకుంటే ఆగేదేముంటుంది? చైతన్యం విచ్చుకుంటే ఎదురేముంటుంది? పోరాటం తల్చుకుంటే ఏదురేమి నిలుస్తుంది? ఉద్యమ ఉప్పొంగితే తట్టుకునే శక్తి ఎవరికుంటుంది? అన్నింటికీ అక్షరం బాసటగా నిలిస్తే విజయాలుకు అడ్డేముంటుంది? ఎదురీతకు నిలిచే ధైర్యం ఎవరికి వుంటుంది? అదీ అక్షరం గొప్పదనం. ఎందుకంటే నేటి ధాత్రి నిప్పు కణం. అగ్ని రణం. నేటిదాత్రి నిజాల దావానలం. మంచి చేస్తే వెలుగు పంచుతుంది. తప్పు చేస్తే దహించి వేస్తుంది. నిజం పరిధిని ఏనాడు నేటిధాత్రి దాటే ప్రయత్నం చేయలేదు. చేయదు కూడా. అబద్దాన్ని ఏనాడు మోయదు. దాన్ని దరి చేరనివ్వదు. కొందరు నేటిధాత్రి గురించి తెలిసీ తెలియక కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజాన్ని నిర్భయంగా చెప్పే నేటిధాత్రి మీద నిందల రంగులు పూయాలనుకుంటున్నారు. నిజం గడప దాటే లోపు అబద్దం ఊరు చుట్టి వస్తుందని సామెత. అలాగే నేటిధాత్రి ఏ ఒక్కరికో వంత పాడుతున్నట్లుగా, ఎవరి మేలు కోసమో పనిచేస్తున్నట్లు కొందరు అభిప్రాయ పడుతున్నారు. నేటిధాత్రిని పూర్తిగా అర్ధం చేసుకోలేకపోతున్నారు. అందుకే నేటిధాత్రి అంటే ఏమిటో చెప్పాల్సిన అవసరం మా పాఠకులకు చెప్పాలని అనుకుంటున్నాం. గత పందొమ్మిది సంవత్సరాలుగా నేటిధాత్రిని ఆదరిస్తున్నా, చూస్తున్న వారిని నేటిధాత్రి నైతిక విలువల గురించి పూర్తిగా తెలుసు. కాని కొత్త తరం పాఠకులకు చెప్పాల్సిన అవసరం వుందని గుర్తించి చెబుతున్నాం. నేటిధాత్రి నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ఏనాడు జంకలేదు. ఆలోచించలేదు. సమాజానికి మంచి జరుగుతుందనుకునే విషయాన్ని చెప్పకుండా ఊరుకోలేదు. సమాజానికి నష్టం అనుకున్న విషయాన్ని వెల్లడిరచకుండా ఆపలేదు. ఎందుకంటే ఎప్పుడూ, ఎట్టిపరిస్ధితుల్లోనూ నేటిధాత్రి అబద్దాన్ని మోయదు. దాన్ని దరి చేరనివ్వదు. ఇది మాత్రం నేటిధాత్రిని ఆదరించే పాఠకులకు చెప్పాలని అనుకున్నాం. 

నేటిధాత్రిపై పందొమ్మిది సంవత్సరాల సుథీర్ఘ ప్రయాణంలో బెదిరించాలని చూసిన వారున్నారు. భయపెట్టిన వారున్నారు. అదిరించాలని చూసి, దాడులకు దిగిన వారున్నారు. కార్యాలయం మీదకు వచ్చి ద్వంసం చేసే ప్రయత్నం చేసిన వారున్నారు. 

నేటిధాత్రి అక్షరాలు జీర్ణించుకోలేని అవినీతి పరులు, కబ్జాదారులు, అన్యాయాలు చేసేవారు మా సిబ్బందిపై పగలు, ప్రతీకారాలు పెంచుకున్న వారున్నారు. ఆఖరుకు నేటిదాత్రి ఎడిటర్‌నైన నాపైనే దొంగ దెబ్బ తీసే కుట్ర కూడా పన్నారు. అందులో ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా ఏదీ లేదు. నేటిధాత్రి చెప్పే నిజాలు నచ్చని వారు ఏ పార్టీకి చెందిన వారైనా సరే బెదిరించే ప్రయత్నం చేసినవారే…కేసులు నమోదు చేసిన వారే..అయినా నేటిదాత్రి అక్షరం జంకలేదు. మరింత అక్షరాలకు పదును పెంచుకున్నదే…కాని వణికిపోయింది లేదు. అక్షరం పారిపోయింది లేదు. ఎంతటి వారైనా సరే తప్పు చేస్తే తూర్పారపట్టకుండా వదిలేసింది లేదు. సమాజానికి మేలు చేసే వరకే ఎవరైనా? ఏ విషయంలోనైనా తప్పు అనిపిస్తే చాలు వారిని అక్షరాలతో కడగడం నేటిధాత్రి చేసే యజ్ఞం. అది దాదాపు అనేకమంది నాయకులకు తెలుసు. ఎందుకంటే మంచిని మంచిగానే నేటిదాత్రి విశ్లేషిస్తుంది. అవసరమైతే శబాష్‌ అని ముందుకు నడవాలని సూచిస్తుంది. తప్పు చేసిన వారిని చీల్చి చెండాడుతుంది. అందుకే ఈ పందొమ్మిదేళ్ల నేటిధాత్రి ప్రయాణంలో అలసట లేదు. అలుపు లేదు. అక్షరానికి విరామం లేదు. అక్షరం ఆపింది లేదు. కష్టానికి వెరవలేదు. సుఖానికి మురిసిపోలేదు. నేటిధాత్రికున్న పాఠకుల ఆదరణ ఇప్పటికీ చెక్కుచెదరలేదు. అదే మా నిబద్దత. నేటిధాత్రి తొందరపాటుకు గురైన సందర్భం లేదు. తొట్రపాటుకు గురైన సమయం లేదు. ఏదైనా ఒకటికి పది సార్లు ఆలోచించే అక్షరాన్ని రచిస్తాం. అచ్చువేస్తాం. ఎవరి మీద నిరాధారమైన ఆరోపణలు రాయం. అందుకే నేటిదాత్రిని నిజానికి నిజరూపం, నిజాయితీకి నిలువెత్తురూపం అని కొనియాడుతుంటారు. నేటిధాత్రి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన పత్రిక. పద్నాలుగేళ్లపాటు తెలంగాణ కోసం నిరంతరం అక్షర యజ్ఞం చేసిన పత్రిక. ఆనాడు పత్రిక నిర్వహణ అంటే ఎంత కష్టమో తెలిస్తే, ఇప్పుడు నేటిధాత్రి మీద జోకులు ఎవరూ వేయరు. తెలంగాణ కోసం ఆస్ధులు తాకట్టుపెట్టి, చివరకు ఆ అప్పులు తీరక అమ్ముకొని నిలబడిరదే నేటిధాత్రి. కాని ఏనాడు అక్షరం ఆగలేదు. సమాజంకోసం, సమాజ హితం కోసం, తెలంగాణ కోసం, వచ్చిన తెలంగాణ అభివృద్ధి భాగాస్వామ్యం కోసమే నేటిధాత్రి సాగుతోంది.

తెలంగాణ వచ్చిన తర్వాత కోటి ఆశలుంటాయి. వాటిని కూడా ప్రజలు అర్ధం చేసుకోవాలి.

 ఒక కుటుంబం వేరుపడితేనే కుదురుకోవడానికి కొంత సమయం పడుతుంది. అలాంటిది తెలంగాణ వచ్చిన మరునాడే కోరికలు తీరాలన్న ఆశలు చాలా మందిలో వుంటాయి. తెలంగాణ ప్రజల ఆశలు తీరాలనే తెలంగాణ ఉద్యమం జరిగింది. అన్నీ చక్కదిద్దుకునే క్రమంలో కొంత ఆలస్యమౌతుంది. కాని తెలంగాణలో అలాంటి పరిస్ధితి కూడా ఎదురుకాలేదు. అదే నేటిధాత్రి చెప్పేది. కాని దాన్నికొందరు వక్రీకరించి నేటిధాత్రిపై అవాకులు చెవాకులు పేలినవారున్నారు. అది తప్పు. నేటిధాత్రి కూడా ప్రభుత్వంలో కీలకభాగస్వాములైన కొందరు చేసే తప్పులను కూడా ఎండగట్టిన సందర్భాలు అనేకం వున్నాయి. తెలంగాణ కోసం పద్నాలుగేళ్లు కొట్లాడి, తెలంగాణ తెచ్చుకొని, నవ్వే వాడి ముందు పడిపోకూడదనే నేటిధాత్రి ఎప్పుడూ కోరుకునేది. అందుకే మా దారి ఎవరి కోసం మార్చుకోలేదు. ఎవరికీ మేం భజన చేయం. సూచనలు ఇవ్వాల్సిన చోట ఇస్తాం. ఎత్తి చూపాల్సిన చోట ఎత్తి చూపుతాం. హితవు చెప్పాల్సిన అవసరం వుంటే చెబతాం. వినకపోతే కూడా వారి రాజకీయ భవిష్యత్తు ఎలా వుంటుందో కూడా ముందు విశ్లేషించి కళ్లకు కట్టినట్లు చెబుతాం. అయినా వినక, ఇప్పుడు బాదపడుతున్నవారు ఎందరో…ఆనాడు నేటిధాత్రి చెప్పినా వినకపోవడం వల్లనే ఈ పరిస్ధితి వచ్చిందని చెబుతున్నవాళ్లను చూస్తున్నాం. 

               పోరాడితే పోయేదేమీ లేదు..అన్న సిద్దాంతాన్ని నమ్ముకొని తెలంగాణ ఉద్యమంలో మమేకమయ్యాం. తెలంగాణ సాధనలో మేము తురుపుముక్కలయ్యాం. మా అక్షర విజయం తెలంగాణ అని గర్వంగాచెప్పుకుంటాం. అలాగే రాజకీయ భవిష్యత్తును కూడా ఎప్పటికప్పుడు విశ్లేషించడంతో డిప్యాక్‌ సంస్ధతో కలసి, నేటిధాత్రి అందిచించిన సర్వేలు ఎక్కడా పొల్లుపోలేదు. గతం గురించి కన్నా, తాజాగా వర్తమానంలో మునుగోడు ఉప ఎన్నికలపై ఖచ్చితమైన లెక్క చెప్పింది ఒక్క నేటిధాత్రి మాత్రమే. ఇక కర్నాటక ఎన్నికల సమయంలో నేటిధాత్రి సంచలనం సృష్టించింది. గతంలోనే కాదు, ఇటీవల కాలంలో కూడా ఏ సర్వే సంస్ధ చెప్పనంత ఖచ్చితమైన లెక్కను చెప్పి నేటిదాత్రి సరికొత్త సర్వేలకు తెరతీసింది. కర్నాటకలో కాంగ్రెస్‌, బిజేపి, జేడిఎస్‌లు ఎన్ని సీట్లు వస్తాయన్నదానిపై అన్ని పార్టీలకు ఒక్కసీటు కూడా అటు, ఇటూ కాకుండా చెప్పిన ఏకైక సంస్ధ డీప్యాక్‌. బొంబాయి కేంద్రంగా మొదలైన డీ ప్యాక్‌ సర్వేలు నేటిదాత్రితో కలిసి సాగించిన అన్ని సర్వేలు ఒక సంచలనమే అని చెప్పకతప్పదు. అదీ నేటిధాత్రి నిబద్దత. అలాంటి నేటిదాత్రి ఎప్పుడూ నిజాలే చెబుతుంది. ప్రజా శ్రేయస్సే కోరుకుంటుంది. అది పాఠకులు తెలుసుకుంటే చాలు… మీ అందరికీ శనార్దులు.

భట్టికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవరు ప్రత్యేకంగా ఫోన్ చేశారో తెలుసా?

mallu bhatti vikramarka with rahul gandhi
తెలంగాణ ప్రజలు ఎప్పుడూ మరిచిపోలేని దుర్దినాలు… అప్పట్లో చంద్రబాబు పాలనలో ఉండేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం అరాచక పాలన, కరువుతో అల్లాడిపోయేది. తెలంగాణ కూడా ఇందుకు మినహాయింపు కాదు. నీటి చుక్క లేక జనం అల్లాడుతూ… కన్నీటి చుక్కలతోనే… తమ దాహం తీర్చుకునేటంతటి దుస్థితి! అదుగో అప్పుడు బయలుదేరాడు దివంగత కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి!
తన మనస్సుల్లాడే స్వచ్ఛమైన తెల్లటి పంచె, దానిపైన సంప్రదాయబద్ధమైన లాల్చీ, నెత్తిన రైతుల్ని తలపించే పాగా, కాళ్లకి స్పోర్ట్స్ షూసు… ఈ రూపం ఎక్కడ కనిపించిన మనకు పెద్దాయనే గుర్తుకు వస్తారు. అటువంటి సందర్భమే మరోసారి వచ్చింది తెలంగాణ నేలపై. అప్పుడు చంద్రబాబు లాగే ఇప్పుడు కేసీఆర్ అరాచక పాలన సాగుతోంది. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న తెలంగాణ ప్రజానీకానికి తొమ్మిదేళ్లుగా కన్నీళ్లే మిగిలాయి. వారి చెమర్చిన కళ్లు తుడవటానికే మనందరి జన నేత భట్టి విక్రమార్క పట్టుబట్టి బయలుదేరారు. వేయి కిలో మీటర్లు దాటి వంద రోజుల మైలు రాయిని త్వరలో చేరుకోబోతున్నారు!
ఆనాటి రాజశేఖర్ రెడ్డి లాగే ఇంటి నుంచీ బయలుదేరి నిర్విరామంగా జనం మధ్య గడుపుతోన్న భట్టికి జూన్ 15న ఆయన బర్త్ డే సందర్భంగా ఒక స్పెషల్ కాల్ వచ్చింది! అది మరెవరి నుంచో కాదు… ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చిన సోనియమ్మ తనయుడు దిల్లీ నుంచీ ఫోన్ చేశారు! భట్టికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన రాహుల్ గాంధీ పాదయాత్ర గురించి అడిగి తెలుసుకున్నారు. గల్లీ నుంచీ దిల్లీ దాకా చర్చగా మారిన పీపుల్స్ మార్చ్… రాహుల్ ను కూడా ఆకర్షించింది. జనం కోసం జన నేత భ్టటి విక్రమార్క చేస్తోన్న పోరాటం ఆయన చేత ఫోన్ చేయించింది. తెలంగాణలో సామాన్య జనం బాగోగుల గురించి ఆరా తీయించింది! ప్రజల కోసం ఆరాటపడుతోన్న నాయకుడికి అండగా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఉంటుందని ఆయన అన్నట్లు సమాచారం. మొత్తంగా భట్టి పాదయాత్ర ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ పార్టీలో చర్చగా మారింది! రాహుల్ నుంచీ ఫోన్ రావటంతో భట్టి విక్రమార్క మరింత ధృఢ సంకల్పంతో ఇక పై ముందుకు దూసుకుపోనున్నారు…

నిండైన గుణం..మేలైన నాయకత్వం.

`నారబోయిన రవిలో వుంది అసలైన సేవా గుణం.

`అందుకే ఆయనంటే అందరికీ ఇష్టం.

` పేదల బాధలు తెలిసిన నాయకుడు.

` వారి బాధలు పంచుకునే ఆత్మీయుడు.

` మునుగోడులో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ముందు తలుపుతట్టేది రవి ఇంటినే…

` బిఆర్‌ఎస్‌ లో రవి బలమైన బిసి నాయకుడు.

`మంత్రి జగదీష్‌ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడు.

` జిల్లాలో మంత్రికి అనుంగు అనుచరుడు.

` ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో వుండే నాయకుడు.

`మునుగోడు అభివృద్ధి కోసం అహర్నిశలు తపించే నాయకుడు.

` మునుగోడు ప్రగతి కోసం నిర్విరామ కృషి చేస్తున్న నాయకుడు.

`ప్రజల మనసెరిగిన నేత.

` భవిష్యత్తు మునుగోడు ప్రజానేత.

` బిఆర్‌ఎస్‌ టిక్కెట్‌ దక్కనున్న బిసి నేత.

` రవికే అన్ని వర్గాల చేయూత..

` సమస్యలు లేని మునుగోడు నిర్మాణమే రవి కల.

`అన్ని రంగాలలో మునుగోడు అభివృద్ధి జరగాలనేదే రవి ఆకాంక్ష.

హైదరబాద్‌,నేటిధాత్రి:  

మన సమాజంలో మాటలు చెప్పే నాయకులు చాలా మంది వుంటారు. సేవ అనగానే దూరం పారిపోయేవారు కూడా వుంటారు. కేవలం రాజకీయాల కోసమే పనిచేసేవారు మరికొందరుంటారు. కాని మునుగోడు బిఆర్‌ఎస్‌ నాయకుడు నారబోయిన రవి లాంటి నాయకులు అతి తక్కువగా వుంటారు. రవి సేవాభావం నిండుగా వున్న నాయకుడు. ప్రజలకు ఏ ఆపదవచ్చినా వెంటనే స్పందించే నాయకుడు. ఏ అర్ధరాత్రి తలుపుతట్టినా నేనున్నాని భరోసా కల్పించే నాయకుడు. ప్రజాసేవలో నిమగ్నమైన నాయకుడు. ప్రజలంటే ప్రేమ కల్గిన నాయకుడు. అందుకే రవి నాయకత్వం కావాలని మునుగోడు బలంగా కోరుకుంటోంది. ప్రజలు ఎంతో ఆసక్తిగా రవి నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో బిఆర్‌ఎస్‌ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అని ఆసక్తి కనబర్చుతున్నారు. అటు ప్రజలు ,ఇటు మునుగోడు బిఆర్‌ఎస్‌ ముఖ్య నేతలందరూ రవి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. ఈసారి ఎట్టిపరిస్ధితుల్లోనూ రవికే టిక్కెట్‌ ఇవ్వాలని ముక్తకంఠంతో కోరుతున్నారు. బిఆర్‌ఎస్‌ నాయకులే కాదు, ఏ పార్టీకి చెందిన నాయకులు నలుగురు ఒక చోట చేరినా, సరే నారబోయిన రవి గురించే చర్చించుకుంటున్నారు. ఆయన నాయకత్వం గురించి చర్చించుకుంటున్నారు. ఈసారి బిఆర్‌ఎస్‌ తరుపున నారబోయిన రవి ఎన్నికల బరిలో నిలిస్తే మిగతా పార్టీల పరిస్దితి ఎలా వుంటుందా? అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే రవి మునుగోడు నియోజకవర్గంలో బలమైన నాయకుడు. ఆయన రాజ్‌గోపాల్‌రెడ్డి లాంటి నాయకుడిని కూడా ఎదుర్కొగల సత్తా వున్న నాయకుడు. గత ఉప ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే కూసుకుంట్లకు ఇంటా, బైట నేతలందరూ ప్రచారం నిర్వహించాల్సివచ్చింది. మరి సార్వత్రిక ఎన్నికలంటే ఎమ్మెల్యే అభ్యర్ధి ఎంతో జన బలం కల్గిననేతై వుండాలి. కూసుకుంట్ల ఆ విషయంలో చాలా వెనుకబడి వున్నాడన్న సంగతి గత ఎన్నికల్లోనే తేలిపోయింది. కాకపోతే ముఖ్యమంత్రి కేసిఆర్‌ మరోసారి ఉప ఎన్నికల్లో కూసుకంట్లకు అవకాశం కల్పించారు. అందులో దాగి వున్న మర్మం కూడా అందరికీ తెలిసిందే. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూసుకుంట్ల టిక్కెట్‌ అడక్కుండా వుండేందుకే ఉప ఎన్నికల్లో ఆయనకు అవకాశం కల్పించారన్నది భహిరంగ రహస్యమే. అందుకే ఉప ఎన్నికలు పూర్తయి తర్వాత నుంచి పార్టీ ఆదేశాల మేరకు నారబోయిన రవి నియోజకరవర్గంలో అనేక సంక్షేమ సేవా కార్యక్రమాలు విసృతంగా చేపడుతున్నారు. పార్టీ నుంచి ఇప్పటికే పూర్తి స్ధాయి సూచనలు అందినట్లు కూడా సమాచారం. అందుకే రవి ఏ పనిచేసినా పార్టీ నుంచి పూర్తి స్ధాయి అనుమతులున్నట్లు పార్టీవర్గాలు చెప్పుకుంటున్నాయి. అందులో భాగంగానే మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా నారబోయిన రవి నాయకత్వం గురించి వాల్‌ రైటింగ్స్‌ విసృతంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా రవి గురించి ప్రచారమే దర్శనమిస్తోంది. ఏ గోడచూసినా రవి నాయకత్వం గురించే చెబుతున్నట్లు వుంది. ఇక బిఆర్‌ఎస్‌ నాయకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మెజార్టీ సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జడ్పీటిసీలు, ఇతర నాయకులు, కార్యకర్తలు పూర్తి స్ధాయిలో రవి నాయకత్వాన్నే బలపర్చుతున్నారు. రవి ఎట్టిపరిస్దితుల్లో ఈసారి ఎమ్మెల్యే కావాలని కోరుతున్నారు. ఎందుకంటే కూసుకుంట్ల అటు ఎమ్మెల్యేగా, ఇటు నాయకుడిగా పూర్తి స్ధాయిలో విఫలం చెందారని సొంత పార్టీ నేతలే భహిరంగంగా చెప్పుకుంటున్నారు. 

ఇక ఉప ఎన్నికల సమయంలోనే కూసుకంట్ల వైపు పార్టీ అదిష్టానం మొగ్గు చూపుతోందన్న విషయం తెలిసిన వెంటనే నియోజకవర్గ స్ధాయి నాయకులంతా ఏకమై, కూసుకుంట్లను వ్యతిరేకిస్తూ, అనేక సమావేశాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 

అంటే ఆ స్ధాయిలో ఆనాడే ఆయనపై తీవ్ర వ్యతిరేకత వుంది. మరి ఇప్పుడు ఆ వ్యతిరేకత మరింత రెట్టింపైంది. ఉప ఎన్నికల్లో ఓడిపోయిన రాజగోపాల్‌రెడ్డి మరింత కసిగా వున్నారు. ఓడిపోయిన నాడే శపథం కూడా చేశాడు. అంటే వచ్చే ఎన్నికలు రాజగోపాల్‌రెడ్డికి చావో రేవో అన్నట్లుగానే సాగుతాయి. అలాంటప్పుడు ఆయనను బలంగా ఢీ కొనగలిగే నాయకుడు కావాలి. అది కేవలం రావి మాత్రమే అన్నది మునుగోడు నియోజకవర్గం మొత్తంచెప్పుకుంటున్న మాట. బిఆర్‌ఎస్‌లో చాలా మంది సిట్టింగ్‌ ఎమ్యెల్యేలను మర్చే యోచన ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేస్తున్నాడన్నది తెలుస్తున్న విషయమే. అందులో మునుగోడు ఖచ్చితంగా వుండే నియోజవర్గమే. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిపై ప్రజల్లో ఎలాగూ సదాభిప్రాయం లేదు. నాయకుల్లో నమ్మకం లేదు. ఆయన నాయకత్వమంటే విశ్వాసమే లేదు. మరోసారి కూసుకంట్లను కావాలని ఎవరూ కోరుకోవడం లేదు. కొత్త ఓటర్ల దగ్గర నుంచి బిఆర్‌ఎస్‌ పార్టీ అంటే ఎంతో ప్రేమ వున్న నాయకులందరూ కోరుకుంటున్న ఏకైక వ్యక్తి నారబోయిన రవి. ఆయనను కాదని , ఎవరిని ప్రజల మీద రుద్దినా పార్టీకి నష్టమే అన్న అభిప్రాయమే వినిపిస్తోంది. అంతే కాదు కూసుకుంట్ల విషయంలో మాత్రం తీవ్ర వ్యతిరేకత వున్న సంగతి తెలిసిందే. ఉప ఎన్నికల్లో అంటే పార్టీ యంత్రాంగంమంతా పనిచేయడం గమనార్హం. అయినా ఆనాడే ఏ బిఆర్‌ఎస్‌ నాయకుడు మనస్పూర్తిగా కూసుకుంట్లకు పనిచేయలేదు. కాని పార్టీ మీద వున్న నమ్మకంతో, విశ్వాసంతో, ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వం, మంత్రి కేటిఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి పేరు నిలపడం కోసమే అందరూ కూసుకంట్లకు పనిచేశారు. కాని ఈసారి కూసుకుంట్ల వద్దే వద్దు అని ఎప్పటినుంచో పార్టీకి చెబుతున్నారు. ఉప ఎన్నికల సమయంలో కూసుకుంట్లకు పనిచేయడం ఇదే ఆఖరు సారి అని కూడా తేల్చిచెప్పినట్లు సమాచారం. 

  మునుగోడు వ్యవహారం ముందుగానే తేల్చాలని ప్రజలు కోరుతున్నారు.

 బిఆర్‌ఎస్‌ శ్రేణులు కూడా పట్టుబడుతున్నారు. నారబోయిన రవిలో అసలైన సేవా గుణం వున్న నాయకత్వం వుంది. అందుకే ఆయనంటే ప్రజలకు కూడా ఎంతో ఇష్టం. అది రవికి ఎంతో ప్లస్‌ పాయింట్‌ అని చెప్పకతప్పదు. నారబోయిన రవి పేదల బాధలు తెలిసిన నాయకుడు. వారి బాధలు పంచుకునే ఆత్మీయ నాయకుడు. మునుగోడులో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ముందు రవి ఇంటి తలుపు తట్టేవారే ఎక్కువ. బిఆర్‌ఎస్‌లో రవి బలమైన నేత. సామాజిక నేపద్యం అండగా వున్న నేత. ముఖ్యమంత్రి కేసిఆర్‌, మంత్రి కేటిఆర్‌, జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి ఆశీస్సులున్న ఏకైక నాయకుడు. జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డికి ఎంతో నమ్మకస్తుడు. అనుంగు అనుచరుడు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో వుండే నాయకుడు. మునుగోడు అభివృ ద్దికోసం నిరంతరం తపించే నాయకుడు రవి. మునుగోడు అభివృద్ది కోసం నిర్విరామ కృషి చేస్తున్న నాయకుడు. ప్రజల మనసెరిగిన నేత. మునుగోడులో ఆసారి బిఆర్‌ఎస్‌ టిక్కెట్‌ దక్కనున్న బిసి నేత నారబోయిన రవి. ఎందుకంటే బిసిలలో అన్ని సామాజిక వార్గల చేయూత వున్న ఏకైక నేత కూడా రవే కావడం ఆయన అదృష్టం. సమస్యలు లేని మునుగోడు నిర్మాణమే రవి కల. ఆ కల నేరవేర్చేందుకు సరైన నాయకుడు రవి అనే ప్రజలు నమ్ముతున్న మాట. అన్ని రంగాల్లో మునుగోడు అభివృద్ది జరగాలంటే రవి నాయకత్వమే కావాలని అందరూ కోరుకుంటున్నారు. రవి ఎమ్మెల్యే కావాలని ఆకాంక్షిస్తున్నారు. దీవిస్తున్నారు.

ఆరోగ్య తెలంగాణ. తెలంగాణలో వైద్య విప్లవం.

తెలంగాణ ప్రజలకు అందుతున్న ప్రభుత్వ వైద్యం గురించి, దశాబ్ద కాలంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెచ్చిన వైద్య విప్లవం గురించి బిఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ఖైరతాబాద్‌ ఇంచార్జ్‌ మన్నె గోవర్ధన్‌ రెడ్డి నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న అభిప్రాయాలు… ఆయన మాటల్లోనే…

`తెలంగాణ తెచ్చిన ఉద్యమకారుడు కేసిఆర్‌ అపూర్వ సృష్టి.

`తెలంగాణ కు నీళ్లొచ్చినయ్‌.

`తెలంగాణ కు నిరంతర కరంటు వచ్చింది.

` కోతలతో తల్లడిల్లిన తెలంగాణలో కరంటు విప్లవం.

` మన నిధులతో విద్యా రంగంలో గొప్ప ఆవిష్కరణలు.

` గురుకులాల ఏర్పాటుతో ఉచిత విద్యకు మోక్షం.

`ఇప్పుడు వైద్యరంగం వంతు.

` గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాలలో మెరుగైన వైద్య సదుపాయాలు.

` ఊళ్లలో పల్లె దవఖానాలు.

`పట్టణాలలో బస్తీ దవాఖానాలు.

` ప్రతి జిల్లాలో వైద్య కళాశాలలు.

` వరంగల్‌ లో 2500 బెడ్లతో కొత్త ఆసుపత్రి.

` హైదరాబాదు నలువైపులా నాలుగు ఆసుపత్రులు.

` నిమ్స్‌ కు మరో మణిహారం…విస్తరణతో మరొ కొత్త భవనం.

` కేసిఆర్‌ నిమ్స్‌ దీక్ష లోనే తెలంగాణ ప్రకటన వచ్చింది.

`కేసిఆర్‌ పాలనలో నిమ్స్‌ కు మహార్థశ పట్టనుంది.

`మరో 2000వేల బెడ్ల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన.

` దశాబ్ది ఉత్సవాల వేళ వెలిగిపోతున్న వైద్య రంగం.

` పేదలందరికీ అందుబాటులో ఉచిత వైద్యం.

`తల్లి, బిడ్డల సంక్షేమం.

` కేసిఆర్‌ కిట్‌ తో రేపటి తరానికి సంపూర్ణ ఆరోగ్యం.

`నవ తరం ఆరోగ్యానికి కేసిఆర్‌ పాలన కొండంత ధైర్యం.

`అటు హరీష్‌ రావు, ఇటు కేసిఆర్‌ పేదల వైద్యానికి భరోసా.

` ప్రభుత్వ ఉచిత వైద్యానికి తెలంగాణ అడ్డ.                 

హైదరబాద్‌,నేటిధాత్రి:   

తెలంగాణ ఈ పదమే ఒక ఉద్యమం…ఒక విప్లవం. ఒక ప్రశ్న. ఒక నిలదీత. ఒక వేధన. ఒక ఆందోళన. ఒక శక్తి. ఒక ఆర్తి. ఒక కీర్తి. వీటన్నింటినీ ఏకం చేసి తెలంగాణ సాధించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌. ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిననాడు ఎక్కడున్నారో కూడా తెలియని వాళ్లు కూడా ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉనికి తెలియని వాళ్లు, తెలంగాణ ఆన వాళు తెలియని వాళ్లు, తెలంగాణ గోస తెలియని వాళ్లు కూడా తెలంగాణపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. అయినా కేసిఆర్‌ ప్రశ్న కొత్తది కాదు. కేసిఆర్‌కు ప్రశ్నలు కొత్తవి కాదు. తెలంగాణ వస్తే ఏమెస్తది,ఏమెస్తది అని ప్రశ్నించిన వారికి తెలంగాణ వ్యవసాయ విప్లవం కళ్లముందు కదలాడుతోంది. కాళేశ్వరం నిర్మాణం కళ్లముందు కనిపిస్తోంది. రేపటి బంగారు తెలంగాణ కళ్లముందు కదలాడుతోంది. ఇదే నేటి తెలంగాణ. బంగారు తెలంగాణ. పచ్చని మాగాణగా, మారి కోటినన్నర ఎకరాల సాగు తెలంగాణ ఏర్పడిరది. ఇప్పుడు దిగుబడుల్లో విప్లవం తీసుకొచ్చింది. రైతుల ఆశల పండిస్తోంది. మన ముఖ్యమంత్రి కేసిఆర్‌ మన వెనక వున్నారన్న భరోసా ప్రతి రైతులో నిండిరది. ఆ నమ్మకమే రైతుల్లో కోటి ఆశలు నెరవేర్చుతోంది. కూలీ నాలి చేసుకునేందుకు వలసలు వెళ్లిన, కుటుంబాలకు దూరమైన, ఊరును ఏళ్ల తరబడి చూడలేకపోయిన వారంతా తెలంగాణ పల్లె జీవనంలో మమేకమయ్యారు. పల్లె సీమలో గొప్ప జీవితాలు అనుభవిస్తున్నారు. గర్వంగా మన తెలంగాణ అని చెప్పుకుంటున్నారు. నాకేం తక్కువ అన్నంత ధీమా రైతు వ్యక్తంచేస్తున్నాడు. అప్పుచేయాల్సిన పని లేదిక. ఎరువులు అందవన్న ఆందోళన లేదు. నకిలీ విత్తనాల బెడదలేదు. సకాలంలో వర్షాలు పడడం లేదన్న దిగులు లేదు. కరంటు ఎప్పుడొస్తుందా అని రాత్రిళ్లు, బావుల దగ్గర నిద్రలు పోవాల్సిన పనిలేదు. పగటి పూట ఎంత నీరు సమృద్ధిగా వుంటే ఎంత సమయమైనా నీటి పారకంతో పంట దిగుబడులు మారకాలౌతున్న కాలమిది. ఉద్యమకారుడు కేసిర్‌ పాలనిది. మూడు ముఖ్యమైనసమస్యల్లో ఒకటైన నీటి వనరులు అందేందుకు, చేయాల్సిన పనులన్నీ చేసి పెడుతున్నాడు. ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరంటు, సాగునీరు, పెట్టుబడి, అన్నీ తానై రైతుకు అండగా నిలుస్తున్నారు. అభివృద్ధిపై ఆర్తి, భవిష్యత్తుపై స్పూర్తి వున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌. వేసే అడుగు, ఇచ్చే మాట, చేసే పని అన్నది మాత్రమే ఆలోచించే ఏకైక నాయకుడు ఆయన. అందుకే నమ్మకం లేని చోట నమ్మకాన్ని నిర్మించి, తెగించి తెలంగాణ తెచ్చిన ఉద్యమశీలి. బంగారుతెలంగాణకు బాటలు వేస్తున్న అభినవ రాజకీయ శిల్పి. కేసిఆర్‌ గురించి చెప్పాలంటే ఎప్పుడు మాట్లాడుకున్నా మొదటి పేజీనుంచి చెప్పుకుంటే గాని తృప్తి వుండదంటారు. అంతటి స్పూర్తివంతమైన రాజకీయ జీవితాన్ని అనుసరించి, అనుభవించి, పాలించి చూపించిన నాయకుడు ఒక్క కేసిఆర్‌ మాత్రమే. అంటున్న తెలంగాణ ఉద్యమ నాయకుడు, బిఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు మన్నె గోవర్ధన్‌రెడ్డి , నేటిధాత్రి ఎడిటర్‌కట్టారాఘవేంద్రరావుతో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రగతిపై చెప్పిన విషయాలు..ఆయన మాటల్లోనే…

సహజంగా ఎవరైనా రాజకీయాల్లో ఎదిగి, ఓట్లు, సీట్లు అన్నది మాత్రమే చూసుకొని పాలన సాగించిన వారే ఎక్కువ.

 కాని తన కలగని, ప్రజలచేత నినాదమై, తెలంగాణ ఉద్యమానికి నిర్మాణమై, లక్షలాది మంది కేసిఆర్‌లను తయారు చేసి, కోట్లాది గొంతుకై తెలంగాణ సాధించి, పాలిస్తున్న నాయకుడు ఒక్క కేసిఆర్‌. చరిత్రలో పేజీకోసం చూసే నాయకులు కొందరైతే, చరిత్రే తానుగా తీర్చిదిద్దుకునే నాయకులు కొందరే…అందులో తొలి వరుసలో వుండేది ఒక్కడే. తెలంగాణలో ఆయనొక్కడే. పద్నాలుగేళ్ల సుధీర్ఘ ఉద్యమ ప్రయాణంలో, పోరాట దారిలో కేసిఆర్‌ వున్నాడనే ధీమా ప్రతి ఒక్కరిలో కలిగించి, కదిలించిన నాయకుడుగా చరిత్ర ఆయనకు దాసోహమనక మానదు. తెలంగాణను చిరస్థాయిగా, చిరస్మరణీయం చేసినందునే తెలంగాణ ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకున్నారు. పాలనకు సరైన దారులు వేస్తారని నమ్మారు. ఆనాడైనా, ఈనాడైనా అదే దారి, అదే ఆర్తి, ఆదే సూర్తి… నిన్నటి ఉద్యమ ఆకాంక్ష నిత్యమై, సత్యమై ఎలా ముందుకు తీసుకెళ్లారో నేడు అభివృద్ధిని కూడా నిత్యవసంతం చేయాలన్న తపనతో ఆయన సాగుతున్నారు. అందుకే మట్టి విలువ, నీటి విలవ ఆయనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదనే చెప్పాలి. సహజంగా ఏ నాయకుడైనా ఉద్యమ పంధాలో వున్నప్పుడు, ఆ గెలుపే లక్ష్యంగా సాగినా, మరే దానిపై వ్యాపకం వుండకపోవచ్చు. కాని తెలంగాణ సాధన అన్నది ఏనాటికైనా సాధ్యమయ్యేదే అని బలంగా నమ్మి, భవిష్యత్తు తెలంగాణకు ఎలా పునాదులు నిర్మాణం చేపట్టాలని ఉద్యమ కాలంలోనే రచించిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. 

తెలంగాణ సాధించిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయన పాలనాపరమైన అడుగు ఎంతో ముందు చూపుతో, భివిష్యత్‌ తరాలను దృష్టిలో పెట్టుకొని వేస్తున్నారు.

 అందుకే అన్ని రంగాల్లో అనతి కాలంలోనే తెలంగాణ అధ్భుతమైన విజయాలు సాధింస్తోంది. సాగు రంగంలో ఒకనాడు తిండి గింజలు పండితే చాలు దేవుడా అనుకున్న తరుణం నుంచి తెలంగాణ అన్న పూర్ణగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌ది. సాగుకు నీరు కావాలని అప్పటి ఉమ్మడి పాలకులను ఎంత వేడుకున్నా తెలంగాణలో ఎత్తిపోతలు ప్రభుత్వానికి తీవ్రభారమని, రైతు శ్రేయస్సును కూడా కాదని, ప్రజలు ఆకలితో అలమటస్తున్నా పట్టించుకోని రోజులవి. కాని నేడు ఏ పాలకులు తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం కష్టమన్నారో అక్కడే కాళేశ్వరం లాంటి గొప్ప నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తిచేసి, రైతులకు నీళ్లందిస్తున్న అపర భగీరధుడు కేసిఆర్‌. ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం తెలంగాణనే సంక్షేమ రాష్ట్రంగా విరాజిల్లేలా చేసిన గొప్ప సంస్కర్త కేసిఆర్‌. అదే వరసలో తెలంగాణలో వైద్య విప్లవం సృష్టించిన నాయకుడు కేసిఆర్‌. ఒకప్పుడు తెలంగాణలో ప్రభుత్వ వైద్యమంటే పెద్ద నగరాలకే పరమితమైన సౌకర్యం. కాని నేడు ఊళ్లలో పల్లె దవఖానాలు పెద్దఎత్తున ఏర్పాటు చేసి, పేదలకు ఉచిత వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఇక ప్రతి జిల్లాలోనూ వైద్య కళాశాల ఏర్పాటుతో మెరుగైన, మేలైన, అత్యవసర వైద్యానికి హైదరాబాద్‌ వరకు రాకుండా అక్కడికక్కడే వైద్యం అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే చాలా జిల్లాల్లో వైద్య కళాశాలల నిర్మాణాలు పూర్తిచేసుకొని వైద్యం అందుబాటులోకి వచ్చింది. త్వరలో మిగతా జిల్లాల్లోనూ వైద్యకళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. గతంలో ఒక్క వైద్య కళాశాల ఇవ్వడానికి కూడా ఉమ్మడి పాలకులు అంగీకరిచలేదు. ఇక వరంగల్‌లో 2500 పడకలతో అధునాతమైన ఆసుపత్రి, 24 అంతస్ధులతో నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. దసరా నాటికి ఆ ఆసుపత్రి ప్రజలకు అందుబాటులో రానున్నది. ఆ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే వరంగల్‌లో ప్రభుత్వ వైద్యమే తప్ప, ప్రైవేటు వైద్యం కనిపించకోవచ్చు. ఇక హైదరాబాద్‌కు నలువైపుల నాలుగు మల్లీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఆ ఆసుపత్రులతో పేద ప్రజలకు ఎంతో ఖరీదైన వైద్యం కూడా ఉచితంగా అందేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇదిలా వుంటే తెలంగాణ ఉద్యమానికి సాక్షిగా నిలిచిన నిమ్స్‌కు మహార్ధశ పట్టనుంది. ఎక్కడైతే ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణ కోసం దీక్ష చేపట్టి, తెలంగాణ సాధించారో ఆ ఆసుపత్రికి మరో మణిహారంగా కొత్తగా 2000 పడకల నూతన భవనం నిర్మాణం జరగనుంది. ఆ భవననిర్మాణానికి నేడు ముఖ్యమంత్రి కేసిఆర్‌ భూమి పూజ చేయనున్నారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో వైద్య రంగంలో తెలంగాణను అగ్రగామిగా మార్చి, పేదలకు ఉచిత వైద్యం అందుబాటులోకి తెచ్చి, ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణలో ఆరోగ్య విప్లవాన్ని సృష్టించారు.

రవి కే టికెట్‌ ఖరారు!

-రవి వస్తేనే మునుగోడు అభివృద్ధి.

-మునుగోడు ప్రజల అభివృద్ధే రవి ధ్యేయం.

-అనేక సామాజిక కార్యక్రమాలతో ప్రజలకు సేవలు.

-రవి ముదిరాజ్‌ కే ప్రజల దీవెనలు.

-ఎవరికి ఆపద వచ్చినా ఆదుకునే ఆపద్భాందవుడు.

-బలమైన ముదిరాజ్‌ సామాజిక వర్గ నేపథ్యం.

-మునుగోడు ఈసారి బిసిలకే…టికెట్‌ రవికే!

-ప్రజలంతా కోరుకుంటోంది రవినే…

-డి. ప్యాక్‌, నేటిధాత్రి సంయుక్త సర్వేలో తేలిందిదే.

-మెజారిటీ ప్రజలు రవి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు.

-పొరపాటున కూడా కూసుకుంట్ల వద్దంటున్నారు.

-బిసిలలో ఐక్యత సాధించే నాయకుడు రవి.

-బిఆర్‌ఎస్‌ నేతలు, బిసిలంతా ముక్త కంఠంతో కోరుకుంటోంది రవినే.

-మునుగోడు ముందటపడాలంటే రవే రావాలి.

-మునుగోడు అభివృద్ధి జరగాలి.

-ఇదే జనం చెప్పుకుంటున్న మాట.

-సామాన్యుల బాధలు తెలిసిన నేత రవి.

-కష్టపడి పైకొచ్చిన ఆదర్శనేత రవి.

-మునుగోడు వెలగాలంటే రవి రావాలి…మునుగోడు ప్రగతిలో దూసుకుపోవాలి.

-బిఆర్‌ఎస్‌ కు ఎదురులేదు…రవి నాయకత్వానికి తిరుగులేదు.

-పార్టీ కోసం, ప్రజల కోసం పని చేసే నాయకుడు రవి.

హైదరబాద్‌,నేటిధాత్రి:               

గొప్పను గొప్పగా చెప్పాల్సిన తరుణాన్ని గొప్పగానే చెప్పాలి. ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న మునుగోడు ముద్దుబిడ్డ నారబోయిన రవి ముదిరాజ్‌ గురించి నిజమే చెప్పాలి. నిజాన్ని ప్రజలందరికీ తెలియజేయాలి. ఆయనకు ప్రజలంటే ప్రాణం. ప్రజా సేవ చేయడం ఇష్టం. తాను కష్టపడి సంపాది ంచిన దానిలో ఆపదలో వున్నవారిని ఆదుకునేందుకు ఖర్చు చేయడం గొప్ప గుణం. ప్రజల అవసరాలు తీర్చి, వారికి మేలు చేయడం ఎంతో ఇష్టం. తమ ప్రాంతాన్ని గొప్పగా అభివృద్ది చేయాలని ఇష్టం. గొప్పగా అభివృద్ది చెందాలని కోరుకోవడం ఆయన నైజం. తమ ప్రాంతాభివృద్ధిలో తన పాత్ర వుండాలనుకోవడం ఇష్టం. నాయకుడిగా ప్రజలు మరింత సేవ చేయాలన్నది ఆయనకు ఇష్టం. ముఖ్యమంత్రి కేసిఆర్‌ అంటే ఎంతో ప్రాణం. ఆయన పాలనంటే ఎంతో ఎంతో ఇష్టం. ఉద్యమకారుడిగా తెలంగాణ సాధకుడిగా యుగపురుషుడిగా ఆయనను కొలవడం ఇష్టం. ముఖ్యమంత్రి కేసిఆర్‌ సంక్షేమ పాలన అంటే మరీ ఇష్టం. మంచినీటికి కూడా గోస పడ్డ మునుగోడుకు అందరికంటే ముందే మంచినీళ్లు ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ అంటే ఎనలేని ఇష్టం. అలాంటి ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనతో, తాను కూడా ప్రజలకు సేవ చేయాలని రవికి ఇష్టం. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆశీస్సులతో తమ ప్రాంత అభివృద్ది తన చేతుల మీదుగా మరింత జరగాలన్నది రవి కోరుకుంటున్న ఇష్టం. మంత్రి జగదీశ్‌రెడ్డి అనుచరుడిగా రాజకీయాల్లో మరింత రాణించాలన్నది ఎంతో ఇష్టం. ముఖ్యమంత్రి కేసిఆర్‌, మంత్రి జగదీశ్‌రెడ్డిల ఆశీస్సులతో జరుగుతున్న అభివృద్ది మరింత జరగాలని, మునుగోడు అన్ని రంగాల్లో ముందుండాలని ఇష్టం. సామాజిక బాద్యతలో ప్రజాసేవలో వున్న రవి ప్రత్యక్ష్య రాజకీయాల్లో ప్రజా రాజకీయాల్లో ప్రజా భాగస్వామ్య రాజకీయాల్లో కీలకం కావాలని ఆయన అభిమానలకు ఇష్టం. మొత్తంగా మునుగోడు నియోజకవర్గంలో ఎవరిని అడిగినా ఇదే మాట…ఎవరు చెప్పినా ఇదే మాట…ఎవరిని కదిలించినా చెబుతున్నది ఒకే మాట..మాకు ఈసారి రవి ఎమ్మెల్యే కావాలని, ఆయన నేతృత్వంలో మునుగోడు మరింత పరుగులు పెట్టాలని…

 వ్యాపార రంగంలో ఎంత బిజీగా వున్నా ప్రజలకు చేరువగా వుండడం రవికి ఎంతో ఇష్టం.

ఎందుకంటే తమ ప్రాంతం మీద ఎంతో మక్కువ వున్న నాయకుడు రవి. మునుగోడులో బిసి సామాజిక వర్గాల ప్రాబల్యం ఎక్కువ. అయినా ఇప్పటి వరకు రెడ్డి రాజకీయం తప్ప, బిసిల రాజకీయం సాగలేదు. కాలం మారింది. తెలంగాణ వచ్చింది. బిసి రాజకీయానికి మరింత వన్నె వచ్చింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ అన్ని వర్గాలను ఆదుకుంటున్నారు. అన్ని వర్గాలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పిస్తున్నారు. సకల జనులతో తెలంగాణ ఉద్యమం సాధించినట్లుగానే, పార్టీలోనూ,పరిపాలనలోనూ అన్ని వర్గాలకు అవకాశం కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రోత్సహిస్తున్నారు. అయితే మునుగోడును ఎన్నికైన నాయకులెవరూ గతంలో నియోజకవర్గాన్ని ఏనాడు ఎవరూ పట్టించుకోలేదు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి కేసిఆర్‌ మునుగోడు కష్టం ప్రత్యక్షంగా చూసి, చలించిపోయారో..అప్పటి నుంచే మునుగోడులో కొంత మార్పు వచ్చింది. మునుగోడుకు కనీసం మంచినీళ్లు ఇచ్చేందుకు కూడా చేతులు రాని ఉమ్మడి పాలకులను కేసిఆర్‌ ప్రశ్నించారు. నిలదీశారు. కాని ఫలితం కనిపించలేదు. అందుకే తెలంగాణ రాగానే ముందు మునుగోడు గోడు తీర్చారు. అంత గొప్ప నాయకుడి పాలనతో మునుగోడు అభివృద్ది జరగాలంటే ఆ ప్రాంతం మీద ఎంతో అంకితబావం వున్న రవి లాంటి నాయకుడికి అవకాశం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మునుగోడులో ప్రస్తుత ఎమ్మెల్యే కూసుకుంట్ల కాకుండా రవి లాంటి నాయకుడు ఎమ్మెల్యేగా వుంటే మునుగోడు ఒక వజ్రపు తునకగా మార్చేవారని ప్రజలు అంటున్నారు. 

నారబోయిన రవి అటు వ్యాపార రంగంలో ఇటు రాజకీయ రంగంలో ఎక కాలంలో రెంటింటిలోనూ తనదైన ముద్ర వేస్తూ వస్తున్నారు.

 గతంలో కాంగ్రెస్‌లో రాష్ట్ర స్ధాయి నాయకుడిగా వున్నారు. అయితే మంత్రి జగదీశ్‌ రెడ్డి ప్రోద్భలంతో బిఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ కోసం అహర్నిషలు పనిచేస్తున్నారు. పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారు. మంత్రి జగదీశ్‌ రెడ్డి మాటంటే రవికి ఎంతో గౌరవం. అందుకే ఆయన పార్టీ కోసం ఏ పని చెప్పినా దానిని విజయవంతం చేయడంలో రవి దిట్ట. పార్టీ పరమైన కార్యక్రమాలెన్నో విజయవంతం చేసి, మంత్రి జగదీశ్‌రెడ్డి చేత అనేక సార్లు శబాష్‌ అనిపించుకున్నారు. గత ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల గెలుపుకోసం రవి పడిన శ్రమ అంతా ఇంతా కాదు. అయితే గత ఉప ఎన్నికల సమయంలోనే రవికి టిక్కెట్‌ ఇవ్వాలని పార్టీ శ్రేణులను నుంచి ఒత్తిడి వచ్చింది. రవికి ఇస్తే బిఆర్‌ఎస్‌ గెలుపు నల్లేరు మీద నడకే అని పార్టీ శ్రేణులు చెప్పాయి. అంతే కాకుండా మంత్రి జగదీశ్‌ రెడ్డి ప్రధాన అనుచరుడిగా కూడా రవికి అదనపు బలంగా మారింది. కాకపోతే అప్పటికే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం కూసుకుంట్లకు టిక్కెట్‌ ఇవ్వడం జరిగింది. అయినా పార్టీ కోసం తన సర్వ శక్తులు ఒడ్డి కూసుకుంట్లను గెలిపించడంలో కీలకభూమిక పోషించిన నాయకుడు రవి. అందువల్ల ప్రజలు కూడ ఈసారి రవికే టిక్కెట్‌ ఇవ్వాలని కోరుకుంటున్నారు. పార్టీ శ్రేణులైతే ఇప్పటినుంచే రవి టిక్కెట్‌ దక్కాలని పార్టీ పెద్దల వద్ద తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఎందుకంటే మునుగోడు ప్రాంత అభివృద్ది లక్ష్యం వున్న ఏకైక నాయకుడు నారబోయిన రవి. మరో వైపు ఆయన చేపట్టే సామాజిక కార్యాక్రమాలు మునుగోడు నియోజకవర్గంలో చాలా మందికి అందాయి. నియోజకవర్గంలోనే బలమైన బిసి సామాజిక వర్గంగా ముదిరాజ్‌లున్నారు. సుమారు 45వేలకు పైగా ముదిరాజ్‌ ఓట్లున్నాయి. మొత్తంగా మునుగోడులో బిసి సామాజిక వర్గాలే ఎక్కు.వ. అందులో ముదిరాజ్‌లదే పెద్ద బలగం. అందుకే నారబోయిన రవికి టిక్కెట్‌ ఇస్తే బిఆర్‌ఎస్‌కు తిరుగులేని మెజార్టీ రావడం ఖాయం అంటున్నారు. ఎవరికి ఆపద వచ్చినా ఆదుకునే నాయకుడుగా రవికి వున్న పేరు ఎంతో కలిసి వస్తుంది. 

 ఇదిలా వుంటే మునుగోడులో గత మూడు నెలలుగా డిప్యాక్‌, నేటిధాత్రిలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సర్వేలలో ప్రజలు ఎక్కువగా నారబోయిన రవి గురించే ప్రస్తావిస్తున్నారు.

 ఆయన సామాజిక సేవలు గుర్తు చేసుకుంటున్నారు. గ్రౌండ్‌ రిపోర్టులో నారబోయిన రవికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు కనిపిస్తోంది. నియోజకవర్గంలో రవికి అరవై ఎనమిది శాతం మంది ప్రజలు మద్దతు పలుకుతుండడం గమనార్హం. కూసుకుంట్ల విషయం కనీసం పట్టుమని పది శాతం మంది ప్రజలు కూడా మద్దతివ్వడం కనిపించలేదు. నియోజకవర్గంలో బిఆర్‌ఎస్‌ బలమైనపార్టీ. తర్వాత స్ధానంలో కాంగ్రెస్‌ వుంది. బిజేపికి కనీసం క్షేత్ర స్ధాయిలో కార్యకర్తలు కూడా లేరు. గత ఉప ఎన్నికల్లో కేవలం రాజగోపాల్‌రెడ్డి వల్లనే బిజేపికి ఆ మాత్రం ఓట్లు వచ్చాయి. కాని ఈసారి రాజగోపాల్‌రెడ్డికి కనీసం ఇరవైశాతం ఓట్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. నిలకడ లేని రాజకీయాలు చేస్తూ, రాజగోపాల్‌రెడ్డి స్వార్ధ రాజకీయాల కోసం పనిచేస్తున్నాడన్న మాట ఎక్కువగా వినిపించింది. అందువల్ల బలంగా వున్న బిఆర్‌ఎస్‌కు మునుగోడు కంచుకోట కావాలంటే నారబోయిన రవికే టిక్కెట్‌ ఇవ్వాలని ప్రజలు పెద్దఎత్తున అభిప్రాయం వ్యక్తంచేయడం విశేషం.

గుండెపోటుతో ములుగు జడ్పీచైర్మన్ “కుసుమ జగదీష్” మృతి

ఫ్లాష్.. ఫ్లాష్..

నేటిధాత్రి వరంగల్

జిల్లా పరిషత్ చైర్మన్, ములుగు నియోజకవర్గ ఇన్చార్జి, బీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీశ్వర్ కొద్దిసేపటి క్రితం గుండెపోటుతో హనుమకొండలోని అజార హాస్పిటల్ లో మృతి చెందారు.

తెలంగాణ ఊపిరి…ప్రగతి రూపశిల్పి.

 

 

`సంక్షేమ సారధి…అభివృద్ధి వారధి.

`సాగు నిర్ణేత..సస్యశ్యామల ప్రదాత.

`తెలంగాణ అభివృద్ధిపై నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న భావాలు…అనుభవాలు. పెద్ది మాటల్లోనే..

`అన్ని వర్గాల ఆకాంక్షలకు ప్రతీక.

`సకల జనుల అభివృద్ధి నిర్మాత.

`పల్లె సింగారానికి శ్రీకారం.

`తెలంగాణలో నీటి జాడలకు సంకేతం.

`చెరువులతొ మొదలైన అభివృద్ధి సంతకం.

`సాగుకు 24 గంటల కరంటు నిదర్శనం.

`ఆసరా ఫింఛన్లుతో భరోసా…

`దివ్యాంగుల ఫించన్‌ పెంపుతో ఊరట.

`దళిత బంధుతో పెరిగిన ఆత్మవిశ్వాసం…

`గిరిజన బంధుతో ఆత్మస్థైర్యం…

`కళ్యాణ లక్ష్మితో కమనీయం.

`బిసిలకు లక్షతో చేతి వృత్తులకు సహకారం.

`అభివృద్ధిలో తెలంగాణ ఫస్ట్‌..

`సంక్షేమంలో తెలంగాణే బెస్ట్‌.

హైదరబాద్‌,నేటిధాత్రి: 

మొన్న: నా గోడు తెలంగాణ. నా గోస తెలంగాణ. కాలోజీ మాటల్లో నా గొడవ తెలంగాణ. కడుపుకు పట్టెడు బువ్వ కరువైన తెలంగాణ. కళ్ళలో కాంతి కరువు చేయబడ్డ తెలంగాణ. కంటికి కునేక కరువైన తెలంగాణ. ఉపాధి లేని తెలంగాణ. చీకటి సూర్యులై అడవుల బాట పట్టి, అమరులైన యువకుల తెలంగాణ. కడుపు కోతల తెలంగాణ. కరువు రక్కసి పీక్కుతిన్న తెలంగాణ. కన్నీటి తెలంగాణ. కష్టాల తెలంగాణ. కాని నిజాం కాలంలోనే పిడికిలెత్తిన తెలంగాణ. ఆనాడే ఉక్కు సంకల్పం నిండిన తెలంగాణ. మర్లవడ్డ తెలంగాణ. పెత్తనాన్ని ప్రశ్నించిన తెలంగాణ. పాట తెలంగాణ. ఆట తెలంగాణ. ఆత్మ గౌరవ తెలంగాణ. చాకలి ఐలమ్మ వేసిన బాట తెలంగాణ. దొడ్డికొమరయ్య అమరత్వం తెలంగాణ. పోరాటం నా తెలంగాణ. ఆరాటం నా తెలంగాణ. ఉద్యమం నా తెలంగాణ. ఉరకలెత్తే ఉత్సాహం నా తెలంగాణ. మర్లవడే తిరుగుబాటు నా తెలంగాణ. హక్కుల సాధన నా తెలంగాణ. ఆశయ సాధన నా తెలంగాణ. అరగారిణ వర్గాల చైతన్యం నా తెలంగాణ. జన నినాదం తెలంగాణ. రణం నా తెలంగాణ. పౌరుషం నా తెలంగాణ.

జంరaా మారుతం తెలంగాణ. మా నినాదం తెలంగాణ. మా ఊపిరి తెలంగాణ. దిక్కులు పిక్కటిల్లేలా గర్జన నా తెలంగాణ. అణువణువునూ నిండిన వాదం తెలంగాణ. ఉచ్చాస నిచ్చాసల బలం నా తెలంగాణ. ప్రతి వ్యక్తి గుండె చప్పుడు తెలంగాణ. ప్రతి కదలికలో అలికిడి తెలంగాణ. ఇలా చెప్పుకుంటూ పోతే విశ్వవాప్తమైన నా తెలంగాణ. రణమైనా, రాగమైనా అంబరమంటే సంబరం నిండిరదే నా తెలంగాణ. ఉత్కృష్టమైన, ఉజ్వలమైన వెలుగే నా తెలంగాణ. భావన నా తెలంగాణ. భావావేశం నా తెలంగాణ. 

నిన్న: అరవై ఏళ్ల దుఃఖం కడుపులో దాచుకొని పురిటి నొప్పులు పడ్డ గడ్డ నా తెలంగాణ.

 అడుగడుగునా దగాపడ్డది నా తెలంగాణ. కన్నీళ్లతో కడుపు చల్లబర్చుకున్నది నా తెలంగాణ. తలాపున గోదారి పరుగులున్నా, కనీసం నురగలు కూడా తెలంగాణ పల్లెలు చూడక, ఎండిపోయిన బతుకులు తెలంగాణ. ఆ పక్క కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా, పడావు పడ్డ పాలమురూ కరువు నా తెలంగాణ. పలుగు రాళ్లు తప్ప పంట చేలు కనిపించని నా తెలంగాణ. ఎండిన బీళ్లు, నెర్రెలు బారిన పొలాలు, ఇంకిన చెరువులు, ఒట్టిపోయిన ఒర్రెలు, వంకలు మూసుకుపోయిన వాగులు, నీటి జాడలు పాతాళంలో కనిపించని తెలంగాణ పల్లెలు. ఇవీ నా తెలంగాణ బతుకులు. జీవితాల గోసలు. 

నేడు: చిరునవ్వుల తెలంగాణ. చిద్విలాసం చూస్తున్న తెలంగాణ. సిరుల మాగాణ నా తెలంగాణ.

 కోటిన్న ఎకరాలకు సాగు చేరిన తెలంగాణ. పసిడిపంటల కాణాచి తెలంగాణ. పచ్చని పల్లెల తెలంగాణ. పైర్లు పైటలా కప్పుకున్న పచ్చని మాగాణ నా తెలంగాణ. సిరుల సింగారం నా తెలంగాణ. వీరుల తెలంగాణ. ఉద్యమ కారుల తెలంగాణ. నిండైన గౌరవం నా తెలంగాణ. ఆత్మ నిండిన తెలంగాణ. ఆత్మ గౌరవం వెల్లివిరిసిన తెలంగాణ. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ. అనువణువూ పులకింత తెలంగాణ. అవమానాలు అంతరించిన తెలంగాణ. సగర్వంగా నిలబడ్డ గెలుపు పతాక తెలంగాణ. నీటి సవ్వడులతో గలగల నవ్వుతున్న తెలంగాణ. జలజలాపారుతున్న తెలంగాణ. కాళేశ్వరంతో కళకళలాడుతున్న తెలంగాణ. కాలువలు ఏరులై పారుతున్న తెలంగాణ. ఏరులన్నీ సజీవమైన తెలంగాణ. చెరువులన్నీ నిండిన నా తెలంగాణ. వాగుల్లో నిళ్లు పరవళ్లు తెలంగాణ. మత్తళ్లు దుంకుతున్న తెలంగాణ. ఒర్రెళ్లల్లో నీటి ఊటలు తెలంగాణ. పొలాల నిండా నీటి తెలంగాణ. పసిడి పంటల తెలంగాణ. ప్రతి గుండె కలల రూపం తెలంగాణ. పోరాడి సాధించుకున్న లక్ష్యం తెలంగాణ. ఉద్యమ కారుడైన కేసిఆర్‌ ఊపిరైన తెలంగాణ. పద్నాలుగేళ్లు పోరాటం చేసి సాధించి, వెయ్యేళ్లు చెప్పుకున్నా తనివి తీరని సంతోషం నిండిన తెలంగాణ. ఆనాటి జ్ఞాపకాలను, ఉద్యమకారుడైన కేసిఆర్‌ పోరాటంలో వేసిన ఎత్తులు, రాజకీయంగా అనుసరించి విధానాలు, ముక్కొటి గొంతులను ఒక్కటి చేసి జై తెలంగాణ అనిపించి తెలంగాణ సాధించిన కేసిఆర్‌ కలల రూపం నేటి తెలంగాణ అంటూ నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ చెప్పిన ఆసక్తికరమైన అంశాలు…తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల వేళ ఆయన మాటల్లోనే…

 ఒకనాడు తెలంగాణలో ఎక్కడ చూసినా కరువు. 

ఎప్పుడు చూసినా కరువే. కాని ఇప్పుడు ఆ మాటకు అర్ధమేమిటో కూడా తెలియనంత అభివృద్ధి తెలంగాణ జరిగింది. దానికి ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఒక ప్రణాళికా ప్రకారం చేస్తున్న అభివృద్దే నిదర్శనం. ఎందుకంటే ఆయన తెలంగాణ కోసం కొట్లాకు బయలుదేరిన నాటి నుంచే భవిష్యత్తు తెలంగాణ ఎలా వుండాలన్నదానిపై ఒక స్పష్టమైన వైఖరితో వున్నారు. అందుకే ఇంత త్వరగా తెలంగాణ కోలుకోగలిగింది. అన్ని రంగాల్లో అభివృద్ది చెందగలింది. అన్ని రంగాల్లో పురోగమిస్తోంది. సంక్షేమ రాష్ట్రంగా విరాజిల్లుతుంది. తెలంగాణ రాకుంటే ఇందులో ఏ ఒక్కటీ వుండేది కాదు. అదే గోస..అదే యాతన వుండేది. తెలంగాణ రాకపోతే చెరువులుండేవా? చెరువుల్లో నీళ్లుండేవా? పల్లెల్లో పంటలుండేవా? అదే ఎండిన బావులు, నెర్రెలు బారిన భూములు..అవే వలసలు…అప్పటికే చిద్రమైన పల్లె మరింత దరిద్రమయ్యేది. పల్లె జీవితం చిన్నాభిన్నమయ్యేది. కాని తెలంగాణ రాగానే పల్లెకు వెలుగొచ్చింది. పల్లె మురిసిపోయేంత సంతోషం నిండిరది. ఏళ్ల తరబడి పంటలకు పనికి రాకుండా పోయిన భూముల్లో మళ్లీ పంటల కళ వచ్చింది. ప్రతి ఎకరం సాగుకు యోగ్యమైంది. ఆరు తడి పంటల భూములన్నీ, పొలాలుగా మారాయి. నిత్యం నీటితో కళకళలాడే పంట పొలాలయ్యాయి. ఇదే కదా తెలంగాణ కోరుకున్నది. ఇదే కదా! ప్రతి రైతు ఆశించింది. ఈ నీటి కోసమే కదా! రైతు కన్నీరు కార్చింది. ఏదేశమైనా పాడి పంటలు బాగుంటేనే ఆ దేశం అన్ని రకాలుగా అభివృద్ది చెందుతుంది. ముందు సాగు, ఆపైనే ఇతర బాగు అని పెద్దలు అందుకే అన్నారు. అది తుచ తప్పకుండా ముఖ్యమంత్రి కేసిఆర్‌ అనుసరించారు. ఒకనాడు పంటలంటే, పచ్చని పొలాలంటే సీమాంధ్ర గురించి చెప్పుకునేవారు. ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నారు. తెలంగాణ లో పచ్చని కాంతిని చూస్తున్నారు. 

  తెలంగాణ వస్తే చిమ్మ చీకట్లే అన్నారు. కాని పరాయి పాలకులను పారద్రోలినట్టే చీకట్లను కూడా తెలంగాణ తరిమేసింది. 

వెలుగులు నింపుకున్నది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ పుణ్యంతో తెలంగాణ వెలుగులు విరజిమ్ముతున్నది. సీలేరు నుంచి కరంటు ఇవ్వకున్నా, కోతలు లేని కరంటు మన సొంతమైంది. కేసిఆర్‌ ప్రణాళిక ప్రకారం నిరంతరం కరంటు వస్తోంది. కాని అదే సీమాంద్రలో కరంటు కటకట చూస్తోంది. ఏ రైతుకు కరంటు కష్టం తెచ్చిపెట్టారో..తెలంగాణ రైతు గోస పుచ్చుకున్నారో…అదే తెలంగాణలో 24గంటల కరంటు రైతుకు ఉచితంగా అందుతోంది. రైతు కష్టం తీరుతోంది. రైతు కళ్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఒకనాడు కరంటు కోసం ఎదురుచూసి, ఎదురుచూసి, రాత్రిళ్లు బావుల దగ్గర నిద్రలు చేసి, పురుగు, పుట్రలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతికిన రైతన్నకు కరంటు అన్ని వేళలా అందుబాటులో వుంటోంది. ఇదీ తెలంగాణ సాధించిన విజయం. తెలంగాణ వస్తే ఏమొస్తుందని ప్రశ్నించిన వారికి కళ్లముందు కనిపిస్తున్న సమాధానం. ఇక రైతు కోసం ముఖ్యమంత్రి కేసిఆర్‌ అందిస్తున్న ఏ ఒక్క పధకం దేశంలోనే ఎక్కడా లేదు. ఏరాష్ట్రంలో రైతుబంధులేదు. రైతు భీమా లేదు. రైతు పండిరచిన ధాన్యం నేరుగా ప్రభుత్వమే కొనుగోలు లేదు. తెలంగాణలో అందుతున్న గిట్టుబాటు ధర ఎక్కడా అందడం లేదు. ఇదీ తెలంగాణ రైతు మాత్రమే అందుతున్న వరం. ఇది దేశం మెచ్చిన తెలంగాణ. ఇది కేసిఆర్‌ తెచ్చిన తెలంగాణ. కేసిఆర్‌ చేతిలో రూపు దిద్దుకున్న తెలంగాణ.

1000 కిలోమీట‌ర్లు.. 500 పైగా గ్రామాలు.. 30కి చేరువ‌లో నియోజ‌క‌వ‌ర్గాలు

 

సీఎల్పీ నేత జ‌న‌నాయకుడు భ‌ట్టి విక్ర‌మార్క మార్చి 16న చేప‌ట్టిన పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర 85వ రోజు నాటికి
996 కిలోమీట‌ర్లు పూర్తి చేసుకుంది. ఈ పాద‌యాత్ర‌లో వంద‌ల 500 పైగా గ్రామాలు.. తాండాలు, ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు చుట్టేస్తూ సాగుతోంది.

గిరిజ‌నులు, ఆదివాసీలు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలు, మైనారీటీలు, అట్ట‌డుగు వ‌ర్గాలు, అణ‌గారిన ప్ర‌జ‌లు.. భ‌ట్టి విక్ర‌మార్క‌ను జ‌న నాయ‌కుడిగా పేర్కొంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని గెలుపుతీరాలకు చేర్చే చుక్కానిలా భ‌ట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర ముందుకు సాగుతోంది. గ‌తంలో కాంగ్రెస్ పార్టీకి దూర‌మైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అట్ట‌డుగు, అణ‌గారిన వ‌ర్గాన‌లు తిరిగి పార్టీకి ద‌గ్గ‌ర చేయ‌డంలో భ‌ట్టి విక్ర‌మార్క పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర విజ‌యం సాధించింద‌ని చెప్ప‌వ‌చ్చు. .

మార్చిన 16న సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజ‌క‌వ‌ర్గం బజరహాత్నూర్ మండ‌లం పిప్పిరి గ్రామం నుంచి పాద‌యాత్రను ప్రారంభించారు. ఇప్న‌టికే బోథ్‌, ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంప‌ల్లి, చెన్నూర్, మంచిర్యాల‌, రామ‌గుండం, ధ‌ర్మ‌పురి, పెద్ద‌ప‌ల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్, వ‌ర్ధ‌న్న‌పేట‌, వ‌రంగ‌ల్ వెస్ట్, స్టేష‌న్ ఘ‌న్ పూర్, జ‌న‌గామ‌, అలేరు, భువ‌న‌గిరి, ఇబ్ర‌హీం ప‌ట్నం, ఎల్బీన‌గ‌ర్, మ‌హేశ్వ‌రం, రాజేంద్రనగర్, చేవెళ్ల‌, షాద్ న‌గ‌ర్, ప‌రిగి, జ‌డ్చెర్ల‌, నాగ‌ర్ క‌ర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, దేవరకొండ నియోజ‌క‌వ‌ర్గాల్లో పాద‌యాత్ర సాగింది.

సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర కొన‌సాగిన నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం కావ‌డంతో పాటు.. కేడ‌ర్ లో స‌రికొత్త జోష్ నెల‌కొంది. దీంతో ఇప్పుడు పాదయాత్ర వెళ్లని నాయకులనుంచి.. మా నియోజకవర్గాల్లో కూడా పాదయాత్ర చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీద తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. భట్టి పాదయాత్ర నియోజకవర్గాల్లో సాగితే.. పార్టీలో కొత్త జోష్ రావడంతో పాటు, అభ్యర్థుల గెలుపు అవకాశాలు పెరుగుతున్నాయన్న అంచనాలతో.. పీపుల్స్ మార్చ్ పై రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

గాలి దుమారాలు.. విపరీత ఎండలు.. ఊహించన భారీ వర్షాలు.. అయినా కూడా తనతో నడిచే కార్యకర్తలతో సమానంగా టెంట్ లో ఉంటూ.. వారితో కలిసి తింటూ.. కలియ తిరుగుతున్న భట్టి విక్రమార్క.. సరికొత్త ట్రెండ్ సెట్టర్ గా మారారు. కాంగ్రెస్ నౌకను గెలుపు తీరాలకు చేర్చే.. తెరచాపలా.. భట్టి విక్రమార్క ముందుకు సాగుతున్నారు.

ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి కరీంనగర్ హన్మకొండ జనగామ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి వికారాబాద్ మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ నల్లగొండ సూర్యాపేట ఖమ్మం జిల్లాలో పాదయాత్ర కొనసాగిన తరువాత
ఈనెల 25 నాటికి 101 రోజులు పాదయాత్ర పూర్తి అవుతుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హాజరవుతారు. ముగింపు సభకు దాదాపుగా రెండు లక్షల పైగా జనాలు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగానే నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎండల్లో ఎంత యాతన!

`తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేడుక.

`అటు నాయకులు, ఇటు అధికారులు.

`ఎండలను కూడా లెక్క చేయకుండా అభివృద్ధి పనులు.

`ఉత్సవాలలో ఇరవై రోజుల పాటు ప్రజలతో మమేకం.

`చెరువులో తట్టెడు మట్టి తీయని వాళ్లు కూడా తెగమాట్లాడుతున్నారు.

`ఊరుకు కళొచ్చిందంటే అది బిఆర్‌ఎస్‌ తోనే…

`పల్లెకు వెలుగొచ్చిందంటే బిఆర్‌ఎస్‌ తోనే

`చెరువే ఊరికి ఆదరువు.

`కుల వృత్తులకు బతుకుదెరువు.

`సాగును కాపాడే కల్పతరువు.

`ఊరందరికీ ఉపకారి చెరువు.

`ఆ చెరువును గాలికొదిలేసిన వాళ్లు మాట్లడడం దెయ్యాలు వల్లించడమే?

`తెలంగాణ రాకపోతే చెరువు లేదు.

`పల్లెకు బతుకుదెరువు లేదు.

`పల్లె వికాసమే లేదు.

`అలాంటి పల్లెను కాపాడుతున్నది బిఆర్‌ఎస్‌.

`ప్రజల గుండెల్లో వున్నది బిఆర్‌ఎస్‌.

`ప్రజలకు ఆమడ దూరంలో వున్నవి ప్రతిపక్షాలు.

`అధికారంలో వున్ననాడు పట్టించుకోలేదు…ప్రతిపక్షంలో వుండి ప్రగతిని ఓర్చుకోలేరు.

`అందుకే ప్రతిపక్షాలు ప్రజల దరి చేరడం లేదు.

`ప్రజా సంక్షేమం ప్రతిపక్షాల డిక్షనరీలోనే లేదు.

`అందుకే అభివృద్ధి వారి కళ్లకు కనిపించదు.

`అభివృద్ధి వారికి సహించదు.

`అభివృద్ధి అంటే బిఆర్‌ఎస్‌… సంక్షేమం అంటే కేసిఆర్‌. ఇదీ జనం మాట.

హైదరబాద్‌,నేటిధాత్రి:                తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల వేళ బిఆర్‌ఎస్‌ నాయకులు యాతన పడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నరకయాతన అనుభవిస్తున్నారు. అయినా అది ఎంతో సంతోషంగానే స్వీకరిస్తున్నారు. ప్రజల కోసం పడుతున్న ఇబ్బందులను ఆనందంగా చెప్పుకుంటున్నారు. ఉద్యమ కాలం నాడు అటుకులు బుక్కి ప్రజల్లో వున్నది బిఆర్‌ఎస్‌ నేతలే…ఇప్పుడు అధికారంలో వున్నా, మండుటెండల్లో ప్రజలకు చేరువలో వున్నదికూడా బిఆర్‌ఎస్‌నేతలే…కాని పని లేని ప్రతిపక్షాలు ఇళ్లు కదలకుండా అభివృద్ధిని చూడలేకపోతున్నారు. ప్రగతిని జీర్ణించుకోలేకపోతున్నారు. పల్లెల కాంతులను చూసి కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అందుకే ప్రతిపక్షాలు చేసే విమర్శలను ప్రజలు చీకొడుతున్నారు. ఏనాడైనా గతంలో అధికారంలో వున్న పార్టీలు ఇప్పుడు బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న పనులు చేశారా? అంటూ ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ఆనాడైనా ఈనాడైనా ప్రజల్లో వున్నది, వుండేది బిఆర్‌ఎస్‌ నాయకులే అంటున్నారు. ఎందుకంటే సుదీర్ఘంగా సాగిన తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణకు అన్యాయం జరక్కుండా చూసింది కూడా బిఆర్‌ఎస్సే. ఆనాటి పాలకులు చేసిన ప్రతి ప్రజావ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకించింది బిఆర్‌ఎస్సే. తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్నప్పుడు కరంటు బిల్లులు విపరీతంగా పెంచినప్పుడు ప్రశ్నించింది ముందు ఆనాటి ఉప సభాపతిగా వున్న కేసిఆరే…ఆనాడు విద్యుత్‌ చార్జీల ఉప సంహరణకు చంద్రబాబు ఒప్పుకోకపోవడంతో ప్రజల కోసం, తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసి, ప్రజల్లోకి వచ్చింది కేసిఆరే..అలా ఆయన ప్రజల్లోకి వచ్చిన నాటి నుంచి నేటి దాకా ప్రతిపక్షంలో వున్నా, నేడు అధికారంలో వున్నా ప్రజల్లో వుండే ఏకైక పార్టీ బిఆర్‌ఎస్సే. ఇక తెలంగాణ ఉద్యోగులు సైతం దశాబ్ధి ఉత్సవాలలో ఎంతో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రజల మన్నననలు పొందుతున్నారు. గతంలో అధికారులు కార్యాలయాలు వదిలి బైటకు వచ్చేవారు కాదు. నాడు పాలకులు ప్రజల్లోకి వచ్చేవారు కాదు. అదికారులను పనిచేయనిచ్చేవారు కాదు. పాలకుల ఇష్టారాజ్యం అన్నట్లు వుండేది. కాని నేడు ప్రభుత్వ పెద్దలు ఎంతగా ప్రజల్లో వుంటున్నారో, అదికారులు కూడా అంతగా ప్రజలకు చేరువౌతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నారు. కాని ప్రతిపక్షాలు మాత్రం రోజు రోజురోజుకూ ప్రజలకు దూరమౌతున్నారు. 

 తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు మండుటెండల్లో జరుగుతున్నాయి. 

ఉదయం వేళలోనే సూర్యుడు చుర్రుమంటున్నాడు. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్‌ దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలంతా ప్రజల్లోనే వుంటున్నారు. దశాబ్ధి ఉత్సవాలలో నిత్యం పాల్గొంటున్నారు. బిఆర్‌ఎస్‌ నాయకులలో కనిపించే అంకితభావం మరో పార్టీలో వుండదు. అందుకే తెలంగాణ ప్రజలు ఇతర పార్టీలకు స్ధానం లేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా చెరువుల పండగ అన్నది ఎంత గొప్పగా జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు, పత్రికలు లేని పోని కథనాలు వండి వార్చడాన్ని ప్రజలే జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో పల్లెలు ఎలా వుండేవి? ఇప్పుడు ఎలా వున్నాయన్న విషయం తెలిసి కూడా తెలియనట్టు, ప్రజలను ఏమార్చే కనికట్టు ప్రతిపక్షాలు చేయాలని చూస్తే ప్రజలు హర్షించరు. ఇప్పటికే ప్రతిపక్షాలను ప్రజలు ఆదరించడం లేదు. అయినా వారిలో మార్పు రావడం లేదు.

తెలంగాణ వచ్చాక ఊరు మారింది.

 చెదిరిన కల కొత్త రూపును సంతరించుకున్నది. పల్లెకు మళ్లీ కొత్త సొగబు వచ్చింది. పల్లె రూపులకు రేఖలకు కొత్త కళ వచ్చింది. ఎండిన పైర్లు, బీడు వారిన భూములు, పల్లెర్లు మొలిచి పొలంఆనావాలు లేని భూములకు మళ్లీ మట్టివాసన అద్దింది. పూడిపోయిన బావులకు ఊటలు వచ్చాయి. ప్రతి ఊరిలో, ప్రతి గల్లీలో సిసి రోడ్లు వచ్చాయి. పచ్చదనం పెరిగింది. ఊరి చెరువు బాగుపడిరది. చెరువు కట్టలకు కొత్త దనం వచ్చింది. చెరువు కట్టల మీద ఊత వనాలు పురుడుపోసుకున్నాయి. చెరువు కట్టంతా అల్లుకున్నాయి. ఊరే చెరువుకు ఆదరవు. ఊరులో చెరువుంటే ఊరంతటికి కల్పతరువు. ఊరిలో చెరువుంటే, అది నిండుగా వుంటే పంటలకు కొదవలేదు. అందుకే తెలంగాణ రాగానే ముఖ్యమంత్రి కేసిఆర్‌ చెరువుల పండగ మిషన్‌ కాకతీయను మొదలుపెట్టారు. ముందు చెరువుల బాగోగులు చూశాడు. చెరువులను మరమ్మత్తులు చేయించాడు. పాత కట్టల స్ధానంలో మరింత కొత్త కొత్త కట్టలు నిర్మాణం చేయించాడు. చెదిరిన చెరువులను తవ్వించాడు. పూడికను రైతుల భాగాస్వామ్యంతో పొలాలలకు మళ్లింపజేశాడు. చెరువుల పూడిక కార్యక్రమం పండగలా చేయించాడు. ,చెరువులన్నీ గోదారి జలాలలో నింపారు. ఎండాకాలంలో కూడా చెరువులు మత్తళ్లు దుంకించారు. దాంతో తెలంగాణ పల్లె రూపు ఒక్కసారిగా మారిపోయింది. వందేళ్ల కింది గొలుసుకట్టు చెరువులకు మళ్లీ కల వచ్చింది. చెరువుల్లోకి నీరొచ్చింది. బావులకు ఊటలొచ్చాయి. ఎండిన బోర్లు ఎల్లబోశాయి. పడావు పడిన భూములు మళ్లీ పొలాలయ్యాయి. వలసవెళ్లి రైతులంతా మళ్లీ ఊళ్లకు చేరుకున్నారు. వ్యవసాయం సాగిస్తున్నారు. రైతు బంధు అందుకుంటున్నారు. పెట్టుబడి సాయం అందుకుంటున్నారు. అఫ్పులేకుండా వ్యవసాయం సాగిస్తున్నారు. ఇరవైనాలుగు గంటల ఉచిత కరంటు అందిస్తున్నారు. పండినపంటలను రైతు కల్లాల దగ్గరకే అధికారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. గతంలో రైతులే మార్కెట్‌ యార్డుకు తరలించి అమ్ముకునే దుస్ధితి నుంచి బైటపడ్డారు. రైతు తన పంట రాశి మీద దర్జాగా కూర్చొకొని తనదగ్గరికే అదికారులొచ్చి కొనుగోలు చేసుకుంటుంటే రాజులా తన ధాన్యాన్ని అమ్ముకుంటున్నాడు. ఇదీ ఇప్పుడు తెలంగాణ రైతు అనుభవిస్తున్న ఠీవి. మరి గతంలో రైతుపరిస్ధితి ఎలా వుండేది. చెరువు దుస్దితి ఎలా వుండేదో ప్రతిపక్షాలకు తెలియంది కాదు. కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో 45 సంవత్సరాలు పాలించినా, ఏనాడు తెలంగాణకు చుక్క నీరు తెచ్చే యోచన చేయలేదు. నాటి పాలకులతో కొట్లాడి సాధించింది లేదు. చెరువుల బాగోగులు చూసంది లేదు. కనీసం చెరువుల పూడిక తీస్తే, తెలంగాణ రైతులకు మేలు జరుగుతుందని అడిగింది లేదు. కాని నేడు చెరువుల పండగతో కులవృత్తులకు మేలు జరిగింది. అందుకే ఊరూరు చెరువుల పండగ జరుపుకుంటోంది. ఒకనాడు చెరువుల్లో నీళ్లు లేవు. చేపలు లేవు. ముదిరాజ్‌లకు ఉపాధి లేదు. కాని నేడు చెరువుల్లో పుష్కలమైన మత్య్స సంపద. ముదిరాజ్‌కు కళ్లముందు ఉపాధిపండగ. రజకులకు కూడా చెరువుల ద్వారా కుల వృత్తిపోషణ జరుగుతోంది. ఇలా రైతులకు మేలు జరుగుతోంది. చెరువు కట్టలపై వెలసిన ఈత వనాల మూలంగా గౌడసామాజిక వర్గానికి మరింత ఉపాది దొరికింది. ఇలా చెరువు ఊరికి కల్పతరువైంది. పూర్వం తెలంగాణ పల్లె సింగారం మళ్లీ ఇప్పుడు కళ్లముందు కదలాడుతోంది. తెలంగాణ ప్రభుత్వం దశాబ్ధి ఉత్సవాలలో చెరువు ఒక గొప్ప వరంగా మారింది. ప్రజలకు జీవనాడిగా మారింది. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయాలంటే, ఊరు బాగు పడిరదంటే అది ముఖ్యమంత్రి కేసిఆర్‌పుణ్యమే…ఆయన ఆలోచనల రూపమే…పచ్చని పైట సింగారించకున్న పల్లె ముస్తాబుకు సాక్ష్యమే..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version