ప్రజా వ్యతిరేక బడ్జెట్ కదా…?

కేంద్ర బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్: తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :

పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని, కార్పొరేట్ శక్తులకుఅనుకూలమైన బడ్జెట్ అని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. గురువారంచండూరు మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో( సిఐటియు, రైతు,కల్లుగీత కార్మిక సంఘం,చేతి వృత్తిదారుల సంఘం )కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్లోమోడీ ప్రభుత్వం ప్రజల మౌలిక అవసరాలకు కేటాయింపులు తగ్గించి,సంపన్నులకు రాయితీలు పెంచిందని, సామాన్య ప్రజలకు తీరని ద్రోహం చేసిందని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. దేశంలో200 మంది శతకోటీశ్వరులపై4 శాతం సంపద పన్ను ప్రవేశపెట్టాలని, కార్పొరేట్ పన్ను పెంచాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర హామీ కల్పించాలని ఆయన అన్నారు. భీమా రంగంలో100 శాతం ఎఫ్ డిఐ ఉపసంహరించాలని ఆయన అన్నారు.ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ,ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వారికి అప్పగించడం ఆపాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 50 శాతంకేటాయింపులు పెంచాలని, పట్టణాలకు వర్తింపజేయాలని,ఆరోగ్య రంగానికి,విద్యారంగానికి జిడిపిలో3 శాతం చొప్పున కేటాయించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆహార సబ్సిడీ పెంచాలని,ఎస్సీ ఎస్టిరంగాలకుమహిళ, శిశు సంక్షేమానికి కేటాయింపులు పెంచాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.స్కీం వర్కర్ల గౌరవ వేతనంతో కేంద్రం వాటాను పెంచాలని, రాష్ట్రాలకు నిధులబదిలీ పెంచాలని ఆయన అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై సెస్సులు,సర్ చార్జీలు రద్దు చేయాలనివారు అన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రజల వ్యతిరేక బడ్జెట్ అని వెంటనే పార్లమెంట్లో ఫైనాన్స్ బిల్లు ఆమోదించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులుమొగుధాల వెంకటేశం, చేతి వృత్తిదారుల సంఘం నాయకులు చిట్టి మల్ల లింగయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కత్తుల సైదులు, నల్లగంటి లింగస్వామి, గండూరు వెంకన్న, చినరాజు, కృష్ణయ్య, రమేష్, వెంకన్న, అన్నేపర్తి ఎల్లమ్మ, బక్కమ్మ, చంద్రమ్మ, అలివేలు, కలమ్మ, రేణుక, ముత్తమ్మ,రైతు సంఘం నాయకులుకొత్తపల్లి నరసింహ,వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.

మొక్కజొన్న పంటలను పరిశీలన

బర్లగూడెం మాజీ సర్పంచి ఆదివాసీ నవనిర్మానసేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి..

బాండ్ మొక్కజొన్న పంటలను క్షేత్ర స్థాయి పరిశీలన..

°అన్నదాలకు అండగా ఉండాలని ప్రజలకు పిలుపు..

°ఆర్గనైజర్ల వందల కోట్ల అక్రమాల పైన విచారణ చేపట్టాలని డిమాండ్..

నూగూర్ వెంకటాపురం ఫిబ్రవరి 20 ( నేటి ధాత్రి ):-

అన్నదాతలకు అండగా నిలవడం సమాజ సామాజిక బాధ్యత అని మాజీ సర్పంచి కొర్స నర్సింహా మూర్తి పేర్కొన్నారు. బుధవారం ఆయన వాజేడు మండలం లోని ఆరుగుంట పల్లి, వెంకటాపురం మండలం లోని రాచపల్లి, మొట్లగూడెం గ్రామాల్లో సాగు చేసిన మొక్క జొన్న పంటలను క్షేత్ర పరిశీలన చేశారు.ఆరుగుంటపల్లి రైతులు గత సంవత్సరం నుండి సింజెంట మొక్కజొన్న సాగు చేస్తూ దిగుబడి రాక నష్టపోతున్నామని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు అని అన్నారు. గత ఏడాది ఇదే విత్తనం వేసి దిగుబడి రాక నష్టపోతే నష్టపరిహారం ఇవ్వలేదని వాపోయారని అన్నారు. ఈ ఏడాది కూడా రైతులు వేయబొమని చెప్పినప్పటికి దిగుబడి రాకపోతే నష్టపరిహారం చెల్లిస్తామని రైతులకు హామీ ఇచ్చినట్టు ఆయన తెలియజేసారు. బహుళ జాతి మొక్క జొన్న విత్తన కంపెనీల ఏజెంట్ల మాటలు నమ్మి మొక్కజొన్న పంటలు వేసి తీవ్రంగా నష్టపోయమని రాచపల్లి, మొట్లగూడెం రైతులు తెలిపినారని అన్నారు. రాజకీయ పార్టీల ముసుగులో ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజలను మోసం చేస్తూ రాజకీయాల్లో కొనసాగడం సిగ్గు చేటన్నారు. రాజకీయాలను వ్యాపారాలుగా మార్చుకొని పబ్బం గడుపుతు న్నట్లు మండిపడ్డారు. బాండ్ వ్యవసాయం అని నోటి మాటలు చెప్పి రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. నష్టపోయిన రైతులకు కంపెనీ నియమ నిబంధనల ప్రకారం నేరుగా రైతు ఖాతాలోనే వేయాలని డిమాండ్ చేశారు. ఆర్గనైజర్ల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని అన్నారు.మొక్క జొన్న కుంభకోణం పైన సమగ్రవిచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ ని కోరారు . రెండు మండలాల్లోని మొక్కోజొన్న రైతులు కలిసి కట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. నాయకులు కుంజ మహేష్, పాయం రాంబాబు, ప్రవీణ్, పర్శిక సురేష్ మొక్కజొన్న రైతులు ఉన్నారు.

షాట్ పుట్ లో సంపత్ కు పతకం.

బెల్లంపల్లి నేటిధాత్రి :

బెల్లంపల్లి లో ఈ నెల 18 వ తేదీ నుండి 19 వ తేదివరకు వరకు ఉస్మానియా యూనివర్సిటీ క్రీడా మైదానంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి యూత్ అథ్లెటిక్స్ క్రీడా పోటీలలో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నాగంపేట గ్రామానికి చెందిన ఈర్ల సంపత్ రాష్ట్రస్థాయిలో సత్తా చాటి పురుషుల విభాగంలో పతకం సాధించాడని కోచ్ సల్పాల సంతోష్ యాదవ్ తెలిపారు. షాట్ పుట్ లో సంపత్ కంచు పతకం సాధించాడని అయన తెలిపారు. మంచిర్యాల జిల్లా అథ్లెటిక్స్ కార్యదర్శి ఈ. మారయ్య మాట్లాడుతూ యువతకు క్రీడలు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ రానున్న కాలం లో క్రీడల పట్ల మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అన్నారు. కోచ్ సంతోష్ యాదవ్ ను, అథ్లెట్ సంపత్ ను అభినందించారు.

ఉద్యోగానికి రాజీనామా ఒక డ్రామా!

-హరికృష్ణ త్యాగం ఒక మిధ్య!!

-రాజీనామా చేసినా ఉద్యోగం మళ్ళీ వస్తుంది?

-అలా ఉద్యోగాలు పొందిన వాళ్లు కోకొల్లలు!

mlc candidate harikrishna

-ప్రజలను మభ్యపెట్టి సానుభూతి కోసం ఆరాటం

-ఎన్నికలలో గెలవాలన్న ఆలోచనతో ప్రచారం

-కోచింగ్‌ సెంటర్ల మేలు కోసం సరికొత్త నాటకం

-కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులంతా ఏకమై సాగిస్తున్న రాజకీయం

-ఎమ్మెల్సీ ఎన్నికలు ఖర్చుతో కూడుకున్నవి

-ఒక సామాన్యమైన ఉద్యోగికి అంత సొమ్మెక్కడిది!

-జీతంలో ముప్పై శాతం సామాజిక కార్యక్రమాలు గొప్పల కోసమే

-ప్రభుత్వాల మీద కోచింగ్‌ సెంటర్ల ఆధిపత్యం కోసం కొత్త ఎత్తుగడ

-విద్యార్థుల జీవితాలు ఫణంగా పెట్టి సంపాదనా మార్గాలకు రాచబాట

అబద్దమాడరాదు..సత్యమునే పలుకవలెను..అని చెప్పాల్సిన గురువులు కొందరు పచ్చి అబద్దాలు చెప్పి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్న బిఎస్పీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణ గౌడ్‌ మాటలు అలాగే వున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతో ఆయన కొంత కాలం క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి తాను ప్రజా సేవ కోసం ప్రజల్లోకి వచ్చానని, ప్రజా సేవ కోసం తన ఉద్యోగాన్ని తృణ ప్రాయంగా వదిలేశానని, కొలువుకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానని ప్రచారం మొదలు పెట్టారు. సహజంగా ఇలాంటి మాటలు విన్నవారికి ఎవరికైనా సరే అవునా? చాలా గొప్ప వ్యక్తి అన్న భావనే ఏర్పడుంది. చాలా మందికి అసలు నిజం తెలియదు. అంతలోతుగా కూడా ఎవరూ ఆలోచించరు. ఉద్యోగాల విషయంలో ఎలాంటి వెసులు బాటు వుంటుందో కూడా ఇతరులకు పెద్దగా అవగాహన వుండదు. దాంతో ఉన్నతమైన ఉద్యోగం వదిలి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాడేమో? అని జనం ఆలోచిస్తుంటారు. కాని అదంతా నిజంకాదు. ఇకపోతే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతోనే గత కొంత కాలంగా చిన్నా చితక సామాజిక కార్యాక్రమాలు చేపడుతూ వస్తున్నానని ఆయనే చెబుతున్నారు. తనకు వచ్చే జీతంలో కొంత శాతం సమాజ సేవ కోసం ఖర్చు చేస్తున్నానంటూ చెబుతుండడం విడ్డూరం. ఆయనకు వచ్చే జీతమెంత? అందులో చేసే ఖర్చెంత? ఎందుకంటే ఆసుపత్రుల్లో పది మంది రోగులకు పండ్లు పంచినా అది సామాజిక సేవే…కాని మన సమాజంలో ఎంతో మంది కొన్ని కోట్ల రూపాయలు సమాజం కోసం ఖర్చు చేస్తూ గుప్త దానాలు చేస్తున్న వారు అనేక మంది వున్నారు. వాళ్లెవరూ ఇలా ప్రచారం చేసుకోరు. అసలు పేదలను ఆదుకునేందుకు విద్యా, వైద్య సహాయ కార్యక్రమాలు చేస్తున్నట్లు కూడా తెలియదు. కాని రాజకీయ భవిష్యత్తుకోసం ఆరాటపడే వాళ్లే ఇలా చిన్నా చితక సాయాలు చేసి పెద్దగా ప్రచారం చేసుకుంటారు. మీడియాలో వార్తలు రాయించుకొని ప్రచారంలో దూసుకుపోతుంటారు. ఉద్యోగానికి రాజీనామా చేసిననాడు కూడా ఇలాగే తన త్యాగం గురించి చెప్పుకొని మీడియా సమావేశం ఏర్పాటు చేసి, గొప్పలు చెప్పుకున్నారు. ఆ మరునాడు వచ్చిన మీడియా కథనాలను బ్రోచర్‌గా మార్చుకొని రాజకీయ పార్టీల వెంట ప్రసన్న హరికృష్ణ తిరిగారు. ముఖ్యంగా అదికార కాంగ్రెస్‌ పార్టీ చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. కాని కాంగ్రెస్‌ పార్టీ ప్రసన్న హరికృష్ణను నమ్మలేదు. ఎందుకంటే హరికృష్ణ ఉద్యోగ జీవితమే పట్టుమని పదిహేనేళ్లు లేదు. రిటైర్‌ మెంటుకు దగ్గరకూడా లేరు. కాని ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం అడుగులు వేశారు. అందులోనూ పెద్దల సభను ముందుగా ఎంచుకున్నాడు. ఇక్కడే ఆయనలోని అత్యాశ కనిపించింది. ఒక సాధారణ వ్యక్తి రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు చిన్న వయసు నుంచే కార్యకర్తగా మొదలై, అంచెలంచెలుగా ఎదుగుతుంటారు. లేకుంటే రిటైర్‌ అయ్యే సమయంలో రాజీనామాలు చేసి రాజకీయాల్లోకి వస్తుంటారు. కాని ఇంకా ఎంతో ఉద్యగ భవిష్యత్తు వున్న వ్యక్తి రాజీనామా చేశానని చెప్పి, ప్రజలను నమ్మించి రాజకీయాల్లో వస్తున్నానంటే ఎవరూ నమ్మరు. కారణం ఆ ఉద్యోగం ఎటూ పోదు. ఇంకా రెండేళ్లకైనా సరే ఆ ఉద్యోగం మళ్లీ వస్తుంది. అవసరమైతే ఆ జీతమంతా కలుపుకొని కొలువొస్తుంది. ఈ జిమ్మిక్కులు సామాన్యులకు తెలియవు. ఏదొ కారణం చెప్పి కోర్టును ఆశ్రయిస్తారు. ఇలా రాజీనామాలు చేసి, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మళ్లీ కొలువులు తెచ్చుకున్నవారు అనేక మంది వున్నారు. ఇలా ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయడం త్యాగం కాదు. ప్రజలను మోసం చేయడం. అద్యాపక వృత్తిలో వుంటూ నీతి, నిజాయితీని సమాజానికి పంచాల్సిన వ్యక్తి అబద్దాల పునాదుల మీద, అసత్యాలతో రాజకీయాలు చేయాలనుకోవడం తప్పు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ తన కొలువు తిరిగి తెచ్చుకోవడం కోసం న్యాయ స్దానాలను కూడా మోసం చేస్తారు. ఇలా కోర్టులను కూడా మోసం చేయగలిగిన వాళ్లు ప్రజలను మోసం చేయకుండా వుండగలరా? నల్లగొండ ఉపాధ్యాయ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధికూడా ఇలాగే తన ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ చేస్తున్నారు. తర్వాత ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకొని, వారు కోరినంత ముట్ట జెప్పి, కోర్టును కూడా ప్రబావితం చేసి ఉద్యోగాలు తెచ్చుకుంటారు. అందువల్ల హరికృష్ణ చెబుతున్నది అబద్దమని, త్యాగం అసలే కాదని ఇక్కడే తేలిపోయింది. ఇంకా ఆయనను ప్రజలు నమ్ముతారని అనుకోవడం విచిత్రం. ఇక కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంటుగా పోటీకి నామినేషన్‌ వేసిన హరికృష్ణ కొంతకాలంగా తాను బిసినంటూ బిసీ వాదం వినిపిస్తూ వచ్చారు. బిసిలను సంఘటితం చేసి విజయం సాధిస్తాననుకున్నారు. కాని అటు వంటి దారి ఎక్కడా కనిపించలేదు. దాంతో రాత్రికి రాత్రి బిఎస్పీ కండువా కప్పుకున్నారు. బిఎస్పీ కార్యకర్తలైన పట్టుబద్రుల వద్దకు వెళ్లినప్పుడు బిఎస్పీ కండువా కప్పుకుంటున్నారు. ఇతర బిసి పట్టభద్రుల వద్దకు వెళ్లినప్పుడు బిసి కండువాతో ప్రచారం సాగిస్తున్నారు. తాను ఎంత ఊసరవెళ్లి రాజకీయాలను చేయగలనో ఇక్కడే ఆయన చూపించుకుంటున్నారు. ఈ రెండిరటికన్నా మరో భయంకరమైన నిజం హరికృష్ణ రాజకీయంలో దాగి వుంది. గత ప్రభుత్వ సమయంలో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగాలు లేకున్నా, అప్పటి ప్రభుత్వం చెప్పే మాటలతో కోచింగ్‌ సెంటర్లన్నీ కళకళలాడుతుండేవి. కోచింగ్‌ సెంటర్లు కూడా ఇదిలో ఈ నోటిఫికెషన్‌ వచ్చే, ఆ నోటిఫికేషన్‌ వచ్చే అని ప్రచారం చేసుకోవడానికి వీలుండేది. ప్రభుత్వం నుంచి ఉద్యోగాల కల్పన ప్రకటన వచ్చిన నాటి నుంచి కోచింగ్‌ సెంటర్లప్రచాం మొదలు పెట్టేవి.తెలంగాణ వచ్చిన తర్వాత లక్ష ఉద్యోగాలు ఇస్తామని గత బిఆర్‌ఎస్‌పాలకులు చెప్పడంతో గ్రామీణ ప్రాంతాల పట్టభద్రులు పెద్దఎత్తున నగరాలకు చేరుకుంటూ వుండేవారు. ముఖ్యంగా హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఉమ్మడిజిల్లాల కేంద్రాలలో పెద్దఎత్తున వెలసిన కోచింగ్‌ సెంటర్లలో చేరేవారు. దాంతో కోచింగ్‌ సెంటర్లకు కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేది. కాని ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు వేయడం నిర్ణీత గడువు ప్రకటించడం, పరీక్షలు నిర్వహించడం కోచింగ్‌ సెంటర్లబొచ్చేలో రాయి వేసినట్లైంది. కోచింగ్‌ సెంటర్లు వెలవెలబోతున్నాయి. కొన్ని దశాబ్ధాలుగా ఏటా కిటకిటలాడే కోచింగ్‌ సెంటర్లు మూసుకోవాల్సిన పరిస్ధితి విచ్చింది. ఆ మధ్య డిఎస్సీ, గ్రూప్‌ వన్‌ ల మీద పెద్దఎత్తున సొమ్ము చేసుకోవాలని చూసిన కోచింగ్‌ సెంటర్లు, అభ్యర్ధులను రెచ్చగొట్టి రోడ్లమీదకుతెచ్చింది. పరీక్షలు వాయిదా వేయాలని ఉద్యమాలు చేయించింది. అయినా ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా ఉద్యోగ పరీక్షలు నిర్వహించింది. దాంతో కోచింగ్‌ సెంటర్ల గొంతులో వెలక్కాయ పడినట్లైంది. ఇకపై ప్రభుత్వం తమ చెఫ్పుచేతుల్లో వుండాలన్న ఆలోచనతో కోచింగ్‌ సెంటర్లన్నీ ఏకమై ఎమ్మెల్సీ ఎన్నికల ఖర్చు భరించేందుకు ముందుకు వచ్చి, హరికృష్ణను రంగంలోకి దింపాయి. గుట్టు చప్పుడు కాకుండా కాంగ్రెస్‌ పార్టీనుంచి టికెట్‌ తెచ్చుకునేలా హరికృష్ణ కూడా వ్యూహం పన్నారు. ఎందుకంటే ఆయన ఓ వైపు కాంపిటీటివ్‌ పరీక్షల కోసం పుస్తకాలు రాస్తూ , అదనపు ఆదాయం సమకూర్చుకుంటుంటారు. కోచింగ్‌ సెంటర్లకు ద్వారా వాటిని అమ్ముకుంటుంటారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే ప్రభుత్వం కోచింగ్‌ సెంటర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. పట్టభద్రుల నుంచి కోచింగ్‌ల పేరిట కోట్లు సంపాదించుకోవాలని చూశారు. కాని హరికృష్ణ ఆశలు కాంగ్రెస్‌ పార్టీ ద్వారా తీరలేదు. ఆయనకు టికెట్‌ రాలేదు. అయినా సరే కొండంత అండగా కోచింగ్‌ సెంటర్లు వుండడంతో ఆయన ఇండిపెండెంటుగా నామినేషన్‌ వేశారు. బిఎస్పీ కండువా కంప్పుకొని తిరుగుతున్నారు. ఈ విషయాలు పట్టభద్రులు తెలుసుకుంటే ఆయన అసలు నిజస్వరూపం తెలిసిపోతుంది. చైతన్య వంతులైన పట్టభద్రులను మోసం చేయడం ఎవరి వల్ల కాదన్నది ప్రజల అభిప్రాయం. ఎన్నికలంటేనే ఎన్నెన్నో లెక్కలు..విద్యలు..ఎత్తులు..జిత్తులు…కథలు…నటనలు..సానుబూతి పవనాలు. .ఇన్ని దాగి వుంటాయి. కాని కొన్ని ఎన్నికలు అలా వుండకూడదు. ముఖ్యంగా పెద్దల సభకు జరిగే ఎన్నికలైనా నీతిగా, నిజాయితీ వుండాలని రాజ్యాంగ పెద్దలు కొన్ని నియమనిబంధనలు ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీలు వాటిని కూడా తుంగలో తొక్కడం అలవాటు చేసుకున్నారు. ఎన్నికల వ్యవస్దలో వున్న లొసుగులను ఆసరాగా చేసుకుంటున్నారు. ఇక తీర్పునివ్వాల్సింది పట్టభద్రులే…

కలెక్టర్ పై అసత్య ప్రచారాలు చేసే వారి పై కేసులు నమోదు

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ పై ఎటువంటి కేసులు లేవు
అసత్య ప్రచారాల నేపథ్యంలో పత్రికా ప్రకటన విడుదల చేసిన జిల్లా కలెక్టర్

సిరిసిల్ల(నేటిధాత్రి):

సిరిసిల్ల జిల్లా కలెక్టర్ వ్యక్తిత్వాన్నికి మచ్చ తెచ్చెలా అసత్య ప్రచారాలు చేసే వారి పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తన పై వివిధ కేసులు ఉన్నట్లుగా సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని, తన పై ఎటువంటి కేసులు లేవని, తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సామాజిక మాధ్యమాలు పోస్ట్ చేస్తున్న వారి పై, అసత్యాలను ప్రచారం చేస్తున్న వారి పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటానని , ఇప్పటికే కొంత మంది పై కేసులను నమోదు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
అసత్య ఆరోపణలు, కట్టుకథల ఆదారంగా మీడియా సామాజిక మాధ్యమాలలో వార్తలను ప్రచారం చేయవద్దని అనవసరంగా కేసులలో ఇరుక్కోవద్దని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ

నేటి యువత ఛత్రపతి శివాజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని మాజీ మంత్రి లోక సభ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు.కమలాపూర్ మండలం నేరెళ్ల గ్రామంలో ఆరె సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని, విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ చత్రపతి శివాజీ మహారాజ్ 395 వ జయంతి ఉత్సవాలు
ఆరె సంక్షేమ సంఘం నేరెళ్ల గ్రామ కమిటీ ఆధ్వర్యం బాసిరి కిరణ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.మహారాష్ట్రలో సాధారణ కుటుంబంలో పుట్టిన శివాజీ స్వశక్తితో ఒక రాజ్యాన్ని స్థాపించి,దేశంలోని బహుజనుల చీకటి బతుకుల్లో దారి దివిటీ అయ్యాడని,స్వరాజ్యంలో రైతులు, స్త్రీలు, అప్పుృశ్యులు, గిరిజనులు, సబ్బండ వర్గాలను భాగస్వామ్యం చేసి బహుజన నిర్మాణం ఎలా ఉండాలో శివాజీ పాలన నేటి పాలకులకు ఆదర్శం అని,ఆయన మార్గాన్ని అందరూ అనుసరించాలన్నారు.ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెట్టుపెల్లి
శివాజీ మాట్లాడుతూ రాజులు పోయారు,రాజ్యాలు విచ్చిన్నమయ్యాయి కాని
శివాజీ లాంటి బహుజన పాలకుడిని కీర్తి ప్రపంచానికి చాటాలన్నారు.వియత్నాం వంటి దేశం ఛత్రపతి స్పూర్తితో యుద్ధంలో విజయం సాధించిందని పేర్కొన్నారు.ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ జెండా రాజేష్ మాట్లాడుతూ ఓబీసీ కోసం నిరంతరం పోరాడుతున్నామని,ఆ కలను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని అన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ అనంతరం బూర్గుల సమ్మయ్య ఇంటిదగ్గర భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వలిగే సాంబారావు,విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మోటె చిరంజీవి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు శివాజీ,ప్రధాన కార్యదర్శి కిషన్ రావు,నాయకులు లక్ష్మణ్ రావు,సుకిన సంతాజి,తిరుపతి రావు, దామోదర్,
లింగమూర్తి,కండె రావు,చందర్రావు,భాస్కర్,మరియు ఆరె కుల నాయకులు నేరెళ్ల గ్రామాస్తులు పాల్గొన్నారు.

New FASTag rules

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఫిబ్రవరి 17 నుండి అమలులోకి వచ్చిన కొత్త ఫాస్ట్‌ట్యాగ్ నియమాలను ప్రకటించింది. NPCI ప్రకారం, టోల్ ప్లాజాలో ట్యాగ్‌ని స్కాన్ చేసిన క్షణం నుండి నిర్దిష్ట సమయ వ్యవధిలో ఫాస్ట్‌ట్యాగ్ చెల్లింపులు ధృవీకరించబడతాయి. కొత్త నియమాలు మోసాన్ని తగ్గించడం మరియు టోల్ చెల్లింపు సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ప్రజలను రెచ్చగొట్టేలా విమర్శలు చేయడం సబబు కాదు

ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు బిఆర్ఎస్ నాయకులకు లేదు

చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గోనె ఎల్లప్ప

సిరిసిల్ల(నేటి ధాత్రి):
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డిని తిట్టడం తప్ప బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏమీ పని లేదని చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గోనె ఎల్లప్ప సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ లో తెలపడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 222 కొట్ల బతుకమ్మ చీరల బకాయిలను ఉంచిపోగా నేటి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 202 కోట్ల బకాయిలను చెల్లించి, పోచంపల్లిలో ఉన్న స్టాక్ ను కూడా కొనుగోలు చేసేలా కార్మికులను, వస్త్ర పరిశ్రమను ఆదుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు.
సిరిసిల్ల మున్సిపాలిటీ పందులతో అపరిశుభ్రతతో ఉందనడము సబబు కాదని టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా పందులు ఉండేవని అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంగా మారింది కాబట్టి జిల్లా కేంద్రానికి కావలసిన వసతులను సమకూరుస్తూ కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కాలేజ్ వంటి పనులు అవసరం కనుక అభివృద్ధి పనుల్లో భాగంగా సిరిసిల్ల అభివృద్ధి చెందింది తప్ప ప్రత్యేకంగా మీరు చేసింది ఏమీ లేదని అన్నారు.
కేవలం మీరు మీ పార్టీ నాయకులు అభివృద్ధి చెందారని, కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని అన్నారు.
బాపు కేసీఆర్ అభివృద్ధి చేశాడని అంటున్నారు కాబట్టి ప్రభుత్వం చేసిన అప్పులకు బాధ్యత వహించి మీరు కడతారా అన్నారు.
ఆనాడు ఉద్యమంలో కెసిఆర్ నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలు చేస్తూ ఉద్యమం నడిపించారు అందులో మేమందరం కూడా ఆ నినాదాలకు కట్టుబడే ఉద్యమంలో పాల్గొన్నాము కాబట్టే అందులో భాగంగానే ప్రాజెక్టు లు కట్టాడని అన్నారు.
కేకే మహేందర్ రెడ్డి ఆనాడు ఉద్యమంలో టిఆర్ఎస్ పార్టీకి ఎంతగానో పనిచేసే ప్రజా ప్రతినిధులను గెలిపించుకుని పార్టీని విస్తరించాడు ఈనాడు విమర్శలు చేస్తున్నరన్నారు. ఆనాడు ఏ పార్టీలో ఉండేవారు ఏ స్థాయిలో ఉండేవారు మర్చిపోవద్దని అన్నారు.
ఈనాడు అనవసరపు విమర్శలు చేస్తున్నవారు కేకే మహేందర్ వెంట తిరిగిన వారేనని గుర్తుంచుకోవాలని అన్నారు.
కేకే మహేందర్ వేంట తిరిగిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయనను వెన్నుపోటు పొడిచి డైరెక్ట్ గా కేటీఆర్ ను తీసుకువచ్చి కేవలం 170 ఓట్లతో గెలిపించుకున్నారని అన్నారు. ఇది వెన్నుపోటు కాదా అని అన్నారు.
లేకుంటే ఏనాడో కేకే మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే మినిస్టర్ వంటి పదవులు చేపట్టేవారని అన్నారు.
ఆయన గెలిచే టైంలో నోటికాడబుక్కను గుంజుకున్నట్టు చేసింది మీరు కాదా, అలాంటి మీరు కేకే మహేందర్ రెడ్డిని పదేపదే ఓడిపోతున్నాడని విమర్శించడం సరికాదని అన్నారు..
ఇక్కడ వనరులను దోచుకుంది మీరు, ఏ హోదా ఉందని ఎవర్ని భయపెట్టాలని గన్ మెన్ లని పెట్టుకున్నారని అన్నారు. భూకబ్జాలు చేసింది మీరు కాదా అని అన్నారు..
ప్రజలను రెచ్చగొట్టేలా విమర్శలు చేయడం సబబు కాదని అన్నారు.
ఈ కార్యక్రమంలో చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గోనె ఎల్లప్ప,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకులూరి బాలరాజు, తిరుపతి రెడ్డి,నలిని కాంత్,కోడం అమర్నాథ్, కొడిక్యాల రవి, బొద్దుల శీను, ఇసుక మధు, వేముల రవి,వంగరి దత్తు తదితరులు పాల్గొన్నారు.

జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి.

జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ వి.బి.నిర్మలా గీతాంబ

వరంగల్, నేటిధాత్రి (లీగల్), ఫిబ్రవరి, 19:-

జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్- మార్చి, 08వ తేదీన శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించతలపెట్టామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ వరంగల్ వి.బి.నిర్మలా గీతాంబ తెలియజేశారు.
ఈ సందర్భంగా న్యాయ సేవా సదనం బిల్డింగ్ లో రెండు వేర్వేరు సమావేశాలను నిర్వహించడం జరిగింది. మొదటగా ఇన్సూరెన్స్ సంబంధ, చిట్ ఫండ్ కంపెనీ మరియు బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఆ తర్వాత పోలీసు ఉన్నతాధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు మాట్లాడుతూ “రాజీ మార్గమే రాజమార్గం” అని తెలిపారు. మార్చి, 08-2025 శనివారం రోజున నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ లో రాజీ పడదగు క్రిమినల్, సివిల్, వివాహ /కుటుంబ తగాదా కేసులు, మోటార్ వెహికల్ యాక్ట్, బ్యాంకు, చిట్ ఫండ్, ఎక్సైజ్ కేసులు, ఎలక్ట్రిసిటీ సంబంధ కేసులను మరియు రాజీ పడదగు ఇతర కేసులు పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కనుక ఇన్సూరెన్స్ బ్యాంకు మరియు చిట్ ఫండ్ అధికారులు కోర్టులలో పెండింగ్ లలో ఉన్న తమ తమ కేసులను అధిక సంఖ్యలో పరిష్కరించుకొని లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని కోరారు.
కావున కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకుని, ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించుకోవాలని తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ లో అధిక కేసుల పరిష్కారానికి తేదీ:17.02.2025 నుండి ప్రి-లోక్ అదాలత్ ను న్యాయ సేవాధికార సంస్థ, వరంగల్ ఆధ్వర్యంలో ప్రారంభించామని తెలిపారు. ఈ ప్రి-లోక్ అదాలత్ కక్షిదారుల కేసును ఇరుపక్షాల అంగీకారంతో రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవడానికి సులభతరం అవుతుందని భావిస్తున్నాము.
ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి యం.సాయికుమార్, వరంగల్ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు తీగల. జీవన్ గౌడ్, పోలీస్ ఉన్నతాధికారులు షేక్ సలీమా, రవీందర్ ఇతర పోలీసు అధికారులు, ఎక్సైజ్ అధికారులు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లు, బ్యాంకు, ఇన్సూరెన్స్, చిట్ ఫండ్ అధికారులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

విపక్షాల వైఖరి మారాలి

బలమైన ప్రతిపక్షానికి సహేతుక సిద్ధాంతం అవసరం

కలగూరగంప రాజకీయాల వల్ల ఒరిగేదేమీ వుండదు

 

ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పును గుర్తించని విపక్షాలు

అధికార దాహం తప్ప బలమైన నాయకుడేడీ?

 

ఉచితాలు మితిమీరి మునుగుతున్న రాష్ట్రాలు

ఒక వర్గం ప్రయోజనం కోసం మరో వర్గం బలి!

 

ఇదీ విపక్షాల ‘సెక్యులర్‌’ సిద్ధాంతం!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

స్వాతంత్య్రం వచ్చిననాటినుంచి పరిశీలిస్తే మనదేశంలో అధికారంలో ఉన్న పార్టీ ఆధిపత్యమే అ ప్రతిహతంగా కొనసాగింది తప్ప, విపక్షాల వాణి ఎప్పుడూ బలహీనంగానే వుంటూ వచ్చింది. కాంగ్రెస్‌కు సైద్ధాంతికంగా బలమైన ప్రత్యామ్నాయాలుగా వున్న కమ్యూనిస్టు పార్టీలు నేడు పూర్తి శిథిలావస్థకు చేరుకున్నాయి. అవినీతికి వ్యతిరేక పోరాటంలో పుట్టుకొచ్చిన ఆమ్‌ ఆద్మీపార్టీ, తె లంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రసమితి (తర్వాత బీఆర్‌ఎస్‌గా మా రింది) ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు చతికిలపడటం తాజాపరిణామం. సైద్ధాంతిక దివాలకోరుత నంతో అధికారమే పరమావధిగా రాజకీయాలు నడుపుతున్న కాంగ్రెస్‌ అంపశయ్యవైపు అడుగులేస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికారంలో కొనసాగుతూ వస్తున్నప్పటికీ హింసారాజకీయమే దానికి ఊతంగా నిలుస్తోంది. మొత్తంమీద చెప్పాలంటే దేశంలో విపక్షాలు యుద్ధంలో అన్ని ఆస్త్రాలను కోల్పోయి నిర్వీర్యమైన దుస్థితికి చేరుకున్నాయనడంలో సందేహం లేదు. ఇందుకు ప్రధాన కారణాన్ని విశ్లేషించాల్సిన ఆవశ్యకత ఏర్పడిరది. ముఖ్యంగా విభిన్న సైద్ధాంతిక నేపథ్యాలు కలిగిన బలమైన ప్రతిపక్షాలు ఎంత బలంగా వుంటే ప్రజాస్వామ్యం అంత పటిష్టంగా మనుగడ సాగిస్తుందనేది ఒక అభిప్రాయం. కానీ స్వాతంత్య్రం వచ్చిననాటినుంచి విప క్షాలు బలంగా ఉన్నది ఎప్పుడూ లేదు! బలంగా ఉన్న కొద్దికాలంలో అవి ప్రభుత్వాలను స్థిరంగా పాలన సాగించనివ్వనూ లేదు! ఈ రెండూ చెప్పడానికి విచిత్రంగా వున్నా, అక్షరసత్యం!

ఛరిష్మా రాజకీయాలు

ఏ రాజకీయ పార్టీ అయినా తాము నమ్మిన కొన్ని సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడు వారి ఆమోదం లభిస్తేనే దానికి మనుగడ వుంటుందనేది అందరికీ తెలిసిందే. స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో కాంగ్రెస్‌పై స్వాతంత్య్రోద్యమ ప్రభావం వుండటంవల్ల అప్రతిహతంగా అధికారంలో కొనసాగగలిగింది. ఈ ఛరిష్మాముందు కమ్యూస్టుల సిద్ధాంతాలు పనిచేయలేదు. ఒకదశలో కాంగ్రెస్‌ను ఢీ అంటే ఢీ అనే స్థితి ఏర్పడినా స్వీయ తప్పిదాలు, అంతర్గత సైద్ధాంతిక విభేదాలు కమ్యూనిస్టుపార్టీని దెబ్బతీసాయి. ఒకరకంగా చెప్పాలంటే కాంగ్రెస్‌ పార్టీకూడా సిద్ధాంత నేపథ్యం కంటే, నె హ్రూ, ఇందిరాగాంధీ ఛరిష్మాపైనే నెట్టుకొచ్చింది. ఇప్పుడు ఆ ఛరిష్మా కలిగిన నాయకులు లేకపోవడంతో పార్టీ కోటలు ఒక్కటక్కటిగా కుప్పకూలిపోవడం మొదలైంది. ఇక కమ్యూనిస్టులో పరిపాలనా పరంగా ‘లిబరల్‌’, ‘నియో`లిబరల్‌’ విధానాల మధ్య ఊగిసలాట వైఖరి కొనసాగింది.

అవినీతిపై పోరాటం, వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ ప్రాధాన్యతల ఆధారంగా కొనసాగే ఉద్యమ నేపథ్యంలో అధికారంలోకి వచ్చే పార్టీల మనుగడ ఆయా పరిస్థితులు చక్కబడేంతవరకే వుంటుంది. ఆయా సమస్యలు తీరిన తర్వాత ప్రజలు సహజంగానే వాటిని మరచిపోతారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధారణ ప్రజలు తమకు కనీసావసరాలపై దృష్టిపెడతారు తప్ప మిగిలినవి వారికి పట్టవు. ఇవి అన్ని వర్గాలు, కులాలు, మతాలవారికీ ఒక్కటే కనుక ప్రస్తుతం రాజకీయ పార్టీలు ‘సంక్షేమం’ పేరుతో ఉచితాలను ఇవ్వడం మొదలుపెట్టాయి. ఇవి ఒక పరిమితిని దాటిపోవడం తో అమలు చేయలేక అధికార పార్టీలు సతమతమవుతుంటే, మరోవైపు రాష్ట్రాల ఆర్థికవ్యవస్థలు కుప్పకూలడం వర్తమాన చరిత్ర! విపక్షాలు చేస్తున్న మరో తప్పిదమేమంటే ‘సెక్యులరిజం’ పేరు తో మెజారిటీ ప్రజలను నిర్లక్ష్యం చేయడం, మైనారిటీలను విపరీతంగా బుజ్జగించడం! ఇదికూడామెజారిటీ ప్రజల్లో వారిపట్ల వ్యతిరేకత పెరగడానికి ప్రధాన కారణం! అదే ముస్లింలు లేదా క్రైస్తవులు బలీయంగా వుండి, హిందువులు మైనారిటీలుగా ఉన్న రాష్ట్రాలు లేదా ప్రాంతాల్లో ఈ పార్టీల వైఖరి మైనారిటీలకు అనుకూలంగా వుండదు. ఈ రెండు నాల్కల ధోరణిని మెజారిటీ వర్గాలుగుర్తించడమే వాటి పతనానికి ప్రధాన కారణం

జాతీయవాదానికి కారణం

ఒక జాతిప్రజలు తమ సంస్కృతిాసంప్రదాయాలకు భంగం వాటిల్లుతుందని భయపడినప్పుడు, వారిలో జాతీయవాదం క్రమంగా పెరుగుతుందనేది వర్తమాన చరిత్ర చెబుతున్న సత్యం. ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో సెక్యులర్‌ ప్రభుత్వాల మితిమీరిన మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు, జాతీయవాదం ప్రబలడానికి ప్రధాన కారణమవుతున్నాయి. ఒక జాతి తన మనుగడకు ప్ర మాదం వాటిల్లుతుందని లేదా మరొక సంస్కృతి తన అస్తిత్వానికే భంగకరంగా మారిందని భా వించినప్పుడు ఉద్భవించే జాతీయవాదాలు ప్రజాస్వామ్యంలో కొత్త పోకడలను ఆవిష్కరిస్తాయి. ఐరోపా దేశాలు ప్రస్తుతం ఈ పోకడలకు గొప్ప ఉదాహరణ. మనదేశంలో జమ్ముాకశ్మీర్‌కు చెందిన నాలుగు లక్షలమంది కాశ్మీరీ పండిట్లు ఇప్పుడు స్వదేశంలోనే కాందిశీకులుగా బతుకులీడవా ల్సిన దుస్థితికి ఇస్లామిక్‌ ఉగ్రవాదంతో పాటు, సెక్యులర్‌ పార్టీల పక్షపాత, నిర్లక్ష్య ధోరణి ప్రధాన కారణం. సెక్యులర్‌ ప్రభుత్వాల మితిమీరిన బుజ్జగింపు రాజకీయాలకు విసిగిన ప్రజలు క్రమం గా జాతీయవాద పార్టీ అయిన బీజేపీ వైపు మొగ్గు చూపారు. దాదాపుగా ఇదే పరిస్థితి యూరప్‌ దేశాల్లో ప్రస్తుతం నెలకొంది. ఇస్లామిక్‌ ఉగ్రవాదం కారణంగా తమ అస్తిత్వానికి భంగం వాటిల్లుతున్నదని అక్కడి ప్రజలు భయపడుతుండటంతో క్రమంగా అక్కడ జాతీయవాద పార్టీలు అధికా రంలోకి రావడమో, పెద్ద పార్టీలుగా అవతరించడమో జరుగుతోంది. 2010కి ముందు ఈ దేశాల్లో మొత్తం పోలైన ఓట్లలో జాతీయవాద పార్టీల వాటా 3% కంటే తక్కువ వుండేది. తర్వాతి కా లంలో స్వీడన్‌లో 12%కు, ఫిన్లాండ్‌లో 18%, హంగరీలో 19%కు పెరగడం ఆయా దేశాల సా మాజిక వర్గాల్లో పెరుగుతున్న సాంస్కృతిక అభద్రతాభావానికి చిహ్నం. ఈ పరిణామాలను మన దేశంలో కమ్యూనిస్టులతో సహా సెక్యులర్‌ పార్టీలుగా చెప్పుకునేవారు గుర్తించకపోవడం విచారకరం. 

ప్రాధాన్యత లేని అంశాలపై పోరు

పెట్టుబడిదార్లను, భూస్వాములను వ్యతిరేకిస్తూ ప్రాభవంలోకి వచ్చిన కమ్యూనిస్టు పార్టీలు తమ ప్రాభవం కోల్పోవడానికి ప్రధాన కారణం ఈ రెండు అంశాలకు ఇప్పుడు ప్రాధాన్యత లేకపోవడమే. ఒక పెట్టుబడిదారు సంస్థను స్థాపిస్తే ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి లభిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ట్రేడ్‌యూనిన్లు హక్కులకోసం పోరాటం తప్ప, బాధ్యతలపై దృష్టిపెట్టకపోవడంతోఅవి దేశ ఆర్థిక వ్యవస్థకే గుదిబండల్లా మారిపోయి, చివరకు ప్రైవేటీకరణకు గేట్లు తెరవాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఇక భూస్వామ్య వ్యవస్థ విషయానికి వస్తే ఇప్పుడు ప్రతిదీ కార్పొరేటీకరణ జరుగుతున్న కాలం ఇది. జనాభా విపరీతంగా పెరిగి కమతాల విస్తీర్ణం కుంచించుకుపోతున్న నేప థ్యంలో ఎవరికీ కడుపునిండని దుస్థితి! ఈ నేపథ్యంలో ప్రజల ఆలోచనా విధానాల్లో సమూల మార్పులు వచ్చేశాయి. లాభదాయకమైన ఉపాధి అవకాశాలవైపు దృష్టి సారించడం మొదలవడంతో భూస్వామ్య వ్యవస్థపై పోరాటానికి విలువేలేకపోయింది. సాయుధపోరాటం పేరుతో వాపపక్షతీవ్రవాదం ఇప్పుడు శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తోంది. దీనికి తోడు ముస్లిం మత ఛాందస వాదం ప్రపంచ దేశాల అస్తిత్వానికే ప్రమాదకరంగా మారింది. అభివృద్ధి నిరోధకంగా, హింసను ప్రజ్వరిల్లజేస్తున్న ఈరెండు రకాల ఉగ్రవాదాలను కఠినంగా అణచివేయాలని ప్రపంచ దేశాలు నిర్ణయించిన నేపథ్యంలో వీటికి ప్రజలనుంచి మద్దతు లభించదు. వామపక్ష ఉగ్రవాద సమర్థకు లు ‘యుద్ధం’, ‘రణరంగం’ వంటి అతిపెద్ద పదాల ప్రయోగం చేస్తుంటారు. బలమైన వ్యవస్థతో సాయుధపోరాటం పనిచేయదన్నది ప్రపంచ వ్యాప్తంగా నిరూపితమైన సత్యం. తమ భావజాలాన్నిమార్చుకొని వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా మలచుకుంటే, ప్రజల్లో మద్దతుకోసం ముందుకు సాగవచ్చు. అసలు ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ తంత్రమే మారిపోయిన కాలమిది. ఇక ముందు ఆయుధాలు పనిచేయవు! అంతా డిజిటల్‌ పద్ధతిలోనే యుద్ధాలు జరుగుతాయి!

చరిత్ర ఒకప్రవాహం

చరిత్ర అనేది ఒక ప్రవాహం వంటిది. ఒక్కో కాలంలో ఒక్కో వాదం, సిద్ధాంతం బహుళ ప్రాచు ర్యం పొందుతాయి. ఒక కాలంలో ప్రధాన సమస్యగా వున్నది అనంతరకాలంలో కనుమరుగు కావచ్చు. ఎందుకంటే ఆ సమస్యపై ఆ కాలంలో జరిగిన పోరాటం విజయం సాధించడం వల్ల. ఆసమస్యకు పరిష్కారం లభించిన తర్వాత ఇక ఆ వాదంతో పనివుండదు. కానీ అదేవాదాన్ని పట్టుకు వేలాడతానన్న వారికి మనుగడ వుండదు! దళితవాదం, స్త్రీవాదం వంటి అనేక వాదాలు ఒకప్పుడు బహుళ ప్రచారం పొందడానికి ప్రధాన కారణం ఆయా వర్గాలు తీవ్ర అణచివేతను ఎదు ర్కొనడం! ఈ సిద్ధాంతాల నేపథ్యంలో జరిగిన సంఘర్షణ పుణ్యమాని వీరిపై అణచివేత తగ్గుముఖం పట్టడంతో క్రమంగా ఆయావాదాలు కనుమరుగైపోతాయి. ఇప్పుడు క్రమంగా పురుషుల పైవేధింపులు పెరుగుతున్నాయి! మరిప్పుడు ‘పురుషవాదం’ రావాలా? పిల్లల్ని మేమెందుకు కనాలి? అనే ధోరణి క్రమంగా పెరుగుతున్న రోజులివి. ఈ నేపథ్యంలో సాంకేతిక సహాయంతో బిడ్డలను కనేరోజులు మొదలయ్యాయి! ఇంతటి మార్పు వస్తున్న తరుణంలో స్త్రీవాదం పనిచేస్తుందా? సామాజికంగా సమానత్వం పరిఢవిల్లుతున్న నేటి కాలంలో పేదరిక నిర్మూలన, ఉపాధికే ప్రాధా న్యత వుంటుంది తప్ప దళితవాదానికి ప్రాధాన్యత ఎక్కడ? హింసకు లేదా అత్యాచారానికి గురైన వ్యక్తి పేద లేదా మహిళ లేదా మరే ఇతరులైనా చట్టపరమైన న్యాయాన్ని పొందడానికి అర్హులవుతారు. పీడితుడికి కులం, మతం, ప్రాంతం అనేవి వుండవు. ఎవరైనా వేధింపులకు గురైనప్పుడు పోలీసులను ఆశ్రయించి న్యాయం పొందవచ్చు. మహామహులు, తాము గొప్ప నాయకులనుకుంటున్నవారే జైళ్లకు వెళ్లే రోజులివి! 

విపక్షాల మార్కు సెక్యులరిజం

ఇంత విశ్లేషణ తర్వాత మనకు అర్థమయ్యేది ఒక్కటే! మెజారిటీ, మైనారిటీ, ధనిక, పేద అనే తే డా లేకుండా అందరికి సమానత్వం, సమాన న్యాయం జరగడమే సెక్యులరిజం. కానీ విపక్షాలు సెక్యులరిజం పేరుతో తమకు ప్రయోజనం వుంటుందనుకున్న వర్గాన్ని మాత్రమే వెనకేసుకొచ్చి, మరొక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి. విపరీత స్థాయిలో బుజ్జగింపులకు పాల్పడుతున్నాయి. ఇదే వాటి పతనానికి ప్రధాన కారణం! ఓట్లకోసం సైద్ధాంతిక నిబద్ధతను గాలికొదిలేయడం విపక్షాలు వరుస పరాజయాలు ఎదుర్కొనడానికి మరో కారణం! నిజం చెప్పాలంటే మైనారిటీల పేరు తో ‘మతవాదాన్ని’ సమర్థిస్తున్నవి ఈ పార్టీలే. మెజారిటీ వర్గం మేల్కంటే, దాన్ని ‘మతోన్మాదమంటూ’ గగ్గోలు పెట్టడం వీటికి ఫ్యాషనైపోయింది. ఇప్పటికీ ఇవి తమ లోపాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడంలేదంటే, ఈ వాస్తవాన్ని ఇంకా గుర్తించలేదని అర్థం. సైద్ధాంతిక నిబద్ధత కలిగిన కమ్యూనిస్టులు తమ సిద్ధాంతాలను కాలానుగుణంగా, మనదేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మార్పుచేసుకోవడానికి అంగీకరించరు. అధికారం పొందడం మాత్రమే సిద్ధాంతంగా కలిగిన మిగిలిన పార్టీలు తమ విపరీత పోకడలను మార్చుకోరు. మనదేశంలో విపక్షాలు బలోపేతం కాకపోవడానికి ఇది మరో కారణం! లౌకికవాదం ముసుగులో రాజ్యాంగాన్ని హతమార్చి హిం దువులకు వ్యతిరేకంగా వ్యవహరించిన కాంగ్రెస్‌ భయంకరమైన పాపాన్ని మూటకట్టుకుంది. 1975 నుంచి 1977 మధ్య 21నెలల పాటు ఎమర్జెన్సీ కాలంలో అరెస్టయింది, నష్టపోయింది హిందువులే! దేశాన్ని తల్లిగా పేర్కొంటూ, మాతృప్రేమను పెపొందించేది భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లు మాత్రమే! కులం, ప్రాంతం, భాష అనే కుంపట్ల మధ్య కునారిల్లుతున్న హిందువుల్లో తాము హిందువులమన్న జాగృతిని కలిగించింది కేవలం అయోధ్య రామమందిరం మాత్రమే. విభిన్న త్వం పేరుతో ప్రజలమధ్య విభేదాలు సృష్టిస్తూ ఓట్లను దండుకోవడానికి ప్రయత్నిస్తున్న విపక్షాల కుచ్చిత నీతిని ప్రజలు గుర్తించడంవల్లనే వాటికి ప్రస్తుత దుస్థితి. నేడు ప్రజలు ఒక సత్యాన్ని బాగా గుర్తించారనుకోవాలి. ఏంటంటే సన్యాసులు (కర్మయోగులు) పాలిస్తే కోట్లరూపాయల మిగు లు బడ్జెట్‌ వుంటోంది. అదే సన్నాసులు (స్వార్థపరులు) పాలిస్తే అప్పులే గతి!

సామాజిక న్యాయానికి కేరాఫ్‌ కాంగ్రెస్‌

`అంతర్గత ప్రజాస్వామ్యం.. సామాజిక న్యాయం!

`కాంగ్రెస్‌ కే చెల్లిన ఆదర్శ రాజకీయం

`అన్ని వర్గాలకు సముచిత స్థానం కాంగ్రెస్‌లోనే సాధ్యం

`ఉమ్మడి రాష్ట్రంలోనూ అనుసరించిన విధానం.. సమ ప్రాధాన్యం

`ఇప్పుడూ కాంగ్రెస్‌లో అందరికీ అందుతున్న పదవుల పంపకం

`మహిళా సాధికారతలోనే కాంగ్రెస్‌ పార్టీదే పై చేయి

`మహిళా విభాగానికి సైతం కాంగ్రెస్‌లో అధిక ప్రాధాన్యత

`పిసిసికి సమానంగా విభాగాలున్న ఏకైక పార్టీ కాంగ్రెస్‌

`అత్యధికంగా మహిళా ముఖ్యమంత్రులను చేసిన పార్టీ కాంగ్రెస్‌

`ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి సుచేత కృపలాని

`యుపి తొలి గవర్నర్‌ సరోజినీ నాయుడు

`కాంగ్రెస్‌ పార్టీ తొలి జాతీయ అధ్యక్షురాలు కూడా

`ఉప ప్రధానిగా, ముప్పై సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా పనిచేసిన జగ్జీవన్‌ రాం

`అన్ని స్థాయిలలో ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించిందే కాంగ్రెస్‌

`సామాజిక న్యాయంలో కాంగ్రెస్‌ ను మించిన పార్టీ లేదు

`ఇప్పుడు కూడా ఏఐసిసి. అధ్యక్షుడు ఖర్గే వున్నారు

`తెలంగాణలోనూ సమన్యాయ పాలన

`బీసీలకు సముచితమైన అవకాశాల కోసం కులగనణ

`పేద వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్‌ తోనే

`అన్ని తరగతుల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్‌ లోనే..

`రాజకీయ సమ ప్రాధాన్యత కేవలం కాంగ్రెస్‌ కే సొంతం

హైదరాబాద్‌,నేటిధాత్రి:
వాడుకోవడానికి వర్డ్‌ బాగుంది కదా! అని అందరూ సామాజిక న్యాయం అనే పదం వాడుతుంటారు. కాని అందులో నిజమెంత? దానిని అనుసరించే పార్టీల విజ్ఞతెంత? రాజకీయ పార్టీల నైతికతెంత? వారు అనుసరిస్తున్న విదానమెంత? అని చూసుకుంటే కాంగ్రెస్‌ పార్టీ అన్ని పార్టీ పార్టీలకంటే ఒకింత మేలనే చెప్పాలి. ఆది నుంచి చూసినా, ఇప్పుడు పరిశీలించినా కాంగ్రెస్‌ ఫార్టీ జరిగేంత సామాజిక న్యాయం మరే పార్టీలోనూ జరగదు. కాని తమ పార్టీలలో ఆ సామాజిక న్యాయం అనుసరించని పార్టీలన్నీ కాంగ్రెస్‌ను నిందిస్తుంటాయి. మన తెలుగు ఉమ్మడి రాష్ట్రంలో చూసినా, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చూసినా ఆయా పార్టీలలో ఎంత సామాజిక న్యాయం అమలు జరుగుతుందన్నది చూస్తే జల్లడ వేసినా కాంగ్రెస్‌ తప్ప మరో పార్టీ కనిపించదు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ వస్తే దళితుడే తొలి ముఖ్యమంత్రి అని కొన్ని వందల వేల సార్లు చెప్పింది కేసిఆర్‌. కొన్నివందల సార్లు తాను కాపాలా కుక్కలా వుంటానే తప్ప తెలంగాణకు ఎట్టిపరిస్ధితుల్లోనూ తొలి ముఖ్యమంత్రి దళితుడే అన్నారు. కాని తీరా బిఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకివచ్చిన తర్వాత కేసిఆర్‌ చేసిందేమిటి? కుర్చీలో తాను కూర్చున్నాడు. కీలక పదవులన్నీ రెండు సామాజిక వర్గాల చేతుల్లో పెట్టేశాడు. ప్రాధాన్యత లేని పదవులను కూడా కొన్ని సార్లు బిసిలకు, దళితులకు, గిరిజనులకు ఇచ్చేందుకు చేతులురాలేదు. కాని కాంగ్రెస్‌ పార్టీలో అలా వుండదు. కొంత రెడ్డి సామాజిక వర్గానిది కాంగ్రెస్‌ పార్టీలో పై చేయి వుంటుందన్నది వాస్తవం. కాని పూర్తిగా వారిదే పై చేయి వుంటుందనేది కూడా నిజం కాదు. బిసి నాయకులు ఎంతో మంది కాంగ్రెస్‌లో కీలక భూమికపోషించారు. ఇప్పుడూ క్రియాశీలక పాత్రలో వున్నారు. దేశంలోనే అన్ని వర్గాల ప్రజలకు అన్నింటా న్యాయం చేసిన పార్టీ ఏదైనా వుందంటే అది కాంగ్రెస్‌ పార్టీయే. ఎందుకంటే దేశ స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోనే సరోజినీ నాయుడుకు 1927లో జాతీయ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలును చేసింది. అసలు స్వాతంత్య్రోమ కాలంలో మహిళలకు అంత పెద్ద పదవి అందుతుందని ఎవరూ ఊహించలేదు. కాని తాను ఆ పదవి చేపట్టేందుకు సిద్దంగా వున్నానని చెప్పిన సరోజనీ నాయుడును కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షురాలని చేశారు. అంతే కాదు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌గా సరోజినీ నాయుడుకు అవకాశంకల్పించారు.1963లో ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా సుచేతా కృఫలానీని చేసిన ఘనతకాంగ్రెస్‌దే. అంతే కాకుండా కాంగ్రెస్‌ పార్టీ ఐదుగురు మహిళలను ముఖ్యమంత్రులను చేశారు. ఒడిషాకు చెందిన నందినీ సత్పతి, అస్సాంలో అన్వారా, డిల్లీ షీలా దీక్షిత్‌, పంజాబ్‌ రాజీందర్‌ కౌర్‌లను ముఖ్యమంత్రులను చేసింది కాంగ్రెస్‌ పార్టీ. కాని అది బిజేపిలో సాద్యమా? జన్‌సంఫ్‌ులో సాధ్యమైందా? ఆర్‌ఎస్‌ఎస్‌లో సాధ్యమౌతుందా? దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి మహిళా ముఖ్యమంత్రిని కూడా కాంగ్రెస్‌ పార్టీయే చేసింది. బిజేపిలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఉమా భారతి పరిస్దితి ఏమిటి? ఆమెను క్రియాశీల రాజకీయాలకు ఎందుకు దూరం చేశారు? ఎవరు దూరం చేశారు? బిజేపిలో జాతీయ అధ్యక్షురాలిగా మహిళను నియమించగలరా? కాని కాంగ్రెస్‌లో మహిళా విభాగం కూడా ప్రత్యేకంగా వుంటుంది. ఆ విభాగం కూడా కీలక భూమిక పోషిస్తుంది. కాని ఇతర పార్టీలలో ఆ విభాగాలు వున్నా, ఉత్సవ విగ్రహాలుగానే వుంటారు. తప్ప ఎక్కడా పార్టీ కమిటీకి సరిసమానమైన ప్రాధాన్యత వుండదు. కాంగ్రెస్‌ పార్టీలో చాల వరకు ఆ మహిళా విభాగానికి ఎంతో ప్రాదాన్యత వుంటుంది. అలా మహిళా అధ్యక్ష పదవులు నిర్వహించిన వాళ్లు మంత్రులయ్యారు. రాష్ట్ర రాజకీయాలను శాసించారు. అందులో గల్లా అరుణకుమారి. గీతారెడ్డి లాంటి వారు అనేక మంది వున్నారు. వాళ్లు ఎమ్మెల్యేలయ్యారు. పురుషాదిక్య సమాజంలో సమాన పాత్రలు పోషించారు. కాని బిజేపిలో ఆ పరిస్ధితి ఎక్కడా కనిపించదు. ఇదే విషయాన్ని పార్లమెంటులో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ దేశమంతా ప్రచారం చేస్తున్నారు. బిజేపిలో వ్యక్తి పూజలు ఎక్కువయ్యాయి. మహిళా ప్రధాన్యత తగ్గిపోయింది. పైగా సామాజిక న్యాయం అడుగంటిపోయింది. కేంద్ర మంత్రి వర్గంలో ఎక్కువ శాతం ఉన్నత కులాలకుచెందిన నాయకులే వున్నారు. కీలకభూమికపోషిస్తున్నారు. ఉన్నత వర్గాలు కీలకంగా లేని రాష్ట్రాలలో మాత్రమే ఇతర వర్గాలకు కొంత గుర్తింపునిస్తున్నారు. తప్ప ఎక్కడా బిజేపి సామాజిక న్యాయాన్ని పాటించడం లేదు. కేవలం ప్రధాని పదవిని చూపించి, బిజేపి రాజకీయం చేస్తోంది. ఆ విషయాన్ని కూడా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ప్రదాని మోడీ బిసి కాదని తేల్చేశారు. అది జీర్ణించుకోలేని బిజేపి కుల రాజకీయాలను ముందు పెడుతోంది. కాని దేశంలో కుల గణనను మాత్రం తొక్కి పెట్టేస్తోంది. జనాభా గనణ చేపడితే బిసిల సంఖ్య తేలుతుంది. అన్ని కులాల లెక్కలు తేలుతాయి. దాంతో రాజకీయంగా రిజర్వేషన్ల శాతం పెంచాల్సి వస్తుంది. ఉన్నత వర్గాలకు అన్యాయం జరుగుతుంది. అందుకే బిజేపి జనాభా గణనకు ముందుకు రావడం లేదు. నిజానికి 2021లోనే జనాభా గణన జరగాలి. కాని ఇప్పటి వరకు చేపట్టలేదు. ఆలస్యానికి కారణం చెబుతోందే తప్ప, కుల గణన సంగతి మాట మాత్రమైనా చెప్పడం లేదు. కుల గణన చేపడితే దేశ రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని బిజేపి భయపడుతోంది. కాని కాంగ్రెస్‌ పార్టీ ఏనాడు అలా వెనుకడుగు వేయలేదు. దేశంలో డెబ్బై ఏళ్ల స్వాతంత్య్ర దేశంలో జనాభా గణన, కుల లెక్కలు తేల్చకుండా వుండలేదు. కాని బిజేపి లెక్కలు అనగానే భయపడుతోంది. ఇటీవల రాహుల్‌ గాందీ చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచనాలయ్యాయి. దేశ బడ్జెట్‌ రూపకల్పనలో పాలు పంచుకునేంత శక్తి బిసి, ఎస్సీ, ఎస్టీ అధికారులకు లేదా? వారి ఎంపిక చేయాల్సిన అవసరం లేదా? బడ్జెట్‌ రూపకల్పనలో ఉన్నత కులాల అదికారులకే బాధ్యతలా? ఆఖరుకు హల్వాతినడానికి కూడా ఇతర అధికారులు అర్హులు కారా?అంటూ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పాలనా వ్యవహారాలలో కీలక భూమిక పోషించే అదికారులు కూడా ఉన్నత వర్గాలేనా? అంటూ ప్రశ్నించారు. కాని కాంగ్రెస్‌ పార్టీపై అలాంటి ప్రశ్నలు లేవనెత్తేందుకు బిజేపికి ఎక్కడా అవకాశం లేదు. రాజ్యాంగ రచనాసంఘం అధ్యక్షుడు డాక్టర్‌.బిఆర్‌.అంబెద్కర్‌ ప్రత్యక్ష్య ఎన్నికల్లో ఓడిపోతే, ఆయనను రాజ్యసభకు నామినేట్‌ చేసి మంత్రిని చేసింది ప్రదాని నెహ్రూ. కాని బిజేపి పార్టీ చెప్పే మాటల్లో ఎంత మాత్రం నిజం లేదు. కాంగ్రెస్‌ పార్టీలో దళిత నాయకుడైన బాబూ జగ్జీవన్‌రాం ఉప ముఖ్యమంత్రి పదవిని నిర్వహించారు. అంతే కాదు సుమారు 30 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఏకైక నాయకుడు జగ్జీవన్‌ రాం. అంతగా ఆయనకు ప్రాదాన్యత కల్పించిన పార్టీ కాంగ్రెస్‌ పార్టీ. మరి బిజేపిలో ఒక దళిత నాయకుడికి ఇంతటి ప్రాదాన్యత దక్కుతుందా? ఊహించగలమా? ఇప్పుడు కూడా తెలంగాణలో మంత్రి వర్గంలో కూడా చాల వరకు న్యాయం జరిగింది. ఇంకా జరగాల్సి వుంది. కానీ ఎన్నికల ముందు ఇచ్చిన హమీ మేరకు కుల గణన చేశారు. 42శాతం బిసిలకు రిజర్వేషన్‌ కల్పించేందుకు సిద్దంగా వున్నారు. బిఆర్‌ఎస్‌లో దళితులకు , బిసిలకు కాంగ్రెస్‌లో కనిపించేంత సామాజిక న్యాయం ఊహించగలమా? 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కేసిఆర్‌ తన తొలి ఐదేళ్ల పాలనా కాలంలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. ఇది పాలనలో మహిళా నాయకులను చిన్న చూపు చూడడం కాదా? డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇచ్చినా అది ఉన్నత వర్గానికే కట్టబెట్టారు. కాని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఇద్దరు మహిళా మంత్రుకు చోటు కల్పించారు. అందులోనూ ఒకరు బిసి, మరొకరు ఎస్టీకి కేటాయించారు. కొండా సురేఖ, ధనసరి అనసూయ( సీతక్క)ను మంత్రులు చేశారు. బిసిలకు కూడా బిఆర్‌ఎస్‌ కన్నా మెరుగైన స్ధానమే కల్పించారు. సామాజిక న్యాయం చేసేందుకు ప్రయత్నం జరిగింది. కాకపోతే పదేళ్ల పాటు పార్టీ కోసం పని చేసిన నాయకుల్లో ఎక్కువగా ఉన్నత వర్గాల నాయకులే వున్నారు. ఇక తెలంగాణ ప్రకటించిన వెంటనే రాష్ట్ర కాంగ్రెస్‌ భాధ్యతలు పొన్నాల లక్ష్మయ్యకు కట్టబెట్టారు. కాని ఆయన తన వల్ల కాదని ఆ పదవిని వద్దనుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే..సామాజిక న్యాయం ఎక్కువే.. ఆ రెండు లక్షణాలులేని ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌ నిందిస్తామంటే జనమే మెచ్చరు.

హిందూధర్మ సామ్రాజ్య సంరక్షకుడు చత్రపతి శివాజీ మహారాజ్

మహనీయులను స్మరించుకుందాం..వారి అడుగుజాడల్లోనే నడుద్దాం

ఘనంగా మరాఠా యోధుని జయంతి వేడుకలు

చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి..ఘనంగా నివాళులర్పించిన మోటే ధర్మారావు
మూలపల్లి నేటి ధాత్రి
మహనీయులను స్మరించుకొని వారి అడుగుజాడల్లోనే నడవాలని హిందూ హృదయ సామ్రాట్..హిందూ ధర్మ రక్షకుడు..హిందూ సామ్రాజ్య స్వరాజ్ కోసం రాక్షసుల్లాంటి ఢిల్లీ సుల్తానులతో, మొఘలాయిలతో యుద్ధం చేసి, హిందూ దేవాలయాలను, హిందూ మహిళలను రక్షించి మొఘల్ పాలకుల నుండి విముక్తి ప్రసాదించిన హిందూ సామ్రాజ్యాధిపతి, చత్రపతి బిరుదాంకితుడు, మరాఠా పోరాట యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ అని మొగుళ్లపల్లి మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు అన్నారు. బుధవారం చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని శివాజీ విగ్రహానికి ఆయన పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ధర్మారావు మాట్లాడుతూ తల్లి జిజియాబాయి బోధించిన మహనీయుల గాథలు విని అద్భుతమైన మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆపాదించుకుని, తండ్రి షాహజీ ద్వారా పోరాటపటిమను, యుద్ధ విద్యలోని నైపుణ్యాలను అలవర్చుకొని 17 సంవత్సరాల వయసులోని హిందూ ధర్మ సంస్థాపన కోసం నడుం బిగించి..యుద్ధం చేసిన ఏకైక మరాఠా యోధుడు, హిందూ హృదయ సామ్రాట్ చత్రపతి శివాజీ అని అన్నారు. ఔరంగజేబు లాంటి కీచకులు చత్రపతి శివాజీ మహారాజును ఆయన కొడుకుని చంపాలని ప్రయత్నించిన ఆయన తప్పించుకుని తిరిగి ఔరంగజేబుపైన యుద్ధం ప్రకటించి హిందూ సామ్రాజ్య విస్తరణ కోసం, హిందూ అభివృద్ధి కోసం, హిందూ మహిళల ఔన్నత్యాన్ని పెంచడం కోసం, మొఘలాయిలతో తీవ్రమైన పోరాటం చేశాడన్నారు.

పత్తి రైతుల ఇబ్బందులను తొలగించండి

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

జైపూర్,నేటి ధాత్రి:

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పత్తి రైతుల ఇబ్బందులపై స్పందించారు.అదే క్రమంలో వారు సంయుక్తంగా మంచిర్యాల జిల్లాలో పత్తి కొనుగోలు జాప్యం పై బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి చర్చించారు.ఈ సందర్భంగా వారు పత్తి కొనుగోలు విషయంలో సీసీఐ నుంచి రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు.ఆన్లైన్ సర్వర్ పనిచేయని నేపథ్యంలో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆధార్ కార్డుతో మాన్యువల్ ద్వారా పత్తి కొనుగోలు చేపట్టాలని కోరినారు.సీసీఐ షరతుల కారణంగా చిన్న సన్నకారు రైతులు అవస్థలను గుర్తించాలన్నారు.సానుకూలంగా స్పందించిన కిషన్ రెడ్డి కేంద్ర టెక్స్ టైల్ మినిస్టర్,సీసీఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఎండి లలిత్ కుమార్ తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లుగా జిల్లాలోని రైతాంగానికి సమాచారం ఇచ్చారు.

జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి నీ గెలిపించండి.

బిజెపి మండల అధ్యక్షుడు భాయ్ లింగారెడ్డి.

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

మండల కేంద్రం లో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం జరిగింది, ఇట్టి కార్యక్రమం లో మండల అధ్యక్షులు బాయి లింగ రెడ్డి మాట్లాడుతూ
కరీంనగర్, మెదక్,నిజామాబాద్,ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి అని కోరడం జరిగింది. మరియు కార్యకర్తలకు దిశ నిర్దేశం చేయడం జరిగింది, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపియగలరని కోరారు, ఈ గెలుపు తో రానున్న స్థానిక సంస్థలలో బీజేపీ పార్టీ విజయం కాయమని నిజామాబాదు ఎంపీ ధర్మపురి అరవింద్ గారి నాయకత్వం లో అన్ని స్థానలను బీజేపీ కైవసం చేసుకుంటుంది అన్నారు
ఇట్టి కార్యక్రమం లో బీజేపీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం నాయకురాలు భోగ శ్రావణి, మండల నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాలొగొన్నారు,

చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయాలి

మంచిర్యాల,నేటి ధాత్రి:

బీసీ సమాజ్ మంచిర్యాల కార్పొరేషన్ కమిటీ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలవేసి జయంతి ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ బహుజన రాజు చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలో నెలకొల్పుటకు అనుమతించాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏ విధంగా నైతే హిందూ రాజస్థాపన కై పోరాటం చేసిండో అదేవిధంగా వారి స్ఫూర్తితోనే బీసీ రాజ్యాధికార స్థాపనకు బీసీ సమాజ్ యావత్ బిసి సమాజాన్ని ఏకం చేసి బిసి రాజ్యాధికారం దిశగా పోరాటాలను కొనసాగిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ సీనియర్ నాయకులు బొలిశెట్టి లక్ష్మణ్, బియ్యాల సత్తయ్య,పోరండ్ల శ్రీనివాస్,సల్ల విజయ్ కుమార్, జక్కం రవీందర్,గుమ్మల సుదర్శన్,బిరుదు రాజు ,శ్రీధర్, రాజు,వెన్నంపల్లి మురళి, గుండ్ల లక్ష్మణ్,బీసీ సమాజ్ మహిళా నాయకురాలు ఆకుతోట పద్మాదేవి,వీణవంక నాగలక్ష్మి,చెన్నూరు ఉమాదేవి తదితరులు పాల్గొని శివాజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

పేకాట స్థావరం పై పోత్కపల్లి పోలీసుల దాడి..

ఓదెల (పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:

పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓదెల గ్రామ శివారు హరిపురం రోడ్డు వైపు కొంతమంది వ్యక్తులు కలసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై పోత్కపల్లి పోలీసులు వెళ్లి రైడ్ చేసి తొమ్మిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఏడు వేల ఒక వంద రూపాయలు,మూడు మొబైల్ ఫోన్లు, నాలుగు టూ వీలర్స్ మరియు పేక పత్తలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై దీకొండ రమేష్ తెలిపారు.
పేకాట ఆడిన వారి వివరాలు
1 మంద కుమారస్వామి
2 రాచర్ల రమేష్
3 చెరుకు మహేష్
4 కొక్కుల రవీందర్
5 పెండెం సమ్మయ్య
6 పెండెమ్ లక్ష్మణ్
7 పసెడ్ల స్వామి. 8 పసెడ్ల సతీష్.9 గడ్డం యాదగిరి లు వీరందరిది ఓదెల గ్రామమే నని తెలిపారు.
ఈ సందర్భంగా పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ మాట్లాడుతూ గ్రామాలలో పేకాట, కోడి పందాలు ఆన్లైన్ బెట్టింగులు, క్రికెట్ బెట్టింగ్,బహిరంగ ప్రదేశంలో జూదం,మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే పోత్కపల్లి ఎస్ఐ నెంబర్ 8712656514, కు సమాచారం అందించాలని సూచించారు.చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన ఎంతటి వారినైనా చట్టప్రకారం శిక్షించడం జరుగుతుందని ఎస్ఐ గారు హెచ్చరించినారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. .
ఇట్టి రైడ్ లో పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ గారితో పాటు, కానిస్టేబుల్ రాజేందర్, ప్రశాంత్, రామకృష్ణ లు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ కీలకం

నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు..తుమ్మలపెల్లి సందీప్

నర్సంపేట,నేటిధాత్రి:

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ విభాగం కీలకమని నర్సంపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి నేతృత్వంలో ఈనెల 16నుండి 18వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్ లోని మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ఓ రిసార్ట్ లో జరిగిన సోనియమ్మ కుటీరం యువ క్రాంతి బునియాది శిక్షణ తరగతుల సమావేశానికి సందీప్ హాజరైనారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాకు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అవకాశాన్ని కల్పించి, మూడు రోజుల పాటు హైదరాబాదులో జరిగిగే శిక్షణ తరగతుల్లో పాల్గొనే గొప్ప అవకాశాన్ని అందించిన జనహృదయనేత, నర్సంపేట శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ చాలా కీలకమని యూత్ కాంగ్రెస్ లో ఎవరైతే క్రియాశీలకంగా సమర్థవంతంగా చురుగ్గా పని చేస్తారో వారికి కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో ఉన్న చాలా మంది ప్రముఖులు యూత్ కాంగ్రెస్ లో పని చేసిన వారేనని శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథులుగా హాజరైన పలువురు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మాట్లాడిన మాటలని ఆయన గుర్తు చేశారు.అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రజా పాలన అందిస్తున్న పథకాలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అండగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరించే దిశగా యూత్ కాంగ్రెస్ నాయకులు అడుగులు వేయాలని సూచించారు.జాతీయ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ సురభి దివెది జీ, జాతీయ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి సైద్ ఖాళీద్ అహ్మద్ జీ, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డిల చేతుల మీదుగా శిక్షణ తరగతుల సర్టిఫికెట్, యూత్ కాంగ్రెస్ బ్యాగ్, బహుమతులను తీసుకున్నట్లు తుమ్మలపెల్లి సందీప్ తెలిపారు.

ఛత్రపతి శివాజీ మహారాజ్…

జహీరాబాద్. నేటి ధాత్రి:

భరత జాతి ముద్దుబిడ్డ.. వీరత్వం, పరాక్రమానికి ప్రతీకగా భావించే ఛత్రపతి శివాజీ మహారాజా జయంతి ఈరోజే. ఈ సందర్భంగా శివాజీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం…

భారతదేశ చరిత్రలో గొప్ప యోధులు, సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేర్లలో ఛత్రపతి శివాజీ పేరుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆయన పేరు ఉంటే హిందూ మతం ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంది. చిన్నతనంలోనే మొఘలుల దాడులలో హిందూ మతం అంతరించి పోతుందని, వారితో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేసిన వేళ శివాజీ మహారాజు మండే నిప్పు కణికలా దూసుకొచ్చాడు. మొగల్ రాజులతో ఎంతో వీరోచితంగా పోరాడాడు. అందుకే హిందూమతాన్ని కాపాడిన ఘనత ఒక్క మరాఠా మహారాజు శివాజీకే దక్కుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే ఆ యోధుడి జన్మదినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా ఒక వేడుకలా జరుపుకుంటారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఒక పండుగలా నిర్వహిస్తారు. చరిత్రను పరిశీలిస్తే, 1674లో శివాజీకి చక్రవర్తిగా పట్టాభిషేకం జరిగింది. అంతటి గొప్ప వీరయోధుడి 394వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన పుట్టినప్పటి నుంచి వీర మరణం పొందే వరకు ఎలాంటి విజయాలు సాధించారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

శివాజీ జననం..

క్రీస్తు శకం 1630లో ఫిబ్రవరి 19వ తేదీన మహారాష్ట్ర పూణే జిల్లాలో ఉన్న జనార్‌లోని శివనీర్ కోటలో జిజియాబాయ్, షహాజీ దంపతులకు శివాజీ జన్మించారు. ఆయన తల్లి క్షత్రియ వంశీయురాలు. శివాజీ పుట్టకముందే పుట్టిన వారంతా చనిపోవడంతో, ఆమె శివపార్వతులను పూజించగా శివాజీ క్షేమంగా ఉన్నాడు. దీంతో ఆయనకు శివాజీ అనే పేరు పెట్టారు.

తల్లిదండ్రుల నుంచి..

శివాజీ మహారాజ్ కన్న తల్లి దగ్గరే పరమత సహనం, మహిళల పట్ల గౌరవంగా ఉండటం నేర్చుకున్నాడు. అతి చిన్న వయసులోనే తను పుట్టిన భూమికి మేలు చేయాలని, ప్రజలతో ఎలా నడుచుకోవాలో శివాజీకి జిజియబాయి పూస గుచ్చినట్టు వివరించారు. మరోవైపు తన తండ్రి పూణేలో జాగీరుగా ఉండేవారు. తన తండ్రి దగ్గర నుంచి యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. రాజనీతి మెళకువలు నేర్చుకుంటూ.. తన తండ్రి ఓటముల గురించి అధ్యయనం చేసేవాడు. అప్పుడే సరికొత్త యుద్ధ తంత్రాలను నేర్చుకున్నాడు.

కత్తి పట్టిన తొలిరోజుల్లోనే..

శివాజీ 17వ ఏటలోనే కత్తి పట్టాడు. అంతేకాదు వెయ్యి మంది సైన్యంతో వెళ్లి బీజాపూర్‌కు చెందిన తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత మూడేళ్లలోపే రాజ్‌ఘడ్, కొండన ప్రాంతాలను ఛేజిక్కుంచుకుని పూణే ప్రాంతాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు.

గెరిల్లా యుద్ధ రూపకర్త..

‘‘ఓటమి తప్పదు అనిపిస్తే యుద్ధం నుంచి తప్పుకోవాలి.. అనుకూల సమయాన్ని చూసి దాడి చేసి గెలవాలి’’ ఈ సూత్రాన్ని శివాజీ ఎక్కువగా నమ్మేవారట. ఇదే శివాజీ పాటించే యుద్ధ తంత్రం. దీన్నే గెరిల్లా యుద్ధం అంటారు.

అన్ని మతాలను సమానంగా..

శివాజీ మహారాజు ముస్లిముల దురాక్రమణను వ్యతిరేకించినప్పటికీ, తన రాజ్యంలో లౌకికవాదాన్ని పాటించారు. అన్ని మతాల వారినీ సమానంగా ఆదరించారు. ఇతర మతాల వారిని కూడా గౌరవించారు. అంతేకాదు హిందువుగా మారిన ఓ వ్యక్తికి తన కుమార్తెను ఇచ్చి వివాహం కూడా జరిపించారట.

తన సైన్యంలో..

ఛత్రపతి శివాజీ స్నేహితుల్లో చాలా మంది మహమ్మదీయులు ఉన్నారు. తన సైనిక వ్యవస్థలో కూడా ఎందరో ముస్లింలకు సముచిత స్థానం కల్పించారు.

ఆధునిక యుద్ధ తంత్రాలు..

శివాజీ యుద్ధ తంత్రాలు శత్రువులకు అస్సలు అంతుబట్టని విధంగా ఉండేవట. తిరుగులేని యుద్ధ వ్యూహాలను అనుసరించడమే శివాజీ అసమాన ప్రతిభకు నిదర్శనం. పటిష్టమైన సైన్యంతో పాటు నిఘా వ్యవస్థను కూడా కలిగి ఉండటమే కాకుండా, ఆధునిక యుద్ధ తంత్రాలను ఉపయోగించాడట.

బలమైన నావికా దళం..

శివాజీ మహారాజ్ పటిష్టమైన నావికా దళం మరాఠాలకు మరింత బలాన్ని పెంచింది. ఇందుకు శివాజీ వేసిన బలమైన పునాదులే కారణం. విదేశీ దండయాత్రల నుంచి కాపాడటానికి అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆ కాలంలో ఏ రాజులకు ఇలాంటి ఆలోచనలు రాకపోవడం గమనార్హం.

అఫ్జల్ ఖాన్‌తో సమావేశం..

యుద్ధంలో భయంకరమైన అఫ్జల్‌ఖాన్ ముందుగానే శివాజీ యుద్ధ తంత్రాలను, గెరిల్లా యుద్ధం గురించి తెలుసుకుని.. శివాజీని రెచ్చగొట్టేందుకు, తనకు ఎంతో ఇష్టమైన దుర్గా మాత దేవాలయాన్ని కూలగొట్టాడట. అదే సమయంలో శివాజీ కుట్రలను పసిగట్టి తనను సమావేశానికి ఆహ్వానిస్తాడు.

మరాఠా యోధుడిగా..

అదే సమయంలో శివాజీ మహారాజ్ ముందుగానే తన ఉక్కు కవచాన్ని వేసుకుని, చేతికి పులి గోర్లు ధరించి అక్కడికి వెళ్తాడు. అందులో శివాజీ, అప్జల్ ఖాన్ కేవలం అంగరక్షకులతో మాత్రమే హాలులోకి వెళ్తారు. అక్కడ అప్జల్‌ఖాన్ శివాజీని కత్తితో పొడించేందుకు ప్రయత్నించగా.. తన పులి గోర్లతో శివాజీ అఫ్జల్ ఖాన్‌ను ఖతం చేస్తాడు. అందుకే ఆయనను మరాఠా యోధుడు, ఛత్రపతి శివాజీ మహారాజుగా పిలుస్తారు.

బిహార్‌లో నితిశ్‌ వారసుడిగా నిశాంత్‌?

నితిష్‌ నిష్క్రమణ తర్వాత జేడీయూ విలీనానికి భాజపా ప్రణాళిక

వయసు, ఆరోగ్య సమస్యలతో నితిష్‌

నిశాంత్‌ అరంగేట్రాన్ని స్వాగతిస్తున్న పార్టీలు

నితిష్‌ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం

మరో ఇద్దరు సోషలిస్టు నాయకుల తనయులు ఇప్పటికే రాజకీయాల్లో…

పార్టీ మనుగడకోసం నితిష్‌ సర్దుకుపోతారా?

రాష్ట్రంలో తిరుగులేని బలంతో ఎన్డీఏ కూటమి

నేటిధాత్రి డెస్క్‌:

బిహార్‌లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఢల్లీి పీఠం కైవసంతో, రాష్ట్రంలోని భాజపా వర్గాల్లో జోష్‌ నెలకొంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో 225 కైవసం చేసుకోవాలన్నది వీరి లక్ష్యం. అవసరమైతే ఒంటరిపోరుకూ సై అంటున్నప్పటికీ, బిహార్‌లో ఇప్పటికీ అత్యంత చరిష్మా కలిగిన నాయకుడు జెడీయూ అధినేత నితిష్‌కుమార్‌ మాత్రమే! ఈ నేపథ్యంలో పార్టీ కేంద్రనాయకత్వం మాత్రం నితిష్‌ నేతృత్వంలోనే ఈసారి ఎన్నికల్లో పోటీచేయాలన్న స్పష్టమైన ఉద్దేశంతో వుంది. ప్రస్తుతం భాజపా`జేడీయూ`ఎల్‌జేపీలు కాంబినేషన్‌ను ఆర్‌జేడీ`కాంగ్రెస్‌ కూటమి ఎదుర్కొనే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే ఆర్‌జేడీ నేత తేజస్వినీ యాదవ్‌కు నితిష్‌కుమార్‌పై దింపుడు కళ్లం ఆశలున్నాయి. చివరిదశలోనైనా బీజేపీకి థమ్కా ఇచ్చి తమ కూటమిలో చేరితే తిరుగుండదని భావిస్తున్నా, నితీష్‌ నిలకడలేని వైఖరి, ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగా వుండటం వంటి ప్రతికూలతలు ఇబ్బందిగా మారాయి. అదీకాకుండా ప్రస్తుతానికి ఆయనకు కేంద్రంలోని భాజపాతో ఎటువంటి పొరపొచ్చాలు లేవు. కేంద్ర నాయకత్వం పటిష్టంగా వుండటం తో తోకజాడిరపు రాజకీయాలు ఇప్పుడు పనిచేయవన్న సంగతి ఆయనకు బాగా తెలుసు. దీనికితోడు వయోభారం, అనారోగ్యంతో ఇబ్బందులు ఎలాగో వున్నాయి. ఇదిలావుండగా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈసారి బడ్జెట్‌లో బిహార్‌కు ముఖ్యంగా యువత, స్త్రీలు మరియు పేదలను దృష్టిలో వుంచుకొని అనేక రాయితీలు ప్రకటించిన నేపథ్యంలో ఈసారి భాజపాకు తిరుగుండదన్న అభిప్రాయం కూడా రాష్ట్ర నాయకత్వంలో వుంది. రాష్ట్రంలోని మిథిలా ప్రాం తంలో మఖనా పంటను అధికంగా సాగుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌లో ఈ మఖ నా బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన సందర్భంగా ప్రకటించారు. అంతేకాదు పశ్చిమ కోశి కాల్వ ప్రాజెక్టు, నేషనల్‌ ఇన్‌స్టిట్యూ ట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ, పాట్నాలోని ఐఐటీ విస్తరణ వంటి వరాలను కూడా ప్రకటించడం గమనార్హం.

ఈనెల 24న ప్రధాని పర్యటన

ఫిబ్రవరి 24న ప్రధాని నరేంద్రమోదీ భాగల్పూర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 18వ విడత ‘పి.ఎం. కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ని దేశవ్యాప్తంగా రైతులకు వారివారి ఖాతాల్లో జమచేయనున్నారు. బిహార్‌కు చెందిన 83లక్షల మంది రైతులకు ఈ నిధులు అందుతాయి. ప్రధాని నరేంద్రమోదీ ఈ పంపిణీ కార్యక్రమాన్ని బిహార్‌లో చేపట్టడం, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే నన్న సంగతి స్పష్టమవుతోంది. ఇదే సమయంలో లబ్దిదారులో ప్రధాని వర్చువల్‌గా ముచ్చటిస్తా రు. అంతేకాకుండా రాష్ట్రంలో రూ.15వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకు స్థాపన చేయనున్నారు. ప్రస్తుతం నితీష్‌కుమార్‌ నేతృత్వంలోని జేడీయూకు చెందిన 12 మంది ఎంపీలు, కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి మద్దతునిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ వర్గాల్లో ఒంటరిగా పోటీచేయాలన్న ఉద్దేశమున్నప్పటికీ, తిరుగులేని నితిష్‌కుమార్‌ చరిష్మాముందు ఎవరూ నిలబడటం కష్టమన్న సంగతి వారికి బాగా తెలుసు. నితిష్‌ తర్వాత జేడీయూలో ఎవరనేదానికి ప్రస్తు తానికి సమాధానం దొరకడం కష్టం. ప్రస్తుతం ఆయన పేరుమీదనే పార్టీ మనుగడ సాగుతోంది.

పోస్టర్‌ రాజకీయం

ఇదిలావుండగా ఫిబ్రవరి 12న బిహార్‌ రాజధాని పాట్నాలో వెలిసిన ఒక పోస్టర్‌ అందరిని ఒక్క సారి ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీన్ని కాంగ్రెస్‌ నాయకుడు రవికుమార్‌ గోల్డెన్‌ ఏర్పాటుచేశారు.నలంద జిల్లాలోని హర్నౌట్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్టు ఆయన ఈ పోస్టర్‌లో పేర్కొనడమే అందరినీ ఆకర్షించడానికి ప్రధాన కారణం. నిజానికి ఈ స్థానం గత 20ఏళ్ళుగా జె.డి(యు)కు కంచుకోటగా కొనసాగుతోంది. జె.డి(యు) అధినేత, ముఖ్యమంత్రి నితిష్‌కుమార్‌ ఈ స్థానంనుంచే గెలుపొందారు. 2005కు ముందు ఈ స్థానంలో సమతాపార్టీ బలంగా వుండేది. ఈ పార్టీని నెలకొల్పింది ఎవరో కాదు. నితిష్‌కుమార్‌, మాజీ రక్షణశాఖ మంత్రి జార్జ్‌ ఫెర్నాండెజ్‌తో కలిసి ఈ పార్టీని ఏర్పాటు చేశారు. ఇదిలావుండగా రవికుమార్‌ గోల్డెన్‌ స్వగ్రా మం కూడా ఇదే నియోజకవర్గంలో వుంది. ఈ గ్రామం పేరు కళ్యాణ్‌ బిఘా. హరినారాయణ్‌ సింగ్‌ అనే సీనియర్‌ జేడీ(యూ) నాయకుడు 2010 నుంచి ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.2020లో హర్నౌట్‌ స్థానంనుంచి కాంగ్రెస్‌ తరపున టిక్కెట్‌ కోసం యత్నించిన రవికుమార్‌ గోల్డె న్‌ సక్సెస్‌ కాలేదు. ఈసారి తనకు పార్టీ టిక్కెట్‌ లభిస్తుందన్న ఆశ వున్నా, ఈ స్థానం లో నితిష్‌ కుమార్‌ తన కుమారుడు నిశాంత్‌కుమార్‌ను నిలబెడితే తన గెలుపు కష్టమన్న భయం కూడా ఆయన్ను వెన్నాడుతోంది. కాగా ఇదంతా టిక్కెట్‌ కోసం పోస్టర్‌ స్టంట్‌ అని భాజపా, జెడీ (యు)లు కొట్టిపారేస్తుండగా, కాంగ్రెస్‌ దీనిపై ఇప్పటివరకు ఏవిధమైన కామెంట్‌ చేయలేదు.

రాజకీయాలకు దూరంగా నిశాంత్‌

నిశాంత్‌ కుమార్‌ బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసారు. ఆయన రాజకీయాల్లోకి రావడానికి ఇంతవరకు ఉత్సాహం చూపడంలేదు. పుస్తకపఠం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భజనలు…ఇవీ ఆయన వ్యాపకం. నితిష్‌కుమార్‌కు నిబద్ధ రాజకీయవేత్తగా రాష్ట్రంలో పేరుంది. తన వారసులను తీసుకొచ్చేందుకే రాజకీయాలు నడపరన్న మంచిపేరును తెచ్చుకున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే, ఇప్పటివరకు రాజకీయాలకు దూరంగా ఆధ్యాత్మిక జీవనానికి ప్రాధాన్యమిస్తున్న నిశాంత్‌ ఇక రాజకీయాల్లోకి అడుగుపెడతారన్న వార్తలు రాష్ట్రంలో జోరుగా సాగుతున్నాయి. ఇందుకూ కారణం లేకపోలేదు. 2015లో ఆర్‌జేడీ`జేడీయూ అలయన్స్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు నితిష్‌కుమార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకార కార్యక్రమానికి నిశాంత్‌ హాజరయ్యాడు. ఇదే ఎన్నికల్లో ఆర్‌జేడీ అధినేత లల్లూ ప్రసాద్‌ యాదవ్‌ తనయుడు తేజస్వీ యాదవ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాజకీయ అరంగేట్రంచేశారు. సరిగ్గా ఏడాది తర్వాత రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ తనయుడు చిరాగ్‌ పాశ్వాన్‌ జాముయ్‌ లోక్‌సభ స్థానంనుంచి గెలుపొంది పార్ల మెంట్‌లోకి అడుగుపెట్టారు. ఈవిధంగా బిహార్‌లో ముగ్గురు సోషలిస్ట్‌ నాయకులు (నితిష్‌కుమార్‌, లాలూప్రసాద్‌ యాదవ్‌, రాంవిలాస్‌ పాశ్వాన్‌) తమ కింది తరాలకు అధికారాన్ని బదలీ చేస్తా రన్నది స్పష్టమైంది. ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రావణ్‌కుమార్‌ (ఈయన నితిష్‌కు సన్నిహితులు) ఇటీవల మాట్లాడుతూ నిశాంత్‌ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని వెల్లడిరచడం ఈ వాదనకు బలం చేకూరుస్తున్నది.

రెండోతరం నాయకుల కొరత

నితిష్‌కుమార్‌ నడిపిన అస్థిర రాజకీయాల నేపథ్యంలో అప్పటివరకు ‘సుశాసన్‌ బాబు’గా ప్రసిద్ధు డైన ఆయన్ను ‘‘పల్టు చాచా’’ బీహార్‌ ప్రజలు పిలవడం మొదలుపెట్టారు. ఈ పరిస్థితుల్లో నితిష్‌కుమార్‌ తన తర్వాత అధికారాన్ని అప్పగించడానికి రెండోతరం నాయకులను తయారు చేయలేదు. మరి ఇదే సమయంలో రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ కేంద్రంలో, లలూప్రసాద్‌ యాదవ్‌ రాష్ట్రంలో సుస్థిరమైన రీతిలో రెండోతరానికి అధికారాన్ని అప్పగించగలిగారు. ఇదిలావుండగా 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, నితిష్‌కుమార్‌ అప్పటిరకు కొనసాగాని ఇండీ కూటమి కాడి కిందపడేసి, ఎన్డీఏ కూటమిలో చేరిపోయారు. ఈ ఎన్నికలను 2025 అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా పరిగణించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లోనే నితిష్‌కు తొలిసారి రెండోతరం నాయకులు లేని లోటుఅర్థమైంది. ముఖ్యంగా ఆయన స్టార్‌ కాంపెయినర్లుగా అశోక్‌ చౌదరి, విజయ్‌ చౌదరి, రాజీవ్‌ రంజన్‌సింగ్‌, సంజయ్‌ రaాలపై ఆధారపడ్డారు. వీరు ప్రచారంలో పాల్గనడమే కాదు, జెడీ (యు)లో నిర్ణయాలు తీసుకోవడంలో కీలకపాత్ర పోషించారు. అంతకుముందు నితిష్‌ వారసుడి గా మనీష్‌వర్మ పేరు బాగా వినబడిరది. ఈయన నితిష్‌కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరిం చాడు. కానీ క్రమంగా ఈయన తెరమరుగు కావడంతో, మరి నితిష్‌ స్థానాన్ని భర్తీ చేసేదెవరన్న దనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇటువంటి పరిస్థితిలో పైన పేర్కొన్న నలుగురు నాయకులే ఇకముందు పార్టీ వ్యూహాలను రచించడంతోపాటు, భాజపాతో సీట్ల ఒప్పందాలను చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ కూడా చాలా ఓపిగ్గా జేడీయూ పరిణామాలను పరిశీలిస్తోంది. నితిష్‌ రాజకీయాలనుంచి తప్పుకున్నతర్వాత నాయకత్వలోటు ఎట్లాగూ ఏర్పడుతుంది కాబట్టి ఏకం గా జేడీయూను, తమ పార్టీలో విలీనం చేసుకునేందుకు కమల నాథులు వ్యూహాలు పన్నుతున్నా రు.

జేడీయూకు నష్టం

నితిష్‌కుమార్‌ రాజకీయాలనుంచి తప్పుకుంటే జేడీయూకు చాలా నష్టం. ఎందుకంటే బిహార్‌లోని 75శాతం దళిత ఓటర్లు ఆయనవైపే వుంటారు. నితిష్‌ ఏపార్టీలో ఉన్నాడనేది వారు పట్టించుకోరు. ఆయన్ను తమ నాయకుడిగా వారు చిత్తశుద్ధితో అంగీకరించడం వల్లనే నితిష్‌ తిరుగులేని నేతగా బిహార్‌ రాజకీయాల్లో వెలుగొందుతున్నారు. కుర్మి`కుశవహ వర్గాల ఓట్లు చీలకుండా గంప గుత్తగా జేడీయూకు పడేలా నితిష్‌ చేయగలుగుతున్నారు. వయసు, ఆరోగ్య కారణాల నేపథ్యంలో, ఈ రెండు వర్గాల మధ్య ఎప్పటికప్పుడు వచ్చే చీలికను అరికట్టే సామర్థ్యం నితిష్‌లో సన్నగి ల్లుతోంది. ఈ నేపథ్యంలో పార్టీకి నితిష్‌ వంటి క్లీన్‌ ఇమేజ్‌ వున్న నాయకుడు అవసరం. ప్రస్తు తం నితిష్‌కు ఎంతటి క్లీన్‌ ఇమేజ్‌ వుందో తనయుడు నిశాంత్‌కు కూడా అంతే ఇమేజ్‌ వుంది. మేనరిజం, హావభావాలు, అభిప్రాయాలు కూడా ఇద్దరివీ ఒక్కలాగానే వున్నాయి. కానీ వచ్చిన సమస్యల్లా వంశపారంపర్య రాజకీయాలకు నితిష్‌ వ్యతిరేకం. ఈ విషయంలో రాంవిలాస్‌ పాశ్వాన్‌, లల్లూ ప్రసాద్‌ యాదవ్‌ను గతంలో తీవ్రంగా విమర్శించారు కూడా. 2024 ఎన్నికల ప్రచా రం సందర్భంగా లల్లూ ప్రసాద్‌ యాదవ్‌నుద్దేశించి ‘ఈయన పిల్లల్ని కన్నాడు కానీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని’ ఎద్దేవా చేశారు.

రాజీపడతారా?

ఇప్పుడు తనవరకు వచ్చేసరికి పార్టీని నిలబెట్టాలంటే తనయుడు నిశాంత్‌కుమార్‌కు పగ్గాలు అ ప్పగించక తప్పదు. ఈ విషయంలో నితిష్‌ రాజీపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం నిశాంత్‌కుమార్‌కు 50 ఏళ్లు. ఒకవేళ ఆయన రాజకీయాల్లోకి వస్తే, అంత చదువుకున్నా బయట ఏమీ అవకాశాలు లేక, మరోదారి కానరాక రాజకీయాల్లోకి ప్రవేశించాడని ప్రత్యర్థులు ప్రచారం చేయకమానరు! ఈవిధంగా నితిష్‌కు రెండువైపులా సమస్యలు పీడిస్తున్నాయి. నిజానికి గత ఏడాది నవంబర్‌ నుంచే నిశాంత్‌ రాజకీయాల్లోకి వస్తారన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా రాష్ట్రంలో నేరాల రేటు పెరగడం, నితిష్‌ అస్థిర మానసిక స్థితి ఇందుకు ప్రధాన కారణం. 2024 నవంబర్‌ 15వ తేదీన మొట్టమొదటిసారి తండ్రి తనయుడు ఒక పెళ్లి వేడుకలో దర్శనమిచ్చారు. నితిష్‌కుమార్‌ పర్సన ల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ తనయుడి వివాహం హర్యానాలోని రివారి జిల్లా భుర్తాల్‌ గ్రామంలో జరిగింది. ఈ వేడుకకు తండ్రి తనయులు హాజరయ్యారు. అప్పటినుంచే నిశాంత్‌ రాజకీయ అరంగే ట్రంపై ఊహాగానాలు మొదలయ్యాయి. 2025, జనవరి 8న భక్తియార్‌పూర్‌లో స్వాతంత్య్ర స మరయోధులకు నివాళులర్పించే కార్యక్రమంలో మళ్లీ ఇద్దరూ పాల్గన్నారు. ఈ సమరయోధుల్లో నిశాంత్‌ తాత కవిరాజ్‌ రామ్‌లఖన్‌ సింగ్‌ వైద్య కూడా వున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ రం గప్రవేశంపై అడిగిన ప్రశ్నలకు నిశాంత్‌ ‘‘మీరు మా నాన్నగారికి ఓటేయండి. మళ్లీ ఆయన్ను ముఖ్యమంత్రిని చేయండి’’ అనిమాత్రమే చెబుతున్నారు. మరోపక్క 2025 అసెంబ్లీ ఎన్నికల సీట్ల విషయంలో జేడీయూ, బీజేపీల మధ్య సుదీర్ఘ చర్చలు సాగుతుండటం గమనార్హం. ఇక మొత్తం మీద పార్టీ నాయకత్వం నిశాంత్‌కు బాధ్యతలు అప్పగించాలని కోరుతోంది. విచిత్రమేమంటే ఆర్‌జేడీ నాయకుడు తేజస్వీయాదవ్‌ కూడా నిశాంత్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలని కోరుతున్నారు. ఆర్జేడీ కూటమిలో ఉన్న కాంగ్రెస్‌ కూడా నిశాంత్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తోంది. విచిత్రంగా భాజపా కూడా నిశాంత్‌ను రాజకీయాల్లోకి స్వాగతిస్తోంది.

ఎవరి స్వార్థం వారిది

ఆర్జేడీ, కాంగ్రెస్‌లు నిశాంత్‌ ఆగమనాన్ని స్వాగతిస్తున్నా దీనికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడంలేదు. ఎందుకంటే నిశాంత్‌ రాజకీయాల్లోకి వస్తే, సామాజిక న్యాయ సమర్థక ఓటుబ్యాంకు, నిరుపేద అగ్రవర్ణాల ఓట్లు వీటికి పడవు. బీజేపీ వ్యూహాలు వేరు. పార్టీకి బలమైన క్యాడర్‌ వుంది కానీ, సుస్థిరమైన నాయకుడు లేడు. ఆలోటును నిశాంత్‌ తీరుస్తాడు. బీజేపీకి కేవలం అగ్రవర్ణ పార్టీగానే పేరుంది. నితీష్‌కుమార్‌ పుణ్యమాని, దళితులు, ఇతర వెనుకబడిన వర్గాల ఓట్లు కూటమికి పడటం వల్ల అధికారంలోకి రాగలిగింది. ఇక జేడీయూ ప్రధాన లోపం సంస్థాగత నిర్మాణం, బలమైన క్యాడర్‌ లేకపోవడం. ఈ లోటును బీజేపీ తీరుస్తోంది. ఇప్పుడు నితిష్‌ రాజకీయాలనుంచి ని ష్క్రమణ తర్వాత జేడీయూను విలీనం చేసుకుంటే, నాయకత్వలోటును భర్తీచేసుకోవచ్చుననేది బీజేపీ వ్యూహం. అయితే ముందుజాగ్రత్త చర్యగా గత ఆర్నెల్లనుంచి ఉపముఖ్యమంత్రి పదవిలో వు న్న సామ్రాట్‌ చౌదరిని నాయకుడిగా వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది! ఈ పరిస్థితుల్లో నిశాంత్‌ రాజకీయాల్లోకి వస్తే చౌదరికి ఇబ్బందికరం. ఆయనకు ఇదెంతమాత్రం ఆమోదయో గ్యం కాదు. కానీ ఓటుబ్యాంకు పరంగా చూస్తే సామ్రాట్‌ చౌదరికి కొయిరి`కుర్మి జాతి ప్రజల్లోనే ఓటుబ్యాంకు వుంది. అదే నిశాంత్‌కు తండ్రి వారసత్వంగా కొయిరి`కుర్మితో పాటు దళితుల్లో మంచి పలుకుబడి వుంది. అందువల్ల నిశాంత్‌ రాజకీయాల్లోకి వస్తే భాజపా, సామ్రాట్‌ను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేయగలదు. ఇందుకు బీజేపీకి కొన్ని అనుకూలాంశాలున్నాయి. మొదటిది నిశాంత్‌ మతపరమైన విశ్వాసాలు కలిగిన వ్యక్తి, అతని సిద్ధాంతాలు, బీజేపీకి అనుకూలంగా వుంటాయి. అందువల్ల ఆర్‌జేడీ విలీనమైతే నిశాంతే ముఖ్యమంత్రి అవుతాడు. ఒకవేళ నిశాంత్‌కు పాలనానుభవం లేదనుకుంటే, సా మ్రాట్‌ చౌదరిని ముఖ్యమంత్రిని చేసి, నిశాంత్‌ను ఉపముఖ్యమంత్రిగా చేయవచ్చు. ఆవిధంగా అతనికి అనుభవం వచ్చేవరకు వేచివుండి, ఈలోగా జేడీయూను వదలడానికి ఇష్టపడని వారిని కూడా క్రమంగా తమవైపు తిప్పుకోవచ్చు. ఇది బీజేపీ ప్రణాళిక.

భాజపాలో ఎల్‌జేపీ(ఆర్‌వీ) విలీనం తథ్యమా?

చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని ఎల్‌జేపీ (ఆర్‌వీ) కూడా భాజపాలో విలీనమవుతుందనేది బిహార్‌ రాజకీయాల్లో మరో కీలక ప్రచారం. చిరాగ్‌ పాశ్వాన్‌కు ముఖ్యమంత్రి పదవిపై మోజుండటమే ఇందుకు కారణం. ఇప్పటికే ఆయన తన ఉద్దేశాన్ని భాజపా పెద్దలకు చెప్పారని వార్తలు వచ్చాయి. ఈ పార్టీకి పాసీ తెగల్లో మంచి పలుకుబడి వుంది. ప్రస్తుతం ఇతర దళిత తెగల్లోకి కూడాతన పలుకుబడిని విస్తరించడానికి ఎల్‌జేపీ(ఆర్‌వీ) ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇదే సమయంలో హిందూస్థానీ అవామీ మోర్చా (హెచ్‌ఏఎం) పార్టీ అధినేత జితన్‌రామ్‌ మంరీa కూడా తన పార్టీ బలాన్ని విస్తరించాలన్న యోచనలో వున్నారు. ప్రస్తుతం ఈ పార్టీకి ముసాహర్‌ కులం ప్రజల్లో గట్టి పట్టుంది. ఇదికూడా ఎన్డీఏలో భాగస్వామిగానే వుంది. ఈ నాయకులనుంచి ఎదురయ్యే అడ్డంకులు ప్రధానమైనవి కావు. నిశాంత్‌ రాజకీయాల్లోకి రావడం ఎన్డీఏ కూటమికి చాలా అవసరం. ఎందుకంటే నితిష్‌ లోపాన్ని నిశాంత్‌ మాత్రమే భర్తీ చేయగలడు!

అతిబలవంతుడు రేవంతుడు.

సీఎంపై కొందరి ఏడుపెక్కువైంది? 

-కుర్చీపై కూర్చోవాలని ఆరాటమెక్కువైంది?

-పార్టీ కోసం పనిచేసే వాళ్లు తక్కువయ్యారు.

-పదవుల కోసం పాకులాడేవాళ్లెక్కువయ్యారు.

-ప్రతిపక్షాల మీద నోరు మెదపలేరు.

-ప్రతిపక్షాలను పల్లెత్తు మాటలనలేరు.

-ప్రతిపక్షాల విమర్శలకు కనీసం స్పందించరు.

-ప్రతిపక్షాల దాడిని చూసి మురిసిపోతుంటారు!

-ఎప్పటికప్పుడు ముసలం పుడితే బాగుండనుకుంటారు!

-కూర్చున్న కొమ్మనే నరుక్కునే కుట్రలు చేస్తుంటారు.

-సవ్యంగా సాగుతున్న పాలనలో పచ్చగడ్డి వేసి పొగపెడుతుంటారు.

-ఒకరి మీద ఒకరు పుల్లలు పెట్టుకుంటూ పార్టీ పరువు తీసుకుంటారు.

-రహస్య మంతనాలతో పార్టీని బజారుకీడుస్తుంటారు.

-అసంతృప్తుల అవతారంలో కోవర్డులౌతారు.

-అంతర్గత ప్రజాస్వామ్యం..కొంప కొల్లేరుకు మార్గం!

– కెలికి, గెలికి..కుంపట్లు పెట్టి!

-అప్పుడే కొంపలు మునిగిపోయినట్లు ప్రవర్తిస్తుంటారు ?

-ఏడాదిలోనే అంతగాకంగారెందుకు?

-పదేళ్లుగా ప్రతిపక్షంలో వున్నప్పుడు పార్టీని పట్టించుకోలేదు.

-కొట్లాడి కొట్లాడి అధికారం తెచ్చిన వాళ్లను ఓర్వలేరు.

-పడరాని పాట్లు పడి అధికారంలోకి తెచ్చిన సిఎంకు సహకరించలేరు.

-రేవంత్‌ రెడ్డిని నమ్మి ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం అందించారు.

-కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు రేవంత్‌ నానా కష్టాలు పడ్డారు.

-పార్టీని నడపలేక చేతులెత్తేసిన వాళ్లు కూడా కుర్చీ కోసం ఆరాటపడుతున్నారు.

-పదవులు రాని వాళ్లను ఎగదోస్తున్నారు.

-ఎమ్మెల్యేలైన వారికే అసంతృప్తి వుంటే, ఏమీ కాని నాయకుల పరిస్థితి ఏమిటి?

-ఏడాదే పూర్తయింది..భవిష్యత్తుపై ఓపిక పట్టలేరా!

-దినదిన గండంగా మార్చి అలజడి మొదలుపెడతారా!

-అవకాశ వాద రాజకీయాలకు పాల్పడి పార్టీని ఆగం చేస్తారా?

-మళ్ళీ పార్టీ అధికారంలోకి రావాలన్న సోయి లేకుండా పోతుందా?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో అత్యంత బలవంతమైన నాయకుడు, పాలకుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఇందులో ఎవరికీ సందేహాలు అవసరం లేదు. ఆశ్యర్యం అసలే అక్కర్లేదు. నాయకులు ప్రజల్లో నుంచి పుడతారు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం సిఎం. రేవంత్‌రెడ్డి. అంచెలంచెలులగా ఒక్కొ మెట్టు, ఎక్కుతూ, రాజకీయాలను తన చేతుల్లోకి ప్రజల మెప్పు పొందుతూ వచ్చారు. మొత్తం తెలంగాణ రాజకీయాలను తనవైపు తిప్పుకొని తిరుగులేని నేతగా ఎదిగారు. ప్రజా సేవలో, నాయకుడిగా ఎదుగుదలలో ఎవరి ప్రమేయం లేదు. ఎవరి ప్రోద్భలం లేదు. ఎవరి వెన్నుదన్ను అసలే లేదు. స్వయం ప్రకాశిత శక్తిగా రేవంత్‌ రెడ్డి ఎదిగారు. ఇప్పుడున్న కాంగ్రెస్‌ పార్టీలో అలాంటి నాయకుడు ఏ ఒక్కరూ లేరు. అంతే కాదు తెలంగాణ ఇతర రాజకీయ పార్టీలలో అసలే లేరు. ఆయన ఏ పార్టీ నీడన రాజకీయాలు నేర్చుకోలేదు. ఆయన నాయకుడిగా ఎదిగిన తర్వాతే తెలుగుదేశంలో చేరారు. అంతకు ముందు ఆయన మొదటిసారి పోటీతోనే జడ్పీటీసి అయ్యారు. తర్వాత మళ్లీ వెంటనే ఎమ్మెల్సీ అయ్యారు. ఆ పదవి కూడా ఇండిపెండెంటుగా గెలిచారు. తన రాజకీయ చతురతను చూపించారు. చిన్న వయసులోనే రాజకీయ చాణక్యం ప్రదర్శించారు. అప్పుడు ఆయన ఒక రాజకీయ పార్టీని ఎంచుకున్నారు. అలా ఒక్కోమెట్టు ఎక్కుతూ, చిన్న వయసులోనే రాష్ట్ర స్దాయి నాయకుడయ్యారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్లందరికీ కొరకరాని కొయ్యగా ఎదిగారు. ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేనితనం ప్రదర్శించిన నాయకులు కూడా వున్నారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం ఉనికి ప్రశ్నార్ధం కావడంతో కాంగ్రెస్‌లో చేరారు. చేరుతూనే వర్కింగ్‌ ప్రెసిండెట్‌ అయ్యారు. ఆ వెంటనే తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రెసిడెంటు అయ్యారు. అలా మూడు సంవత్సరాలలో పార్టీకి పునర్వైభవం తెచ్చారు. కాంగ్రెస్‌ పార్టీని అదికారంలోకి తీసుకురావడానికి అష్టకష్టాలు పడ్డారు. అనేక కేసులను కేసులను ఎదుర్కొన్నారు. అనేక సార్లు జైలు జీవితం ఎదుర్కొన్నారు. నిర్భందాలు ఎదుర్కొన్నారు. అడుగడుగునా అవమానాలు ఎదుర్కొన్నారు. ఇక్కడ మరో విషయమేమింటే సహజంగా ఏ నాయకుడికైనా ప్రత్యర్ధి రాజకీయ పార్టీల నుంచి సవాళ్లను ఎదుర్కొంటారు. కాని రేవంత్‌ రెడ్డి స్వపక్షం నుంచి, ప్రత్యర్ధి పార్టీల నుంచి కూడా ఎదుర్కొన్నారు. వాళ్లందరూ చూస్తుండగానే ముఖ్యమంత్రి అయ్యారు. అందుకు ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఇటు సొంత పార్టీ నేతలను భుజ్జగించుకుంటూ, వారు చేస్తున్న అమానాలను ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఎలాంటి సమస్యలనైనా చిరునవ్వుతో స్వాతతించుకుంటూ వెళ్లారు. అంతే కాని ఎక్కడా బ్యాలెన్స్‌ తప్పలేదు. పార్టీని నిలబెట్టడంతో ఎక్కడా వెనుకంజ వేయలేదు. ధీరుడిగా ముందుకు సాగారు. పదేళ్ల తర్వాత పార్టీని అధికారంలో తెచ్చారు. అందుకే పార్టీ అధిష్టానం రేవంత్‌ రెడ్డి నాయక్వాన్ని మెచ్చి, నచ్చి ముఖ్యమంత్రిని చేసింది. ఇదీ రేవంత్‌ రెడ్డి ట్రాక్‌ రికార్డు. ఇలాంటి రికార్డు వున్న నాయకుడు ఎవరూ కాంగ్రెస్‌ పార్టీలో లేరు. పదేళ్ల కాలంలో కనీసం పార్టీ మా వల్ల బలపడిరదని చెప్పుకోగలిగిన నాయకుడు మరొకరు లేరు. పాలతో నిండిన కుండలో నీళ్లదంరూపోస్తారు. నా పాలతోనే కుండ నిండిరదని చెప్పుకుంటారు. కాని ముందు చిక్కని పాలు ఎవరు పోశారన్నది తెలియకుండా వుండదు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానానికి ఎవరు పార్టీని సమర్ధవంతంగా నడిపి అదికారంలోకి తెచ్చారన్నది తెలియదా? ప్రతిపక్షంలో వున్నన్నప్పుడు పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తెస్తానని చెప్పిన నాయకుడు లేదు. అంతగా పార్టీ కోసం కొట్లాడిన నాయకుడు ఎవరూ లేరు. కాకపోతే సీనియర్లమని కొందరు, మాకు పిసిసి. అవకాశమివ్వాలని కొందరు కోరుకున్నారు. కాని వాళ్లలో ఏ ఒక్కరు నాకు పిపిసి ఇస్తే పార్టీని అధికారంలోకి తెస్తానని అధిష్టానానికి భరోసా కల్పించలేదు. అధిష్టానం నమ్మకాన్ని చూరగొనలేదు. ఎందుకంటే పుట్టింటి గొప్పదనం మేనమామకే చెబితే ఎలా వుంటుంది. అందుకే పాత తరం నాయకులకు పక్కన పెట్టి, రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్‌ పగ్గాలు అప్పగించింది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చి రేవంత్‌ రెడ్డి చూపించారు. అయితే ఈ మధ్య ప్రభుత్వంలో లుకలుకలు అంటూ పెద్ద పదవి కోసం పోటీ పడుతున్న నాయకులు కొందరు లేనిపోనివి ప్రచారంలోకి వచ్చేలా చేస్తున్నారని కూడా తెలుస్తోంది. లేని వివాదాలు ముసురుకునేలా చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిని మార్చినట్లు కొంత మంది పనిగట్టుకొని ప్రచారం సాగిస్తున్నారు. కాని అది నిజం కాదు. సిఎం. రేవంత్‌ రెడ్డిని కట్టడి చేయడానికి ఇన్‌చార్జిని మార్చినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం అసలేలేదు. దీపాదాస్‌ మున్షీఇంత కాలం తెలంగాణకు అడిషినల్‌ ఇన్‌చార్జిగా వున్నారు. ఆమె కేరళ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి. కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల తెలంగాణతోపాటు, చాలా రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జిలను ప్రకటించింది. అందులో భాగంగానే కొత్త ఇన్‌చార్జిని తెలంగాణకు పంపించారు. ఈ విషయాన్ని చిలువలు పలువలు చేస్తూ, కొంత ప్రచారం సాగిస్తున్నారు. కూర్చున్నచెట్టునే నరుక్కునేందుకు సిద్దపడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వుంటే ఆ నాయకులకు ఏదో ఒక పదవి వస్తుంది. కాని ఆ సత్యం మర్చిపోతున్నారు. లేనిపోని రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. ఆ అంతర్గత ప్రజాస్వామ్యమే కాంగ్రెస్‌ కొంప ముంచుతుంది. కాంగ్రెస్‌ పార్టీని ఎవరూ ఓడిరచాల్సిన పనిలేదు. అసమ్మతి వాదులు నలుగురుంటే చాలు చెల్లాచెదురౌతుందని ఎప్పటి నుంచో నానుడి వుంది. దాన్ని మళ్లీ నిజం చేస్తారా? అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అసంతృప్తి రాజేస్తారా? పార్టీలో గాని, ప్రభుత్వంతో గాని ఏదైనా సమస్యలుంటే చర్చించుకునే వేదికలున్నాయి. మంత్రుల తో ఇబ్బందులుంటే చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వున్నారు. పార్టీ అధ్యక్షుడు మహేష్‌ గౌడ్‌ వున్నారు. ఇంకా చెప్పుకోవాలంటే పార్టీ అధిష్టానంవుంది. అక్కడ చెప్పుకోవాల్సిన విషయాలను మీడియా కంటపడేలా? ప్రజలు తెలిసేలా, ప్రతిపక్షాలకు ఆయుధం అందేలా సమాలోచనలు చేయాల్సిన అవసరం లేదు. పదేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో లేదు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. ఓవైపు మేమే కొట్లాడి తెలంగాణ తెచ్చామని బిఆర్‌ఎస్‌ పదే పదే చెప్పుకుంటుంది. కాంగ్రెస్‌ మెడలు వంచి తెలంగాణ సాధించామని ఒకటికి పదిసార్లు చెప్పుకుంటుంది. మేం లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదని బిజేపి అంటుంది. వాళ్లకు ధీటైన సమాదానం చెప్పడానికి మాత్రం ఏ కాంగ్రెస్‌ నాయకుడికి నోరు రాదు. మాటలు రావు. కాని మాకు అన్యాయం జరిగిందని చెప్పడానికి మాత్రం అన్నీ వస్తాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పదేళ్లలో మేమే తెలంగాణ ఇచ్చామని చెప్పుకునే అవకాశం దొరకలేదు. చెప్పుకోవడానికి నోరు రాలేదు. 2014 ఎన్నికల తర్వాత స్దానిక సంస్దల ఎన్నికల్లోనూ చెప్పుకోలేకపోయారు. 2019 ఎన్నికల్లో మళ్లీ ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత కూడా చెప్పుకునేందుకు ముందుకు రాలేకపోయారు. కాని ప్రజలు గ్రహించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక్కసారి అవకాశమిద్దామని కనికరించారు. ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ సమజామంతా ఏకమైన కాంగ్రెస్‌ పార్టీని గెలిపించింది. అందుకు అందరూ కృషి చేశారు. ఏ ఒక్కరిదీ తక్కువ భాగస్వామ్యమేమీ లేదు. పై స్దాయిలో వున్న నాయకులకే అసంతృప్తి వుంటే కింది స్ధాయిలో జెండా మోసిన సామాన్య కార్యకర్తల కష్టం ఎవరు తీర్చాలి. వారికి పదువులు ఎవరు ఇవ్వాలి. పదేళ్ల పాటు పార్టీకి అండగా నిలిచి, జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన కార్యకర్తలు ఎవరికి చెప్పుకోవాలి. ఆస్ధులు అమ్ముకొని పార్టీని నమ్ముకొని పని చేసిన వాళ్ల గోడు ఎవరికి వినిపించాలి. ఎమ్మెల్యే స్ధాయి నేతలకేనా అసంతృప్తి వుండేది? నిజానికి ఎమ్మెల్యేలు ఎంతో సంతోషపడాలి. లక్షలాది మంది వున్న కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల్లో ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం కొద్ది మందికే దక్కింది. ఎమ్మెల్యేలు అయిన వారు మంత్రి పదవి కావాలని కోరుకోవడంలో తప్పు లేదు. కాని అన్యాయం జరిగిందన్న కారణంతో పార్టీపై నెపం నెట్టేసి, అన్యాయం జరిగిందని వీధులకెక్కితే పార్టీ పరువు పోతుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు కాచుకొని కూర్చున్నాయి. ఏడాది కాలంలో అజ్ఞాతంలోవున్న కేసిఆర్‌ కూడా వైఫల్యాలను ఎండగట్టాలని చూస్తున్నారు. బిజేపి ఈసారి గెలవాలని కాచుకొని కూర్చున్నది. మరో పదేళ్లయినా ప్రతిపక్షాలకు అవకాశమివ్వకుండా రాజకీయాలు చేయాల్సిన కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడే అసంతృప్తి జ్వాలలు రగిలించడం సరైందికాదు. పార్టీకి ఏ రకంగా మేలు జరగదు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version