బండి తొండి?

 

-సొంత పార్టీలో రగులుతున్న కుంపటి?

– సీనియర్లలంటే లెక్కేలేదండి?

-బండితో నలుగుతున్న పువ్వు?

– వచ్చిన అవకాశం సద్వినియోగంలో బండి ఫెయిల్‌?

– ఒంటెద్దు పోకడలతో తంటాలు?

– ఆది నుంచీ బండిమీద విమర్శలే?

-నోటి దురుసు వ్యాఖ్యలు… పసలేని వాదనలు?

– ప్రతిసారీ జైలు సిద్ధమంటూ వ్యాఖ్యానాలు?

– బండి వ్యాఖ్యలతో ఇతర వర్గాలు దూరం?

– సీనియర్లు అసంతృప్తికి ఇదొక కారణం?

– సీనియర్లంటే లెక్కలేని తనం?

– సీనియర్లను పక్కన పెట్టేంత పెత్తనం?

-జిల్లా నాయకుల నియామకాలలో సీనియర్లకు సంకటం?

-బండి దూకుడు బిఆర్‌ఎస్‌ కు వరం?

-తొలగిపోతున్న బండి మబ్బులు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కొండ అద్దమందు కొంచెమై వుండదా? అని పెద్దలెందుకన్నారో…బిజేపి రాష్ట్ర ఛీఫ్‌ను చూస్తే అదే అనిపిస్తుందని బిజేపి నేతలే అంటున్నారు. రాజకీయాల్లో కొన్ని అవకాశాలు కొందరికి ఎందుకు వస్తాయో తెలియదు? అనుకోని అవకాశాలు చాలా విచిత్రంగా వస్తాయి. అలా వచ్చిన అవకాశాలను చాలా పదిలంగా వాడుకొని, పైకొచ్చినవారు చాల మందే వున్నారు. వచ్చిన అవకాశాన్ని చెడగొట్టుకొని, కలిసొచ్చిన రాజకీయం జీవితం మళ్లీ మొదటికి తెచ్చుకున్నవాళ్లు కూడా చాలా మందే వున్నారు. అలాంటి కోవకే బండి సంజయ్‌ వస్తాడా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. నిజానికి బండి సంజయ్‌ కిందిస్ధాయి నుంచి ఎదిగిన నేత. అంత వరకు ఓకే…కాని ఆయనకు అనుకోని అదృష్టం తలుపు తట్టింది. కార్పోరేటర్‌గా వున్న బండిసంజయ్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కలిసొచ్చింది. కాని గెలవలేదు. అలా గెలవకపోవడం కూడా బండికి వరంగా మారింది. అదృష్టం కలిసొచ్చింది. ఆ క్షణం పడిన బాధకు మంచి, రెట్టించిన సంతోషం దక్కింది. ఎంపి పదవి వరించింది. ప్రజల ఆశీస్సులు అందాయి. పార్టీ పెద్దలు కూడా మెచ్చారు. ఇదే సమయంలో పార్టీ బండి సంజయ్‌ కలలోకూడా ఊహించని పార్టీ అధ్యక్ష పదవి వచ్చి వాలింది. నిజానికి బండి సంజయ్‌ ఒక్కసారి ఎమ్మెల్యే కావలనుకున్నాడు. 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడంతో ఆ కల నెరవేరకుండా పోయిందని కన్నీరు పెట్టుకున్నాడు. కార్యకర్తల సమక్షంలో దుఖించాడు. ఆయనతోపాటు కార్యకర్తలు కూడ ఏడ్చారు. కట్‌ చేస్తే ఇదంతా డిల్లీ పెద్దల దాకా చేరింది. ఆ ఏడుపే బండికి కలిసొచ్చింది. ఆయనను ఎంపినిచేసింది. అలా ఒక్కొసారి ఓడుపు కూడా కలిసొచ్చినవాళ్లు వున్నారని చెప్పుకోవడానికి బండి సంజయ్‌ ఉదంతం కనిపిస్తుంది. అదేంటో వచ్చే అవకాశాలు కూడా అలా తన్నుకుంటూ వస్తాయన్నట్లు వచ్చి వాలిన అధ్యక్షపదవి చేపట్టిన కొద్ది కాలానికే బండిలో కూడా మోనోపలి పెరిగిందనేది పార్టీలో చెప్పుకుంటున్న మాట. 

ఇక పార్టీ బరువు బాధ్యతలు మోయడం నా వల్ల కాదు అనుకుంటూ ఎన్నోసార్లు మెరపెట్టుకున్నా లక్ష్మణ్‌ను పార్టీ అలాగే కొనసాగించింది.

చివరికు తన ఆరోగ్యం సహకరించడంలేదని పార్టీకి నివేదించడంతో తప్పని పరిస్ధితుల్లో మాత్రమే బండి సంజయ్‌ పార్టీ అధ్యక్షుడయ్యాడు. ఈ సమయంలో కూడా చాలా మంది ప్రయత్నాలు చేశారు. ఒక దశలో దుబ్బాక శాసనసభ్యుడు రఘునందర్‌ పేరు బాగా వినిపించింది. అయితే ఆయన అప్పటికే గొప్ప మాటకారి అన్న పేరు బాగా నాటుకుపోయింది. కాకపోతే వచ్చిన చిక్కల్లా ఆయన ఎమ్మెల్యేగా, ఎంపిగా, కనీసం ఎమ్మెల్సీగా ఎన్నిక కాలేదు. కాకపోతే పలుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఇదిలా వుంటే అప్పుడే ఎంపిగా ఎన్నికైన నిజామాబాద్‌ ఎంపి. ధర్మపురి పేరు కూడా అప్పట్లో బాగానే వినిపించింది. అదేంటో పార్టీ అధ్యక్షపదవి ఎంపిక జరిగిన సమయంలో ధర్మపురి అరవింద్‌ దూకుడు స్వభావం వున్న నాయకుడు నాయకుడు అన్న ముద్ర బలంగా వుంది. అందువల్ల అరవింద్‌తో మొదటికే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు? అని అధిష్టానం ఆలోచించింది. కొంత సౌమ్యుడుగా వున్న బండి సంజయ్‌ని ఎంపిక చేస్తే బాగుంటుందని భావించి ఎంపిక చేశారు. అప్పటి నుంచి బండికి దూకుడు పెరిగింది. భ్రేకులు లేకుండా పోయాయి. ఏమాటకామాట చెప్పుకోవాలి. బండి సంజయ్‌ వల్లనే పార్టీ ఇప్పుడు ఈస్ధితికి చేరుకున్నది చెప్పడంలో ఎలాంటి శషభిషలు అవసరంలేదు. కాకపోతే ఆ దూకుడే మళ్లీపార్టీకి కష్టాలు తెచ్చిపెడుతోందని చెప్పడంలో సందేహం లేదు. అంతే కాదు బండి వ్యవహారం పార్టీకి తలనొప్పిగా కూడా మారిందంటున్నారు. 

ఇటీవల బండి దూకుడు అధికార బిఆర్‌ఎస్‌ మీదనే కాకుండా, సొంత పార్టీ నేతల మీద కూడా కనబర్చుతున్నాడన్న అపవాదు ఎదుర్కొంటున్నాడు.

పార్టీలో నాయకుల మధ్య కూడా పొగ పెట్టడంలో బండి సంజయ్‌ ఆరితేరినట్లు కూడా చెప్పుకుంటున్నారు. ఓ ఇద్దరు నేతల ఆర్ధిక సంబంధాలను ఆసరా చేసుకొని వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చేందుకు కూడా బండి సంజయ్‌ కారణమన్న మాటలు వినిపించాయి. అత్తమీదకు కోడలును, కోడలు మీదకు అత్తను ఎగేసినట్లు ఆ ఇద్దరి నేతలకు చెప్పాల్సిందంతా చెప్పి, నూరిపోశానడి అంటుంటారు. అందుకే ఇద్దరూ ఎడమొహం పెడమొహం పెట్టుకుంటున్నారన్న వార్తలు వినిపించాయి. ఇక ప్రతి దగ్గర హిందుత్వానికి తాను ప్రతీకగా ప్రచారం చేసుకుంటే ఎవరూ అడ్డుచెప్పకపోవచ్చు. కాని బిజేపి కేవలం హిందుత్వానికి ప్రతీక అన్నంత దోరణిలో, శివం, శవం అన్నది పెద్దఎత్తున వివాదాలకు తెర తీసింది. దాంతో కొందరు నాయకులు బండి సంజయ్‌ను సూటిగానే వ్యతిరేకించారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న అనేక సంక్షేమ పధకాల లబ్ధిదారుల్లో అన్ని వర్గాల శ్రేణులున్నారు. వారి సంక్షేమం కోసం కూడా బిజేపి పనిచేస్తుందన్న సంకేతాలు పార్టీ పంపాల్సిన అవసరం వుంది. కాని అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తున్న వ్యాఖ్యల వల్ల వారు పార్టీ దూరమయ్యే ప్రమాదముందని ఆక్షేపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్న పార్టీగా బిజేపి ప్రజలకు చేరువ కావాలి. కొన్ని వర్గాలకే పరిమితయ్యేలా బండి వ్యాఖ్యలు పార్టీకి తీరని నష్టాన్ని కలిగిస్తాయంటున్నారు. ఇక ఇటీవల ఎమ్మెల్సీ కవిత అరెస్టు విషయంలో బండి సంజయ్‌ వ్యాఖ్యలు పెద్ద వివాదమయ్యాయి. సామెతలైనా వాడాల్సిన చోట వాడాలని, అన్నింటికీ అన్వయించలేమన్న సోయి లేకుండా ఒక ఎంపి ఎలా మాట్లాడతాడని అన్ని వర్గాల ప్రజల నుంచి కూడ పెద్దతెత్తున అభ్యంతరాలు వెల్లువెత్తాయి. దానితోపాటు సొంత పార్టీ నేతల నుంచి కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. నిజామాబాద్‌ఎంపి. అరవింద్‌ ఒక అడుగు ముందుకేసి బండి సంజయ్‌ లిమిట్స్‌ గురించి కూడా మాట్లాడాడు. ఆయన రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అయినంత మాత్రాన ఆయన పవర్‌ పవర్‌సెంటర్‌ కాదన్న మాట అరవింద్‌ అన్నాడు. అంతే కాకుండా ఆయన కవిత విషయంలో అన్న మాటను సమర్ధించడం లేదన్నారు. ఆమాట వెనక్కి తీసుకోవాలని కూడా సూచించారు. ఇలాగే ఆయన వ్యవరిస్తే పార్టీకి నష్టమేర్పడుతుందన్న మాట కూడా అరవింద్‌ అన్నారు. ఇలా పార్టీలోని చాలా మంది కూడా బండికి సూచించారు.  

ఇదే ఊపు మీద ఊపు పార్టీలో కూడా నిరసన స్వరాలు మరిన్ని పెరిగితే గాని బండికి ఉద్వాసన జరగదన్న నిర్ణయంలోనే చాలా మంది సీనియర్లు వున్నట్లు కూడా తెలుస్తోంది. 

రాష్ట్రంలో బిజేపి కొంత బలపడిరదని చెప్పడంలో సందేహం లేదు. రెండు ఎన్నికలు గెలిచారు. ఇటీవల ఎమ్మెల్సీ కూడా గెలుచుకున్నారు. హైదరాబాద్‌లో బాగానే కార్పోరేటర్‌ సీట్లు సాధించారు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో బండి సంజయ్‌ ఒంటెద్దుపోకడలు సీనియర్లకు ఆశని పాతంగా మారుతున్నాయి. ఒక వేళ ఎన్నికల బండిసంజయ్‌ నేతృత్వంలో వెళ్తే, కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకన్నట్లు, పార్టీ గెలిస్తే, సీనియర్లందరినీ కాదని ఆయనకు సిఏం చేయొచ్చన్న చర్చ జోరుగా సాగుతోంది. అందుకే ఇప్పుడే బండిని నిలువరిస్తే తప్ప, ఆయన భవిష్యత్తులో ఆయనకు ఎదురు లేకుండాపోతుంది. కాని బండి నోటి దురుసు కూడా పార్టీకి తీరని నష్టం కూడా తెచ్చిపెట్టే ప్రమాదం లేకపోలేదంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి క్రూయిషియల్‌ సమయంలో అన్ని వర్గాల నాయకులను, ప్రజలను కలుపుకుపోయే నాయకుడు కావాలని కోరుకుంటున్నారు. ప్రజలు బిజేపిని ఆదరిస్తున్న సమయంలో బండి దూకుడు స్వభావం ఎన్నికల వేళ కష్టాలు తెచ్చిపెట్టకుండా వుండాలంటే రాష్ట్ర పార్టీ బాధ్యుడిని మార్చాలన్న డిమాండ్‌ బాగానే పెరుగుతున్నట్లు తెలుస్తోంది. పైగా తన బలం పెంచుకోవడం కోసం సీనియర్లను, పక్కన పెట్టడాన్ని కూడా ఎవరూ జీర్ణించుకోలేపోతున్నారు.

కవిత జీవితమే ఒక ఉద్యమం

తెలంగాణ పోరాటమే ఆమె జీవితం.

కవిత పట్ల ఈడీ అనుసరిస్తున్న వైఖరి మహిళా హక్కులను కాలరాడమే!

బిజేపి అసహనం, దొడ్డి దారి పైత్యం, రాజకీయం కోసం చిల్లర జిత్తులు తెలంగాణలో సాగవంటున్న భూపాలపల్లి జిల్లా ‘‘బిఆర్‌ ఎస్‌’’ పార్టీ అధ్యక్షురాలు, వరంగల్‌ జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ ‘‘గండ్ర జ్యోతి’’, నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’కు వివరించిన ఆసక్తికరమైన విషయాలు.

చట్టాలు చేసే సభ్యురాలికే హక్కులు అందకపోతే…సామాన్యుల పరిస్థితి ఏమిటి?

ఈడీ పరధి దాటడానికి కేంద్ర పెద్దల ఒత్తిడి కారణం కాదా?

మహిళలకు రక్షణ చట్టాలు ఈడీ ముందు బలాదూరా?

ఈడీ చెబుతున్నదేమిటి? చేస్తున్నదేమిటి?

ఈడీ ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడిరదా?

అసలు కవిత విషయంలో మనీ లాండరింగ్‌ ఆపాదించడమే తప్పు?

కవిత నిందితురాలు కాదు…అనుమానితురాలు కూడా కాదు?

బిజేపి పెద్దల కక్ష సాధింపులో కవితను ఇరికించే ప్రయత్నం చేశారు?

మహిళా హక్కుల కోసం పోరాటం చేసే కవితకే రక్షణ కరువౌతోంది?

బిజేపికి మహిళలంటే ఎంత చిన్న చూపో ఇక్కడే తేలిపోయింది.

ఇప్పటికైనా బిజేపి తన వైఖరి మార్చుకోకపోతే పతనమే!

బిజేపి అప్రజాస్వామిక ధోరణి దేశమంతా గమనిస్తోంది?

ఈడీ విచారణలో ఏం జరుగుతుందో బిజేపి ఎంపిలకు ఎలా తెలుస్తోంది?

గోప్యంగా వుండాల్సిన విచారణ ఎలా లీకౌతోంది?

కవిత మీద బండి సంజయ్‌ వ్యాఖ్యలు కేంద్ర మహిళా కమిషన్‌ ఎందుకు స్పందించలేదు?

ఒక్క కవిత మీద అంత దాడి చేస్తున్నారంటేనే బిజేపి ఎంత భయపడుతుందో అర్థం చేసుకోవచ్చు!

హైదరబాద్‌,నేటిధాత్రి: 

యత్ర నార్యంతు పూజ్యతే తత్ర రమంతే దేవతా! అన్నారు పెద్దలు. దేశం కోసం, ధర్మం కోసం అంటూ నిత్యం సుద్దులు వల్లించే బిజేపి పార్టీ పెద్దలు,నేతలకు మహిళలు రాజకీయాల్లో రాణించడం ఇష్టం లేదా? మహిళలు రాజకీయాల్లోకి రావొద్దా? రాణించొద్దా? ప్రజా సమస్యలపై మాట్లాడొద్దా? మిగతా నాయకులకన్నా గొప్పగా ప్రభావం చూపొద్దా? ప్రగతి శీల సమాజంలో రాజకీయాలను ప్రభావితం చేయొద్దా? అసలు బిజేపి ఆలోచన ఏమిటి? మహిళపట్ల బిజేపికి వున్న చిన్న చూపు ఏమిటో ఇప్పటికే అనేక సార్లు రుజువైంది. వాళ్లు చెప్పే మాటలకు, చేసే చేతలకు ఎక్కడా పొంతన లేదన్నది అనేక సార్లు రుజువు చేసుకుంటూనే వున్నారు. ప్రజలకు బిజేపి పార్టీ అసలు రంగు తెలిసిపోయింది. ఈసారి ఖచ్చితంగా బిజేపికి దేశ వ్యాప్తంగా బుద్ది చెప్పేరోజులు దగ్గరనే వున్నాయి. తెలంగాణ రాజకీయ యవనికపై కల్లకుంట్ల కవితది సామాన్యమైన పాత్ర కాదు. నిజానికి ఆమె తెలంగాణ ఉద్యమానికి అందించిన చేయూత అంతా ఇంతా కాదు. సహజంగా ఎవరైనా రాజకీయావకాశాలు కలిసి వచ్చినప్పుడు చేస్తుంటారు. అంతదాకా ఎందుకు సినిమా నటులు రిటైర్‌ అయ్యే దశలో రాజకీయాల్లోకి వస్తుంటారు. ప్రజా సేవ అంటూ చెబుతుంటారు. రాజకీయాలలో అనూహ్యంగా కొందరు తెరమీదకు వస్తుంటారు. కాని కవిత రాజకీయాలు అందుకు భిన్నం. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఉద్యమాన్ని మొదలుపెట్టి, ఎండనక, వాననక సాగిస్తున్న పోరాటాన్ని చూసి, తాను కూడా తెలంగాణ ఉద్యమంలో తరుపుకు ముక్కనౌతానని వచ్చిన నాయకురాలు కవిత. ఉన్నతమైన విద్య, చక్కని ఉద్యోగం, కుటుంబ జీవనం,చిన్న పిల్లలు, అమెరికాలో జీవనం అన్నీ కాదనుకొని, మళ్లీ తెలంగాణ గడ్డ మీద అడుపెట్టి ఉద్యమంలో చురుకైన, ప్రత్యేకమైన పాత్ర పోషించిన నాయకురాలు కవిత. ఇంట్లో చిన్న పిల్లల్ని వదిలేసి, తెలంగాణ ప్రజల జీవితాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన నాయకురాలు కవిత. ఇప్పుడన్న పరిస్ధితుల్లో అప్పటి కాలం చిన్నగా కనిపించొచ్చు..కాని ఆనాడు ఉద్యమ కారులు పడిన శ్రమ ఎంతో అనుభవించినవారికే తెలుస్తుంది. తాడు బొంగరం లేని బిజేపి నాయకులు ఏవోవో మాట్లాడతారు? ఎందుకంటే బిజేపిలో సీనియర్లమని చెప్పుకునేవారికి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు. ఉద్యమంలో వాళ్లు పాల్గొన్నది లేదు. ఇక ఇప్పుడు పెద్ద నాయకులమైనట్లు వ్యవహరిస్తున్న వారికి అసలు తెలంగాణ ఉద్యమస్వరూపమే తెలియదు. అందుకే చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. కవిత లాంటి ఉద్యమ కారులను పదేపదే అవమానిస్తున్నారు. రాజకీయాల్లో ఇది మంచి సంప్రదాయం కాదు…ఏది ఏమైనా కవిత లాంటి నాయకురాలు తెలంగాణ రాజకీయాల్లో వుండడం అన్నది తెలంగాణ సమాజం గర్వించదగ్గ విషయం. ఉద్యమ కాలం నాటి కుట్రలు, కుతంత్రాలు చూసిన కవితకు, బిజేపి ఉడుత ఊపులకు భయపడదు. ఆమె వెంట మొత్తం తెలంగాణ మహిళా సమాజమే కాదు, దేశంలోని మహిళలంతా కదలుతారు…అంటున్న బిజేపి అసహనం, దొడ్డి దారి పైత్యం, రాజకీయం కోసం చిల్లర జిత్తులు తెలంగాణలో సాగవంటున్న భూపాలపల్లి జిల్లా ‘‘బిఆర్‌ ఎస్‌’’ పార్టీ అధ్యక్షురాలు, వరంగల్‌ జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ ‘‘గండ్ర జ్యోతి’’,నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో చిట్‌చాట్‌… ఆమె మాటల్లోనే…

కవిత విషయంలో కావాలనే బిజేపి రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. 

ఇదంతా దేశమంతా చూస్తోంది. ఒక మహిళ పట్ల బిజేపి ప్రభుత్వం చేస్తున్న దాడి, మొత్తం మహిళా సమాజం మీద జరుగుతున్నట్లే లెక్క. పూట పూటకు, రోజు రోజుకు కవిత మీద ఎన్నో ఆరోపణలు, చిల్లర విమర్శలు సాగిస్తున్నారు. కవిత ఏ పని చేసినా అది భవిష్యత్తు సమాజానికి దిశా నిర్ధేశం చేసేలా వుంటుంది. అందులో భాగంగానే ఈడీ విచారణ అన్నది కూడా రాజ్యాంగ బద్దంగా సాగాలి. చట్టబద్దంగా వుండాలి. మహిళల హక్కుల రక్షణ అమలు కావాలి. అంతే గాని ఎంపిగా కేంద్ర అత్యున్నత చట్ట సభకు ప్రాతినిధ్యం వహించి, ఇప్పుడు రాష్ట్రంలో పెద్దల సభ సభ్యురాలైన కవిత పట్లనే ఈడీ ఇలా వ్యవహరిస్తుంటే, ఇక సామాన్యమైన మహిళకు దేశంలో రక్షణెక్కడిది. దర్యాప్తు న్యాయంగా జరగాలని కవిత కోరుతోంది. అది కూడా తప్పేనా…పక్షపాతంగా కక్ష పూరితంగా సాగొద్దని మహిళా సమాజం కూడా కోరుతోంది. ఎంత సేపు పిఎంఎల్‌ఏ చట్టంలో అది వుంది..ఇది వుంది…అంటూ లేని భాష్యాలు బిజేపి నేతలు చెప్పడంలో ఆంతర్యమేమిటి? ఈ చట్టంలో ఇప్పటికే అనేక సార్లు మర్పులు చేశారు… మన దేశంలో అత్యున్నతమైన రాజ్యాంగంలోనే కాలనుగుణంగా అనేక మార్పుల చేశారు..అలాగే ఈడీ నిబంధనలు కూడా మార్చారు. కాని ఈడీ ముందు ఎవరైనా ఒక్కటే అంటూ వితండ వాదాలు చేస్తూ, మహిళల హక్కులను కించపర్చడమేనా బిజేపి నేతలు నేర్చుకున్న విలువలు. కవిత ఇప్పటికే నాలుగు సార్లు అటు ఈడీకి గాని, ఇటు సిబిఐకి గాని సహకరించిన విషయం తెలిసిందే..అయినా ఆమె సహకరించడంలేదని బిజేపి అసత్య ప్రచారం చేయడం సరైంది కాదు. నిజానికి సిఆర్‌పిసిచట్టం 160 ప్రకారం ఒక మహిళను ఏ సందర్భంలోనైనా విచారించాల్సి వస్తే కచ్చితంగా ఆమెకున్న హక్కులకు లోబడే దర్యాప్తు జరగాలి. కాని ఈడీ ఇందుకు మినహాయింపు కాదు..ఈడీ కవిత సెల్‌ఫోన్‌ లాక్కోవడం నిబంధనలకు వ్యతిరేకం అన్నది న్యాయనిపుణులు చెబుతున్న మాట. ఇదే ఆమె ఈడీని ప్రశ్నిస్తోంది. పైగా ఈడీ తన పరిధిలో లేని, తనకు సంబంధం లేని అంశాల ప్రస్తావన తీసుకురావడం కూడా తన పరిధి దాటి వ్యవహరించడం కాదా? ఇదిలా వుంటే ఈడి విచారణ సమయంలో అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ కవిత లేఖాస్త్రం సంధించారు. ఆమె ధైర్యానికి ఇది ఒక సంకేతం. ఎందుకుంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాణాలకు సైతం లెక్క చేయకుండాపోరాటం చేసిన వనిత కవిత. అలాంటి కవితను ఈడి బెదిరిస్తే కవిత బెదురుతుందా? అదురుతుందా? 

ఈ రోజు కొన్ని మీడియా సంస్ధలు కవిత మళ్లీ సుప్రింకోర్టును ఆశ్రయించినట్లు, కవిత విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చినట్లు ఎవరికి వారు కట్టుకధలు అల్లి ప్రచారం సాగించారు.

ఇదేనా మీడియాకు ఒక మహిళా నాయకురాలు, ఉద్యమకారురాలు పట్ల వ్యవహరించాల్సిన తీరు..మీడియా కూడ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీడియా సమజాంలో జరిగే విషయాలపై నిజానిజాలు తెలియజేసేలా వుండాలే, గాని మీడియాకూడా లేనిపోనివి సృష్టించడం తగదు. ఈడీ కూడా తన పరిధి దాటి చేస్తున్న విన్యాసాలు కూడా సరైనవి కాదు. ఆ సంస్ధ మీద బిజేపి పెద్దల ఒత్తిడి ఎంతో వుందనేది వాస్తవం. అయినా రాజ్యాంగబద్దమైన సంస్ధ ఇలా వ్యవహరిస్తూ, సమన్లు జారీ చేసిన సమయంలో చెప్పని విషయాలను కూడా ప్రస్తావించడాన్ని కవిత ఎంతో ధైర్యంగా ప్రశ్నించింది. అందుకు కవితను ప్రతి మహిళ అభినందించాలి. కవిత ఫోన్‌తో ఈడీకి ఏం సంబంధం? ఫోన్‌అనేది వ్యక్తిగతమైనది. అందులో అనేక అంశాలుంటాయి. అలాంటి ఫోన్‌ను తెప్పించి, స్వాదీనం చేసుకోవడం వ్యక్తిగత హక్కును, స్వేచ్ఛను హరించడమే అవుతుంది. సహజంగా ఆరు గంటల వరకే దర్యాప్తు జరగాలి. కాని కవితను రాత్రి 8గంటలదాకా విచారణ చేయడం అంటే కుట్ర కోణం దాగి లేదా? ఈ నెల 11న జరిగిన విచారణలో నిందితుల ముందు ఈడీకి వున్న అనుమానాలు నివృత్తి చేసుకోవడం కోసమే అనుమానితురాలిగా కవితను విచారణకు పిలిచారు. మరి కవిత ప్రశ్నించినట్లుగా నిందితులను ఆమె ముందుకు ఎందుకు తీసుకురాలేదు? ఇది ఈడీ ఉల్లంఘన కాదా? ఒక మహిళా నేతమీద ఈడీ వ్యవరిస్తున్న తీరుపై దేశమంతా చర్చజరుగుతోంది. బిజేపి కుట్రనంతా గమనిస్తోంది. కవిత లాంటి నాయకులనే భయపెట్టామన్న ప్రచారం చేసుకోవడం కోసం, బిఆర్‌ఎస్‌ను దెబ్బతీయాలనే కుట్ర చేస్తున్న బిజేపికి తగిన బుద్ది ప్రజలే చెబుతారు..దేశం నుంచి బిజేపిని తరిమికొడతారు..వినేశ కాలే వివపరీత బుద్ది అని బిజేపి తన అహంకార పూరిత రాజకీయాలకు కాలం చెల్లే రోజులు దగ్గరనే వున్నాయి. కవిత విషయంలో దేశంలోని మహిళా సమాజమంతా ఆమెకు మద్దతుగా వుంటుంది. కేంద్రాన్ని ఎండగట్టేందుకు ఎల్లప్పుడు మహిళా లోకం సిద్దంగానే వుంటుంది.

దేశాన్ని అమ్మడం ఆపండి

*మోదీ అధానీ భాయ్ భాయ్*

*తక్షణమే జేపీసీ వేయాలి*

*దద్దరిల్లిన పార్లమెంట్ ఆవరణ*

*ప్రతిపక్షాల నిరసనలతో ఐదో రోజు కూడా అట్టుడికిన పార్లమెంట్*

*అదానీ వ్యవహారంపై జేపీసీకి ప్రతిపక్షాల డిమాండ్*

*అధికార పక్షం మొండివైఖరితో సమావేశాలను బహిష్కరించిన బీఆర్ఎస్, డీఎంకే ఎంపీలు*

*”మోదానీ” వ్యవహారంపై జేపీసీ వేయాలంటూ రాజ్యసభ సభ్యులు రవిచంద్ర,యుపీఎ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులతో కలిసి పట్టుబట్టారు*

ప్రధాని నరేంద్ర మోడీ ఆప్తమిత్రుడు అదానీ పాల్పడిన ఆర్థిక నేరాలపై సమగ్ర విచారణకు గాను జేపీసీ వేయాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ఐదో రోజు కూడా పార్లమెంటు అట్టుడికింది.శుక్రవారం ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే బీఆర్ఎస్, డీఎంకే తదితర పక్షాలు అదానీ వ్యవహారంపై చర్చ జరగాల్సిందేనంటూ పెద్ద పెట్టున నినాదాలిస్తూ పట్టుబట్టాయి.అధికార పక్షం అందుకు ససేమిరా అనడంతో ఉభయ సభలలోని ప్రతిపక్షాలు సమావేశాలను బహిష్కరించి పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం చేరి ఆందోళనకు దిగాయి.ప్రధాని మోడీ అండదండలతోనే అదానీ తీవ్ర ఆర్థిక నేరాలకు ఒడిగట్టారని, అందుకే ఆయన వ్యవహారాలపై జేపీసీ వేయకుండా వెనుకేసుకు వస్తున్నారని ప్రతిపక్ష ఎంపీలు మండిపడ్డారు.మోడీ-అదానీల స్నేహాన్ని గుర్తు చేస్తూ “మోదానీ”అనే ప్లకార్డులను ప్రదర్శించారు.”వేయాలి వేయాలి వెంటనే జేపీసీ వేయాలి”,”స్వస్తి పలకాలి స్వస్తిపలకాలి సీబీఐ,ఈడీ,ఐటీల దుర్వనియోగానికి వెంటనే స్వస్తిపలకాలి”అంటూ ఎంపీలు నేలపై బైటాయించి పెద్ద పెట్టున నినాదాలు చేశారు.ఈ ఆందోళన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర యుపీఎ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున ఖర్గే,రాహూల్ గాంధీ, చిదంబరం,బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు,లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు,సహచర ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, దీవకొండ దామోదర్ రావు,కే.ఆర్.సురేష్ రెడ్డి,బీ.బీ.పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి,బడుగుల లింగయ్య యాదవ్, బోర్లకుంట వెంకటేష్ నేతకాని,పీ.రాములు తదితరులతో కలిసి పాల్గొన్నారు.

మహిళా హక్కులకు విలువలేదా?

`ఈడీ విషయంలో మినహాయింపా?

`డిల్లీ మద్యం కేసు విషయంలో కవిత నిందుతుల జాబితాలో లేదు?

`ఇప్పటి వరకూ అనుమానితురాలు కూడా కాదు?

` కేవలం సాక్షిగానే ఆమెకు నోటీసులు?

`అలాంటప్పుడు పదే పదే విచారణకు పిలువడంలో ఆంతర్యమేమిటన్నదే బిఆర్‌ఎస్‌ ప్రశ్న?

`ఇప్పటికే ఓసారి తన వద్ద వున్న సమాచారం కవిత ఇచ్చానంటోంది?

`మీడియా అత్యుత్సాహం?

`బిజేపి రాజకీయ కక్ష వ్యవహారం?

`ఎలాగైనా కవితను ఇబ్బందులకు గురి చేయాలన్నదే బిజేపి లక్ష్యం?

`బిజేపి పై బిఆర్‌ఎస్‌ నేతల అగ్రహం.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలో ఈడీ పెంచిన దూకుడు సహజంగా రాజకీయాలలో ప్రత్యర్థులకు ఉత్సాహ వాతావరణాన్ని కలిగించొచ్చు…కానీ రాజకీయాలలో ఈర్ష్యతో, దురుద్దేశ్యాలతో కక్ష సాధింపులు సరికావు. ఈడీ అనేది ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో, వారి ఆదేశాల మేరకే పని చేస్తుందని తెలిసిందే..ఇదే ఇక్కడ అసలు సమస్య. నిజానికి డిల్లీ లిక్కర్‌ కేసు విషయంలో ఎమ్మెల్సీ కవిత మీద అభియోగాలు మోపబడలేదు. నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి జాబితాలో లేదు. కేవలం సాక్షిగా మాత్రమే ఆరోపణలు ఎదుర్కొంటోంది. అంతే కాకుండా ఇప్పటికే ఒకసారి కవిత ను ఈడీ. డిల్లీలో ప్రశ్నించింది. కావాల్సిన సమాచారం సేకరించింది. మరో సారి కవిత ఈడీ విచారణకు హజరు కావాలని నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఈడీ పొందుపర్చిన కేసులో కవిత పేరు లేదు. కేవలం అనుమానం పేరుతో ప్రస్తావన మాత్రమే వుంది. అలాంటప్పుడు ఆమెకు రాజ్యాంగ రిత్యా సంక్రమించిన హక్కులు వున్నాయి. వాటి ఉల్లంఘనకు ఆస్కారం లేదు. మహిళలు, చిన్న పిల్లల విషయంలో కొన్ని ప్రత్యేక వెసులుబాటులున్నాయి. సిబిఐ వాటిని అమలు చేస్తోంది. ఈడీ విషయంలో మినహాయింపు ఎలా వుంటుంది? అన్న సందేహం అందరి మదిని తొలుస్తోంది. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ ఆక్ట్‌( పిఎమ్‌ఎల్‌ఏ) 2002 ఏర్పాటు చేయడం జరిగింది. నిజానికి ఈడీ 1947లో ఏర్పాటైన సంస్థ. అ తర్వాత 1957 దానిని మరింత పటిష్ఠం చేశారు. 1999లో ఫెమా చట్టం తెచ్చారు. తాజాగా 2018లో ఎఫ్‌ఈఓయే చట్టం జత చేశారు. ఇంతవరకు బాగానే వుంది. కానీ ఇటీవల 2022లో పార్లమెంటులో జరిగిన చర్చలో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. కేంద్ర ప్రభుత్వం విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. ఈడీ దాడులు రాజకీయ దురుద్దేశ్యపూరితంగా జరుగుతున్నవే అన్న అందరూ చెబుతున్న మాట. నిజానికి మనీలాండరింగ్‌ కేసుల విషయంలో జప్తుకు ఆస్కారం వుంటుంది. కానీ డిల్లీ లిక్కర్‌ కేసు విషయంలో ఆరోపణలు , ఆధారాలు నగదు రూపంలో దొరికింది లేదు. జప్తు జరిగింది లేదు…అసలు దానిపై సరైన లెక్కలు లేవు…కేవలం ఊహాగానాలతో మొదలైన కేసు మాత్రమే అన్నది న్యాయ నిపుణులు చెబుతున్న మాట.. బిఆర్‌ఎస్‌ నేతలు అంటున్న మాట కూడా! ఈడీ ముందు సోనియా గాంధీ హాజరుకాలేదా? అని ఒకరంటారు? తమిళనాడులో ఓ మహిళ కోర్టుకు ఆశ్రయిస్తే అంగీకరించలేదని ఒకరు ఉటంకిస్తారు? మనీలాండరింగ్‌ చట్టాలు కఠినంగా వుంటాయని భయపెడతారు. అసలు డిల్లీ లిక్కర్‌ కేసు అసలు నిలబడేదే కాదని దేశమంతా అంటుంటే సూడో మేధావులు తమకు తోచింది చెప్పడం, రాయడం మరీ విచిత్రం. 

మహిళా హక్కులకు విలువలేదా? 

ఇక్కడ సందేహమేమిటంటే మహిళా హక్కులు, సాధికారిత, వాటి పరిరక్షణలు, మహిళా బిల్లు వంటి అంశాలలో నిరంతరం చర్చ జరిపే, వాటి గురించి కొట్లాడే కవిత విచారణలో అవేవీ హక్కులు పట్టించుకోకపోవడమే అభ్యంతరం వ్యక్తమౌతోంది.

 కవిత లేవనెత్తిన అంశాలలో మహిళల విచారణ వారి అనుమతి, ఇష్టపూర్వకంగా జరక్కపోవడం మహిళల హక్కులను కాలరాయడమే అవుతుంది. ఐపిసి సెక్షన్లు అమలు చేసే అన్ని పోలీసు వ్యవస్థలు మహిళలను విచారించే విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. చట్టాలకు లోబడి దర్యాప్తు నిర్వహిస్తారు. విచారణ చేపడతారు. అసలు మహిళలను అరెస్టు చేసే సమయంలో అయినా, వారి విచారణలో కూడా కచ్చితంగా మహిళా అధికారులుండాలి. న్యాయవాది సమక్షంలో జరగాలి. ఈడీ. విచారణలో అలాంటి అవకాశం ఎందుకు లేదన్నదే ఇప్పుడు దేశ వ్యాప్తంగా జరుగుతయన్న చర్చ. ఈడీ ప్రధాన కార్యాలయం డిల్లీలో లో వున్నా, దేశంలో వివిధ ప్రాంతాలలో ప్రాంతీయ కార్యాలయాలు కూడా వున్నాయి. అందులో హైదరాబాదు కూడా వుంది. కవిత లిక్కర్‌ కేసులో నిందుతుల జాబితాలో లేదు. అలాంటప్పుడు ఆమెను హైదరాబాదులో కూడా విచారించే అవకాశం కూడా వుందని న్యాయ నిపుణులు చెబుతున్న మాట. డిల్లీ కేసు కావడం మూలాన అక్కడ విచారణ జరిపినా సమయపాలన లేకుండా విచారణ జరగడాన్ని కవిత ప్రశ్నించడం ఆమెకున్న హక్కులో భాగం. కవితను రాజకీయంగా కుంగదీయంలో భాగంగానే బిజేపి కేంద్ర ప్రభుత్వం కుటిల యత్నం చేస్తోందనేది బిఆర్‌ఎస్‌ వాదన. 

మీడియా అత్యుత్సాహం?

 సమకాలీన రాజకీయాలు, ప్రజా చైతన్యం, ప్రభుత్వాల పని తీరు, ప్రజా సమస్యలు, సామాన్యుల బాగోగులు, రైతుల అవస్థలు, చిరు వ్యాపారుల కష్టాలు, నిత్యావసర వస్తువుల ధరలు… సమాజంలో వున్న రుగ్మతలు, ఎన్నికలు, దేశ భవిష్యత్తు ఇవేమీ ఈ తరం మీడియాకు పట్టకుండా పోయింది. ఎంత సేపు సెన్సేషనల్‌ వార్తలు…టిఆర్పి రేటింగ్లులు, అత్యుత్సాహాలు, జ్యోతిష్యాలు, నిమిష నిమిషానికి అప్‌ డేట్లు, డిబేట్లు…ఇదేనా మీడియా చేయాల్సిన పని. అదిగో పులి అంటే ఇదిగో తోక అని ప్రచారం చేయడం బాగా అలవాటైపోయింది. గత 11 ప్రజలను ఎంటర్టైన్మెంట్‌ చేస్తూ,కవిత అరెస్టు… అంటూ ఊదరగొట్టింది…ఆ వార్తలు వాస్తవ రూపం దాల్చకపోవడంతో, మీడియా ఆశలు 16కు వాయిదా వేసుకున్నారు. ఇదిగో, అదిగో…మద్యాహ్నం అరెస్ట్‌ చేయొచ్చని రకరకాల వార్తలు వండి వార్చారు. కవిత విచారణకు హజరుకాకపోవడంతో ఖంగుతిన్న మీడియా మళ్ళీ రకరకాల వదంతులు మొదలుపెట్టింది. ఈడీ నుంచి వచ్చిన మరో వాయిదాను ఆసరా చేసుకొని 20 కోసం మీడియా కంటి మీద కునుకు లేకుండా చూసుకోనుంది.

మహిళా లోకపు ఆర్తి, తెలంగాణ స్పూర్తి కవిత.

` చెట్టు పేరు చెప్పి రాజకీయాల బతుకు షర్మిలది? 

`వైయస్సార్‌ టిపి అధ్యక్షురాలు షర్మిలపై చర్లపల్లి కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు.

`నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో, కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవి చిట్‌ చాట్‌….

`అడుగడుగునా వైఎస్‌ కుటుంబం ఎప్పటికీ తెలంగాణకు అడ్డంకే!

`తెలంగాణ మీద షర్మిల మాటలన్నీ మొసలికన్నీళ్లే?

`కల్వకుంట్ల కవిత మీద మాట్లాడే స్థాయి షర్మిలకు వుందా?

`షర్మిల తన జీవితంలో సామాజిక సేవ అనే పదం వుందా?

` తెలంగాణ కోసం కొట్లాడిన చరిత్ర కల్వకుంట్ల కవితది?

`జాగృతి పేరుతో యువతలో చైతన్యం నింపిన శక్తి కవితది?

`ప్రజల ఆశీస్సులతో ఎంపిగా గెలిచింది.

`ఉన్నత చదువులు చదివి, అమెరికాలో ఉద్యోగం చేసింది.

`అనర్గళంగా ఐదారు బాషలు కవిత మాట్లాడుతుంది?

`కవితలో వున్న ఒక్క క్వాలిటీ అయినా షర్మిలలో వుందా?

` కనీసం వార్డు మెంబరుగా ఒక్కసారైనా షర్మిల గెలిచిందా?

` కవిత గురించి మాట్లాడే నైతిక హక్కు షర్మిలకుందా?

` షర్మిల తెలంగాణ గురించి మాట్లాడడం అవి వేదాలు వల్లించడమే!

`కల్వకుంట్ల కుటుంబం మీద మాట్లాడితే తెలంగాణ చోటు కాదు కదా? ఒక్క ఓటు పడదు?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

రాజన్న బిడ్డని.. జగనన్న బాణాన్ని అని ఇంకా ఎంతకాలం చెప్పుకుంటావు? చెట్టుపేరు చెప్పుకొని ఎంత కాలం రాజకీయాలు చేస్తావు? తెలంగాణకు ఏం చేశావు? తెలంగాణ అంటే ఏం తెలుసు? తెలంగాణలో రాజన్న రాజ్యానికి రూపు లేదు. వైఎస్‌ అన్న పదానికే తావు లేదు. రాజన్న రాజ్యం. ..జగన్న బాణం అని పాచిపోయిన పాట తప్ప చెప్పుకోవడానికి షర్మిలకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇప్పుడ జగనన్న కూడా షర్మిలను పట్టించుకోవడం లేదు..అది కూడా ఆమే స్వయంగా చెప్పిందే…అందుకే షర్మిలా…ఒట్టి మాటలు కట్టిపెట్టు. తెలంగాణకు ఏనాడైతే వైఎస్‌ కుటుంబం వ్యతిరేకం అని గుర్తించిందో ఆనాడే తెలంగాణ సమాజం మీ కుటుంబాన్ని చీ కొట్టింది. దూరం పెట్టింది. మానుకోటలో రాళ్ల వర్షం కురిపించి, తరిమేసింది. అయినా ఇంకా తెలంగాణ రాజకీయాలు పట్టుకొని షర్మిల వేలాడుతోంది. తెలంగాణ అంటే ఒక ఆత్మాభిమానం..ఆత్మగౌరవం. అవేవీ లేని వాళ్లకు తెలంగాణ రాజకీయ వేధిక కావాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. తను పుట్టిన రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయలేని, రుణం తీర్చుకోలేని షర్మిల తెలంగాణ కోసం మొసలి కన్నీరు కార్చితే ప్రజలు నమ్ముతారా? కన్న తల్లికి బువ్వ పెట్టనోడు చిన్నమ్మకు చీర కొనిస్తానంటే నమ్ముతారా? తెలంగాణ కోసం నిలువు కాదు..అడ్డూ కాదంటూ ప్రతి క్షణం అడ్డుపడిన వైఎస్‌ కుటుంబాన్ని తెలంగాణ సమాజం క్షమిస్తుందా? తెలంగాణ ప్రజలు ఇంకా వంద సంవత్సరాలైనా వైఎస్‌ కుటుంబాన్ని, షర్మిలను నమ్మరు. అయినా తెలంగాణలో రాజకీయం చేస్తా…గెలిచి ఏలుతా షర్మిల పగటి కలలు కంటా అనుకుంటే ఎవరూ కాదనరు…ఇక్కడ రాజకీయాలు చేస్తా అంటే కూడా ఎవరూ అడ్డుపడడం లేదు. కాని తెలంగాణ అస్ధితత్వం మీద, ఉద్యమ కారులు మీద, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ నాయకురాలు కల్వకుంట్ల కవిత మీద షర్మిల ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సహించం… అంతో ఇంతో జనానికి వైఎస్‌ కుటుంబం అనే సానుభూతైనా వుండేది. కాని ఎప్పుడైతే జగన్‌ పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డు ప్రదర్శించాడో అప్పుడే తెలంగాణ ప్రజల గుండెల్లో షర్మిల కుటుంబం తుడిచిపెట్టుకపోయింది. అయినా ఇంకా ఇక్కడ రాజకీయాల పేరుతో తెలంగాణ ఉద్యమ నాయకురాలు, మాజీ ఎంపి. జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలో షర్మిల చిల్లర మాటలు, వెకిలి దెప్పిపొడుపులు చేస్తుంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. ముఖ్యంగా తెలంగాణ మహిళలు అసలే ఊరుకోరు. అయినా మా తాతలు నేతులు తాగారు…మా మూతులు వాసన చూడన్నట్లు రాజన్న పేరు చెప్పుకుంటే పబ్బం గడవని రాజకీయాలు ఎందుకు? అసలు నువ్వేంటో…నీ రాజకీయమేంటో…మహిళా సమాజ చైతన్యంలో నీ పాత్రేమిటో…తెలంగాణకు నువ్వు చేసిన మేలేమిటో ఒక్కటి చెప్పు? చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడే ఇలా చేత్త మాటలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకో..తెలంగాణలో రాజకీయాలు చేసుకో…కాని తెలంగాణ సాధనలో, తెలంగాణ మహిళా ఉద్యమానికి చైతన్య దీపికైన కల్వకుంట్ల కవిత విషయంలో ఇంక్కొక్క మాట మాట్లాడినా షర్మిలను క్షమించేది లేదు..వదిలిపెట్టేది లేదు…ఇంత కాలం పోనీ..పోనీ అనుకుంటూనే ఓపికతో వుంటున్నాం.. పాదయాత్ర పేరుతో నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలపై మాట్లాడుతూ, వారి చేత చీవాట్లు పెట్టించుకోవడం షర్మిలకు అలవాటైనట్లుంది. మహిళగా సభ్యత, సంస్కారంతో మాట్లాడాల్సిన విధానం వదిలేసి, ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి, రాజకీయ పబ్బం గడుపుకోవాలని షర్మిల చూడడం విడ్డూరం. వెకిలి తనానికి నిదర్శనం. తెలంగాణలో అలాంటి సభ్యత లేని మాటలకు తావులేదు. దుర్భాషలకు చోటు లేదు. వెలికి మాటలను తెలంగాణలో ఉచ్చరించరు. వాటిని తెచ్చి తెలంగాణ రాజకీయాలను, సమాజాన్ని కలుషితం చేయాలని షర్మిల చూస్తోంది. ఇది ఏ తెలంగాణ వాది ఆహ్వానించరు. అంతేకాకుండా మరొక్కసారి కల్వకుంట్ల కవిత గురించి ఒక్క మాట మాట్లాడినా షర్మిలకు తెలంగాణ మహిళా సమాజం తగిన బుద్ది చెబుతుంది. అంటున్న బిఆర్‌ఎస్‌ నాయకురాలు, చర్లపల్లి కార్పోరేటర్‌ బొంతు శ్రీదేవి, నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో చిట్‌ చాట్‌…బొంతు శ్రీదేవి మాటల్లోనే…

తెలంగాణ కోసం, తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ సాధన కోసం కల్వకుంట్ల కవిత అమెరికాలో చేస్తున్న ఉద్యోగం వదులకొని వచ్చింది.

తెలంగాణ పోరాటంలో పాల్గొన్నది. ఎండనక, వాననక ఉద్యమాన్ని సాగించింది. అసలు కల్వకుంట్ల కవిత మీద మాట్లాడే స్దాయ షర్మిలకు వుందా? కవితకు చేసిన త్యాగం, ఆమె చేసిన ఉద్యమం ఒక చరిత్ర. కాని షర్మిలది చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకునే చిల్లర రాజకీయం. అయినా పదేపదే తెలంగాణ మీద విషం చిమ్ముతూ, కల్వకుంట్ల కవిత అక్రమాస్తులంటూ పొద్దస్తమానం లేనిపోని మాటలు మాట్లాడుతోంది. ఇంతకీ షర్మిలకు తెలంగాణలో రాజకీయాలు చేయడానికి డబ్బు ఎక్కడినుంచి వస్తోంది. పాదయాత్రకు అవుతున్న ఖర్చు ఎవరిస్తున్నారు? వైఎస్‌. రాజశేఖరరెడ్డి పాలన పోయి దాదాపు పద్నాలుగేళ్లవుతుంది. అప్పటి అక్రమ సంపాదన తప్ప షర్మిల రాజకీయాలకు నిధులెక్కడివి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణను పీల్చిపిప్పి చేసి, తెలంగాణ భూములు తెగనమ్మి, ఆస్ధులు పోగేసుకొని, అక్రమ సంపాదనకు ఎగబడి వెనకేసుకున్న సొమ్ముతో ఇంకా జపం చేస్తున్న షర్మిలకు తెలంగాణలో రాజకీయం చేసే నైతిక హక్కులేదు. రాజ్యాంగపరంగా ఎక్కడైనా రాజకీయం చేయొచ్చు. కాని నైతికత అన్నది ఒకటుంటుంది. అది లేకుంటే రాజకీయాలు కూడా సాధ్యం కాదు…

 కల్వకుంట్ల కవిత ఒక ఉద్యమ నాయకురాలు..ఉన్నత విద్యావంతురాలు..ఉన్నత ఉద్యోగం చేశారు.

 తెలంగాణ ఆశ, ఆశయం, సాధన, ప్రజల ఆర్తి కవితకు తెలుసు. తెలంగాణ స్ధితిగతులు తెలుసు. తెలంగాణ గోస తెలుసు. అందుకే ఆమె అమెరికా నుంచి వచ్చిన వెంటనే రాజకీయాలు చేయలేదు. తెలంగాణ సమాజంలో చైతన్యం కోసం, విద్యా వ్యాప్తి కోసం, యువత కోసం, వారికి సాంకేతిక విద్యలో నైపుణ్యం కోసం, వారి ఉన్నతి కోసం జాగృతి అనే స్వచ్చంధ సంస్ధను ఏర్పాటు చేసి, ఎంతో మందికి మేలు చేసింది. సేవ చేసింది. సామాజిక బాధ్యతను నిర్వర్తించింది. ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఇప్పుడు జాగృతిని దేశమంతా విస్తరించే పనిలో వుంది. తన శక్తి యుక్తులను సమాజ ఉన్నతి కోసం వినియోగిస్తోంది. దేశంలోని యువతకు మేలు చేసే పనిలో వుంది. అదీ కవిత అంటే…ఇందులో షర్మిల ఏ ఒక్క పనైనా చేసిందా? తన జీవితంలో ఏనాడైనా సామాజిక బాధ్యతను నిర్వర్తించిందా? వైఎస్‌ కాంగ్రెస్‌కు అధికారం తెచ్చారని గొప్పలు చెప్పుకోవడం, తమకు అన్యాయం జరిగిందని సానుభూతి కోసం మొసలి కన్నీరు కార్చడం తప్ప షర్మిల ఏం చేసింది? తెలంగాణలో ఇప్పటి వరకు ఏ ఒక్క విద్యార్ధికైనా సాయం చేసిందా? ఏ ఒక్క సామాజిక కార్యక్రమం చేపట్టిందా? ఎంత సేపు రాజకీయం…అధికారం…ఇదే షర్మిల అసలు స్వరూపం…కుటిల స్వభావం..గోతి కాడి నక్క వినయం.

 కల్వకుంట్ల కవిత అంటేనే ఒక బ్రాండ్‌…ఆమె పోరాట యోధురాలు…తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించారు…

తెలంగాణ వచ్చాక ప్రజల ఆశీస్సులతో ఎంపిగా గెలిచారు. దేశంలోనే పేరు ప్రఖ్యాతులు సాధించారు. అనేక సందర్భాలలో గొప్ప స్పీకర్‌గా గుర్తింపు పొందరు. విదేశాలకు పార్లమెంటు డెలిగేషన్‌ వెళ్లినప్పుడు వారికి ప్రాతినిధ్యం వహించే బాధ్యతలు నిర్వర్తించారు. చట్టసభలో మహిళా రిజర్వేషన్‌ కోసం పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు పార్లమెంటులో ప్రస్తావన చేశారు…ఇటీవలే డిల్లీలో జంతర్‌ మంతర్‌ వేధికగా ధర్నా కూడ నిర్వహించారు. ఇదీ కల్వకుంట్ల కవిత అంటే…మరి షర్మిల అంటే ఏమిటో ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది…లేకుంటే తన పరువు తానే తీసుకున్నట్లౌతుంది. మరోసారి నోరేసుకొని కవితపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తెలంగాణ మహిళా సమాజం ఊరుకోదని మాత్రం హెచ్చరిస్తున్నాను..

కాళేశ్వరంపై పిచ్చి కూతలు కట్టిపెట్టు.

`తెలంగాణ వరదాయిని కాళేశ్వరం.

`కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలం.

`ప్రపంచంలోనే కాళేశ్వరం ఒక అద్భుతం. 

`కేంద్రం సహకారం లేకుండా చేసిన నిర్మాణం.

`కేంద్రమే పార్లమెంటు సాక్ష్యిగా అవినీతికి జరగలేదని చెప్పింది.

`ఐదేండ్లు అడిగినా, తెలంగాణలో చిన్న రిజర్వాయర్‌ కూడా వైఎస్‌ కట్టలేదు?

`తెలంగాణ వచ్చాక కాళేశ్వరం కట్డుకుంటే షర్మిల కళ్లు మండుతున్నాయా?

`జలయజ్ఞం పేరుతో ధన యజ్ఞం చేసి తెలంగాణను దోచుకున్నది వైఎస్‌.

`బతకమ్మ తెలియదు, బోనం తెలియదు, తెలంగాణ నైసర్గిక స్వరూపం షర్మిలకు తెలియదు.

`తెలంగాణలో భూకంపాలా? ఏ సన్నాసి చెప్పిండు?

 `అక్కడ అన్నను అడగలేదు! ఇక్కడ బడాయి తక్కువలేదు!!

`స్థాయికి మించి షర్మిల పేకుడు ముచ్చట్లు?

`ఏతులెన్ని చెప్పినా తెలంగాణలో చెల్లవు?

`ప్రతి వాళ్లు కాళేశ్వరం గురించి మాట్లాడే వాళ్లే?

`అన్నను పోలవరం సంగతేమిటని అడిగే శక్తి లేదు?

`ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్‌. పెంకాసులు పోగేసుకున్నాడా?

`వైఎస్‌ బతికుండగానే లక్ష కోట్లు దోచుకున్నాడని పుస్తకాలు వేశారు?

`ఎన్నికల ముందు ఇల్లు అమ్ముకునే స్థితి నుంచి వైఎస్‌ కు ఇన్ని ఆస్థులెక్కడివి?

`రాజన్న రాక్షస రాజ్యం తరిమేసే…తెలంగాణ సాధించుకున్నాం.

`ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో డిల్లీలో షర్మిల ధర్నానుద్దేశించి, తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చెప్పిన ఆసక్తికరమైన విషయాలు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

తెలంగాణ అంటే ఏమిటో తెలియదు. తెలంగాణ యాస తెలియదు. అసలు మాట్లాడనే రాదు…తెలంగాణ పేరెందుకొచ్చిందో తెలియదు. అసలు తెలంగాణకు అర్ధమే తెలియదు. తెలంగాణ కట్టు తెలియదు. బొట్టు తెలియదు. బోనం తెలియదు. బతుకమ్మ అంతకన్నా తెలియదు. తెలంగాణలో బతుకమ్మను ఎందుకు పూజిస్తామో తెలియదు. తెలంగాణ ఉనికి తెలియదు. తెలంగాణ చరిత్ర తెలియదు. తెలంగాణ ఉద్యమం ఎందుకు చేశారో తెలియదు. నైసర్గిక స్వరూపం అసలే తెలియదు. ఎనమిదేళ్ల క్రితం తెలంగాణ ఎలా వుండేదో తెలియదు? ఇప్పుడు ఎలా వుందో చూడలేరు. నిజాలు మాట్లాడేందుకు నోరు రాదు. కాని తెలంగాణ రాజకీయాలు కావాలి. తెలంగాణలో నాయకత్వం కావాలి. మన దౌర్భాగ్యం కాకపోతే తెలంగాణకు అడుగడుగునా అడ్డుపడుతూ, తాను అడ్డూ కాదు,నిలువూ కాదంటూ వెటకారం చేసిన రాజశేఖరరెడ్డి బిడ్డ షర్మిల తెలంగాణపై మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా లేదా? తెలంగాణను నిలువెల్లాదోచి, తెలంగాణను ఎండబెట్టి, పండబెట్టిన వైఎస్‌ కూతురొచ్చి చిలకపలుకులు పలుకుతుంటే తెలంగాణ ఉద్యమ కారులైన మేం వినాల్సి వస్తోంది. 2004లో బిఆర్‌ఎస్‌తో పొత్తు లేకుంటే అసలు ఆనాడు కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదే కాదు…వైఎస్‌ ముఖ్యమంత్రి అయ్యేవారే కాదు… కేవలం తన స్వార్ధపూరిత రాజకీయాల కోసం, తాను ముఖ్యమంత్రి కావడంకోసం, తన కల నెరవేర్చుకోవడం కోసం , కాకమ్మ కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చాడు. వచ్చిన వెంటనే తెలంగాణపై విషం కక్కడం మొదలుపెట్టాడు. తెలంగాణ వాదం బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను మాయచేసి, మభ్యపెట్టి, అదిరించి, బెదిరించి కాంగ్రెస్‌లో కలుపుకున్నాడు. తెలంగాణ వాదం లేదనే కుటిల ప్రయత్నం చేశాడు… ఆఖరకు 2009 ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదని తెలిసి, తెలంగాణకు వెళ్లాంటే పాస్‌పోర్టు కావాలా? అంటూ సీమాంధ్రులను రెచ్చగొట్టి గెలిచిన వైఎస్‌. కుటుంబం నుంచి షర్మిల తెలంగాణ రాజకీయాలపై ఆశలు పెంచుకోవడం మరీ దుర్మార్గం…మాట్లాడొస్తే చాలు నీతులు చెప్చొచ్చు…ఒర్రడమొస్తే చాలు బూతులు తిట్టొచ్చు అని షర్మిల మాటలు చూస్తేనే అర్ధమౌతుంది. తెలంగాణకు రాజశేఖరరెడ్డి చేసిన అన్యాయం బరించలేకే, తెలంగాణలో వైఎస్‌ కుటుంబానికి స్ధానం లేదని తెలంగాణ సమాజం ముక్త కంఠంతో చెప్పింది. ఆ సమయంలో జరిగిన పరాకాల ఉప ఎన్నిక ఫలితం ఏమైందో అందరికీ తెలిసిందే…వైఎస్‌ అన్న పదానికే తెలంగాణలో స్ధానం లేదని మహబూబాబాద్‌ రైల్లే స్టేషన్‌ రాళ్లు ఇప్పటికీ చెబుతాయి. చరిత్ర వున్నంత వరకు ఆ రాళ్లు నాటి తెలంగాణ పౌరుషం గురించి మీసం మెలేస్తాయి. ఆనాడు ఏం జరిగిందో ఆ రాళ్లనడిగితే వివరిస్తాయి. అంటూ నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పంచుకున్న ఆసక్తికరమైన అంశాలు ఆయన మాటల్లోనే పాఠకుల కోసం…

మొన్నటిదకా జగనన్న బాణాన్ని అంటూ చిలకపలుకులు పలికి, ఇప్పుడు తగుదునమ్మా? 

అని తెలంగాణకొచ్చి అన్నతో చెడిరదని చెప్పి, అయ్య రాజశేఖరెడ్డి తెలంగాణ రాసిచ్చినట్లు రాజకీయాలు చేస్తానంటే ఇక్కడ వినడానికి ప్రజలు సిద్దంగా లేరు. గత ఎన్నికల్లో అన్నకు అధికారం కోసం ప్రచారం చేసి, అక్కడ పోలవరంలో తట్టెడు మట్టి ఎత్తిపోయని అన్న గురించి మాట్లాడే శక్తి లేదు…కాని ఇక్కడ తెలంగాణలో కాళేశ్వరం మీద షర్మిల మాట్లాడుతుంటే వింతగా వుంది. అసలు కాళేశ్వరం అంటే ఏమిటో కూడా షర్మిలకు తెలుసా? తెలంగాణలో పలలేని,పని లేని వాళ్లు చెప్పే ముచ్చట్లు విని మాట్లాడడం కాదు… ముందు అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఏమిటో తెలుసుకో…తర్వాత దాని మీద ఏం జరిగిందనేది మాట్లాడుతువుగాని…కాళేశ్వం ప్రాజెక్టు నిర్మాణం అన్నది ఒక అధ్భుతం. ఈ ఎనమిదేళ్ల కాలంలో తెలంగాణలో ఎన్ని రిజర్వాయర్లు నిర్మాణం జరిగిందో షర్మిలకు తెలుసా? ఆ రిజర్వాయర్లు ఎక్కడెక్కడున్నాయో? తెలుసా…వాటిపేర్లుకూడా తెలియవు…కాని కాళేశ్వరం అన్న ఒక్క పదం పట్టుకొని డిల్లీకి వెళ్లి గోల చేస్తే, గాయి, గాయి చేస్తే సరిపోతుందా? అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అన్నది కేవలం తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్ధాయిలో నిర్మాణం చేసుకున్న ప్రాజెక్టు. ఇందులో కేంద్ర ప్రభుత్వానిది ఒక్క రూపాయి కూడా లేదు. అంతే కాదు కాళేశ్వరంలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేదని కేంద్ర ప్రభుత్వమే సాక్ష్యాత్తు పార్లమెంటులో పలు సార్లు వివరణిచింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. కనీసం వాటి గురించైనా షర్మిల తెలుసుకుంటే బాగుండేది. కాళేశ్వరం అన్నది ఒక్క ప్రాజెక్టు కాదు..దాని కింద మొదలైన మూడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లతోపాటు, తెలంగాణలో నిర్మాణం జరిగిన రిజర్వాయర్లన్నీ దాని పరిధిలోకే వస్తాయి. ఆ మాత్రం అవగాహన కూడా లేదు. కాని కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నోరుంది కదా? అని మాట్లాడితే సరిపోదు…

నేను ముఖ్యమంత్రికావాలి…నేను ముఖ్యమంత్రి కావాలి…

అని ఇరవై ఏండ్లు పార్టీలోనే అసమ్మతి నేతగా ఎవరూ మెచ్చని నేతగా, ఆనాటి సీనియర్లతో పంటి కింద రాయిలా, కంటిలో నలుసులా వ్యవహరించి రాజశేఖరరెడ్డి మనస్తత్వాన్ని ఏ కాంగ్రెస్‌ వాది మెచ్చలేదు. నచ్చలేదు. అలాంటి వైఎస్‌ అధికారంలోకి రావడానికి కారణమైన తెలంగాణకు తీరని అన్యాయం చేశాడు. తెలంగాణ పేరు చెప్పి అధికారంలోకి వచ్చి, తెలంగాణ భూములమ్మి ఆంధ్రలో రిజర్వాయర్లు పూర్తి చేసిన దుర్మార్గుడు వైఎస్‌. అలాంటినేత పేరు చెప్పుకొని ఓట్లు రాల్చుకుంటా…రాజకీయాలు చేస్తా అంటే ఎవరూ నమ్మరు…మీ అన్న జగన్‌నే తెలంగాణలో ఎవరూ నమ్మలేదు. సాక్ష్యాత్తు పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకొన్న జగన్‌ను తెలంగాణ ప్రజలే తిరస్కరించారు. తండ్రి వైఎస్‌ తెలంగాణకు అలా అన్యాయం చేస్తే, అన్న జగన్‌ ఈ విధంగా తెలంగాణను అడ్డుకున్నాడు. ఇప్పుడు చెల్లె షర్మిల వచ్చి, తెలంగాణలో రాజకీయాలు చేస్తానంటే నడుస్తుందా? జగనన్న బాణాన్ని అని నిన్నటిదాకా చెప్పుకున్న షర్మిల, ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ఎందుకు పూర్తి కావడం లేదో అన్నను అడిగే పని వదిలేసి, తెలంగాణలో చిలక జోస్యం తనకు తానే చెప్పుకొంటోంది. తెలంగాణలో ఎవరూ మెచ్చని, నచ్చని రాజకీయాలు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి కేసిఆర్‌ కుటుంబం మీద పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తోంది. ఐదేళ్ల కాలం పాటు తెలంగాణలో ఒక్క చెరువు కట్టకు కూడా నిధులు ఇవ్వని వైఎస్‌. రాజశేఖరెడ్డి కూతురొచ్చి, కాళేశ్వరం మీద మాట్లాడే అర్హత వుందా? షర్మిలను తెలంగాణ జనం చీకొడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతం భూకంపాలకు ఆస్కారమందా? అసలు తెలంగాణ ప్రాంత నైసర్గిక స్వరూపం గురించి చదువుకొని మాట్లాడు…తెల్లారి లేస్తే భూమి కంపిస్తోందని జనం ఇళ్ల నుంచి పరుగులు పెట్టే ప్రకాశం జిల్లాలో రాజధాని రావాలని కోరుకున్నది జగన్‌…తాను అనుకున్న ప్రాంతలో రాజధాని నిర్మాణం జరగలేదని విశాఖకు మార్చేందుకు సిద్దమౌతున్న జగన్‌కు నిలదీయాల్సిన షర్మిల ఇక్కడ నీతులు చెబుతోంది. జనం ఉసరు తీసేందుకు కారణమౌతున్న జగన్‌ను రాజకీయాన్ని ప్రశ్నించు? అప్పట్లో డిల్లీ నుంచి దేవగిరికి, దేవగిరిని నుంచి డిల్లీకి మార్చినట్లు ఆంధ్రప్రదేశ్‌లో వుంది పాలన. దాని సంగతి చూడు…? తెలంగాణ రాజకీయాలపై షర్మిల కపట ప్రేమ అందరికీ తెలిసిందే!! ఒక్కసారి కాకతీయ కాలువ చూడు…దానిలో పారుతున్న నీరు చూడు…ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాకతీయకాలువ ఎండబెట్టేవారు…కనీసం నీళ్లు వదిలేవారు కాదు…కాని ఇప్పుడు నిత్యం నిండుకుండలా పారుతుంది. ఏడాది పొడవునా, నిండుగా నీళ్లు మోసుకెళ్తోంది. 9700 క్యూసెక్కుల వ్రాహ సామర్ధ్యంతో కాళేశ్వరం నీళ్లుతో గళగళ సవ్వడులు దుంకుతున్నాయి. కాలువ పొడవునా వున్న పొలాలకు అవసరమైన నీరు నేరుగా రైతులు వాడుకునే అవకాశం కల్గింది. 289కిలోమీట్ల పొడవుతో కాళేశ్వరం నీళ్లు మోసుకుపోతోంది. తెలంగాణ మొత్తం సస్యశ్యామలమౌతోంది. ఇదే కాళేశ్వరం నీళ్లు…నిజాలు..ఇదీ తెలంగాణ సాధించిన విజయాలు..ముఖ్యమంత్రి కేసిఆర్‌ కలలుగన్న బంగారుతెలంగాణ ఆవిష్కారాలు…రైతన్నల జీవితాల్లో వెలుగులు…పాలన అంటే ఇదీ…ప్రజల సంక్షేమం అంటే ఇది! షర్మిల ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది.

కవితపై అంత కక్షెందుకు?

`మితిమీరిన అక్కసు మీడియా కెందుకు ?

`సీమాంధ్ర మీడియా అంత విరుచుకుపడుతుంటే నమస్తే తెలంగాణ ఏం చేస్తున్నట్లు?

`టి. న్యూస్‌ ఏం సంకేతాలు పంపుతున్నట్లూ?

`నిజా నిజాలు ఎందుకు చెప్పకపోతున్నట్లు?

`టి. న్యూస్‌ మౌనం దేనికి సంకేతం? 

`ఇతర మీడియాలు డిబేట్ల మీద డిబేట్లు పెడుతుంటే టి. న్యూస్‌ ఏం చేస్తున్నట్లు?

`డిల్లీ లిక్కర్‌ పాలసీ కేసెలావుతుంది?

`స్కామ్‌ అనడానికి ఆస్కారమేముంది?

`అయితే గియితే అది డిల్లీ ప్రభుత్వానికి సంబంధించినది?

`డిల్లీ ప్రభుత్వం స్కీమ్‌ విరమించుకున్నాక తవ్వకం కక్ష కాక మరేమిటి?

`అది ప్రభుత్వ వ్యాపారం కాదు… కుంభకోణానికి ఆస్కారమే లేదు?

`నష్టపోతే వ్యాపారులకు దెబ్బ?

`రాజకీయాలలో ఎన్నికల ప్రచారానికి కూడా మీడియేటర్లు కావాలి? మీడియా కూడా అందరికీ కావాలి?

`మరి మీడియా కూడా స్కామ్‌ చేస్తున్నట్లేనా?

`ఎన్నికల సంఘం నిర్ణయాలు, ఆదేశాలు కూడా తప్పేనా?

`వ్యాపారమన్నాక మధ్య వర్తులు లేకుండా జరుగుతుందా?

`ఆదాని వ్యాపారంలో ఇతరుల పాత్ర లేదా?

`దేశమంతా కవితపై కక్ష సాధింపు అన్నది చర్చ జరుగుతోంది?

`కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేయకతప్పదని తెలుస్తోంది?

`అనవసరంగా రాష్ట్ర బిజేపి నేతల మాట విని అధిష్టానం అంతర్మధనంలో పడినట్లుంది?

` అందుకే అరవింద్‌ వాయిస్‌ లో మార్పు వచ్చింది?

`బండి వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదని అరవింద్‌ నోట వచ్చింది?

`ఈ సంకేతాలు చాలు కవితపై కక్ష నిజమే! అని చెప్పడానికి?

ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు విశ్లేషణాత్మక కథనం.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఈ తరం రాజకీయాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితది ప్రత్యేక స్ధానం. దేశ రాజకీయాల్లో కీలక స్ధానం. తెలంగాణ రాజకీయాల్లో విశిష్ట స్ధానం. ప్రతిభ, సేవాభావం, రాజకీయం, ప్రగతి పధకం, జాగృతి పదనిర్ధేశం అన్నవి గొప్ప అంశాలు. ఇవన్నీ పునికి పుచ్చుకున్న నాయకురాలు కవిత. ఇప్పుడున్న పరిస్ధితుల్లో అలాంటి నాయకురాలు మా పార్టీలో లేదన్న అసూయ, ఆక్రోశం కూడా ఇతర రాజకీయ పార్టీలలో చాలా కాలంగా వుంది. నిరంతరం ప్రజల్లోవుండడం, ప్రజా సమస్యలపై స్పందిచే తత్వం కవితది. అందరికీ తెలిసిందే. కల్వకుంట్ల కవిత లాంటి డైనమిజం వున్న నేత మరే రాష్ట్రంలో లేదు. బిజేపి, కాంగ్రెస్‌పార్టీలో అంతకన్నా లేదు. దాంతో ఆమె నాయకత్వం భవిష్యత్తు తరంలో పెద్ద పెద్ద నాయకులకు కూడా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం వుంది. నిజామాబాద్‌ ఎంపిగా ఆమె చేసిన సేవలను ప్రజలు మర్చిపోయేట్లు చేసి, మభ్యపెట్టిన బిజేపి గెలిచింది. గెలిచిన ఆ మరుక్షణం ఆ పార్టీ మాట మార్చి అభివృద్ధి కుంటుపర్చడాన్ని ప్రజలుకూడా గమనిస్తున్నారు. ఈసారి నిజామాబాద్‌లో బిజేపికి కాలం చెల్లినట్లే..దేశ రాజకీయాల్లో కూడా బిజేపికి గడ్డుకాలమే…అందుకే కల్వకుంట్ల కవిత లాంటి నాయకురాలు బిజేపిలో వుంటే ఆ పార్టీకి తిరుగులేకుండా వుంటుందన్న ఆలోచన కూడా బిజేపి చేసినట్లు కూడా గతంలోనే తేలిపోయింది. బిజేపి ఎన్ని ప్రయత్నాలు చేసినా కవిత బిజేపిలో చేరే అవకాశాలు లేవని తేలిపోయింది. దాంతో నయానో, భయానో బిజేపిలోకి చేర్చుకునే ఎత్తుగడ కూడా బిజేపి చేసిందనేది విధితమే..ఈ సంగతి సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి కేసిఆర్‌ కూడా బిజేపి అరాజకీయ అసలు స్వరూపాన్ని ప్రపంచానికి తెలిపే క్రమంలో వెల్లడిరచారు. అయినా బిజేపి తన ప్రయత్నాలు ఆపలేదు. ఎంత ప్రయత్నించినా కవిత బిజేపిలోకి వచ్చే అవకాశాలు మృగ్యమైపోవడంతో, డిల్లీ మద్యం పాలసీ కేసుతో ఇబ్బందులకు గురిచేయాలని నిర్ణయించారు. ఒక రకంగా చెప్పాలంటే కక్షకట్టారు. బిజేపికి తెలియని విషయం ఏమిటంటే? అందరిలా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ పేరు చెప్పుకొని ఎదిగిన నేత కాదు. కేవలం ముఖ్యమంత్రి కేసిఆర్‌ పేరు చెప్పుకొని పదవులు పొందిన నేత కాదు. ఆమె స్వయంకృషితో ఎదిగిన నేత. ప్రజల ప్రేమాభిమానాలు చూరగొన్న నేత. 

చాలా మందికి తెలియని విషయమేమిటంటే 2014 ఎన్నికల ముందు వరకు ఆమె టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకురాలు కూడా కాదు. బిఆర్‌ఎస్‌ సానుభూతి పరురాలు మాత్రమే… అయినా ఆమె తెలంగాణ ఉద్యమంలో తాను ప్రత్యేకమైన దారిని ఎంచుకున్నది. తన ప్రత్యేకతను చాటుకున్నది. 

 ఒక నాయకురాలుగా చెప్పుకోలేదు. బిఆర్‌ఎస్‌ పేరుతో రాజకీయాలు చేయలేదు. అలా అనుకుంటే ఆమె 2009లోనే రాజకీయాలు చేసేది. పదవులు అందిపుచ్చుకునేది. కాని ఆమె జాగృతి అనే స్వచ్ఛంధ సంస్ధ ద్వారా యువతకు సేవ చేసింది. వారికి ఉపాధి కల్పనలో మెలుకవలు నేర్పించేందుకు అవసరమైన శిక్షణలు ఇప్పించింది. కొన్ని వేల మందికి ఐటి రంగంలో పోటీ పడేందుకు అవసరమైన శిక్షణలు ఇప్పించింది. ఎంతో మందికి ఆ రోజుల్లో లాప్‌టాప్‌లు కూడా అందించి ప్రోత్సహించింది. మరో వైపు తెలంగాణ ఉద్యమంలో మహిళల తరుపున ఆమె చేసిన ఉద్యమం ఒక చరిత్ర. ఒక నిఘంటువు. ఆ రోజు ఉద్యమంలో ఎక్కడా లేని వాళ్లు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు శతవిధాల ప్రయత్నించినవారు కూడా ఇప్పుడు కల్వకుంట్ల కవితను నానా రకాలుగా విమర్శిస్తున్నారు. అయినా ఆమె ఎప్పుడూ చెదరని చిరునవ్వుతో వాటిని వింటూ వదిలేస్తారు. నాటి నుంచి నేటిదాకా ప్రజలకు సేవ చేస్తూనే వున్నారు. ఉద్యమ కాలంలో కూడా ఇలాగే కొంత మంది విమర్శలు చేశారు. అయినా ఆమె అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడూ పట్టించుకోలేదు. ఆమె చేసిన ఉద్యమం మూలంగా తెలంగాణ యాసను కించపర్చేలా వున్న అనేక సినిమాలను అడ్డుకున్నారు. ఒక దశలో సీమాంధ్ర సినీ పరిశ్రమ శంకర్‌ తీసిన జై బోలో తెలంగాణ సినిమాకు అడ్డంకులు సృష్టిస్తే, అల్లు అర్జున్‌ ఆర్యా2, మహేష్‌బాబు సైనికుడు, జూనియర్‌ ఎన్టీఆర్‌ అదుర్స్‌ లాంటి సినిమాలు తెలంగాణలో ఒక్క షో కూడా పడకుండా చేశారు. తెలంగాణ శక్తి ఏమిటో చూపించారు. తెలంగాణ ఉద్యమంలో ఆమె పాత్ర ఎంత శక్తివంతమైనదో ఆ ఒక్క సంఘటనతో చూపించారు. మరి ఇప్పుడు మాట్లాడుతున్న వారెవరైనా ఆ పని ఆనాడు చేశారా? అలా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారా? కల్వకుంట్ల కవిత సాగించిన తెలంగాణ ఉద్యమ ప్రస్తానంలో అధ్భుతమైన కొన్ని వందల సంఘటనలున్నాయి. కాని ఇప్పుడు పదే పదే మాట్లాడుతున్నవారికి చెప్పుకోవడానికి కనీసం ఒక్క ఘటనైనా వుందా? నోరుంది కదా! మాట్లాడుతున్నవారికి కనీసం బిఆర్‌ఎస్‌ నేతలు కూడా సరైన కౌంటర్లు ఇవ్వకపోవడం బాధాకరం. 

 అసలు డిల్లీ లిక్కర్‌ది కేసే కాదు…అసలు అది సమస్యే కాదు…అది ఒక పాలసీలో భాగమైన చర్య…చర్చ…అంత వరకే…

అయినా ఆ పాలసీ ఎప్పుడో డిల్లీ ప్రభుత్వం ఉప సంహరించుకున్నది. ఈ విషయాలు రాష్ట్ర బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఇతర సీనియర్‌ నాయకులకు తెలియదా? బిఆర్‌ఎస్‌కు దేశంలో ఏ పార్టీకి లేనంత కార్యకర్తల యంత్రాంగం వుంది. సమారు 66లక్షల మందికార్యకర్తలున్నారు. కొన్ని వేల మంది క్రియాశీలక నాయకులున్నారు. రాష్ట్ర స్ధాయిలో అనేక పదవుల్లో వున్న నాయకులువందల్లో వున్నారు. వీళ్లెవరికీ అసలు డిల్లీ లిక్కర్‌ పాలసీ మీద అవగాహన లేకపోవడం విడ్డూరం. అంతే కాదు ఏడెనమిది నెలలుగా నలుగుతున్న ఈ సమస్యపై కనీసం ఏ ఒక్క బిఆర్‌ఎస్‌ నాయకుడు కూడా పెద్దగా స్పందించకపోవడం బాదాకరం. ఇప్పటికే బిఆర్‌ఎస్‌ నాయకులు బిజేపిని ఉతికి ఆరేయాల్సింది. కాని బిఆర్‌ఎస్‌ నేతల ఉదాసీనతే బిజేపికి మరింత బలం చేకూరింది. బిజేపి చేసిన అసత్య ప్రచారంలో నిజానిజాలు కూడా తెలుసుకోకుండా బిఆర్‌ఎస్‌ నేతలు కూడా లిక్కర్‌ స్కామ్‌ నిజమే అని నమ్మడం గమనార్హం. పదవుల కోసం వున్న శ్రద్ద బిఆర్‌ఎస్‌లో చాలా మందికి పార్టీని కాపాడుకోవడంలో లేదు. పార్టీమీద చిత్త శుద్ది లేదు. పార్టీ బలోపేతానికి వారు చేస్తున్నదేమీ లేదు. బిఆర్‌ఎస్‌లో అంతో ఇంతో ఉద్దండులైన నాయకులు, పాలన మీద అవగాహన వున్న సీనియర్‌ నేతలు కూడా స్పందించకపోవడం విచారకరం. అసలు లిక్కర్‌ అంశం డిల్లీలో అదొక పాలసీ మేటరే గాని, స్కామ్‌ అనే మాటకే అవకాశం లేదని నేటిధాత్రి చెప్పేదాక బిఆర్‌ఎస్‌ నేతలు చాలా మందికి అవగాహన లేకపోవడం మాత్రం శోచనీయం. 

కల్వకుంట్ల కవితకు ఈడీ సమన్లు అనగానే రాజకీయ పార్టీలకన్నా, ఎక్కువగా సీమాంధ్రకు చెంది, తెలుగు తెగులును ముందు పెట్టుకున్న ఓ పార్టీకి మీడియాకు ఎనలేని సంతోషం కలిగినట్లుంది.

 ఇంత కాలం మొసలి కన్నీరు కార్చే మీడియా మొత్తం ఒక్కసారిగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ కుటుంబంపై మాట్లాడే అవకాశం దొరికందన్నంతగా అత్యుత్సాహం ప్రదర్శించాయి. డిబేట్ల మీద డిబేట్లు…అసలు ఈడీ కేసులేమిటి? వాటి సెక్షన్‌లేమిటి? వాటి వల్ల ఏం జరగొచ్చు? కవితను అరెస్టు చేస్తే శిక్షేమిటి? నుంచి మొదలు ఇక కవిత అరెస్టు? అయినట్లే అన్నదాకా తీసుకెళ్లాయి? సాయంత్రం ఆరు గడిచినా ఎమ్మెల్సీ కవిత బైటకు రాకపోవడం, ఇక సీమాంద్ర మీడియా గొట్టాలకు పూర్తి స్ధాయి చెప్పింది. ఇక తాము చెప్పిందే జరిగిందన్న సంతోషాన్ని ఒక దశలో వ్యక్తం చేశాయి. ఆ రోజు బాగోతం అంతా ఇంతా కాదు…ఇలా తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన కవిత లాంటి నాయకురాలకు అన్యాయం జరిగితే అండగా నిలవాల్సిన మీడియా కూడా వెలికి వేశాలకు తెరతీసింది. ఇప్పటికీ ఆ మీడియాకు గుప్పిట దాగిన కసి చూపిస్తూనే వుంది. 

  తెలంగాణ మీడియా ఏం చేస్తున్నట్లు? ప్రభుత్వం ప్రటనలు ఇవ్వడం లేదు?

 అంటూ నిత్యం మాట్లాడే తెలంగాణ మీడియా అసలు స్కీమే కాని కేసులో స్కామ్‌ బూచి చూపి, ఎమ్మెల్సీ కవిత మీద క్షక్ష సాధింపు చర్యలు చేపడుతుంటే ఎందుకో తెలంగాణ మీడియాకు రాయడానికి అక్షరాలు రాలేదు? ఎలక్రానిక్‌ మీడియా నోరెందుకు పెగళ్లేదు? అంతే కాదు బిఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నమస్తే తెలంగాణ, టి. న్యూస్‌ ఏం చేస్తున్నట్లు అనే ప్రశ్నలు కూడా తెలంగాణ వాదుల నుంచి ఉత్పన్నమౌతున్నాయి. నిజాలేమిటో కూడా చెప్పలేకపోవడం ఏమిటని బిఆర్‌ఎస్‌ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు. కనీసం నేటిధాత్రిలో వచ్చినంత సమాచారంలో కొంత భాగమైనా ఎందుకు రాయలేకపోయారు… టి. న్యూస్‌లో వినిపించలేపోయారని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా కల్వకుంట్ల కవిత రాజీకీయం భవిష్యత్తు దేశ ప్రగతికి, ప్రగతిశీల సమాజానికి ఎంతో అవసరం. ఆమెకు నేటిధాత్రి పుట్టిన రోజు శుభాకాంక్షలు…

కవిత కడిగిన ముత్యం…

`లిక్కర్‌ కేసు బిజేపి డ్రామా?

`బిజేపికి బిఆర్‌ఎస్‌ అంటే భయం పట్టుకున్నది?

` కేంద్రాన్ని ఎదిరించే శక్తి ఒక్క బిఆర్‌ఎస్‌ కే ఉంది?

`కవిత లాంటి డైనమిక్‌ మహిళా లీడర్‌ ఏ రాష్ట్రంలో లేదు?

`బిజేపి పార్టీలో ఒక్కరు కూడా లేరు?

https://netidhatri.com/integrity-thy-name-kavitha/

`కవిత పవర్‌ఫుల్‌ లీడర్‌… కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేస్తుంది?

`అందుకే బిజేపి భయపడుతోంది?

`కేసులతో బెదిరించాలని చూస్తోంది!

`అసెంబ్లీలో తీర్మానం చేసిన పాలసీని స్కామ్‌ అనొచ్చా?

`మంత్రి మండలి స్కామ్‌ లపై సంతకాలు చేస్తుందా?

`పాలసీ అమలుకాకముందే స్కామ్‌ అని ఎలా అంటారు?

`ఢల్లీి సర్కారు మద్యం పాలసీని ఉపసంహరించుకున్నది కూడా!

` ప్రభుత్వం పాలసీ ఉపసంహరించుకుంటే తప్పు చేసినట్లేనా?

`కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాల ఉపసంహరణ జరిగింది?

`కేంద్రం తప్పు చేశామని ఒప్పుకున్నట్లేనా?

`బిజేపియేతర ప్రభుత్వాలపై బిజేపి కక్ష?

`బిజేపి పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వమే మద్యం అమ్ముతోందా?

`అసలు ప్రభుత్వమే నేరుగాఆ మద్యం అమ్మకాల షాపుల నిర్వహణ తప్పు?

` కేంద్రం దేశమంతటా మద్య నిషేదం అమలు చేయొచ్చు కదా?

`లిక్కర్‌ స్కీమే లేదు…స్కామ్‌ ఎక్కడిది?

`ఢల్లీి ప్రభుత్వం ఎప్పుడో ఉప సంహరించుకున్నది?

`లిక్కర్‌ పాలసీ ప్రభుత్వాల నిర్ణయం!

`ఢల్లీిలో వున్న షాపులే 800 పైచిలుకు?

`గతంలో సగం ప్రభుత్వం నిర్వహించేది?

`సగం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో వుండేవి?

`కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తే తప్పులేదా?

`మిగతా 400 షాపులు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం స్కామౌతుందా?

` ఒక్క ఢల్లీిలో నడిచే షాపుల ఆదాయం ఎన్నికలను ప్రభావితం చేసేంత శక్తి వుంటుందా?

`అంతా ఆదాని కోసమే….ఆదాని సమస్య పక్కదారి పట్టించడం కోసమే బిజేపి కుట్ర?

`వేల కోట్ల స్కామ్‌ చేసిన వారికి ప్రోత్సాహకాలా?

`ఢల్లీిి లిక్కర్‌ పాలసీలో గుజరాత్‌ వాళ్లుంటే బిజేపి కక్ష కట్టేదా?

`ఢల్లీి ప్రభుత్వం చేసిన పాలసీలో కవితకు ఎలా సంబంధం వుంటుంది?

`ప్రభుత్వ విధానాలు ఎక్కడైనా చర్చ లేకుండా జరుగుతాయా?

` ప్రతి వస్తువును పిరం చేసినోళ్లకు,ఢల్లీి మద్యం పిరమైందా?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

రాజకీయాల్లో ఎత్తులు, పైఎత్తులు, జిత్తులు, ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. కాని వేదింపులు సరికాదు. అందులోనూ రాజకీయ వేధింపులు అన్నవి ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే కేంద్రంలో బిజేపి అధికారంలోకి వచ్చాక దేశ వ్యాప్తంగా సుమారు 5వేలకు పైగా కేసులు నమోదు చేశారు. కాని అందులో తేలినవి కేవలం పదుల సంఖ్యలో మాత్రమే వున్నాయి. అంటే మిగతా కేసులన్నీ రాజకీయ క్షక్ష సాధింపు చర్యలకు పురిగొల్పినవే అన్న స్పష్టమౌతోంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్ధ వుంది. దానికి అనుగుణంగా రాజకీయాలు చేయాలి. అధికారంలోకి రావాలి. అందుకు ప్రజల అభిమానం చూరగొనాలి. అంతే కాని కేంద్రంలో అధికారంలో వున్నామని, రాష్ట్రాల రాజకీయాలను కలుషితం చేస్తాం…. ఆ ప్రభుత్వాలను కూలుస్తాం…దొడ్డి దారిన మేం అధికారంలోకి వస్తాం అనే బిజేపి కుట్ర సరైంది కాదు. రాజకీయ పరిణతికి నష్టం జరగొద్దు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను ఇబ్బందిపెట్టొదు. అసత్యాలు, అర్ధసత్యాలు, విపీరత ప్రచారాల పేరుతో ప్రజల మనోభావాలతో ఆడుకునే రాజకీయాలు అసలే చేయొద్దు. ఇప్పుడు కేంద్రం చేస్తున్నది ఇదే అన్నది దేశంలోని అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు తెలుసు. అంతే కాదు దేశంలో అనేక మంది రాజకీయ నాయకుల మీద ఈడి కేసులు నమోదు చేయడం, వారు బిజేపిలో చేరగానే ఆ కేసులను అటకెక్కించడం ఆనవాయితీగా మార్చుకున్నది బిజేపి. తెలంగాణలో కూడా అనేక మంది బిఆర్‌ఎస్‌ నాయకుల మీద కూడా ఈడీ కేసులు పెట్టడం చూసిందే… ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ సమన్లు కూడా అదే కోవలోకే చెందుతాయన్నది ఎవరూ కాదనలేని సత్యం అంటున్న మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య బిజేపిపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. అంతే కాకుండా లిక్కర్‌ స్కామ్‌ అన్న పదమే తప్పని, స్కీము లేదు..స్కామ్‌కు అవకాశమేలేదు…ముడుపుల ముచ్చటే లేదంటూ, ఇందంతా బిజేపి రాజకీయ కుట్ర తప్ప మరేం లేదంటున్న రాజయ్య, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. వాటిని ఆయన మాటల్లోనే…

కల్వకుంట్ల కవిత. ఆమేమీ సామాన్యమైన నాయకురాలు కాదు.

తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడిన నాయకురాలు. అనేక కేసులు కూడా ఎదుర్కొన్నారు. అమెరికాలో ఉద్యోగం చేస్తూ, ఆ జీవితాన్ని వదులకొని వచ్చి, తెలంగాణ కోసం కొట్లాడిన నాయకురాలు. ఆమె తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినప్పుడు తెలంగాణ వస్తుందో రాదో తెలియదు. ఆమె పదవులు ఆశించి రాలేదు. కేవలం తెలంగాణ సాధనలో భాగాస్వామ్యం కావాలన్న ఆలోచనతో మాత్రమే వచ్చారు. అలా తెలంగాణ వచ్చి, ఉద్యమంలో పాల్గొన్నవారు బిజేపిలోగాని, కాంగ్రెస్‌లోగాని అలాంటి వారు ఒక్కరైనా వున్నారా? అసలు బిజేపిలో ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిన ఎమ్మెల్యేలు, ఎంపిలే లేరు. కేవలం ఆనాటి యూపిఏ 2 ప్రభుత్వం తెలంగాణ ప్రకటన చేసిన తర్వాతనే బిజేపిలో కొద్దిగా కదలిక వచ్చింది. తెలంగా ప్రకటన వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించగానే, తెలంగాణకోసం బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేశాం… కాని ఆనాటి బిజేపి ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదు. ఈనాడు రాజకీయాల కోసం తెలంగాణ సాధన కోసం కొట్లాడిన వారిని రాజకీయంగా వేధించడం అన్నది సరైంది కాదు. కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన సమయంలోనే జాగృతి అనే స్వచ్ఛంద సంస్ధ ఏర్పాటు చేసింది. దాని ద్వారా తెలంగాణలోని అనేక గ్రామాల్లో యువతకు వృత్తినైపుణ్య శిక్షణలు ఇప్పించి, వారి భవిష్యత్తుకు ఒక దారి చూపింది. ఐటి రంగంలో ఉద్యోగార్ధులకు అవసరమైన శిక్షణలు ఇప్పించింది. మరో వైపు బతుకమ్మ ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని మరో లెవల్‌కు తీసుకుపోయింది. సాంస్కృతిక పోరాటాన్ని పూలతో బతుకమ్మ రూపంలో సంస్కృతిని పునరుజ్జీవం కోసం పాటుపడిరది. అంతే కాదు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరిగినన్ని వంటావార్పు కార్యక్రమాలు మరే నాయకుడి ద్వారా జరగలేదు. ఎక్కువగా వాంటా వార్పు కార్యక్రమాలు ఆమె చేతుల మీదుగానే జరగడం విశేషం. ఇలా మహిళలను తెలంగాణ ఉద్యమంలోకి తీసుకొచ్చిన ఘనత కూడా కవితకే దక్కింది. అలాంటి కవిత మీద లిక్కర్‌ కేసలన్న భూచీ చూపి, ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం అన్నది సరైంది కాదు. ఆమె రాజకీయ జీవితానికి ఇబ్బందులకు గురి చేయడాన్ని తెలంగాణ సమాజం హర్షించదు. ఆమె పార్లమెంటు సభ్యురాలుగా ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు అందుకున్న నాయకురాలు. కవిత లాంటి డైనమిక్‌ నాయకురాలు దేశంలో ఎక్కడా లేరు. అంతే కాదు బిజేపిలో అలాంటి అలాంటి నాయకురాలు ఒక్కరు కూడ లేదు. దేశ రాజకీయాల మీద పట్టున్న నాయకురాలు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. తెలంగాణాలో ప్రగతి శీల పాత్ర పోషిస్తున్నారు. దేశంలో చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు రాజ్యసభలో పాస్‌ అయి ఇప్పటికీ సుమారు 27 ఏడేళ్లు పూర్తవుతోంది. కాని ఇప్పటి వరకు దేశంలో ఏ మహిళా నాయకురాలు ఈ విషయం గురించి మాట్లాడిరది లేదు. కేవలం ఒక్క కవిత మాత్రమే మాట్లాడుతూ వస్తోంది. ఆమె ఎంపిగా వున్న సమయంలో అనేక సార్లు ప్రస్తావించింది. ఇప్పుడు జంతర్‌ మంతర్‌ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టింది. మహిళాభ్యుదయానికి,చైతన్యానికి కవిత అంకితభావం నిదర్శనం. ఒకనాడు తెలంగాణ కోసం, ఇప్పుడు మహిళా బిల్లు కోసం కవిత చేస్తున్న కార్యక్రమాన్ని అభినందించాల్సిన సమయంలో కేసులు, ఈడీలు, సమన్లు అంటూ సమస్యను పక్కదారి పట్టించి, అసలు విషయం ప్రజల్లోకి పోకుండా బిజేపి అడ్డుకోవడం మహిళా సమాజాన్ని అవమాన పర్చడమే, చిన్న చూపు చూడడమే..వారికి అన్యాయం చేయడమే…మహిళల వాయిస్‌ లేకుండా చేయడమే? అవుతుంది. 

 కొన్ని విషయాలు లోతుగా విశ్లేషించుకోవాలి. 

లిక్కర్‌ పాలసీలపై రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం సహజం. అందులో డిల్లీ ఆప్‌ సర్కారు ఒక నిర్ణయం తీసుకున్నది. అది తప్పో, ఒప్పో ఆ రాష్ట్రానికి సంబంధించింది. అంతే కాని దానిని ఎక్కడికో ముడిపెట్టి, ఎవరెవరినో జత చేసి, బిజపిని ఎండగుడుతున్న బిఆర్‌ఎస్‌ను ఎలా దెబ్బతీయాలని చూడడమే ఇందులో అసలు రహస్యం. ఇంతకన్నా ఏమీ లేదు. అంతా బిజేపి ఆడుతున్న డ్రామా… అసలు లిక్కర్‌ స్కామ్‌ అంటే ఏమిటి? సహజంగా స్కాములు ఎలా జరుగుతాయన్నది అందరికీ తెలుసు. ప్రభుత్వం ప్రవేశ పెట్టన ఏదైనా పధకంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం చేస్తే స్కాం అవుతుంది. లిక్కర్‌ విషయంలో దానిలో దాపరికం అంటూ ఏమీ వుండదు. ఒక వేళ నకిలీ మద్యం సరఫరా చేస్తే నేరమౌతుంది. స్కాం అవుతుంది. అంతే కాని అసలు ఒక ప్రభుత్వం ప్రకటించిన పాలసీనలో వ్యాపారలు హక్కులు ఎలా స్కాం అవుతుందో బిజేపి నేతలే చెప్పాలి. ముడుపులు తీసుకుంటే స్కామ్‌ అవుతుంది? మరి అలాంటి ఆధారాలు ఎక్కడా లేవు. ఏ పార్టీ అయినా తాము అధికారంలోకి వచ్చాక కొన్ని కొత్త పాలసీలు తీసుకోవడం, పాత పాలసీలను పక్కన పెట్టడం సహజంగా జరిగిదే…అలాగే డిల్లీ ప్రభుత్వం కూడా గతంలో వున్న మద్యం పాలసీలో మార్పులు తీసుకొచ్చింది. డిల్లీ లో సుమారు 800పైగా మద్యం షాపులు వుంటాయి. వాటిలో సగం అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తే, మరో సగం ప్రైవేటు వ్యాపారులు నిర్వహిస్తుంటారు. దానిలో ఆప్‌ ప్రభుత్వం మార్పు తీసుకొచ్చి, మొత్తం ప్రైవేటు వ్యాపారులకు ఆ డీలర్‌ షిఫ్‌లు అందించే పాలసీకి శ్రీకారం చుట్టింది. అందుకోసం అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సుధీర్ఘమైన చర్యలు జరిపింది. అందుకోసం అధికారుల చేత ఒక కమిటీ వేసింది. ఆ అధికారుల కమిటీ నివేదిక మీద మరో ముగ్గురు మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది. అందులో కొన్ని సవరణలు చేసింది. ఆ నివేదికపై కూడా అక్కడి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ సూచించిన సరవణలు కూడా పొందుపర్చి, అప్పుడు డిల్లీ శాసన సభ ఆమోంచింది. ఒక్కొ జోన్‌లో కేవలం 27 షాపులకే అనుమతులు అనే దానికి కూడా అంగీకారం తెలిపారు. ఈ పాలసీ ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.9500 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని ఆప్‌ ప్రభుత్వం అంచానా వేసింది. 2021 జాన్‌లో క్యాబినేట్‌ కూడా ఆమోదముద్ర వేసింది. అంతే కాదు షాపుల నిర్వహణ అన్నది డిల్లీ డెవలప్‌ మెంటు అధారిటీ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుందన్న నిబందన కూడా చేర్చారు. దాంతో 2021 నవంబర్‌ 17 కాకపోతే దీన్ని అక్కడి ప్రతిపక్షాలు రాజకీయం చేయడంతో ఆప్‌ సర్కారు ఆ పాలసీని కూడా రద్దు చేశారు. ఇదంతా 2021 ఫిబ్రవరిలో జరిగిన సంఘటన. ఆదానికి చెందిన కంపనీలు బ్యాంకులకు రుణాలు చెల్లించే పరిస్ధితుల్లో లేకపోతే వాటిని మాఫీ చేయడం తప్పుకానప్పుడు, ఆప్‌ సర్కార్‌ అమ్మకాలు లేని కారణంగా డీలర్లకు రూ.144 కోట్ల ఫీజు మాఫీ చేసిందనేది స్కామ్‌ అవుతుందా? దేశంలో పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు కరోనా సమయంలో రూ.10లక్షల కోట్ల బకాయిలు చెల్లించలేని కారణంగా వారికి కూడా రుణాలు మాఫీ చేసింది బిజేపి. కేంద్ర ప్రభుత్వం…ఇది తప్పుకాదా? సామాన్యులకు ఇచ్చే రేషన్‌ సరులకు ఉచితాలౌతాయి? అందరూ వంటకు వాడుకునే సిలెండర్ల ధరలు విపరీతంగా పెరుగుతాయి. విమానాల ఇంధన ధరలు తగ్గుతాయి…పెట్రోల్‌ డీజెల్‌ రేట్లు పెరుగుతాయి? వీటిని స్కామ్‌లని ఎందుకు అనకూడదు? ఇలాంటి ప్రశ్నలు బిజేపి మీద ఎన్నో వున్నాయి. అన్నింటి గురించి బిజేపి పెద్దలు పనిపాట లేని ముచ్చట్లు బాగానే చెబుతారు? కాని ఆదాని గురించి వచ్చే సరికి ప్రధాని మోడీ ఎందుకు మాట్లాడడు…దేశంలో ఏ ఒక్కరికైనా రెండుకు మించి ప్రైవేటు ఎయిర్‌పోర్టులు వుండరాదు? ఇది చట్టం చెప్పే మాట… మరి ఆదానికి ఐదారు ఎయిర్‌ పోర్టులు ఇవ్వడం స్కామ్‌ కాదా? ప్రభుత్వ రంగ సంస్ధలను అమ్మకాలకు పెట్టడం స్కామ్‌ల కిందకు రాదా? ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత అమ్మకాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం వ్యాపారం చేయదని సంస్ధలన్నీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించినప్పుడు, ఆప్‌ సర్కారు లిక్కర్‌ వ్యాపారం ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని అసెంబ్లీ తీర్మాణం చేయడం ఎలా స్కామ్‌ అవుతుంది? ఇంత చిల్లర రాజీకీయాలుంటాయా? అయితే ఆప్‌ సర్కార్‌ ఆ పాలసీని రద్దు చేసి, తన చిత్తశుద్దిని నిరూపించుకున్నది. స్కామ్‌ జరక్కపోతే ఎందుకు వెనక్కి తీసుకుంటున్నట్లు అని మళ్లీ ప్రశ్నిస్తున్న బిజేపి, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రధాని ప్రకటించారు. మొసలి కన్నీరు కార్చారు? అందులో స్కామ్‌ లేదా? అన్న ప్రశ్నకు ఇంత వరకు బిజేపి ఎందుకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతోంది. దేశంలో ఇక బిజేపి పని అయిపోయింది. ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలంటే కుయుక్తులు తప్ప, ప్రజల మనసుల్లో బిజేపికి చోటు లేదు. బిఆర్‌ఎస్‌ను చూసి బిజేపి భయపడుతోంది. పైగా ప్రతిపక్షాలు పుంజుకోవడం చూసి జడుసుకుంటోంది. ఎలాగైనా ప్రతిపక్షాలను వీక్‌ చేసి, ప్రజల దృష్టి మళ్లించి, కుటిల రాజకీయాలు చేయాలని బిజేపి చూస్తోంది. కాని ప్రజలు అంత అమాయకులు కాదు….సరైన సమయంలో బిజేపికి తగిన బుద్ది చెబుతారు..

‘‘నో’’ టిక్కెట్‌… ‘‘కాదంటే’’ కట్‌!?

`వారసుల ఆశలు ఆవిరి?

`ఈసారి వారసులకు టిక్కెట్లు కష్టమే!

`ఎన్నికలు ఈసారి బిఆర్‌ఎస్‌ కు మరింత ప్రతిష్టాత్మకం.

`ఇప్పటికే ఇండికేషన్‌ పంపిన సిఎం కేసిఆర్‌?

`అనుభవజ్ఞులైన సీనియర్లకే మళ్ళీ అవకాశం!

`మార్చాల్సిన స్థానాలలో కూడా ఆశావహులైన సీనియర్లకే ప్రాధాన్యత.

`మొత్తం మీద మరో సారి సీనియర్లనే రంగంలోకి…

`వారసులతో ఇప్పటికే చాలా మంది సీనియర్లకు ఇంటిపోరు.

`తాము బలంగా వున్నప్పుడే వారసులను గెలిపించుకోవాలని ఆశ పడుతున్న సీనియర్లు.

`వచ్చే ఎన్నికల దాక మళ్ళీ ఆగాల్సిందేనా అని వారసుల గోల?

`గత ఎన్నికలలో ఇదే పరిస్థితి ఎదుర్కొన్న కొందరు సీనియర్లు?

`ఈసారి కూడా సీనియర్లకే అనడం వారసులకు నిరాశే!

` ఒకే ఇంట్లో ఇద్దరికీ ఇవ్వడం కుదరదు?

`తలలు పట్టుకుంటున్న సీనియర్లు.

`బలంగా వున్న ప్రతిపక్షాలను ఎదుర్కోవాలంటే సీనియర్లే కీలకం!

హైదరాబాద్‌,నేటిధాత్రి: రాజకీయాల్లో రాను రాను వారసత్వాలు పెరిగిపోతున్నాయి. ఇది వాంఛనీయం కాకపోవచ్చు. కాని వారసత్వ రాజకీయాలు తప్పుకాదు. రాజకీయ నాయకుల వారసులు రాజకీయాలను ఎంచుకోవడంలో తప్పులేదు. ఎటొచ్చి ఎల్లకాలం వాళ్లేనా…మాకు అవకాశం రావొద్దా? అని ఎదురుచూసే నాయకులు కూడా వుంటారు. రాజకీయ జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలని, ఎంపి కావాలని, మంత్రి కావాలన్న కోరిక చాలా మందికి వుంటుంది. అత్యున్నత పదవులు పొందాలన్న లక్ష్యం నెరవేర్చడం కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నవారు కూడా వుంటారు. అయినా కొన్ని సార్లు అలాంటి వారికి జీవితాంతం అవకాశం రాకపోవచ్చు. కొందరికి అనుకోని వరంలా అవకాశాలు కలిసిరావొచ్చు. అలా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఇప్పటికీ రాజకీయాల్లో కొనసాగుతున్నవారు..వారి వారసులను రాజకీయాల్లోకి చేర్చినవారు కొన్ని వందల మంది వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కసారిగా తెరమీదకు వచ్చిన తెలుగుదేశం మూలంగా కొత్త తరం రాజకీయాలకు శ్రీకారం జరిగింది. కొత్త తరం నేతలు రాష్ట్ర రాజకీయాలకు పరిచయమయ్యారు. ఆనాడు రాజకీయాలకు పరిచయం అయిన నేతలు ఇంకా క్రియాశీలక రాజకీయాలలో తమదైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు. సుధీర్ఘ రాజకీయ అనుభవంతో వారి వారసులకు రాజకీయ భవిష్యత్తును సృష్టించిన వారు వున్నారు. కొన్ని కుటుంబాలలో ఒకటి రెండు తరాలు మారినా, వాళ్లే రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా వున్నవాళ్లు కూడా వున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయాలకు అందరూ అర్హులే. కాకపోతే రాజకీయ నాయకుల స్ధాయిని, హోదాను బట్టి ఆయా ప్రాంతాలో వారసులు కూడా తమ భవిష్యత్తు రాజకీయాలను తీర్చిదిద్దుకునే అవకాశం ఏర్పడుతుంది. వారి వారి ప్రాంతాలలో రాజకీయాలను చేతిలోకి తీసుకొని నాయకత్వ పటిమ ప్రదర్శిస్తూ వుంటారు. ప్రజల ఆశీస్సులు వుంటే ఎవరైనా ప్రజా ప్రతినిధి కావొచ్చు. వారసత్వం అన్నది ఒక మెట్టు ఎక్కడానికో, రాజకీయాలకు పరిచయం చేయడానికో మాత్రమే పనికొస్తుంది. ఎల్ల కాలం ఉపయోపగపడదు. తనకు ప్రజా ప్రతినిధిగా అవకాశం వచ్చినప్పుడు ఆ యువ నాయకుడు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారన్నది కూడా ప్రజలు గమనిస్తూ వుంటారు. ప్రజలకు సేవ చేయడంలో సక్సెస్‌ అయితే మళ్లీ, మళ్లీ అవకాశం కల్పిస్తారు. ఎంత పెద్ద నాయకుడైనా సరే అభివృద్ధి చేస్తేనే, ప్రజలకు అందుబాటులో వుంటే, తమ సమస్యలు నాయకుడు తీర్చగలడన్న నమ్మకం వుంటేనే ఓట్లేస్తారు..గెలిపిస్తారు..అంతే కాని వారసులు అన్న ఒకే ఒక్క పదం మాత్రమే నాయకుడిని చేయదు…చేసినా అది ఎల్ల కాలం నిలబడదు..అలా రాజకీయాలు చేయలేక నిష్క్రమించిన వాళ్లు కూడా చరిత్రో అనేక మంది వున్నారు. 

 అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త తరం కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తోంది.

కాని ఇప్పుడున్న పరిస్దితుల్లో ఏ పార్టీ అంత ధైర్యం చేసే పరిస్దితి కనిపించడం లేదు. రెండుసార్లు అధికారంలోకి వచ్చి, మూడోసారి గెలిచి హాట్రిక్‌ కొట్టాలనుకుంటున్న అధికార బిఆర్‌ఎస్‌ పార్టీతోపాటు, ప్రతిపక్షాలు కూడా కొత్త తరం నాయకులకు టిక్కెట్లు ఇచ్చేందుకు కూడా సుముఖంలేవు. కాంగ్రెస్‌లో ఇప్పటికీ సీనియర్లదే హవా కొనసాగుతోంది. ఆ పార్టీలో కూడా మరోసారి అవకాశం కోసమే పాత తరం నేతలంతా ఎదురుచూస్తున్నారు. ఆ పార్టీలో కొత్త నాయకత్వానికి అవకాశమే లేదు. పాతవారికే టిక్కెట్లు సర్ధలేక కాంగ్రెస్‌ పార్టీ తలలు పట్టుకునే అవకాశం వుంది. ఇక బిజేపిలో కూడా దాదాపు అంతే…ఇతర పార్టీలనుంచి వచ్చిన సీనియర్లు, గతం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారికే ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం లేదు. అందువల్ల కొత్త తరానికి అక్కడా అవకాశం లేకుండాపోయింది. కాకపోతే అధికార బిఆర్‌ఎస్‌లో పోటీ మాత్రం విపరీతంగా వుంది. ఆ పోటీ మాత్రం విచిత్రంగా వుంది. ఈసారి టిక్కెట్లు మాకు కాకుండా మా వారసులకు ఇవ్వాలన్ని డిమాండ్‌ బిఆర్‌ఎస్‌లో బాగానే వుంది. తాము నాయకులుగా బలంగా వున్నప్పుడే, పార్టీ పటిష్టంగా వున్నప్పుడే తమ వారసులను రంగంలోకి దింపి ఎన్నికలలో గెలిపించుకోవాలని, వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని చాలా మంది నేతలు ఆశపడుతున్నారు. అందులో కూడా చాలా మంది గత ఎన్నికల్లోనే తమ వారసుల భవిష్యత్తును నిర్ధేశించుకోవాలనుకున్నారు. కాని ఆ ఎన్నికల్లో ఆ అవకాశం ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఇవ్వలేదు. ఒకరికో, ఇద్దరికో అవకాశం ఇచ్చారు. కాని ఈసారి ఆ అవకాశం కూడా ఇవ్వకూడదన్న నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈసారి తమకు కాకుండా టిక్కెట్టు తమ వారసులకు కావాలని కోరుకునే నేతలకు సీరియస్‌గానే సిఎం. కేసిఆర్‌ చెప్పనున్నారట. మీరు మాత్రమే పోటీ చేయాలని ఆదేశాలు జారీ చేసే అవకాశం వుందన్నది తెలుస్తోంది. కాదూ, కూడదు అని ఎవరు నసిగినా వాళ్లకు కూడా టికెట్‌కట్‌ అన్న సంకేతాలు పంపిస్తున్నట్లు సమాచారం. అంటే ఈసారి కూడా బిఆర్‌ఎస్‌ వారసులకు టిక్కెట్లు లేవు. ఇప్పుడున్న సీనియర్లే మళ్లీ పోటీ చేయాలి.. అందులో కూడా కొందరిని మార్చే అవకాశం వున్న చోట కొత్తవారికి అవకశం కల్పించనున్నారు. అంతే కాని నాయకుల వారసులకు మాత్రం టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇదే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఫిక్స్‌ అయినట్లు సమాచారం. ఎందుకుంటే ఇటీవల ఓ సభలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ కాకతాళీయంగా అన్నా, అవే సీరియస్‌ సంకేతాలుగానే పరిగణించాలని నాయకులకు అర్ధమైపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఇండికేషన్లు వున్న తర్వాత కూడా టిక్కెట్‌ విషయంలో ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం ఆయన ఇవ్వకపోవచ్చు.

 ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకం.

 అధికార బిఆర్‌ఎస్‌కు మరీ ముఖ్యం. ఎందుకంటే బిఆర్‌ఎస్‌దేశ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ సమయంలో అనుభవజ్ఞులైన నాయకుల నాయకత్వమే ఎంతో అవసరం. వారికి వున్న అనుభవం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ నాయకులకు నియోజకవార్గల మీద, జిల్లా మీద పూర్తి పట్టు వుంటుంది. అదే వారసులకు అంతగా వుండకపోవచ్చు. పైగా ప్రజల్లో కొత్త వారసత్వ నాయకుల ప్రభావం కూడ పడొచ్చు. రెండుసార్లు అధికారంలో వున్న బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసిఆర్‌పై ప్రజలకు పూర్తి స్దాయి నమ్మకం, భరసా వున్నాయి. ఆయన నాయకత్వమే ప్రజలు కోరుకుంటున్నారు. కాని కొందరు నాయకుల పనీతీరును ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అలాంటి చోట్ల బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుల స్దానంలో వారి వారసులకు అవకాశం కల్పిస్తే, మొదటికే మోసం రావొచ్చు. కొత్త తరానికి అవకాశం రావాలి. కాని దానికి కూడా సమయం సందర్భం వుంటుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలు తీర్పును చూశాం…నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో తీర్పును చూశాం…రామలింగారెడ్డి పనితీరుపై ప్రజలు అసంతృప్తితో వుండడంతో మళ్లీ ఆ కుటుంబాన్ని ప్రజలు ఆదరించలేదు. సానుభూతి కూడా పనిచేయలేదు. అదే నాగార్జున సాగర్‌లో సానుభతి పనిచేసింది. నోముల నర్సింహయ్య నాయకత్వం ప్రజలకు వున్న నమ్మకంతో భగత్‌ను గెలిపించారు. అందుకే ఈసారి రాష్ట్రంలో ముక్కొణపు పోటీ అనివార్యం. ప్రతిపక్షాలు కూడా కొంత బలపడ్డాయనే చెప్పాలి. గత ఎన్నికల పరిస్ధితి ఇప్పుడు లేదు. అందువల్ల ఆ పార్టీలను ఎదుర్కొనాలంటే ఖచ్చితంగా సీనియర్‌ నాయకులనే మళ్లీ ఎంపిక చేయాల్సిందే..వారికే టిక్కెట్లు ఇస్తేనే సీనియర్‌ నాయకులపై వున్న నమ్మకం, ముఖ్యమంత్రి కేసిఆర్‌ మీద వున్న విశ్వాసంతో బిఆర్‌ఎస్‌ మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా వున్నాయి. అందుకే ఈసారి వారసులకు టిక్కెట్‌ నో…!కాదూ..కూడదు…అంటే సీనియర్లకు కూడా కట్‌…!! ఇది ఫిక్స్‌…!!! అని సమాచారం. వారసులను రాజకీయాల్లోకి దింపాలన్న నాయకుల లిస్టు పెద్దగానే వుంది…అందుకే అందతా కాన్సిల్‌…? ఇదే ఫైనల్‌!?

బిసి నేతలు ఎదుగొద్దా! బతకొద్దా!?

` రాజకీయాలలో హత్యా రాజకీయాలకు తావులేదు.

`రాజకీయాలన్నీ ఆత్మహత్యా సదృశ్యాలే!

`బిసి. నేతలను నిర్మూలించి ఎన్నేండ్లు రాజకీయం చేస్తావు?

`వెయ్యేండ్లు బతికి పదవులు అనుభవిస్తావా?

`పార్టీయే నమ్మక పిసిసి ఇవ్వలేదు!

`కోమటి రెడ్డి సమర్థత ఎంతో అక్కడే తేలిపోయింది?

`చెరుకు సుధాకర్‌ చిన్న నాయకుడైతే అంత భయమెందుకు?

`రేవంత్‌ రెడ్డిని ఎదిరించే ధైర్యం లేదు?

`బిసి.నేతల మీదనా నీ ప్రతాపం?

`తెలంగాణ ఉద్యమ సమయంలో పిడి.యాక్ట్‌ ఎదుర్కొన్న ఏకైక నాయకుడు చెరుకు సుధాకర్‌.

`నల్గొండ జిల్లాలో ఎంతో మంది బిసి నేతల రాజకీయ జీవితాలు నాశనం చేసినట్లు అనేక ఆరోపణలు?

`ఇప్పటికే పార్టీలో ఎవరూ నమ్మడం లేదు?

`కాంగ్రెస్‌ లో టిక్కెట్‌ వస్తుందో నమ్మకం లేదు?

`ఎప్పుడు గోడ దూకుతావో ఎవరికీ తెలియదు?

`పార్టీని ఖతం చేసే పనిలో, నేతలను కూడా లేపేస్తావా?

`ఇంతేనా ఇన్నేళ్ల రాజకీయం నేర్పిన పాఠం!

` ఇదేనా ఇంత కాలం అనుసరించిన అరాచక రాజకీయం!

 హైదరాబాద్‌,నేటిధాత్రి: 

రాజకీయాల్లో అసహనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గతంలో రాయలసీమలో ఇలాంటి వాతారణం వుంటుందని అంటుండేవారు. కాని కోమటి రెడ్డి వెంకటరెడ్డిలా తన రాజకీయ ప్రత్యర్ధులను ఏకంగా వంద మంది వెతుకుతున్నారు..వేసేస్తారు? అని చెప్పేంత ధైర్యం ఎవరూ చేసి వుండదు. రాజకీయాలకు దూరంగా వున్నవారో..లేక వ్యాపారాలలో ప్రత్యర్ధులలో..తగాదాలలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారి చూసి వుంటాం…కాని ఒకే పార్టీలో వుంటూ, మరో నాయకుడిపై భువనగిరి ఎంపి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా వ్యాఖ్యలు చేయడాన్ని అందరూ ఖండిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిలో ఇటీవల వీపతీరంగా అసహం పెరిగిపోయినట్లుంది. గత కొంత కాలంగా ఆయన కాంగ్రెస్‌లో ఇమడలేకపోతున్నారు. పార్టీలో వుండాలో వద్దో తేల్చుకోలేకపోతున్నాడు. తమకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తిరుగులేదనుకున్నాడు. తమకు ఎదురులేదనుకున్నాడు. ప్రతి ఎన్నికల్లో గెలుస్తూ రావడంతో ప్రజలు తమ వైపు వున్నారన్న అహంభావం మరీ ఎక్కువైంద. ఎవరిని పడితే వారిని తిడుతున్న్డాడు. దూషిస్తున్నాడు. కాంగ్రెస్‌లో అసమ్మతి నేతగా వుంటూ వస్తున్నారు. అసమ్మతి నేతైనంత మాత్రాన ఆయనేం బలమైన నేత అన్నది ఎవరూ అనుకోడం లేదు…పార్టీ కూడా గుర్తించలేదు. కాకపోతే ఎన్నికల్లో అడిన చోట్లల్లా టిక్కెట్లు ఇస్తూ వస్తున్నారు. 2009 ఎన్నికల సమయంలో తన సోదరుడైన రాజగోపాల్‌రెడ్డిని రాజకీయాల్లోకి తెచ్చాడు. రాజశేఖరెడ్డి ఆశీస్సులతో తన తమ్ముడికి ఎంపి టిక్కెట్టు ఇప్పించుకున్నాడు. గెలిచారు. కాని 2014 ఎన్నికల్లో అన్న గెలిచాడు. తమ్ముడు ఓడిపోయాడు. అయినా కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ టిక్కెట్టు ఇచ్చింది. తర్వాత 2018లో మునుగోడు టిక్కెట్టు తమ్ముడికి, నల్లగొండ టిక్కెట్టు అన్న తీసుకున్నారు. ఈసారి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడిపోయాడు. తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి గెలిచాడు. తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ వెంకటరెడ్డికి పార్టీ భువనగిరి ఎంపి టిక్కెట్‌ ఇచ్చింది. ఇంతగా పార్టీ అన్నాదమ్ములకు ప్రోత్సాహం ఇచ్చినా పార్టీని వెన్నుపోటు పొడిచారు. తమ్ముడు పార్టీ మారాడు. మునుగోడు ఉప ఎన్నిక తెచ్చాడు. వున్న పదవి పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే రాజగోపాల్‌ మునుగోడు బరిలో నిలిచాడో అప్పటినుంచి అన్నకు అసహనం విపరీతంగా పెరిగిపోతూ వచ్చింది.

 రాజగోపాల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా వున్నప్పుడే ఇక కాంగ్రెస్‌ పార్టీ ఖతమైందంటూ బిజేపి వైపు చూశాడు. 

తమ్ముడు రాజీనామా చేసిన తర్వాత అన్న అదే రాగం అందుకున్నాడు. భవిష్యత్తు బిజేపిదే అంటూ, కాంగ్రెస్‌లో వుంటూ తమ్ముడి వైపు సైలెంటు ప్రచారం నిర్వహించాడు. అబాసు పాలయ్యాడు. అయినా ఆయనలో మార్పు రాలేదు. పైగా సొంతపార్టీ నేతలపై బెదిరింపులకు దిగుతూ వస్తున్నాడు. చివరికి తెలంగాణ ఉద్యమకారుడైన చెరుకు సుధాకర్‌ గౌడ్‌ను చంసేస్తానంటూ హెచ్చరికలు జారీ చేశాడు. వంద మంది ఆయన కోసం వెతుకుతున్నారంటూ సుదాకర్‌గౌడ్‌ కొడుకుతో ఫోన్లో బెదిరించాడు. సుధాకర్‌ గౌడ్‌కొడుకు హాస్పిటల్‌ను నాశనం చేస్తానన్నాడు. చెరుకు సుదాకర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి రావడం అన్నది ఆది నుంచి వెంకటరెడ్డికి నచ్చలేదు. ఆయన రాకను వెంకటరెడ్డి వ్యతిరేకించాడు. 

 కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆది నుంచి చెరుకు సుధాకర్‌ కొరకరాని కొయ్యగా మారుతూ వస్తున్నాడు.

 దాంతో సుధాకర్‌పై ఇలాంటి వాఖ్యలు చేశాడు. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా వున్న సమయంలో తెలంగాణలో ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. ఆ సమయంలో చెరుకు సుధాకర్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉద్యమకారుడిగా పదేపదే కాంగ్రెస్‌పై విరుచుకుపడుతుండేవారు. అది వెంకటరెడ్డికి అనేక సార్లు ఇబ్బందులకు గురి చేసింది. ఇదే సమయంలో చెరుకు సుధాకర్‌పై పడి. యాక్ట్‌ పెట్టారు. ఆయనను వరంగల్‌ జైలుకు పంపారు. ఇందులోనూ కోమటిరెడ్డి ఒత్తిళ్లే కారణమన్నది అప్పట్లో చెప్పుకుంటుండేవారు. కాకపోతే తాను తెలంగాణ వాదినే అని చెప్పుకొని మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత వెంకటరెడ్డి వరంగల్‌ జైలులో సుదాకర్‌ను కలవడం జరిగింది. తాను సుధాకర్‌కు వ్యతిరేకం కాదనే సంకేతాలు పంపారు. అయినా వారి మధ్య వార్‌ నడుస్తూనేవుంది. ఇది ఇటీవల కాలంలో మరింత పెరిగింది. అప్పుడుంటే చెరుకు సుధాకర్‌ టిఆర్‌ఎస్‌ వుండేవారు. తర్వాత ఆయన సొంతంగా తెలంగాణ ఇంటి పార్టీ పెట్టుకున్నాడు. కాని ఇప్పుడు సుధాకర్‌ గౌడ్‌ కాంగ్రెస్‌లో వున్నాడు. ఈ మధ్య జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డిని ఓడిరచడంలో కీలక పాత్ర పోషించాడు. రాజగోపాల్‌రెడ్డికి పట్టున్న చౌటుప్పలోనే ఓట్లు పడకుండా రాజకీయం నడిపాడు. అప్పటినుంచి చెరుకు సుధాకర్‌ మీద వెంకటరెడ్డి మరింత కోపం పెంచకున్నాడన్నది వినిపిస్తున్న మాట. అయితే తాజాగా జరిగిన వివాదంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అత్యుత్సాహానికి పోయి, గతంలో అద్దంకి దయాకర్‌ విషయంలో చేసిన దూకుడే ఇప్పుడూ ప్రదర్శించాడు. కాకపోతే బొక్కా బోర్లా పడ్డాడు. సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలను పూర్తిగా చూడకపోతే ఏమౌతోందో అన్నది వెంకటరెడ్డి ఉదంతమే సాక్ష్యంగా నిలుస్తుందని చెప్పాలి. పైపైన వుండే నాలుగు అక్షరాలు చేసి, ఆవేశపడితే మొదటికే మోసం వస్తుందని తెలిసి కూడా కొన్ని సార్లు తొందరపాటు ఎంత పనిచేస్తుందో వెంకటరెడ్డికి బాగా తెలిసి వచ్చింది. నిజానికి సుధాకర్‌ గౌడ్‌ చేసిన వ్యాఖ్యలు తననే అనుకొని, తనకు ఆపాదించుకొని వెంకటరెడ్డి రెచ్చిపోయాడన్నది అసలు సారాంశం. 

  చెరుకు సుధాకర్‌ గౌడ్‌ ఎపిసోడ్‌తో కాంగ్రెస్‌లో వెంకటరెడ్డికి నూకలు చెల్లినట్లే అంటున్నారు. 

ఆది నుంచి కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి నిత్య అసమ్మతివాదిగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. తాను పార్టీకి సేవ చేశానని అంటున్నారే గాని, తనకు పార్టీ అవకాశం కల్పించిందన్న సంగతిని మర్చిపోతున్నారు. అంటే తన వల్లే కాంగ్రెస్‌ బతికి బట్టకట్టిందన్నంత అతివిశ్వాసానికి వెంకటరెడ్డి వచ్చారని విమర్శలున్నాయి. పైగా వెంకటరెడ్డి ఎప్పుడూ ఒక్క మాట మీద నిలవడడు అన్న అపవాదు కూడా వుంది. ఇంకా కాంగ్రెస్‌పార్టీ వెంకటరెడ్డిని భరించే పరిస్థితుల్లో లేదన్న మాటలే సర్వత్రా వినిపిస్తున్నాయి. ఓ వైపు బిజేపి వైపు కన్ను గీటుతూ, మరో వైపు కాంగ్రెస్‌లో కొనసాగుతూ, అవకాశం వస్తే మరెటైనా దూకేందుకు సిద్దంగా వెంకటరెడ్డి వుంటారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాదు తెలంగాణలో వైసిపి వుంటే వెంకటరెడ్డి ఖచ్చితంగా ఈపాటికి చేరిపోయేవారని, ఒక వేళ షర్మిల పార్టీ బలంగా వుంటే ఆపార్టీలోకైనా వెళ్లిపోయేవారే అంటున్నారు. వైసిపి లేదు…షర్మిల పార్టీ అనుకున్నంత గొప్పగా లేదు. ఇప్పటికైతే కాంగ్రెస్‌లోనే వుంటూ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, అప్పుడు రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకే వెంకటరెడ్డి ఆగుతున్నాడు. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటరెడ్డికి టిక్కెట్టు దక్కే అవకాశం లేదని విశ్వసనీయ సమాచారం. ఆయన ఎలాగూ ఎంపిగా వున్నారు. ఆయనకు అసెంబ్లీ టిక్కెట్టు ఇస్తే మిగతా అసమ్మతి వాదులకు అవకాశం కల్పించినట్లైంది. అంతదాకా ఎందుకు మొన్నటిదాకా ఆయన వెంట నడిచిన వారు, ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారు కూడా వెంకటరెడ్డి వ్యవహార శైలిని నచ్చడం లేదట. అందుకే ఈ మధ్య మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు నిదర్శనం. ఇప్పుడు బిసి నాయకుడు, తెలంగాణ ఉద్యమ కారుడైన చెరకు సుధాకర్‌ గురించి చేసిన వ్యాఖ్యల మూలంగా ఆయన రాజకీయ భవిష్యత్తు తలకిందులయ్యే అవకాశాలే ఎక్కువగా వున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ విషయం నేటిధాత్రి కూడా ఎప్పుడో చెప్పింది. మునుగోడు ఎన్నికల సమయంలో కోమటి రెడ్డి సోదరులు నల్లగొండ ఉమ్మడి జిల్లాలో ఎంత మంది బిసి నేతలను ఎదకుండా చేశారన్నదానిపై కూడా సమగ్ర కధనం కూడా ప్రచురించింది. అయినా వెంకటరెడ్డి తన సహజశైలిని మార్చుకోలేదు. అందుకే అహం బైటపడిరది….రాజకీయ భవిష్యతుకు ఎసరు రానున్నది.

అర్హులను నెట్టి…అనర్హులకు పెట్టి!?

`అధికారుల సహకారం…ట్రేడర్ల మాయాజాలం

`లబ్ధి దారులకు సెంట్రింగ్‌ ఇచ్చే వారు వద్దా? 

` రెండు లక్షలు తీసుకునే వారే ముద్దా!

`దళితుల సొమ్ము కాజేసేవారికే కొమ్ము కాస్తారా?

` సెంట్రింగ్‌ సరఫరా చేస్తామనే వారికి బెదిరింపులా?

`మా ఊరికొస్తే అట్రాసిటీ కేసు పెడతామని భయపెట్టిస్తారా?

` నిజాయితీగా లబ్ధి దారులకు మేలు చేస్తామంటే వద్దంటారా?

` కేకే…స్టీల్‌ ట్రేడర్‌ ను ఎందుకు కాదన్నారు?

` తాను సరఫరా చేసిన సెంట్రింగ్‌ కు కూడా పని కల్పిస్తామని చెప్పే వారు వద్దా?

` నిష్పక్షపాతంగా సెంట్రింగ్‌ సరఫరా చేసే వారికి ప్రోత్సాహం లేదా?

` కనీసం అప్పటికప్పుడు లైసెన్స్‌ సృష్టించుకున్న వారికి అందలమా?

`దళితుల బలహీనతతో ఆడుకుంటారా?

`రెండు లక్షలు నొక్కి, తోచింది చేతిలో పెట్టి, దళిత బంధు లక్ష్యం నీరుగార్చుతారా?

`యూనిట్‌ ఇవ్వకుండా, డబ్బులిస్తామని చెప్పడం నేరం కాదా?

`దళితులను మోసం చేయడమే అధికారుల లక్ష్యమా?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఒక చారిత్రక నిర్ణయంలో, సమాజ నిర్మాణంలో అందరికీ అవకాశం రాదు. భాగస్వామ్యం కాలేరు. దళితబంధు లాంటి విప్లవాత్మకమైన పథకం అమలులో అన్ని వర్గాల ఉద్యోగుల అవసరం లేదు. కాని తెలంగాణలో దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెచ్చిన దళిత బంధు పధకం అమలుకు కొన్ని శాఖలు, కొంత మంది అధికారులకే అవకాశం వచ్చింది. ఆ పధకం అమలులో భాగస్వామ్యమైన దళితులకు అందాల్సిన రూపాయి పక్కదారి పట్టకుండా చూడాల్సిన అధికారులు చేసిన నిర్వాకం మూలంగా వారే విమర్శల పాలౌతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎట్టిపరిస్ధితుల్లో వారు చేసిన, దారి చూపిన అవినీతిపై ప్రభుత్వం కూడా సీరియస్‌గా స్పందిస్తోంది. ఏ క్షణమైనా దీనిపై విచారణ జరిగే అవకాశం కూడా వుంది. అధికారులు, అధికారులకు కొమ్ము కాసిన ట్రేడర్ల మూలంగా హుజూరాబాద్‌ లో అమలు చేయస్తున్న దళిత బంధు పైలెట్‌ ప్రాజెక్టు అసలు లక్ష్యం పక్కదారి పట్టింది. అర్హులనై ట్రేడర్లను పక్కనకు నెట్టేశారు. అనర్హులైన ట్రేడర్లకు అవకాశాకాలు కల్పించారు. దాంతో దళితులకు అందాల్సిన న్యాయమైన సొమ్ము ఉత్తుత్తి ట్రేడర్లు, అధికారుల జేబుల్లోకి వెళ్లిందనేది సర్వత్రా వినిపిస్తున్న మాట. 

 దళిత బంధు అమలులో ప్రభుత్వం అవకాశం కల్పించిన ట్రేడర్లలో సెంట్రింగ్‌ యూనిట్‌ అందించే ప్రత్యేక పరిశ్రమ వున్న సంస్ధ కేకే. స్టీల్‌. పూర్తి స్దాయిలో అన్ని రకాల అనుమతులు వున్న సంస్ధ. 

దళిత బంధు అమలులో భాగంగా అందించే సెంట్రింగ్‌ యూనిట్‌ను అందిస్తున్న విశ్వసనీయ సంస్ధల్లో ఇదొకటి. సహజంగా సెంట్రింగ్‌ యూనిట్లు అందిస్తున్న ఇతర సంస్ధలు కేవలం 1500 ఎస్‌ఎఫ్‌టిమాత్రమే అందిస్తున్నాయి. కాని కేకే అనే సంస్ధ 2000 ఎస్‌ఎఫ్‌టి అందిందించేందుకు ముందుకొచ్చింది. దళితులకు మేలు చేసే ఇలాంటి గొప్ప పధకంలో భాగాస్వామ్యం కావాలన్నదే ఈ సంస్ధ లక్ష్యం. అంతే కాదు మిగతా సంస్దలకన్నా తక్కువ ధరకే కోడ్‌ చేస్తామని కూడా చెబుతున్నారు. ఇప్పటికే తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమల గిరిలో ఈ సంస్ధ అందించిన యూనిట్లు ఇప్పుడు దళితులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇక్కడ మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ఈ కేకే అనే సంస్ధ సెంట్రింగ్‌ యూనిట్‌ను అందించడమే కాకుండా, ఆ యూనిట్‌ తీసుకున్న దళితులకు ఆ యూనిట్‌ ద్వారా ఆదాయం సమకూర్చే బాధ్యత కూడా తీసుకుంటామని కూడా చెబుతున్నారు. కాని ఇది అధికారుల చెవికెక్కలేదు. నిజానికి ఆ పని అధికారులు చేయాలి. సెంట్రింగ్‌ యూనిట్‌ అప్లికేషన్‌ పెట్టుకున్న దళితులకు ఖచ్చితంగా ఆ యూనిట్‌ అందజేయాల్సిన బాధ్యత అధికారులది. అంతే కాకుండా ఆ యూనిట్‌ ద్వారా ఉపాధి అవకాశాలు కూడా కల్పించాల్సిన బాధ్యత అధికారులదే.

ఇది ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలలో ఖచ్చితంగా పాటించాల్సిన అంశం. ఇక్కడ అధికారులు పాటించాల్సిన అంశాన్ని సెంట్రిగ్‌ యూనిట్‌ అందిస్తామని చెప్పిన కేకే స్టీల్‌ ట్రేడర్‌ , లబ్ధిదారులందరికీ తామే ఉపాధి కల్పిస్తామని అందుకు అవసరమైన బాండ్‌ కూడా రాసిస్తామని చెబుతున్నారు. కాని అదికారులు వినలేదు. ససేమిరా అన్నారు. కారణం ఈ కేకే స్టీల్‌ ట్రేడర్స్‌ లబ్ధిదారులకు నేరుగా డబ్బులు ఇస్తామని చెప్పకపోవడమే కారణం….! అసలు ట్రేడర్లు చేయాల్సిన పనేమిటి? అధికారుల పర్యవేక్షణ ఏమిటి? అన్నది అందరికీ తెలియాల్సిన అవసరం వుంది. ఖచ్చితంగా ట్రేడర్లు లబ్ధిదారులకు సెంట్రింగ్‌ యూనిట్లే అందించాలి. కాని దళితుల అకౌంట్లో వున్న డబ్బును సుమరు 2 లక్షలు తీసుకొని మిగతా సొమ్ము ఇవ్వడానికి కాదు…ఇలా ప్రజా ధనం పక్క దారి పట్టేందుకు కాదు…కాని అధికారులు, కొంత మంది ట్రేడర్లు కలిసి ఆడుతున్న నాటకంలో అసలైన ట్రేడర్లు పక్కకు వెళ్తున్నారు. లబ్ధిదారులను మోసం చేస్తున్నారు. వారి సొమ్మును నొక్కేస్తున్నారు. 

 లబ్ధిదారులకు యూనిట్లు అందిస్తామే తప్ప డబ్బుల మాయాజాలంలో మీ జీవితాలను ఆగం చేసుకోవద్దని చెబుతున్న కేకే స్టీట్‌ ట్రేడర్‌ సంస్ధ వ్యక్తులను కొందరు వ్యక్తులు బెదిరిచినట్లు సమాచారం.

 యూనిట్లు ఇస్తామంటూ నియోజకవర్గంలోకి వస్తే, అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని కూడా కొందరు నాయకులు బెదిరించారట. అసలు ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్న ట్రేడర్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని బెదిరించడం ఏమిటి? అంతే కాదు లబ్ధిదారుల డబ్బులు పట్టుకొని ట్రేడర్‌ మాయమైతే అప్పుడు ఎవరి బాధ్యత అంటూ అమాయకులైన లబ్ధిదారులకు లేని పోని భయాలు కూడా కొందరు సృష్టించారని తెలిసింది. యూనిట్లు అందిజేసిన తర్వాతే లబ్ధిదారులనుంచి అందుకు అవసరమైన సొమ్మును డ్రా చేయించుకోవాలి…అదే కేకే.స్టీల్‌ చేస్తామని చెప్పింది. అయినా అధికారులు వినలేదు…నాయకులు వినలేదు…… పైగా ప్రజలను కొందరు నియోజకరవర్గ నాయకులు, బోగస్‌ ట్రేడర్ల్‌ దళితులను తప్పుదోవ పట్టించి, కేకే ట్రేడర్స్‌ను రాకుండా చేశారు. హుజూరాబాద్‌ నియోజవర్గంలో దళిత బంధు లబ్ధిదారులకు అందించాల్సినంత సెంట్రింగ్‌ దరఖాస్తు చేసుకున్న చాలా మంది ట్రేడర్లకు ఎలాంటి అర్హత లేదు. వారికి కంపనీలే లేవు. అవన్నీ కేవలం సూట్‌ కేస్‌ కంపనీలు. రాత్రికిరాత్రి పుట్టుకొచ్చిన లైసెన్సులు మాత్రమే . అవసరమైన గోడౌన్లు లేవు. ఆ సదుపాయాలు కూడా లేవు. మెటీరియల్‌ అంతకాన్న లేదు. కేవలం కాగితాల మీద లైసెన్సు తప్ప మరేం లేవు…కాని కేకే.స్టీల్‌ ట్రేడర్స్‌ అవసరమైన గోడౌన్లు వున్నాయి. దళితులకు అందజేయాల్సిన సెంట్రింగ్‌కూడా రెడీగా వుంది. అధికారులు కూడా ఆ గోడౌన్లు పరిశీలించారు. నామ్‌కే వాస్తే చూశామన్నట్లు చెప్పి, ఉత్తుత్తి ట్రేడర్లకు లాభాల పంట పండిరచేందుకు, వాటలు పొందేందుకే అధికారులు మొగ్గు చూపారు. కేకే స్టీల్‌ ట్రేడర్స్‌కు అవకాశం కల్పించలేదు. అధికారుల తప్పుడు నిర్ణయం వల్ల లబ్ధిదారులకు ఇప్పటికిప్పుడు యూనిట్లు అందజేసేంత మెటీరియల్‌వున్న కేకే సంస్ధను కాదన్నారు. ఆయన పెట్టుకున్న దరఖాస్తును పక్కన పెట్టేశారు. ఉత్తుత్తి ట్రేటర్లకు అవకాశం కల్పించారు. నేటిధాత్రి ఈ విషయంలో దరఖాస్తు చేసుకున్న ట్రేడర్లు, వారి వివరాలు సేకరించింది. వారికి సంబంధించిన లైసెన్స్‌ల ప్రక్రియను కూడా పరిశీలించింది. ఉత్తుత్తి ట్రేడర్ల నిర్వాకంపై నేటిధాత్రి పూర్తి స్దాయి దృష్టిపెట్టింది. వాటి బండారం బైటపెట్టనుంది. త్వరలో వారి బోగోతాలు వరుసగా మీ నేటిధాత్రిలో రానున్నాయి.

అత్యవసరంగా మీటింగ్‌ అన్నారు! అర్థాంతరంగా ఆపేశారు!!

 

`ఇంతకీ ఏం జరిగింది?

`పంచాయతీ రాజ్‌ సెక్రెటరీల వాదనేమిటి?

`మమ్మల్ని వదిలేయండి…ప్లీజ్‌!`మేం చిన్న జీవులం…

`దళిత బంధుపై ఎలాంటి ఒత్తిళ్లు తేవొద్దు!

`పెద్ద వాళ్లను రక్షించేందుకు మమ్మల్ని బలిచేయొద్దు!

`దళిత బంధు లో రూపాయి తిన్నది లేదు!

`పూర్తిగా పై అధికారుల కనుసన్నల్లో జరిగిందే!

`అవకతవకలు కప్పిపుచ్చుకునేందుకు మేమే దొరికామా?

`అమలు విషయంలో అసత్యాలు నమోదు చేయలేం!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

పెద్ద పెద్ద తిమింగలాలు ఎప్పుడూ తప్పించుకునే ప్రయత్నమే చేస్తాయి…చిన్న చిన్న చేపలే బలౌతుంటాయని అనేక సంఘటలను రుజువు చేసిన ఉదంతాలు వున్నాయి. ఇప్పుడు కూడా దళిత బంధు పైలెట్‌ ప్రాజెక్టు అమలులోనే చిన్న జీవులను బలిచేసే ప్రయత్నం పెద్ద జీవులు చేస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇలాంటి పైలెట్‌ ప్రాజెక్టులు అమలు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఆ బాధ్యతను పై స్ధాయి ఉద్యోగులు ఎంతో జాగ్రత్తగా చేపట్టాలి. కింది స్ధాయిలో ఎక్కడా అవకతవకలు జరక్కుండా చూసుకోవాలి. కింది స్ధాయి ఉద్యోగులకు పూర్తి స్ధాయి శిక్షణలివ్వాలి. వారికి కొన్ని బాద్యతలు అప్పంచాలి. కాని దళిత బంధు విషయంలో పై స్దాయి అదికారులే అన్నీ చూసుకున్నారు. పథకం తప్పుతోవ పట్టిందన్న విషయం వెలుగులోకి రావడంతో తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా పంచాయితీ రాజ్‌ సెక్రెటరీలను బలిచేసే ఎత్తుగడలు మొదలైనట్లు తెలుస్తోంది. క్షేత్ర స్ధాయిలో ఈ పధకం అమలుకు సంబంధించి కేవలం అప్లికేషన్లు నింపే ప్రక్రియలాంటి చిన్న పని తప్ప, మరే సంబంధం లేదు. పైలెట్‌ ప్రాజెక్టు కావడంతో ఎంపిక విధానానికి కూడా పెద్దగా కష్టపడాల్సిన అసవరం లేకండాపోయింది. దళితులందరినీ ఈ ప్రాజెక్టులో భాగస్వాములు చేయడంతో పంచాయితీ రాజ్‌ సెక్రెటరీలు పేర్లు పంపించడం తప్ప మరేం చేయలేదు. కాని ఇప్పుడు వారికి పెద్ద చిక్కొచ్చి పడిరది. రెండో విడత నిధులు విడుదల చేయాల్సిన సమయం వచ్చింది. పంచాయితీ రాజ్‌ సెక్రెటరీలతో పై స్ధాయి అధికారులక పని పడిరది. అసలు ఎంత పై స్దాయి అధికారులైనా ఇలాంటి పైలెట్‌ ప్రాజెక్టులపై క్షేత్ర స్ధాయి అవగాహన వుండాలి. కాని అటు ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులెవరూ వాటిని పట్టించుకోలేదు. కేవలం ఇందులో ఎంత సంపాదించొచ్చన్న విషయాలను మాత్రం బాగా పట్టించుకున్నట్లున్నారు. అందుకే ఇప్పుడు ఆపసోపాలు పడుతున్నారు. ప్రజల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

 ఇటీవల దళిత బంధు పథకం పైలెట్‌ ప్రాజెక్టు అమలుపై నేటిధాత్రిలో వస్తున్న కథనాలతో భూకంపం పుట్టింది.

 అంతకు ముందు ఈ విషయాలు అందరికీ తెలిసినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కాని నేటిధాత్రిలో వచ్చే సరికి ప్రభుత్వం కూడా సీరియస్‌ గా వుంది. అసలేం జరిగిందన్నదానిపై ఆరా తీస్తోంది. పైలెట్‌ ప్రాజెక్టు అమలులోనే ఇన్ని లోపాలు ఎదురైతే అసలు పధకం అమలులో అధికారులు ఎన్ని అవాంతరాలు సృష్టిస్తారో అన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఓ మంచి పధకాన్ని తీసుకొచ్చి, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని చూస్తుంటే అధికారుల చేసిందేమిటి? అన్న ప్రశ్నలే మిగులుతున్నాయి. ఈ పధకంలో రాజకీయ జోక్యం వుండొద్దని పూర్తి పారదర్శతతో సాగాలని, అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తే ఎంతో బాగుంటుందని నమ్మిన ప్రభుత్వాన్ని పనిగట్టుకొని అబాసు పాలు చేసే పరిస్దితి తెచ్చారు. ఈ పధకం అమలు విషయంలో అధికార బిఆర్‌ఎస్‌ నాయకులను దూరంగా వుంచారు. లేకుంటే ప్రతిపక్షాలు ఇప్పటికే ఎంతో ఆగం చేసేవి. అయినా పధకం సక్సెస్‌ కావొద్దనే ప్రతిపక్షాలు కాచుకొని కూర్చున్నాయి. అందుకే పైలెట్‌ ప్రాజెక్టు ప్రకటించిన నాటి నుంచి ఈ పధకం మీద బురజ జల్లుతూనే వస్తున్నాయి. ఈ పధకం అమలైతే తమ పార్టీలకు ఇక తెలంగాణలో చోటుండదని ఆ నాయకులకు తెలుసు. అందుకే ఈ పధకం విఫల ప్రయత్నం అన్న ప్రచారంతోపాటు, ప్రభుత్వాన్ని నిందిద్దామని చూస్తూనే వున్నాయి. 

ఇలాంటి సమయంలో ఎంతో గొప్ప పధకంగా ప్రజల చేత కీర్తింబడుతున్న ప్రభుత్వాన్ని బద్‌నాం చేసే పరిస్ధితి అధికారులు తీసుకొచ్చారు. 

ఇక పై నుంచి ఒత్తిళ్లు మొదలు కావడంతో లబ్దిదారులకు సంబంధించినపూర్తి వివరాలు క్రోడీకరించాలని ఓ ప్రత్యేక యాప్‌ తీసుకొచ్చారు. కింది స్ధాయి ఉద్యోగులైన పంచాయితీ రాజ్‌ సెక్రెటరీలను బలి చేసే ఎత్తుగడలు వేశారు. దీన్ని ఆ ఉద్యోగులు పసిగట్టారు. పంచాయితీ సెక్రెటరీలు నివేధిక మీదే పథకం భవిష్యత్తు ఆధారపడి వుంటుంది. కాని ఇక్కడే అసలు చిక్కుముడి వుంది. కనీసం ముప్పై శాతం లబ్ధిదారుల వద్ద ఎలాంటి యూనిట్లు లేవు. కిరణాషాపులు లేవు. ప్రభుత్వం ఇచ్చిన బర్రెలులేవు. కార్లు లేవు. ట్రాక్టర్లు లేవు. సెంట్రింగ్‌ సామాను లేదు. టెంటు హౌజ్‌ కు సంబంధించినవి లేవు. పంచాయితీ రాజ్‌ సెక్రెటరీలు ఏ నివేధిక తయారు చేస్తారు. ఏ ఫోటోలు తీస్తారు.? పై స్ధాయి నుంచి ఒత్తిళ్లతో తిమ్మిని బమ్మిని చేసినట్లు నివేధికలు తయారు చేసినా, ప్రభుత్వం ఏదైనా విచారణకు ఆదేశిస్తే మొదట ఉద్యోగాలు కోల్పోయేది వీళ్లే…అందుకే మేం ఆ పని చేయలేమని పంచాయితీ సెక్రెటరీలు చేతులెత్తేశారు. ఈ మధ్య జిల్లా స్ధాయి అధికారులు జూమ్‌ మీటింగ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. ఈ మీటింగ్‌లో ఖచ్చితంగా పంచాయితీ సెక్రెటరీలు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెబుతారని తెలిసి, ఆ మీటింగ్‌ రద్దు చేశారు. అంతే కాదు తమ జీవితాలను ఆగం చేసేందుకు దళిత బంధు రూపంలో ఉత్పాతాన్ని సృష్టించి, వాళ్ల ఉద్యోగాలు కాపాడుకునేందుకు పై స్ధాయి అధికారులు కుట్ర పనుతున్నారని పంచాయితీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దృష్టికి వారి సమస్యను తీసుకెళ్లేందుకు కూడా సెక్రెటరీలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

   నిజానికి పై స్ధాయిలో వున్న ఉద్యోగులకు అన్నీ తెలుసు. 

కాని ఏమీ తెలియనట్లు, తామేమీ తప్పు చేయనట్లు, క్షేత్ర స్ధాయిలో ఏం జరిగిందో తెలియనట్లు, నివేధికలు కోరడం వెనుకు ఆంతర్యం తెలియందా? కనీసం 30 నుంచి 40శాతం కూడా లబ్ధిదారులు దళిత బంధు యూనిట్ల కలిగి లేదు. అంతే కాదు కనీసం ఆ యూనిట్లు ఎలా వుంటాయన్నది కూడా వారికి ట్రేడర్లు చూపించలేదు. ఈ పధకం కింద ఇచ్చిన కార్లు వారు నడిపింది లేదు. ఇంటి ముందు పెట్టుకున్నది లేదు. ఆ కార్లతో తిరిగింది లేదు. వారి అవసరాలు, బలహీనతలను సొమ్ముచేసుకునేందుకు వచ్చిన దళారులు ఇచ్చిన అత్తెసరుతో సర్ధుకున్నారు. ఇచ్చింది తీసుకొని కార్లు, ట్రాక్టర్లు వారికి అప్పగించారు. అసలు అధికారులు చేయాల్సిన పని ఏమిటన్నది మర్చిపోయారు. కార్లు, ట్రాక్టర్లు,ఇతర యూనిట్లు అందిజేసినప్పుడే లబ్ధిదారులకు ప్రభుత్వ ఆదేశాలు సూచించాల్సి వుండాల్సింది. కాని అది అధికారుల చేయలేదు. అమాయకులైన దళితులు వాటిని అమ్ముకొని వచ్చిన నాలుగు రూపాయలతో పూట గడుపుకున్నారు. అవి కాస్త అయిపోయినవి. ఇప్పుడు రెండో విడత కోసం ఎదురుచూడాల్సిన పరిస్ధితి వచ్చింది. మరి ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందా? దళితులు ధనవంతులయ్యారా? అధికారులు ఇలా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి, తమ వాటాలు తాము తీసుకొని, చేతులు దులుపుకోవడం కోసమేనా? దళిత బంధు అన్న ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్పాలి?

దగా చేసేది మీరేనా…! ఆత్మాభిమానం మీకేనా!!

 

`దళితులనే దోచుకున్నప్పుడు గుర్తులేదా…?

`దళిత అధికారులని అప్పుడు మర్చిపోయారా?

`దళితులను మోసం చేయడం తప్పని తెలియదా?

`దళిత బంధు అమలలో లంచాలు అమానవీయం కాదా?

`దళిత ఉద్యోగులే దళితులను దోచుకుంటుంటే ఎవరికి చెప్పకోవాలి?

`కాపాడాల్సిన స్థానంలో వుండి, కనికరం లేకుండా దోచుకుంటిరి?

`దళిత అధికారులే, దళితుల సొమ్ము కాజేయడం నేరం కాదా?

`సంతకాలకు లంచాలు తీసుకోలేదా?

`ట్రేడర్లు లక్షల నొక్కేస్తున్నది వాస్తవం కాదా?

`షోరూంలు అదనంగా లక్షన్నర లెక్కేయడం నిజం కాదా?

`లబ్ధి దారులను నిండా ముంచింది మీరు కాదా?

`అవినీతి చేసేప్పుడు నిఘా సంస్థలుంటాయని తెలియదా?

`మీడియా వెలుగులోకి తెస్తుందన్న సోయి లేదా?

`లబ్ధి దారులు దుమ్మెత్తి పోస్తున్నారు?

`ఆధారాలతో అన్ని వివరాలు అందిస్తున్నారు?

`తప్పించుకోవడానికి దారి తెలియక మీడియా మీద పడతారా?

`దళితులకు అన్యాయం చేయొద్దని చెప్పడం ఇబ్బందిగా మారిందా?

`ఆత్మాభిమానం ఇప్పుడు గుర్తొచ్చిందా? 

`లంచాలు తీసుకున్నప్పుడు గుర్తు రాలేదా?

`దళిత బంధులో జరిగిన అవకతవకల పై హై కోర్ట్‌ సుమోటోగా కేస్‌ స్వీకరించాలి…

`ఇప్పటికైనా మారండి…దళితులకు అన్యాయం చేయకండి! 

హైదరాబాద్‌,నేటిధాత్రి:

సహజంగా ప్రభుత్వాలు ఒక గొప్ప పధకాన్ని తీసుకొచ్చే ముందు, దాని అమలు తీరు…సవాళ్లు…ఎదురయ్యే ఇబ్బందులు, సాధకబాధకాలు, నిధుల కూర్పు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని పైలెట్‌ ప్రాజెక్టులు ప్రకటిస్తారు. ఏదో ఒక చోట ముందుగా అమలు చేస్తారు. దాంతో ఆ పధకం మీద ప్రజలకు అవగాహన, పాలకులకు మరింత బాద్యత పెరిగే అవకాశం వుంటుంది. అధికారులు ఎలా పనిచేస్తున్నారు..ఎంత వరకు పనిచేస్తున్నారు..వాళ్ల ఆ పథకం మీద ఎంత దృష్టిపెడుతున్నారు..ప్రజలకు ఏ మేరకు సహకరిస్తున్నారు… వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప విప్లవాత్మక పథకమే దళిత బంధు. ఇది ఎంతటి గొప్ప పధకమో సామాన్య ప్రజలకు అర్ధమైనంతగా అధికారులకు అర్ధం కానట్లుంది. అందుకే ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పైలెట్‌ ప్రాజెక్టు అంటే ఉద్యోగులు ఎంతో చిత్తశుద్దితో పనిచేయాలి. ఒక రకంగా చెప్పాలంటే ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. కాని దళిత బంధు విషయంలో ఏం జరుగుతోందో అందరకీ అర్ధమౌతోంది. తెలంగాణలోని దళితుల ఆర్ధిక స్ధితి గతుల్లో మార్పులు తెచ్చి, సమాజంలో వారికి సమున్నతమైన గౌరవం కల్పించి, వ్యాపార రంగాలలో వారిని ప్రోత్సహించి, ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. అందుకే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు చేయని ధైర్యం ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేశారు. పైలెట్‌ ప్రాజెక్టు కింద హుజూరాబాద్‌ను ఎంపిక చేశారు. ఎన్నికల వేళ ప్రకటన అంటూ ప్రతిపక్షాలు రాజకీయం చేయడానికి ఉపయోగించుకున్నా, తను అనుకున్న లక్ష్యం నెరవేరేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ పైలెట్‌ ప్రాజెక్టు కోసం పూర్తి స్ధాయి నిధులు అందజేశారు. ప్రతి దళితుడి బ్యాంక్‌ అకౌంట్లో రూ.10 లక్షలు జమ చేశారు. ఇంత అంకితభావం ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు. ఇప్పటి వరకు అలాంటి ప్రభుత్వం మరొకటి లేదు. మరి ఇంతే చిత్తశుద్ద అదికారులకు వుందా? ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

తెలంగాణలో అమలుకు నోచుకోవాల్సిన దళిత బంధులో వాటాలు వేసుకొని కమీషన్ల రూపంలో లంచాలు దండుకున్నది అధికారులు. అందులో కింది స్ధాయి అధికారులేమో! 

భయంతో పనిచేస్తే, పై స్దాయి అధికారులేమో! తమనెవరు? ఏం చేస్తారు? అన్న ధైర్యంతో దగా చేశారు…దళితుల సొమ్మును దోచుకున్నారు. ఈ విషయం ఏ లబ్ధిదారుడిని అడిగినా చెబుతాడు. దళిత బంధు పథకం డబ్బులు చేతికి రావడానికి ఎక్కడెక్కడ ఎంత తీసకున్నారన్న విషయం లబ్ధిదారులు పూసగుచ్చినట్లు చెబుతున్నారు. అయినా ఇంకా ఎందుకు భుకాయిస్తున్నారు? దళితుల సొమ్ము దగా మేసి, మేం దళిత అధికారులుగా మా ఆత్మాభిమానం దెబ్బతిన్నదంటారా? ఈ మాటలు దళితులే వింటే ఏమనుకుంటారన్న ఆలోచన కూడా లేదా? దళితుల సొమ్ము రూపాయి కూడా తినకుండా చూడాల్సిన బాధ్యత దళిత అధికారులు తీసుకోవాలి. ఆ సొమ్ముకు భద్రంగా దళితులకు అందేందుకు సహకరించాలి. ఎవరైనా గద్దల్లా దళిత బంధు సొమ్ము కాజేయాలని చూస్తే వారి భరతం పట్టాలి. ఇదీ దళిత అదికారులుగా చేయాల్సిన పనిని విస్మరించి, దళిత బంధు లబ్ధిదారులకు సంతకాలు చేసేందుకే వేలాది రూపాయలు వసూలు చేసి, వాళ్లేవరో ఊళ్లు పంచుకున్నట్లు దళితబంధు పథకంలో అందరూ కలిసి కోట్లాది రూపాయలు లూటీ చేశారన్నదైనా గుర్తుందా? 

 నేటిధాత్రి మీద కేసు వేస్తారా? వేయండి? ఏమని వేస్తారో వేస్తే అప్పుడు తెలుస్తుంది?

 నేటిధాత్రి అదే దళితుల సొమ్ము దగా కోరుల పాలైపోతోందని, వారిని చైతన్యం చేసే యజ్ఞం చేస్తోంది. వారి సొమ్ము దారి మల్లకుండా చూస్తోంది. ఎవరెవరు ఎంతెంత వాటాలేసుకొని పంచుకుతిన్నది చెబుతోంది. ట్రేడర్లనుంచి, షోరూం నుంచి జిఎస్టీల పేరుతో దోచుకుంటున్న సంగతి ప్రతి దళితుడికి తెలుసు. దళితుల్లో ఇంకా అమాయకులున్నారనే…వారి ఎదుగుదలకు ఈ సమాజం ఎలాగూ సహకరించదని, ప్రోత్సాహం అసలే వుండదని, ప్రభుత్వమే దళితులు సంక్షేమం కోసం ఆలోచించి దళిత బంధు తీసుకొచ్చింది. కనీసం ఆ పథకం ఉద్దేశ్యం కూడా అర్ధం చేసుకోలేక, ఉన్నతోద్యోగులై వుండి దళితుల సొమ్ముకు ఆశపడ్డవారు కూడా ఆత్మాభిమానం గురించి మాట్లాడితే ఏలా వుంటుందో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిజానికి దళితులమని చెప్పుకుంటున్న ఉన్నతోద్యోగులు తాము చేసింది తప్పే అనుకొని, ఇకపై ఇలాంటి పొరపాట్లు జరక్కుండా చూసుకుంటామని చెప్పాలిందిపోయి, నేటిధాత్రి మీద కేసులు వేస్తామని బెదిరిస్తే సరిపోతుందా? నిజం నిప్పులాంటిది…అది దాగదు…తప్పు చేసిన వారిని ఊరికే వదిలిపెట్టదు. 

 ఉద్యోగులుగా ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్నారు సరిపోవడం లేదా?

 ఒక పైలెట్‌ ప్రాజెక్టు ప్రభుత్వం అమలు చేసినప్పుడు దానిపై ఎంత మంది నిఘా వుంటుందో తెలియకుండా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారా? పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లు, తాము దళితుల దగ్గర తీసుకుంటున్న సొమ్ము గురించి ఎవరికీ తెలియదనుకున్నారా? చేయాల్సిందంతా చేసి, దళితులను దగా చేసి, మేం మా మనోభావాలు దెబ్బతిన్నాయనంటే జనం నివ్విపోతారు…ఇప్పటికైనా హుందాగా వ్యవహరించండి. ప్రభుత్వం ఎంతో గొప్ప పథకాన్ని అమలు చేసే బాధ్యత మీకు అప్పగించినందుకు ఎంతో పుణ్యంగా భావించాలి. తమ చేతుల మీదుగా కొన్ని వేల దళిత కుటుంబాలు ఇప్పుడు సంతోషంగా వున్నాయని చెప్పుకునే స్ధితి కల్పించబడాలి. ఆ హుజూరాబాద్‌లోని దళితులంతా ఉద్యోగులకు చేతులెత్తి మొక్కేలా వుండాలి. ఎక్కడైనా కనిపిస్తే ప్రభుత్వం మా జీవితాలకు భరోసా కల్పిస్తే మీరు మాకు దారి చూపారని చెప్పుకోగలగాలి. అంతే కాని నిత్యం తిట్టుకునేలా వ్యవహరించారు. ఇప్పటికే ఎంతో మంది దళితులు తమ సొమ్ము తిన్న అధికారులను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. దుమ్మెత్తి పోస్తున్నారు. శాపనార్దాలు పెడుతున్నారు. ముందు అవి వినండి…! అప్పుడు నేటిధాత్రి గురించి ఆలోచించండి…ఆత్మాభిమానం గురించి మాట్లాడండి!!

శంకరయ్య…’మనీ’కింకరుడయ్యా!? శంకరయ్య ఒత్తిళ్లు..! టిపిఎస్‌ లకు తిట్లు?

 

`ఎక్కడిక్కడ జనం చీవాట్లు!?

`పాపం అడకత్తెరలో నలుగుతున్న టిపిఎస్‌ లు.

`లంచాలు తింటున్నారని శాపనార్థాలు?

` క్షేత్ర స్థాయిలో జనం గగ్గోలు…

`జోనల్‌ కమీషనర్‌ ఆదేశాల అమలులో చుక్కలు చూస్తున్న ఉద్యోగులు.

`సికింద్రాబాద్‌ లో ఇలా చేసే శేరిలింగంపల్లి కొచ్చారు?

` శేరి లింగంపల్లి లో మరింత సంపాదనకు శంకరయ్య ఎగబడ్డాడు?

` అధికారులను రాచి రంపానపెడుతున్నాడు?

`మింగలేక కక్కలేక అధికారులు మధనపడుతున్నారు?

`జోనల్‌ కమీషనర్‌ శంకరయ్య వల్ల ఎమ్మెల్యే గాంధీ అబాసుపాలౌతున్నారు?

`ఏరి కోరి తెచ్చుకున్న ఎమ్మెల్యేకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాడు?

`జోనల్‌ కమీషనర్‌ పనుల వల్ల ఎమ్మెల్యే కు ఎదురుకానున్న తిప్పలు?

`ఎన్నికలలో ఎమ్మెల్యే కు ఇబ్బందులు తప్పవు?

ఉద్యోగం వచ్చేదాకా జీవితం… సమాజం…జనం…సేవ… ఇలాంటి ఎన్నో ఆలోచనలు చేస్తారు. కొంత మంది అదే జీవితాంతం అనుసరిస్తారు. కొందరు అవన్నీ మర్చిపోతారు…సంపాదనకు ఎగబడతారు. ఉద్యోగం చేస్తూ ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటూ, పనులు చేయడానికి నా కేంటి? అనడం మొదలు పెడతారు…మొహమాటం లేకుండా ఎంతిస్తావ్‌ అని బేరం పెడుతుంటారు…ఇటీవల కాలంలో ఆ బేరం కూడా మారిపోయింది. ఇంతిస్తే గాని పని కాదని చెప్పేస్తున్నారు…పని కావాల్సిన ప్రజలు అంతివ్వలేను మహా ప్రభో అని బ్రతిమిలాడుకుండున్నారు. అయినా కొందరు అధికారులు కనికరం అన్నది వారి దరిదాపుల్లో లేనట్లు, వారి డిక్షనరీ లో లేనట్లు, నా మాటే శాసనమన్నట్లు వసూలు చేస్తున్నారు. జేబులు నింపుకుంటున్నారు…కోట్లు కూడబెట్డుకుంటున్నారు. అలాంటి వారిలో జిహెచ్‌ఎంసి శేరిలింగంపల్లి జోనల్‌ కమీషనర్‌ శంకరయ్య ఒకరు? అని జనం చెప్పుకుంటున్న మాట…ఉద్యోగుల ఆవేదన. 

ఎక్కడిక్కడ జనం చీవాట్లు!?

 జోనల్‌ కమీషనర్‌ పెట్టే టార్గెట్ల మూలంగా టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ప్రజల నుంచి చీత్కారాలు ఎదుర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు టార్గెట్లు పెడుతూ, జనాన్ని ఇబ్బందులు పెట్టినట్లే ఉద్యోగులను కూడా జోనల్‌ కమీషనర్‌ రోజుకింత వారానికింత అని ఆర్డర్‌ వేస్తాడు. దాంతో టౌన్‌ ప్లానింగ్‌ విభాగ సిబ్బంది యాతన అంతా ఇంతా కాదు…జోనల్‌ కమీషనర్‌ మాట కాదనలేక, ఎదురు చెప్పలేక, మా వల్ల కాదనలేక, ఉద్యోగం చేయడం తప్పని సరై వారు పడుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు. క్షేత్ర స్థాయికి వెళ్లి ప్రజలతో పంచాయతీ పెట్టుకునేది అధికారులు, తిట్లు తినేది అధికారులు. పాపం అడకత్తెరలో నలుగుతున్న టిపిఎస్‌ లు. 

తాజాగా శేరి లింగంపల్లిలో నిర్మాణంలో వున్న ఓ బిల్డింగ్‌ కూల్చివేసేందుకు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు వచ్చారు.  

దాంతో స్థానిక ప్రజలు, ఆ నిర్మాణానికి చెందిన వ్యక్తులు టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందిని తిట్టిన తిట్టు తిట్డకుండా తిట్టారు. ఇప్పటికే ఇవ్వాల్సిన లంచాలు ఇచ్చాము…ఇంకా ఎన్ని సార్లు లంచాలు లంచాలివ్వాలని దూషించారు. శాపనార్థాలు పెట్టారు. నిజానికి ఆ బిల్డింగ్‌ నిర్మాణం అక్రమమే అయితే నిర్మాణం మొదలైనప్పుడే అధికారులు అడ్డుకోవాలి. నిర్మాణానికి అవసరమైన హద్దులు ఇవ్వాలి. అంతే కాని నిర్మాణానికి ముందు అన్ని రకాల అనుమతులు ఇచ్చి, తీసుకోవాల్సినంత తీసుకొని, మరింత లాగేందు నిర్మాణం జరగకుండా అడ్డుకోవడం సరైంది కాదు. కానీ ఇలా సగం నిర్మాణం జరిగిన తర్వాత అడ్డుకుంటేనే అధికారులు అడిగినంత ముట్డజెబుతారు. ఇదీ జిహెచ్‌ఎంసి అధికారులు అనుసరించే విధానం. అలాగే శేరిలింగంపల్లిలోనూ జరుగుతోంది. గతంలో ఇక్కడ అలాంటి వాతావరణం లేదని ప్రజలు, అధికారులు కూడా అంటున్నారు. జోనల్‌ కమీషనర్‌ శంకరయ్య వచ్చిన తర్వాతే ఇలాంటి పనులెక్కువయ్యాయని వాపోతున్నారు. క్షేత్ర స్థాయిలో జనం గగ్గోలు…జోనల్‌ కమీషనర్‌ ఆదేశాల అమలులో టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది చుక్కలు చూస్తున్నారు. 

సికింద్రాబాద్‌ లో ఇలా చేసే శేరిలింగంపల్లి కొచ్చారు?

 గతంలో ఇదే శంకరయ్య సికింద్రాబాద్‌ జోనల్‌ కమీషనర్‌ గా పనిచేసిన సమయంలో అక్కడ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు దీపావళి పండగ సందర్భంగా తలా ఓ పది లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేశారట…అధికారులు తమ వల్ల కాదని తెలిసినా, ఆయనకు ఎదురు చెప్పలేక తలాడిరచారట…కానీ ఓ మహిళా టౌన్‌ ప్లానింగ్‌ అధికారి ఎదురుతిరిగిందట…ఏకంగా మంత్రి కేటిఆర్‌ దృష్టికి ఈ సమస్య వెల్లేలా చేసిందట. దాంతో శంకరయ్య తిక్క కుదిరిందనే అందరూ అనుకున్నారు. సికింద్రాబాద్‌ నుంచి తప్పించి, శేరి లింగంపల్లి జోన్‌ కు మార్చడంతో ఇక శంకరయ్య అవినీతికి పుల్‌ స్టాప్‌ పడుతుందనుకున్నారట…అయితే ఇదే సమయంలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఏరికోరి శంకరయ్య కు శేరి లింగంపల్లి లో పోస్టింగ్‌ వేయించారట…శంకరయ్య తీరు ఏ మాత్రం మారలేదు. నిజానికి సికింద్రాబాద్‌ లో ఆమ్థానీ తక్కువ. ఇక్కడ నగరం విస్తరిస్తున్నందున రోజువారీ సంపాదన శంకరయ్య కు పెరిగిందనేది అధికారులు చెప్పుకునే మాట. 

శేరి లింగంపల్లి లో మరింత సంపాదనకు శంకరయ్య ఎగబడ్డాడు? 

అధికారులను రాచి రంపానపెడుతున్నాడు? అనేది ఇక్కడ ప్రధాన వాదన. మింగలేక కక్కలేక అధికారులు మధనపడుతున్నారు? ఇక ఇదిలా వుంటే జోనల్‌ కమీషనర్‌ శంకరయ్య వల్ల ఎమ్మెల్యే గాంధీ అబాసుపాలౌతున్నారు? ఏరి కోరి తెచ్చుకున్న ఎమ్మెల్యేకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాడు?

 జోనల్‌ కమీషనర్‌ పనుల వల్ల ఎమ్మెల్యే కు ఎదురుకానున్న తిప్పలు? ఎన్నికలలో ఎమ్మెల్యే కు ఇబ్బందులు తప్పవు? జనం చెబుతున్నారు.

దళిత బంధు లో దగా.. దగా!

`దళితుల సొమ్ముకు ఎర!

`పథకం అమలుకు అధికారుల పొగ?

` అటు అధికారులు…ఇటు ట్రేడర్లు!

`కారుకు షోరూం కొటేషన్‌ లక్షన్నర అదనం…

`ట్రాక్టర్ల్‌ కు కూడా అంతే లక్షన్నర…

`మధ్య వర్తులంతా షోరూమ్‌ యజమానులే…

`వాటాల పంపకాలు వారి చేతుల మీదుగానే!

`ఇటు ఇస్తున్నారు…అటు అమ్ముకునే దారి చూపిస్తున్నారు.

`కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారు?

`దళిత బంధును పక్కదారి పట్టిస్తున్నారు?

`పథకాన్ని నీరుగారుస్తున్నారు?

`సెంట్రింగ్‌ యూనిట్‌ లో రెండు లక్షలు కమీషన్‌…

` ప్రతి ఫైలుపై సంతకానికి ఎస్సీ కార్పొరేషన్‌ అధికారికి రూ. 30 వేలు.

`ప్రతి వెహికిల్‌ రిజిస్ట్రేషన్‌ కు ఆర్టీవోకు రూ. 13 వేలు.

` రాత్రికి రాత్రే లీడర్ల ట్రేడిరగ్‌ లైసెన్స్‌…

`దళిత బంధు అమలుపై ఇంటలిజెన్స్‌ ఆరా…

` రెండో విడతలో అధికారులు ఏది చెబితే అదే తీసుకోవాలి?

`మొదటి విడతలో తీసుకోని వారు వాహనాలే తీసుకోవాలి?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

సమాజం ఎటుపోతోంది? దళితుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన బాధ్యతను ఎందుకు విస్మరిస్తోంది? ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రారంభించినా, ఆచరించి, అమలు చేయాల్సిన ఉద్యోగ వ్యవస్ధలో కొందరి వల్ల లక్ష్యం ఎందుకు నిర్వీర్యమౌతోంది? అన్న ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్పాలి? అసలు దళిత బంధు సొమ్ముకు అధికారులు ఆశపడడం ఏమిటి? దళారులు కాజేయాలని చూడడమేమిటి? ఎవరికి వారు తమ సొమ్మే అన్నట్లు వాటాలు వేసుకోవడమేమిటి? సంతకాలు పెట్టాలంటే ఇంత ఇవ్వాలని అధికారులు షరతులు పెట్టడమేమిటి? లంచం ఇస్తే తప్ప సంతకం పెట్టమన్నంత ధోరణి ప్రదర్శించడమేమిటి? మొత్తంగా దళిత బంధు లాంటి గొప్ప పథకం అమలో ఇంత దోపిడేంది? పైలెట్‌ ప్రాజెక్టన్న భయం కూడా అధికారుల్లో లేకపోవడం ఏమిటి?  

 సహజంగా ప్రైవేటు వ్యక్తులు షోరూంలలో కారు, ట్రాకర్‌, ఏ వాహనం కొన్నా, ప్రభుత్వ వర్గాలు కార్లు కొన్నా ఒకటే రేటు వుండాలి. 

అందుకు అవసరమైన కొటేషనే వేసి ఇవ్వాలి. ఒక వేళ తేడా ఏమైనా వుంటే అది వెయ్యో…రెండు వేలో తేడా వుంటే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అంతే కాదు పెద్దఎత్తున కార్లు, ట్రాక్టర్లు కొనుగోలు చేస్తున్న సమయంలో మరింత తగ్గించి ఇవ్వాలి. ఇంతకు తగ్గించి ఇస్తేనే మేం కార్లు, ట్రాక్టర్లు తీసుకుంటామని ప్రభుత్వ అధికారులే షరతులు విధించాలి. అది కాకుండా షోరూం లెందుకు రేట్లు పెంచి కొటేషన్లు ఇస్తున్నాయన్న అనుమానం అందరికీ వస్తుంది? కాని అసలు తిరకాసు ఇక్కడే వుంది? ఇది అధికారులు ఆడుతున్న డ్రామా అన్నది అందరికీ తెలిసిందే…కాని అడిగిన వారు లేదు? ప్రశ్నించిన వారు లేదు? అధికార వ్యవస్ధలో కింది నుంచి పై స్ధాయి దాకా అందరికీ తెలిసి జరగుతుందే? అయినా ఇంత దోపిడా? ఒక వాహనం మీద సుమారు రూ.లక్షన్నర ఎక్కువ చెల్లించడం అంటే లబ్ధిదారుడిని దోపిడీ చేయడం. ప్రభుత్వాన్ని మోసం చేయడం కాదా? ఇది చట్టరిత్యా నేరం కాదా? అయినా ఇంతగా అధికారులు ఎలా భరితెగిస్తున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వమంటే కూడా భయం లేకుండాపోయిందా? ప్రభుత్వం ఉద్యోగాలు తీసేస్తుందన్న ఆలోచన కూడ లేదా? జైలుకెళ్లాల్సి వస్తుందన్న భయం కూడా లేదా? ఉద్యోగాలు పోయినా ఫరవాలేదన్న ధైర్యమా? ప్రభుత్వ సొమ్మును కాపాడాల్సిన అధికారులే ప్రభుత్వ ధనం దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అసలైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారు. ఇందులో తమపాత్ర కనిపించంకుండా షోరూం యజమానులు, అక్కడ పనిచేసే ఉద్యోగులను మధ్యవర్తులుగా మార్చి సొమ్మును పంచుకుంటున్నారు. డైరెక్టుగా అంత పెద్ద అమౌంటు తీసుకుంటున్నట్లు తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా కోట్లాది రూపాయలను నొక్కేస్తున్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఇప్పటి వరకు సమారు 4వేల కార్లు, 4వేల ట్రాక్టర్లకు లబ్దిదారులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో మెజార్టీ లబ్ధిదారులకు వాహనాలు అందించారు. ఆ వాహనాల మీద అదనంగా వేసిన కొటేషన్‌ సొమ్మును అధికారుల పంచుకున్నారు. ఇంత భహిరంగంగా దోపిడీ సాగిస్తున్నారు. ఇదిలా వుంటే ఇక రెండు జిల్లాలకు చెందిన ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులు ప్రతి అప్లికేషన్‌ అప్రూవల్‌కు లబ్దిదారుల నుంచి రూ.30వేలు వసూలు చేసినట్లు సమాచారం. లబ్ధిదారుల్లో ఉన్నత విద్యావంతులున్నారు. అమాయకులైన లబ్ధిదారులనుంచే కాదు…ఉన్నత విద్యావంతులైన వారి నుంచి కూడా ముక్కుపిండి వసూలు చేసినట్లు రూ.30వేలు వసూలు చేశారని తెలుస్తోంది. అంటే తమ సంతకానికి వున్న పవర్‌ అని చెప్పకనే చెబుతున్నట్లు లెక్క. 

ఇక ఆ వాహనాల రిజిస్రేషన్‌ అన్నది ఆర్టీవో ఉచితంగానే చేయాలి.

 కాని ఆయనేం తక్కువ తిన్నారా? ఆయన కూడా ప్రతి వాహనానికి రూ.13వేలు వసూలు చేశారని లబ్ధిదారులు చెతున్నారు. పైగా ఎవరైనా లబ్ధిదారులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తే, పుణ్యానికి వస్తేనే ఇలా మాట్లాడుతున్నావ్‌…కష్టపడితే ఏం మాట్లాడతావో? అంటూ బెదిరించి మరీ డబ్బులు వసూలు చేసినట్లు చెబుతున్నారు. సరే అన్ని అవాంతరాలు దాటుకొని వాహనాలు తెచ్చుకున్నా ప్రతి వాడి కన్నూ ఆ వాహానాల మీదే…ఎలాగైనా వారి దగ్గరనుంచి ఆ వాహనాలు లేకుండా చేశారు..పొరుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్‌ లోని వివిధ జిల్లాల నుంచి వచ్చి ట్రాక్టర్లు, కార్లు కొనుగోలు చేశారు. లబ్ధిదారులకు రెండు, మూడు లక్షలు చెతిలో పెట్టి వాహానాలు లేకుండా చేశారు. లబ్ధిదారుల బలహీనతలను ఆసరా చేసుకొని లీడర్లు, అధికారులు చేసిన పని వల్ల దళిత బంధురాకముందు దళితుల పరిస్దితి ఎలావుందో…ఇప్పుడూ అదే పరిస్దితి వుంది. అసలు దళిత బంధు వాహనాలు అమ్మొద్దు…ఎవరూ ఇతరులు వారి వద్ద నుంచి కొనుగోల చేయెద్దు. మరి ఎలా ఈ తతంగం అంతా జరుగుతోంది. ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయం మీద దృష్టిపెట్టాలి. లబ్దిదారులకు నగదు ఆశ చూపించి, సొమ్ము చేసుకున్న వారి వద్దనుంచి వాహనాలు వసూలు చేసి తిరిగి, లబ్ధిదారులకు అందించాలి. అప్పుడుగాని ఇలా ప్రభుత్వ పథకాల దుర్వినియోగానికి ఎవరూ పాల్పడరు…

   ఇక సెంట్రింగ్‌ యూనిట్‌ విషయంలో మరీ ఘోరం…

సెంట్రింగ్‌ పేరు మీద రూ.8లక్షలు డ్రా చేయించి తీసుకుంటున్న ట్రేడర్లు, లబ్ధిదారులకు రూ.6లక్షలు చేతిలో పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. ప్రతి లబ్ధిదారుని వద్ద నుంచి రూ.2లక్షలు కాజేస్తున్నారు. అధికారులకు వాటాలు పంచేస్తున్నారు. ఇదేనా ట్రేడర్ల ముసుగులో నాయకులు అడుతున్న నాటకం. అటు నాయకులు మోసం చేసి, ఇటు అధికారుల మోసం చేసి, దళితులకు న్యాయంగా అందాల్సిన సొమ్మును మాయంచేయడం ఎంత దుర్మార్గం. లబ్ధిదారులకు సెంట్రింగ్‌ యూనిట్‌ రూ.8లక్షల విలువ చూపించాల్సిందిపోయి, రూ.6లక్షలు చేతిలో పెట్టడమేమిటి? రూ.2 లక్షలు తీసుకోవడమేమిటి? ఇంత దర్జాగా దళిత బంధు సొమ్ము నొక్కేయడమేమిటి? మొదటి విడతలో దండుకోవాల్సినంత దండుకొని కోట్లు కొల్లగొట్టిన అధికారులు, రెండో విడతలో ఎలా నొక్కాలి? ఎంత నొక్కాలన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. పైగా మొదటి విడతలో ఎలాంటి లబ్ధి పొందని వారి నుంచి ఎలా వసూలు చేయాలన్నదానిపై కసరత్తు మొదలుపెట్టారు. ఇక్కడో ఆసక్తికరమైన విషయం చెప్పాలి. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ఓ మండలంలో లబ్ధిదారురాలైన ఓ మహిళ తనకు కెమెరా కావాలని, తాను ఫోటోగ్రఫీ వృత్తిని నిర్వహించుకుంటానని అధికారుల దృష్టికి తీసుకెళ్తే, కారు తీసుకో..అని ఉచిత సలహా ఇచ్చారట. అంతే కాదు కారు తీసుకుంటామంటేనే సంతకం చేస్తామని కూడా చెప్పారట. అంటే ఫోటో కెమెరా విషయంలో ఏమీ మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. అదే కారు తీసుకుంటే షోరూం నుంచి నేరుగా వాటా అందే అవకాశం వుంది. ఇప్పటికే దళిత బంధులో దోచుకోవాల్సినంత దోచుకున్నారు…ఇంకా అడుగు బొడుగు వున్నవాటిని కూడా వదలమని తెగించి చెప్పేస్తున్నంత పని చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టిసారించాల్సివుంది.

దళిత బంధు ట్రాక్టర్లు ఆంధ్రాలో..! హర్యానా నుంచి తెచ్చిన బర్రెలు స్వర్గంలో!!

`ఇదీ దళిత బంధు అమలు అధికారుల నిర్వాకం.

`ఏసి. గదుల్లో కూర్చొని అధికారులు చేసిన అమలు తీరుకు నిదర్శనం.

`దళిత బంధు వాహనాలు అమ్మినా, కొన్నా నేరమే!

`అయినా ఎలా కొన్నారు? అమ్మకాన్ని అధికారులు ఎలా ప్రోత్సహించారు?

`దళిత బంధు ట్రాక్టర్లలో 60 శాతం ఆంద్రాకు చెందిన వ్యక్తులు ఎలా కొనుగోలు చేశారు?

`ట్రాక్టర్లు తరలుతుంటే అధికారులు ఏం చేశారు?

` రెండు జిల్లాల కలెక్టర్లు ఏం పర్యవేక్షిస్తున్నారు?

`ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు నిర్వాకం ఎందుకు కనపడలేదు?

`అగ్రికల్చర్‌ ఏడి. ట్రాక్టరు షోరూం యజమానిని కమీషన్‌ కోసం బెదిరింపులేమిటి?

`ఇన్ని ట్రాక్టర్ల అమ్మకానికి అవకాశం కల్పిస్తే కమీషన్‌ ఇవ్వవా? గద్దించడమేమిటి?

`వాహనాల మీద సిఎం. స్టిక్కర్‌, దళిత బంధు అని ఎందుకు రాయలేదు?

`లబ్ధి దారులు బర్రెలు మేమే కొనుక్కుంటామంటే ఎందుకు అధికారులు సహకరించలేదు?

`కరీంనగర్‌ డైరీ వాళ్లు ఎందుకు ఒప్పుకోలేదు?

`గతంలో ఉత్తర భారత్‌ నుంచి గొర్రెల కొనుగోలు అనుభవాలున్నాయి.

`అయినా బర్రెల విషయంలో అదే ఎందుకు అనుసరించారు?

`గేదెల మరణానికి కారకులెవరు?

`వాతావరణ మార్పులు పడక బర్రెలు చనిపోయాయి.

` ఇప్పటికైనా మేం చెప్పినట్లు వినండి…అని దళిత రైతులు కోరుతున్నారు.

`బర్రెలు ఇవ్వడం కుదరదు…మరో ఇతర యూనిట్లు పెట్డుకోమని కొత్తగా అధికారుల ఒత్తిళ్లు?

`ఇప్పుడు గైడ్‌ లైన్స్‌ అడ్డం రావడం లేదా?

`పాలు పితకడం, వ్యవసాయ సాగు తప్ప మాకేం పనిరాదన్నా అధికారులు వినడం లేదు?

`లబ్ధి దారుల మాటకు విలువలేదు?

`దళిత బంధు ఆగమౌతున్నా అధికారులకు పట్టింపు లేదు?

`లబ్ధి దారులు చెప్పినట్లు చేస్తే అధికారులకు కమీషన్లు రావు?

`ఏజెన్సీలకు డైరెక్ట్‌ గానే ఫోన్లు చేసి అధికారులు కమీషన్లు వసూలు చేసుకున్నారు?

`కాల్‌ రికార్డులౌతాయన్న భయం కూడా లేదు?

`దళిత బంధు తో కోట్లు దండుకున్నారు?

`లబ్ధి దారులను ఆగం చేశారు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

సహజంగా పాలకులు మోచేతికి బెల్లం పెట్టి నాకిస్తారని గతంలో చెప్పుకోవడం విన్నాం. ఎదో ఒక సంక్షేమ పధకం ప్రవేశపెట్టి గొప్పలు చెప్పుకోవడం చూశాం…ప్రజల జీవితాలు వెలిగిపోతున్నాయని చెప్పుకున్న సందర్భాలు అనేకం. కాని తెలంగాణ సాధించి, ప్రజల ఆదరణతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రకటించి, అమలు చేస్తున్న పధకాలు అన్నీ ఇన్నీ కావు. అందులో ఎంతో ప్రాముఖ్యమైన, ప్రత్యేకమైన, ప్రధానమైన పధకం దళిత బంధు. మొదటి సారి తెలంగాణలో అట్టడుగు వర్గాలకు న్యాయం చూస్తున్నాం. అనేక పధకాల అమలు అనుభవిస్తున్నారు. ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా అనేక సదుపాయలు అందుకుంటున్నారు. ప్రతి వ్యక్తి ఏదో ఒక రూపంలో ప్రభుత్వ చేయూతనందుకుంటున్నారు. అలాగే దళితుల జీవితాల్లో సంపూర్ణంగా వెలుగులు నిండాలని ఆశించిన ఏకైక ముఖ్యమంత్రి కేసిఆర్‌. అందుకు అవసరమైన గొప్ప పధకానికి రూపకల్పన చేసి, ప్రకటించి అమలు చేస్తున్నారు. దళితులకు కొత్త జీవితాలు ప్రసాదిస్తున్నారు. గతంలో దళితులకు ఎంతో కొంత రుణాలు ఇవ్వడమే గొప్పగా చెప్పుకునేవారు. కాని ఇప్పుడు పైసా కూడా ప్రభుత్వానికి తిరిగి కట్టకుండా, పూర్తి సబ్సిడీతో దళిత బంధు పధకంలో రూ.10లక్షల వరకు అందజేస్తున్నారు. లబ్ధిదారుల కోరిక మేరకు, వారి సూచనలను అనుసరించి ప్రభుత్వం వారి ప్రావీణ్యాన్ని బట్టి యూనిట్లను అందజేస్తున్నారు. వారికి ఉపాధి మార్గం చూపిస్తున్నారు. వాటిలో అనేకం వున్నాయి. రైతులుగా పాడిని కావాలనుకుంటున్నవారికి గేదెలు అందజేస్తున్నారు. వ్యవసాయ పనిముట్టుగా పనిచేసే హార్వెస్టర్లు ఇస్తున్నారు. ట్రాక్టర్లు అందజేస్తున్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ వున్నవారికి కార్లు ఇస్తున్నారు. కిరణా షాపు నిర్వహిస్తామనుకునేవారికి ఆ సదుపాయం కల్పిస్తున్నారు. సెల్‌ఫోన్‌ షాపులు, ఫర్నిచర్‌ షాపులు, సెంట్రింగ్‌ వర్కులు, టెంట్‌ హౌస్‌లు ఇలా అనేక రూపాల్లో ఉపాది చూపిస్తున్నారు. కాని కొందరు అధికారులు ఈ పధకాన్ని పక్కదోవ పట్టించారు. ఆ పధకం అమలులో చీకట్లు నింపారు. సహజంగా ఎస్సీ కార్పోరేషన్‌ అధికారరులు అమయాకులైన దళితుల్లో మరింత చైతన్యం నింపాలి. వారి జీవితాలకు ఒక మార్గదర్శకంగా నిలవాలి. కాని కొందరు అధికారులు, ముఖ్యంగా ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులు చేసిన నిర్వాకం మూలంగా దళిత బంధు వరంగా కాకుంగా, శాపంగా పరిణమించేలా చేస్తున్నారు. వారికి అందాల్సిన సొమ్మును కాజేస్తున్నారు. ఎంతో బాధ్యతగా దళిత బంధును అమలు చేయాల్సిన అధికారుల తీరు బాధాకరం. అత్యంత దురదృష్టకరం. ఇంకా చెప్పాలంటే దుర్మార్గం. పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కొందరు అధికారుల తీరు మారడం లేదు. అవినీతి ఆపడం లేదు. అక్రమ సంపాదన మానుకోవడం లేదు. పథకాన్ని నిర్వీర్యం చేసే పన్నాగం పన్నుతున్నారు. ప్రజల పన్నులతో వచ్చే జీతాలు తీసుకుంటూ, ప్రజలకే సున్నం పెడుతున్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నారు. 

ఇక్కడు ముఖ్యంగా రెండు విషయాలు చర్చించుకోవాల్సిన అసవరం వుంది.

ప్రభుత్వం పేద దళితుల్లో సాగుతోపాటు, పాడిని చూసుకునేవారి కోరిక మేరకు 8 గేదెలు అందజేయాలని నిర్ణయించింది. అందులో హుజూరాబాద్‌ నియోజక వర్గంలో వేలాది మందిరైతులకు గెదెలు సరఫరా చేశారు. మొదటి విడతగా ముందు 4 గేదెలను అందజేశారు. ఇంత వరకు బాగానే వుంది. కాని అసలు తిరకాసు ఇక్కడే వుంది. ప్రభుత్వం అనుకున్నది ఒకటి. కాని అధికారులు ఆచరించింది మరొకటి. లబ్ధిదారులు మొదటగా గేదెల కోసం షెడ్‌ ఏర్పాటు చేసుకోవాలి. అందుకు అవసరమైన సొమ్మును లబ్ధిదారులు బ్యాంకునుంచి డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. షెడ్డు నిర్మాణానికి సంబంధించిన ఫోటోలు తీసుకొని, లబ్ధిదారులు కరీంనగర్‌ డైరీకి అందజేశారు. కరీంనగర్‌ డైరీ అధికారులు రైతులను విడతల వారీగా హర్యానా తీసుకెళ్లి, గెదెలు ఇప్పించారు. కాని ఆ గేదెలు మన వాతావరణంలో మనుగడ సాగిస్తాయా?లేదా? అన్నది ఆలోచించలేదు. ఉత్తర బారత ప్రాంతానికి, మన ప్రాంతానికి వాతావరణంలో ఎంతో వ్యత్యాసం వుంటుంది. అందుకే లబ్ధిదారులైన రైతులు తాము ఇక్కడే గేదెలను కొనుగోలు చేసుకుంటామని చెప్పారు. అయినా అధికారులు వినలేదు. ఏ గేదె ఎక్కువ పాలు ఇస్తుందో… ఎంత ఆరోగ్యంగా వుందో…ఎంత వయసు వుందో…ఇలాంటి విషయాలు క్షుణ్ణంగా తెలుసుకొని ఇక్కడే కొనుగోలు చేసుకుంటామని ఎంత మొత్తుకున్నా అధికారులు వినలేదు. గతంలో కురుమలు, యాదవులకు గొర్రెల యూనిట్లు ప్రభుత్వం అందజేసింది. అప్పుడు కూడా అధికారుల అత్యుత్సాహంతో ఇలాంటి పరిస్దితే ఎదురైంది. రైతులను తీసుకెళ్లి ఉత్తర ప్రదేశ్‌ లాంటి ప్రాంతాల నుంచి గొర్రెలు కొనుగోలు చేసి తెచ్చారు. వాటిలో చాలా వరకు గొర్రెలు మరణించాయి. గొర్రెలకు ఇన్యూరెన్సు వుండడం మూలంగా వారికి పెద్దగా నష్టం జరగలేదు. కాని గేదెలకు అలాంటి అవకాశం కల్పించబడలేదు. దాంతో లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. గేదెలను హర్యానా నుంచి కొనుగోలు చేసిన సందర్భంలో లబ్ధిదారులు ఇక్కడే కొనుగోలు చేస్తామంటూ రూల్స్‌, రెగ్యులేషన్లు అంటూ కొత్త కొత్త బాష్యాలు చెప్పిన అధికారులు, ఇప్పుడు కూడా వారి మాటలు వినడం లేదు. కాని గేదల స్దానంలో మరో రకమైన యూనిట్‌ ఎంపిక చేసుకొమ్మని కొత్త సలహాలు ఇస్తున్నారట…అంటే ఇప్పుడు రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్లు అతిక్రమించొచ్చా? అందుకు అధికారులకు ప్రభుత్వమేమైనా మార్గదర్శకాలు జారీ చేసిందా? అదే నిజమైతే గేదెలను ఇక్కడే కొనుగోలు చేసేలా కొత్త గైడ్‌ లైన్స్‌ ఇస్తుందే గాని, ఇతర యూనిట్లను ఎంపిక చేసుకొమ్మని చెబుతుందా? ఇలా ప్రభుత్వాన్ని అబాసు పాలు చేసేంందుకు, కమీషన్లలో కొత్త దారులు వెతుక్కునేందుకే అధికారులు ప్రయత్నిస్తున్నారు తప్ప, లబ్ధిదారులకు మేలు చేయాలన్న సోయి మాత్రం ఒక్క శాతం కూడా లేదన్న సంగతి తేలిపోయింది. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటే తప్ప, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగవు. ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పడవు. 

ఇక ట్రాక్టర్ల మాయాజాలం మరో రకమైంది. 

హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలో కొన్ని వందల ట్రాక్టర్లు దళిత బంధు కింద అందజేయడం జరిగింది. మరి ఆ టాక్టర్లు ఇప్పుడు లబ్ధిదారుల వద్ద వున్నాయా? లేదా అన్న వాటిని చూసుకునే తీరిక అధికారులకు లేదు. అంతే కాదు ఏ లబ్ధిదారుడికైనా అందిన ప్రతి యూనిట్‌ విషయంలోనూ వారికి ఉపాధి ఎంత లభిస్తోంది. ఒక వేళ లేకపోతే, వారికి ఎలా ఉపాధి కల్పించాలన్నది కూడా ప్రభుత్వ ఉద్యోగులే చొరవ తీసుకోవాలన్నది రూలు. కాని ఎస్పీ కార్పోరేషన్‌ ఉద్యోగులు ట్రాక్టర్లు ఇచేసి చేతులెత్తేశారు. వాటిని అమ్ముకోమ్మని చెప్పి, చేతులు దులుపుకుంటున్నారు. అసలు ఇక్కడ ఎంతో ముఖ్యమైన విషయాలను అధికారులు గాలికి వదిలేశారు. ప్రభుత్వం ఇచ్చే ప్రతి యూనిట్‌ మీద దళిత బంధు స్కీమ్‌ పేరు ఖచ్చితంగా రాయించాలి. పైగా ముఖ్యమంత్రి ఫోటో స్టిక్కర్‌ ఖచ్చితంగా వుండాలి. అది కారైనా, ట్రాక్టరైనా,హార్వెస్టరైనా మరేదైనా సరే, దళిత బంధు స్కీమ్‌ కనిపించేలా వుండాలి. కాని అధికారులు తూతూ మంత్రంగా మాత్రమే వాటిని చూసుకున్నారు. మిగతావాటికి వదిలేశారు. దళిత బంధు స్కీమ్‌ కింద లబ్ధిదారులకు అందజేసిన ఏ వాహనమైనా, మరే ఇతర యూనిట్‌ అయినా సరే అమ్ముకోవడానికి వీలులేదు. ఎవరూ కొనుగోలు చేయకూడదు. అదే జరిగితే ఇద్దరిదీ నేరమే అవుతుంది. ఈ విషయం అమాయకులైన లబ్ధిదారులకు చెప్పకుండా అధికారులు మభ్యపెట్టారు. ఈ విషయం తెలియక ట్రాక్టర్లు చాలా మంది లబ్ధిదారులు అమ్ముకున్నారు. సుమారు 60శాతానికి పైగా ట్రాక్టర్లు ఇప్పుడు లబ్ధిదారుల వద్దలేవు. ఈ విషయంలో లబ్ధిదారులను మాయ చేసి, వారి చేత అమ్మకాలకు పురిగొల్పింది కూడా అధికారులే కావడం గమనార్హం. ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులు ఇలా లబ్ధిదారుల సొమ్ముకు కన్నం పెడితే, అగ్రికర్చర్‌ అధికారులు తామేం తక్కువా అనుకున్నారో ఏమో! ట్రాక్టర్లు సరఫరా చేసిన ఎజెన్సీల వద్దకు వెళ్లి, ఇన్ని ట్రాక్టర్లు అమ్మకానికి అవకాశం కల్పించామని, తమకు కమీషన్‌ ఇవ్వాలని వారిని వేధించి వసూలు చేసినట్లు కూడా తెలుస్తోంది. అగ్రికర్చర్‌ డిపార్లుమెంటుకు చెందిన ఓ ఉన్నతాధికారి ఏకంగా ఆ ఎజెన్సీ యజమానికి బెదిరించినట్లు కూడా సమాచారం. ఇలా ఎవరికి వారు కమీషన్ల పేరుతో వాటాలు పంచుకొని, దళిత బంధు సొమ్ము కాజేశారు…లబ్ధిదారుల వద్ద ట్రాక్టర్లు లేకుండా చేశారు. ఇప్పుడు ఆ ట్రాక్టర్లనీ ఆంధ్రాప్రాంతానికి చెందిన కొంత మంది వ్యక్తులకు దగ్గరుండి మధ్యవర్తుల చేత అధికారులు కధలు నడిపించారు. మొత్తంగా పథకానికి సున్నా చుట్టేశారు.

దళిత బంధు మేసిన రాబందులెవరు?

`ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడిచిందెవరు?

`ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆశలు, ఆశయాలు వమ్ము చేసిందెవరు?

`హుజూరాబాద్‌ పైలెట్‌ ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిరదెవరు?

`దళిత బంధును పప్పు బెల్లాలు చేసుకొని పంచుకొని మింగిందెవరు?

`ప్రతిపక్షాలకు మాటలకు కొమ్ము కాసేలా వ్యవహరించిన అధికారులెవరు?

`ప్రతిపక్షాల మాయలో పడి దళితబంధు లబ్ధి దారులను దోపిడీ చేసిందెవరు?

`అమాయకపు దళితుల జీవితాలను ఆగం చేసిందెవరు?

`ముఖ్యమంత్రి కేసిఆర్‌ చెప్పిందేమిటి? 

`అధికారులు ఆచరించిందేమిటి?

`ఎస్సీ కార్పొరేషన్‌ చేసిన ఘన కార్యమేమిటి?

`లబ్ధి దారులను పక్కదారి పట్టించడంలో ఎస్సీ కార్పొరేషన్‌ అధికారుల పాత్రేమిటి?

`జిల్లా స్థాయి అధికారుల పంపకాల మాటేమిటి?

`ఉత్తుత్తి ట్రేడర్స్‌ కు సొమ్ము కట్టబెట్టడమేటి?

`కార్లు ఇచ్చిన ఏజెన్సీకి అదనంగా మరో లక్షన్నర కలపని అధికారుల ఆదేశాలలో ఆంతర్యమేమిటి?

`దొంగలు, దొంగలు ఊర్లు పంచుకున్నట్లు దళిత బంధు లూటీ మాటేమిటి?

`వందల కోట్లు మింగి, కరిమింగిన వెలగపండు చేస్తిరి?

`ప్రభుత్వ లక్ష్యం నీరుగార్చితిరి?

`లబ్ధి దారులను మోసం చేసి, నిండా ముంచితిరి?

` ప్రభుత్వాన్ని అబాసుపాలు చేస్తిరి?

`అసలు దొంగల చేత తిన్నది కక్కిస్తే గాని దళిత బంధు లక్ష్యం నెరవేరదు?

`రొయ్యలు తిని మూతి నాకినంత సులువుగా కోట్లు కొట్టేసి చేతులు దులుపుకుంటిరి?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణలోని ప్రతి దళిత కుటుంబం కళకళలాడాలి. ప్రతి దళితుడు లక్షాదికారి కావాలి. ఆత్మగౌరవంతో బతకాలి. ఆర్ధికంగా ఉన్నత స్ధితికి చేరుకోవాలి. సమస్యలు లేని జీవితాన్ని గడపాలి. ఆర్ధిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోవాలి. ఆపసోపాలు లేని జీవన యానం కావాలి. తెలంగాణ వచ్చింది. తెలంగాణలో అన్ని వార్గాలు ఆనందంగా బతకాలి. అందులో దళితులు మరింత సంతోషంగా బతికే రోజులు రావాలి. తరతరాలుగా అణచివేతకు, వివక్షకు గురౌతూ, సమాజంలో అట్టడుగు వర్గాలుగా మిగిలిపోతూ, ఆర్ధిక అసమానతలతో వెనుకబడిన దళితుల జీవితాల్లో మార్పులు రావాలి. వారు కూడా సమాజంలో ఉన్నతంగా బతకాలి. అందుకు వారికి ఆర్ధిక చేయూత కల్పించాలి. ఉపాధి అవకాశాలు కల్పించబడాలి. ఉన్నతమైన ఉచిత విద్యావకాశాలు అందించాలి. రేపటి తరాన్ని ఉన్నతంగా తీర్చదిద్దాలి. అసమానతలు లేని సమాజం నిర్మింపబడాలి. వెనుబాటు తనం పోవాలి. అది సామాజిక పరంగానైనా, ఆర్దిక పరంగానైనా అందరూ ఏకతాటిపైకి వచ్చే సమాజ నిర్మాణం జరగాలి. ఇదీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలోచన..ఆచరణ. 

 సమాజంలో దళిత వార్గల అభ్యున్నతి గురించి గొప్పగా కొన్ని దశాబ్ధాలుగా చెప్పుకుంటున్న మాటే…మనం వింటున్న మాటే…కాని ఆచరణేది…ఆచరించిన వారేరీ..  

ఇన్నేళ్లయినా ఆ మాటలు మాటలుగానే మిగిలిపోతూ వచ్చాయి. అందుకే కేటాంచిన సొమ్ము మూటలు మాయమైపోతూ వచ్చాయి…దళితులకు చేయూతనందించిన వారేరీ…గొప్పగా బడ్జెట్‌లో లెక్కలు చూపించి మోసం చేసిన వారే…అలా కాకుండా నేరుగా దళితులకు మేలు జరిగేలా, ఆర్ధికపరమైన లబ్ధి జరిగేలా, ప్రతి దళితుడు లక్షాదికారి అయ్యేలా చేయాలని ప్రపంచ చరిత్రలోనే వినూత్నమైన, విప్లవాత్మకమైన దళిత బంధు పధకాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రవేశపెట్టారు. తెలంగాణలో దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించింది ముఖ్యమంత్రి ఒక్క కేసిఆర్‌ మాత్రమే…గతంలో చాలా మంది నాయకులు, చాల మంది ముఖ్యమంత్రులు చాలా చెప్పారు. కాని ఏది ఆచరించి చూపించలేదు. బడ్జెట్‌లలో కేటాయింపులు, తర్వాత వాటి మళ్లింపులు. ఇవే కాదా…మొన్నదిదాకా చూసింది…కాని నేడు ఆ పరిస్ధితి లేదు. దళితుల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తున్న తరుణమిది. ముందుగా పైలెట్‌ ప్రాజెక్టు హుజూరాబాద్‌లో తీసుకోవడం జరిగింది. ఆ నియోకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.పది లక్షలు అందించే కార్యక్రమం మొదలైంది. అయితే ఇందులో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎంతో దూరదృష్టితో ఉన్నతమైన ఆశయాలు…ఆలోచనతో…ఆచరాత్మక దృక్పధాన్ని మేళవించి ఒక విప్లవాత్మక ధోరణితో దళిత బంధు అమలుకు శ్రీకారం చుట్టారు. కాని ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులకు చెవికెక్కలేదా?… లేక సరిగ్గా వినిపించుకోలేదా? ముఖ్యమంత్రి ఆదేశాలూ పూర్తిగా అవగాహన చేసుకోలేదో? ఏమో గాని దళిత బంధు అమలులో అధికారుల తీరు వివాదాస్పదమౌతోంది. పెద్దఎత్తున చర్చనీయాంశమౌతోంది. దళిత బంధు ఆశయాలకు తూట్లుపొడిచారన్న విమర్శలు పెద్దఎత్తున వెల్లువెత్తుతున్నాయి. పై స్ధాయి అధికారులు చేసిన అవకతవలపై, కింది స్ధాయి అధికారుల మెడకు చుట్టుకునే పరిస్దితులు రానున్నాయి. ప్రభుత్వం తెలంగాణలోని ప్రతి దళితుడిని లక్షాధికారి చేయాలన్న గొప్ప సంకల్పంతో చేస్తున్న యజ్ఞానికి తూట్లు పొడిచి, పైలెట్‌ ప్రాజెక్టులోనే పెద్ద కుంభకోణానికి అధికారులు తెరతీసినట్లు స్పష్టమౌతోంది. 

 ప్రతి మనిషికి కూడు, గూడు, గుడ్డ అన్నవి కనీస అవసరాలు..

.అవి తీరాలంటే పని చేయాలి. కష్టపడాలి. డబ్బు సంపాదించాలి. అందుకు ఉపాధి కావాలి. ఆ ఉపాధి ఏదో ఒక రూపకంగా అందాలి. దాన్ని ప్రతి వ్యక్తి ఆచరించాలి. అనుసరించాలి. అవసరాలు తీర్చుకోవాలి. ఇది మనిషి ఫిలాసఫీ…అనుసరించి…ఆచరించాల్సిన ప్రాక్టికాలిటి…కాని సమజాంలో ఎన్ని యుగాలైనా, ఎన్ని తరాలు మారినా తలరాత మారని, జీవితాలు మార్పులు రాని దళిత సమాజం పట్ల గత ప్రభుత్వాలు సానుభూతి మాత్రం చూపిస్తూ వచ్చేవి. కాని వారి జీవితాల్లో వెలుగులు నింపే పని జరగలేదు. కాని ఇప్పుడు మొదలైంది. దళిత బంధుతో ఆ యజ్ఞం ప్రారంభమైంది. అందుకు ప్రతి దళితకుటుంబానికి ప్రభుత్వం నేరుగా ఆర్ధికపరమైన సాయం అందిస్తోంది. ఆ సొమ్ముతో ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తోంది. హుజూరాబాద్‌లో ప్రారంభమైన దళిత బంధు సుమారు 18వేల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమం చేపట్టింది. గొప్పగా ఆ పథకం అమలుకు మార్గం వేసింది. కాని అధికారుల తీరుతో ఆ పధకం అసలు లక్ష్యాలకు తూట్లు పడేలా చేసింది. నిజానికి ప్రభుత్వ లక్ష్యం వేరు…అధికారులు అనుసరించింది వేరు…అందులోనూ కుంభకోణానికి తెరతీశారు…దాంతో ప్రభుత్వం ఎంతో గొప్ప లక్ష్యంతో చేపట్టిన పధకాన్ని అధికారులు నీరు కార్చుతున్నారు. దళిత బంధు అమలుకు ఎవరి రెకమెండేషన్‌ అవసరం లేదు…దళితుడైన ప్రతి వ్యక్తికి ఆర్ధిక చేయూత కల్పించబడాలి. ఇదే అధికారులకు వరంగా మారింది. లబ్ధిదారులైన ప్రతి దళితుడికి ముందు రూ.5లక్షలతో వారు కోరుకున్న యూనిట్‌ అందజేయాలి. లేదూ..కొంత మంది కలిసి ఏర్పాటు చేసుకొనే సంయుక్త యూనిట్‌ను అందించాలి. ఇవన్నీ అధికారుల పర్యవేక్షణలో జరగాలి. ఎవరెవరు ఏ ఉపాధి కావాలనుకుంటున్నారు…వారికున్న నైపుణ్యాన్ని బట్టి ఆయా యూనిట్లను అందించాల్సిన బాధ్యత ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులది. కాని ఇక్కడ జరిగింది వేరు…పథకం అమలులో సొమ్ములు ఖర్చు చేశారు..కాని లక్ష్యాలకు తూట్లు పొడిచారు…దళితుల జీవితాలను ఎక్కడ వేసినగొంగళి అక్కడే అన్నట్లు తయారు చేశారు…

దళిత బంధు అమలులో అందించిన యూనిట్ల జాడేది అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న.

పెద్దఎత్తున ఎస్పీ కార్పోరేషన్‌ అధికారులు పై స్ధాయి నుంచి కింది స్ధాయి దాకా వాటాలు పంచుకున్నట్లు లెక్కలేసి, దళిత బంధు సొమ్మును దానంగా ఇస్తున్నట్లు ఇచ్చింది తీసుకోండన్నట్లు చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నారు. దళిత బంధు సొమ్ము ప్రతి దళితుడి అక్కంట్లో వున్నప్పటికీ వాటిని ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులు ఎంతో చాకచక్యంగా వాటిని మళ్లించే ప్రయత్నం చేశారు. లబ్ధిదారుల బలహీనతలను ఆసరాగా చేసుకొని వారికి, నగదు ఆశ చూపించి మోసం చేశారు… 

 ప్రతిపక్షాల తీరు…అధికారుల పనితీరు… రెండూ కలిసి దళిత బంధు అమలుకు తూట్లు పొడిచేలా చేశాయి. 

అసలు దళిత బంధు అన్నది అమలుసాధ్యం కానిదంటూ ప్రతిపక్షాలు ప్రచారం చేస్తూ వచ్చాయి. హుజూరాబాద్‌ ఎన్నికల కోసమే ప్రవేశపెట్టిన పధకమంటూ ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపాయి. అంతే కాకుండా ప్రభుత్వం దళితుల అక్కంట్లో వేసిన డబ్బులు తిరిగి తీసుకుంటుందని అసత్య ప్రచారం విసృతంగా చేశాయి. ఆ మాటలే నిజమన్నట్లుగా కొందరు అధికారులు వ్యవహరించారు. లబ్ధిదారుల బలహీనతలను అధికారులు సొమ్ము చేసుకున్నారు. ప్రెండ్లీ ఎంప్లాయిస్‌ అని ప్రభుత్వం చెబితే..దళిత బంధులను ఊడ్చుకుతిన్నారు…వాటాలేసుకొని పంచుకుతిన్నారు. లబ్ధిదారులను మోసం చేశారు…

  మేం వేలు పెడితే రాజకీయమౌతుందని అధికార పార్టీకి చెందిన బిఆర్‌ఎస్‌ నేతలు ఈ విషయంలో వేలు పెట్టలేదు.

 దళితులందరికీ సాయం అందుతున్నప్పుడు వాటిని రాజకీయం చేయకుంటనే మేలని బిఆర్‌ఎస్‌ నేతలు ఎంతో హుందాగా వ్యవహరించారు. ప్రతిపక్షాలేమో…దళిత బంధు ఫెయిల్‌ కావాలని కుయుక్తులు పన్నాయి. గందరగోళం సృష్టించారు. ప్రజలను రెచ్చగొట్టారు. అమాయకులైన వారికి లేనిపోనివి కల్పించి చెప్పారు. దళిత బంధు డబ్బులు వాడుకోకపోతే, ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందని అసత్య ప్రచారం సృష్టించారు. ప్రతిపక్షాలు సృష్టించి ఈ గందరగోళం ఎస్సీ కార్పోరేషన్‌ అధికారుల పాలిట వరమైంది. పట్టించకునే నాధుడు లేడు…అడిగే దిక్కులేదనుకున్నారో ఏమో ఇష్టారాజ్యం చేశారు. దళిత బంధులో దక్కించుకోవాల్సినంత దక్కించుకున్నారు. విస్తరిలో మిగిలిన మెతుకులు విధిల్చినట్లు లబ్ధిదారులకు సున్నం పెట్టారు. ఆకు వక్కలు మాత్రం అధికారులు తిన్నారు. నోరు పొక్కినా ఏదో రుచి నాలుకకు అంటిందే పరమన్నామ్మన్నట్లు అధికారులు ఇచ్చింది లబ్ధిదారులు పుచ్చుకున్నారు. పుణ్యానికి వచ్చింది ఎంతైతే అంత అని సరిపెట్టుకోమన్నారు. తమకు చెందాల్సిన సొమ్మును ఎస్సీ కార్పోరేషన్‌ అధికారులు కాజేస్తున్నారన్న సత్యం తెలుసుకోలేకపోయారు. లబ్ధిదారుల బలహీనతే అధికారులు అప్పనంగా వాడుకున్నారు…దోచుకోవాల్సినంత దోచుకున్నారు…(ఉత్తుత్తి ట్రేడర్ల మాయాజాలం…దళిత బంధు నిధులు మాయం) రేపటి మీ నేటిధాత్రిలో…

భూపాలపల్లి బాద్‌ షా గండ్ర

`బిఆర్‌ఎస్‌ సభ సక్సెస్‌ క్రెడిట్‌ గండ్రకే…

`వచ్చే ఎన్నికలలో టిక్కెట్‌ గండ్రదే…

`గండ్ర మీద ప్రజలకున్న ప్రేమకు సంకేతం…

`నేటిధాత్రి చెప్పేదే నిజం…గత అనుభవాలే అందుకు సాక్ష్యం.

`రెండు దశాబ్దాలుగా గండ్రది తిరుగులేని నాయకత్వం…

`రెండు సార్లు ఎమ్మెల్యే…

`ఒకసారి ఎమ్మెల్సీ..

`ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్‌ విప్‌…

`ప్రగతిలో భూపాలపల్లి ప్రత్యేకం…

`ప్రజలతో మమేకమై.. ప్రజల కోసమే అంకితమై…

`సుదీర్ఘ రాజకీయ ప్రయాణం… అభివృద్ధికి తార్కాణం.

`అలుపెరుగని పోరాటం… ప్రజల సంక్షేమం కోసం ఆరాటం.

`నిరంతరం ప్రజల కోసం…నిజమైన సేవా భావానికి నిదర్శనం.

`పార్టీ బలోపేతం కోసం కృషి, నాయకులను కడుపులో పెట్టుకునే చిత్తశుద్ధి.

`పేదలకు ఆప్తుడు…అభాగ్యులకు అన్నార్థుడు.

` నియోజకవర్గం కోసం నిరంతరం తపించే నాయకుడు.

`ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం తపించే ప్రజా సేవకుడు…

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కాలం కలిసొస్తుంది…ధర్మం, న్యాయం మనవైపు వుంది. తెలంగాణ వచ్చి తీరుతుంది… ఇది ఎవరో అన్న మాటలు కాదు…సాక్ష్యాత్తు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి 2009లో అన్న మాటలు. మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తో అప్పట్లో చెప్పిన మాట…ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే 2009 ఎన్నికలలో గండ్ర వెంకట రమణారెడ్డి తొలి సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటికే ఆయన ఎమ్మెల్సీ కూడా… అయితే ఆ ఎన్నికలలో బిఆర్‌ఎస్‌ కేవలం పది సీట్లు సాధించింది. ఎన్నికల తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల సమయంలో కేటిఆర్‌ అసెంబ్లీ లాబీలో ఎదురైన గండ్ర వెంకట రమణారెడ్డితో కాసేపు తెలంగాణ గురించి చర్చించారు. ఈ సందర్భంగా కేటిఆర్‌ చెప్పిన విషయాలను సావధానంగా విన్న రమణారెడ్డి తెలంగాణ రావడం ఖాయమని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణపై రమణారెడ్డికి వున్న చిత్తశుద్ధిని ప్రజలకు తెలియజేశారు. తన నియోజకవర్గం మీద రమణారెడ్డికి ఎంత ప్రేమ వుందో వివరించే ప్రయత్నం చేశారు. తనకు అత్యంత అప్పుడు రమణారెడ్డి అనే విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఉటంకించారు. రమణారెడ్డి మీద తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు. అలాంటి రమణారెడ్డి బిఆర్‌ఎస్‌ లో చేరి భూపాలపల్లికి చేసిన సేవను, అభివృద్ధి కార్యక్రమాలను కీర్తించారు. భూపాలపల్లిలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాటు సభపై కేటిఆర్‌ ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా బిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ గండ్ర జ్యోతి నాయకత్వ పటిమను కొనియాడారు. భూపాలపల్లిలో చరిత్ర తిరగరాసేంత గొప్పగా సభను ఏర్పాటు చేసిన గండ్ర జ్యోతికి ప్రత్యేకంగా కేటిఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. 

బిఆర్‌ఎస్‌ సభ సక్సెస్‌ క్రెడిట్‌ గండ్రదే…

భూపాలపల్లిలో జరిగిన బిఆర్‌ఎస్‌ సభ నభూతో నభవిష్యతి అన్నట్లు జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎంత జిల్లా కేంద్రంలో సభైనా అది నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజలకున్న నమ్మకం మీద జరిగిన సభ. ఒక నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగిన తర్వాత, అక్కడే జరిగిన సభ. సహజంగా ఎన్నికల సభలకు ప్రజలు విశేషంగా హజరుకావడం చూస్తుంటాం. కానీ ఇలాంటి సభలు బహు అరుదు. అవి ఆది నుంచి బిఆర్‌ఎస్‌ పార్టీకే, ఆ పార్టీ నాయకులకే సాధ్యమౌతుంది. ఇటీవల కాలంలో బిఆర్‌ఎస్‌ పార్టీ సభలకు ప్రజలు గతం కన్నా ఎక్కువగానే వస్తున్నారు. ఆ మధ్య ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన సభకు లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చారు. జిల్లాలలో సమీకృత కలెక్టర్‌ కార్యాలయం సముదాయాల ప్రారంభోత్సవాలు, మెడికల్‌ కాలేజీల శంకుస్థాపనలకు జరుగుతున్న సభలు కూడా పెద్ద ఎత్తున విజయవంతమౌతున్నాయి. అయితే భూపాలపల్లిలో అభివృద్ధి పనుల శంకుస్థాపనల తర్వాత జరిగిన బిఆర్‌ఎస్‌ సభ ఇంత పెద్ద ఎత్తున సక్సెస్‌ అవుతుందని చాలా మంది ఊహించలేదు. కానీ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి చిత్తశుద్ధి, చొరవ, పార్టీ మీద ఆయనకున్న పట్టు, నాయకులలో ఎమ్మెల్యే మీద వున్న విశ్వాసం ఇవన్నీ సభ ఏర్పాటులో కనిపించాయి. అటు వేధిక, ఇటు ప్రజా సముదాయం ఎమ్మెల్యే మీద మరింత నమ్మకాన్ని పెంచిందనే చెప్పాలి. ఇలాంటి సభల సక్సెస్‌ అన్నది నాయకుల మీద మరింత బాధ్యత పెంచుతుంది. ప్రజల్లో నాయకుడిపై నమ్మకం రెట్టింపు అవుతుంది. ప్రజల ఆకాంక్షలు పెరుగుతాయి. మా సమస్యలు తీరుతాయన్న విశ్వాసం పెరుగుతుంది. గత మూడు దశాబ్దాలుగా రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న గండ్ర వెంకట రమణారెడ్డి మీద రోజు రోజుకూ ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతుందే తప్ప ఎక్కడా తగ్గలేదు. అందుకు భూపాలపల్లి సభ విజయవంతం కావడమే నిదర్శనం. బిఆర్‌ఎస్‌ సభ సక్సెస్‌ తో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త రెట్టించిన ఉత్సాహం కనిపించింది. పార్టీ మీద కూడా ప్రజలకు మరింత అచంచల విశ్వాసం పెరిగిందనడానికి నిదర్శనం. 

వచ్చే ఎన్నికలలో టిక్కెట్‌ గండ్రకే… 

భూపాలపల్లిలో జరిగిన సభతో ఒక విషయం మాత్రం స్పష్టమైంది. అడుగడుగునా మంత్రి కేటిఆర్‌ ఎమ్మెల్యేకు ఇచ్చిన ప్రాధాన్యతలోనే రమణారెడ్డికి పార్టీ ఇస్తున్న ప్రాధాన్యత ఎంతో అర్థమైంది. ప్రతి సందర్భంలోనూ మంత్రి కేటిఆర్‌ ప్రజలకు రమణారెడ్డి నాయకత్వ గొప్ప తనం గురించి వివరించే ప్రయత్నం చేశారు. రమణారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంత శ్రమిస్తారనేది కూడా ప్రజలకు మరింత తెలిసేలా చేశారు. ఇంతటి ప్రాధాన్యమనేది అందరికీ దక్కేది కాదు. ఇలాంటి సభలు తెలంగాణలో పెద్దగా ఏర్పాటు చేసినవి కావు. కానీ ప్రత్యేకంగా రమణారెడ్డి మీద వున్న నమ్మకం, ఆయన నాయకత్వంలో అటు పార్టీకి, ఇటు ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని కేటిఆర్‌ కు పూర్తి స్థాయిలో అర్థమైంది. ఒకనాడు ఆయన మనసులోని ఆలోచన తెలుసుకున్న కేటిఆర్‌, ఇప్పుడు రమణారెడ్డి లోని నాయకత్వ దృక్పథం ఎంత విలువైందో తెలిసింది. అందుకే కేటిఆర్‌ ఇంత ప్రాధాన్యత కల్పించారనేది స్పష్టమైంది. అంతే కాకుండా వచ్చే ఎన్నికలలో టిక్కెట్‌ కూడా రమణారెడ్డి కే అన్న పరోక్ష సంకేతాలు కూడా పంపినట్లైంది

గండ్ర మీద ప్రజలకున్న ప్రేమకు సంకేతం…

తెలంగాణలో భూపాలపల్లి అనేది మారుమూల ప్రాంతం. అందులోనూ కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రం. ఆ జిల్లాలో ఒక బ్రహ్మాండమైన సభ జరపడం అన్నది ఎంతో సాహసంతో కూడుకున్న పని. ఏ మాత్రం తేడావచ్చినా నాయకత్వం మీద వున్న నమ్మకం తలకిందులౌతుంది. రమణారెడ్డికి ప్రజల మీద వున్న విశ్వాసం… ప్రజలకు రమణారెడ్డి అంటే వున్న నమ్మకం మీదనే సభ జరిగింది. సక్సెస్‌ అయ్యింది. పార్టికి మరింత జోష్‌ వచ్చింది. బిఆర్‌ఎస్‌ కు తిగులేదని మరోసారి తరలిపోయింది. 

నేటిధాత్రి చెప్పేదే నిజం…గత అనుభవాలే అందుకు సాక్ష్యం. 

ఈ విషయం నేటిధాత్రి ఎప్పటి నుంచో చెబుతోంది. తెలంగాణలో గెలిచే నియోజకవర్గాలు ఏవో, నాయకత్వాలు బలంగా ఎక్కడ వున్నాయో, తిరుగులేని నాయకులు ఎవరో ఇప్పటికే అనేక సర్వేలు నిర్విస్తూ వస్తోంది. భూపాలపల్లి విషయంలో కూడా బిఆర్‌ఎస్‌ ఎంత బలంగా వుందో కూడా చెబుతూనే వస్తోంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ముందు నేటిధాత్రి చెప్పిందే నిజమైంది. మునుగోడు అభ్యర్థి విషయంలో నేటిధాత్రి చెప్పిందే ఫైనల్‌ అయ్యింది. తెలంగాణలో నియోజకవర్గాలలో బిఆర్‌ఎస్‌ బలబలాలపై కూడా ఇప్పటికే పలు మార్లు రిపోర్ట్‌ కూడా ప్రచురించడం జరిగింది. అందులో భూపాలపల్లిలో రాజకీయం ఏం నడుస్తుందో కూడా నేటిధాత్రి చెప్పింది. గండ్ర వెంకట రమణారెడ్డి కే పెద్ద పీఠ అన్నది ఎప్పటి నుంచో నేటిధాత్రి చెబుతూనే వస్తోంది. అదే ఇప్పుడు నిజమైంది. కేటిఆర్‌ కూడా సభలో ఇదే విషయాన్ని కొంత బహిరంగంగా, మరి కొంత నర్మగర్భంగా చెప్పాల్సిన విషయమైతే చెప్పాడు. అర్థమైన వాళ్లు అర్థమైనంతగా వివరంగానే తన అభిప్రాయం వెల్లడిరచారు. ఒక రకంగా వచ్చే ఎన్నికలలో రమణారెడ్డి కే టిక్కెట్‌ అన్నది తేల్చేశారు. తగాదాలు వద్దని చెప్పేశాడు. పేచీలకు తావు లేదని స్పష్టం చేశాడు. 

రెండు దశాబ్దాలుగా గండ్రది తిరుగులేని నాయకత్వం…రెండు సార్లు ఎమ్మెల్యే…ఒకసారి ఎమ్మెల్సీ…

ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌. ప్రగతిలో భూపాలపల్లి ప్రత్యేకం…ఆనాడైనా, ఈనాడైనా అభివృద్ధికి కట్టుబడి వున్న నాయకుడు రమణారెడ్డి. ప్రజలతో మమేకమై.. ప్రజల కోసమే అంకితమై…పని చేయడం మాత్రమే రమణారెడ్డికి తెలుసు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణం… అభివృద్ధికి తార్కాణం అనేది జిల్లా ప్రజలే చెప్పుకుంటున్న మాట. అలుపెరుగని పోరాటం… ప్రజల సంక్షేమం కోసం ఆరాటం. ఆది నుంచి రమణారెడ్డి వ్యక్తిత్వం. నిరంతరం ప్రజల కోసం…నిజమైన సేవా భావానికి నిదర్శనం. అని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ఎప్పుడూ చెప్పుకునే మాట. పార్టీ బలోపేతం కోసం కృషి, నాయకులను కడుపులో పెట్టుకునే చిత్తశుద్ధి. ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా వుండడం రమణారెడ్డి కి తెలుసు. వారి సాధక బాదకాలు పట్టించుకుంటూ కంటికి రెప్పలా చూసుకుంటారు అనే మాట వుంది. పేదలకు ఆప్తుడు…అభాగ్యులకు అన్నార్థుడు. నియోజకవర్గం కోసం నిరంతరం తపించే నాయకుడు.

ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం తపించే ప్రజా సేవకుడు…

తెలంగాణకు చెదపురుగు షర్మిల!

-ప్రశాంతమైన తెలంగాణలో చిచ్చురేపడానికి వచ్చిన చీడ పురుగు.

-చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే రాజకీయాలు తెలంగాణలో చెల్లవు.

-తెలంగాణ శత్రువులకు ఇక్కడ చోటులేదు.

-తెలంగాణను దోచుకున్న వాళ్లకు మాట్లాడే అర్హతలేదు.

-షర్మిల దొంగ దీక్షలు…తెలంగాణ మీద లేని ప్రేమలు, పిచ్చి భ్రమలు ప్రజలకు తెలుసు.

-ఒకనాడు తెలంగాణకు నిలువు, అడ్డం నిలబడిరది వైఎస్‌…

-ఇప్పుడు తెలంగాణలో రాజకీయ ఉనికి కోసం షర్మిల.

-తెలంగాణను తూర్పారపట్టి, ఒట్టిపోయిన ఆవును చేసింది వైఎస్‌.

-అదే తెలంగాణను గంగి గోవును చేసింది కేసిఆర్‌.

-తెలంగాణను ఎండబెట్టింది వైఎస్‌…

-తెలంగాణను సిరుల మాగాణ చేసింది కేసిఆర్‌.

-తెలంగాణ అంటే నిలువెల్ల విషం నింపుకున్నది వైఎస్‌…

నిలువెల్ల గాయాలను మాన్పి, నిత్య వసంతం చేసింది కేసిఆర్‌.

-మా గురించి ప్రశ్నించే అర్హత వుందా?

-తోడ బుట్టిన అన్ననే దూరం పెట్టాడు. 

-ఇంకా ఏ ముఖం పెట్టుకొని వచ్చావు.

-వారసత్వంగా పంచుకోవడానికి రాష్ట్రాలేమైన ఆస్థులా?

-బయ్యారం గనుల కోసమే తెలంగాణలో రాజకీయాలా!

-మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ తో నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు ప్రత్యేక ఇంటర్యూ..

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

నేకొక గిరిజనబిడ్డను…ఉన్నత విద్యావంతుడను. ఉన్నతమైన ఆశయాలుకల్గిన వ్యక్తిని. సమాజంలో అట్టుడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న సామాజిక వేత్తను. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుడిని. రెండు సార్లు ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిదిని. మహబూబాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్న ఎమ్మెల్యేను. నేను చేసిన అభివృద్ధిని, దాని నమూనాను ప్రజల ముందు వుంచిన ప్రజా నాయకుడిని. అలాంటి నాపై ఆరోపణలు చేసి, నోరుంది కదా? అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, రాజకీయాల కోసం బురద జల్లిపోతా? అంటూ ఊరుకోవాలా? మర్యాద, మన్నన లేకుండా కుసంస్కారవంతమైన భాషను ఉపయోగించి, నన్ను మరో రకంగా సంబోధిస్తూ, నా నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి ప్రేలాపణలు చేస్తుంటే నవ్వుతూ చూస్తుండాలా? ఇదేనా షర్మిల నేర్చుకున్న సంస్కారం? రాజకీయాల పేరుతో యాత్రను నిర్వహిస్తూ నియోజకవర్గాలలో పర్యటిస్తూ, రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తుంటే విని సంబరపడమంటారా? షర్మిల ఎంతైనా మాట్లాడొచ్చా? అదే తెలంగాణ నాయకులు మాట్లాడితే తాను మహిళను అన్నది గుర్తుకొస్తందా? దేశంలో ఏ మహిళా నాయకురాలైనా షర్మిల మాట్లాడినట్లు మాట్లాడుతున్నారా? ఇంత దిజగారి వ్యాఖ్యలు చేస్తున్నారా? కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడడం ఎక్కడైనా చూశామా? దొంగే..దొంగ అన్నట్లు 2004 ఎన్నికల ముందు ఎన్నికల్లో పోటీ చేసేందుకు డబ్బులు లేక, ఇంటిని అమ్ముకున్న రాజశేఖరెడ్డి ఐదేళ్లలో లక్ష కోట్లు సంపాదించినట్లు ఆరోపణలు ప్రజలు మర్చిపోయారా? ఆ రోజుల్లో విమర్శల పాలైంది ఎవరు? జైలు పాలైంది ఎవరు? ఎందుకు కేసులు ఎదుర్కొన్నారు? ఇవన్నీ మాట్లాడాలంటే మాకు మాటలు రావా? మేం మాట్లాడలేమా? మహబూబాబాద్‌ చూపిన రుచి మర్చిపోరాయా? ఇప్పటి వరకు నా రాజకీయ జీవితంలో ఎక్కడా నా కుటుంబం మీద ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. అలాంటిది నా సతీమణి గురించి మాట్లాడడాన్ని కూడా సహించమంటారా? ఒక మహిళ సాటి మహిళ గురించి మాట్లాడాల్సిన మాటలేనా? నేనూ మాట్లాడగలను? కాని నాకు సంస్కారం అడ్డొస్తోంది? అయినా రాజకీయాలు చేయాలనుకుంటే రాజకీయంగా మాట్లాడాలి. అంతే గాని వ్యక్తిగత విమర్శలు..దూషణలు…వేలం వెర్రి మాటలు..పిచ్చి కూతలు కూస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? ఇంకోసారి షర్మిల నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వినిపిస్తే సహించే ప్రసక్తే లేదు. ఇంత కాలం ఆమెను పట్టించుకున్న వారే తెలంగాణలో లేరు. బిఆర్‌ఎస్‌ అసలే పట్టించుకోలేదు. దాంతో ఎలాగైనా వివాదాలను సృష్టించి మీడియాలో హల్‌ చల్‌ చేస్తేచాలు..అదే రాజకీయం అనుకునే భ్రమల్లో షర్మిల వుంది. అందుకే ఇలాంటి కూతలు కూస్తోందని అంటున్న మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌తో నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావు ప్రత్యేక ఇంటర్వూ…ఆయన మాటల్లోనే…!

అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి, రాజకీయ అవసరాలకోసం ఎంతకైనా దిగజారే తనం..ఇదంతా షర్మిల కుటుంబానికి చెందిన అనుభవం.

అందరూ అలాగే వుంటారని అనుకుంటే పొరపాటు. 2004 ఎన్నికల ముందుకు ఎలాగైనా తెలంగాణ సీట్లు ఎక్కువ గెలిస్తే తప్ప అధికారంలోకి రాలేమని, జై తెలంగాణ అని అంటే తప్ప తెలంగాణలో ఓట్లు రావని తెలిసి, బిఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకొని అధికారంలోకి వచ్చి మోసం చేసింది వైఎస్‌. బిఆర్‌ఎస్‌తొ పొత్తు పెట్టుకొని తెలంగాణలో గెలిచిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తెలంగాణ వాదమే లేదని నిరూపించే ప్రయత్నం చేసి నమ్మక ద్రోహి వైఎస్‌. రాజశేఖరరెడ్డి. తెలంగాణభూములను తెగనమ్మి, తెలంగాణలో అభివృద్ధిని కుంటుపర్చి, ఆంధ్రకు నిధులను తరలించి దుర్మార్గుడు. తెలంగాణను ఎండబెట్టి, పోతిరెడ్డి పాడుకు పొక్క పెట్టి, నీళ్లను రాయలసీమకు తరలించి, తెలంగాణ రైతాంగం గోస పుచ్చుకున్న వ్యక్తి వైఎస్‌. తన జీవితంలో ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా రాజకీయాలు చేసి, తన స్వార్ధం కోసం తెలంగాణను ఉపయోగించుకొని ఐదేళ్లలో లక్ష కోట్లు సంపాదించాడన్న అపవాదు ఎదుర్కొన్న నాయకుడు వైఎస్‌. ఆనాడు 2004లో ఏ వామపక్షాలతో ఆయన జతకట్టాడో వారిని కూడా నిండా ముంచి, వారి చేతే లక్ష కోట్లు దోచుకున్న వైఎస్‌ అన్న అపవాదును మోసిన నాయకుడు వైఎస్‌. ఇదీ ఆయన చరిత్ర. నీచ రాజకీయం. నూరు గొడ్లను తిన్న రాబందు నీతులు వల్లించినట్లు ఇప్పుడు తగుదునమ్మా! అని తెలంగాణ గురించి షర్మిల మాట్లాడడం విడ్డూరం. తెలంగాణ అంటే ఏమిటో తెలియదు. దాని త్యాగం తెలియదు. తెలంగాణ గోస తెలియదు. తెలంగాణ సంస్కృతి తెలియదు. తెలంగాణ బోనం తెలియదు. తెలంగాణ బతుకమ్మ తెలియదు. బోనం నెత్తినపెట్టబోతే, బొట్టు పెట్టబోతే తెలంగాణ మహిళలపై గుడ్లు పద్దవి చేసుకొని చూసిన షర్మిలనా తెలంగాణ ప్రజలకు మేలు చేసేది…తెలంగాణలో రాజకీయాలు చేసేది…చెప్పుకోవడానికి కొంచెమైనా ఇంగితం వుండాలి! 

  మహబూబాబాద్‌ లాంటి వెనుకబడిన ప్రాంతాన్ని మరింత వెనుకబాటుకు గురి చేసిందే వైఎస్‌. 

అలాంటి ప్రాంతాన్ని ఇప్పుడు సస్యశ్యామలం చేసిందే ముఖ్యమంత్రి కేసిఆర్‌. ఎమ్మెల్యేగా నేను..అంతే కాని ఉమ్మడి రాష్ట్రంలో మహబూబాబాద్‌ పరిస్ధితి ఏమిటో ప్రజలకు తెలుసు. అమ్మ పుట్టిల్లు గురించి మేన మామ ముందు గొప్పలు చెప్పినట్లు…మహబూబాబాద్‌ గురించి షర్మిలకు తెలిందల్లా ఒక్క బయ్యారం గనులు…! మాత్రమే..ఇప్పుడు ఆమే చేసే రిజకీయమంతా అందుకే!! తెలంగాణ ఉద్యమ కాలంలో జై తెలంగాణ అన్న ఎంతో మంది ఉద్యోగులను వేధించింది ఎవరో కాదు…షర్మిల తండ్రి వైఎస్‌. ఉద్యోగులను పీడిరచింది…జై తెలంగాణ అనకుండా దారిలోకి తెచ్చుకునేందుకు ఏసిబితో దాడులు చేయించి, ఎంతో మంది ఉద్యోగులను కేసుల్లో ఇరికించిన చరిత్ర వైఎస్‌ది.

నేను తెలంగాణ వాదిగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తుండడాన్ని జీర్ణించుకోలేక, ఉద్యోగ వేధింపులను కూడా భరించాను. చివరికి ఉద్యోగం కూడా వదులుకొని తెలంగాణ కోసం ఉద్యమించాను. ఇదీ నా చరిత్ర. పిల్ల బిత్తరులంతా వచ్చి, పిచ్చి పిచ్చి ప్రేళాపణలు చేస్తే, నా ఉద్యమ చరిత్రకు చెదలు పడుతుందా? ఇరవైఏ ళ్లకిందనే లక్ష కోట్లు దోచుకున్న దొంగల కుటుంబం అని ఆరోపణలు ఎదుర్కొన్న వైఎస్‌ కూతురు షర్మిల తెలంగాణ నాయకుల మీద లేని పోని అవినీతి ఆరోపణలు చేస్తే ప్రజలు క్షమించరు. అంతదాకా ఎందుకు ఆమె మహబూబాబాద్‌లో మాట్లాడుతన్న సందర్భంలో ప్రజలనుంచి ఎలాంటి సందన కనిపించలేదు. ఒకటికి రెండుసార్లు ప్రజలు అడిగినా ఎవరూ చప్పుడు చేయలేదు. ఆ వీడియాలను స్పష్టంగా చూస్తే నన్ను విమర్శిస్తున్న సందర్భంలో ప్రజలు ఆక్రోశంగా చూశారే…! ఆమె మాటాలకు స్పందిచలేదు. ఇది ఆమె గమనించింది. అందుకే ఇక నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిరది. 

తెలంగాణ అనే పదాన్నే మాట్లాడేందుకు ఇష్టపడని ఆ కుటంబం చేసింది ఏమిటో మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌ రాళ్లకు తెలుసు. 

ఇప్పటికీ తెలంగాణ వాదులు ఆ రాళ్లకు పూజలు చేయడం తెలుసు. అలాంటి మహబూబాబాద్‌లో తనపై షర్మిల పిచ్చాసుపత్రిని నుంచి వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు పట్టించుకుంటారా? ఆనాడు ఆమె తండ్రి తెలంగాణను దోచుకున్నాడు. ఇప్పుడు తెలంగాణ ప్రజల విరాళాలతో పార్టీ నడుపుతోంది. పూట గడుపుకుంటోంది. ఇంతకన్నా సాక్ష్యం మరొకటి అవసరం లేదు. తెలంగాణ మీద పడి దోచుకోవడానికి అలవాటు పడిన ప్రాణం ఊరుకోలేకపోతుంది. అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చినా వారి ఆశలు చావడం లేదు. దోచుకోవడం ఆగిపోవడం జీర్ణం కావడం లేదు. షర్మిల తెలంగాణ వాది కాదు..తెలంగాణ కోసం కొట్లాడిరది లేదు. తెలంగాణకు మేలు చేసే పని ఏనాడు చేసింది లేదు. మరి ఇప్పుడు తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసుకోవడానికి అసవరమైన నిధులు ఎక్కడివి? అంత సంపాదన ఎక్కడిది? ముందు ఈ సంగతి చెప్పాలి. చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకునేందు, కాలం కలిసొస్తే, చేజారిపోయిన బయ్యారం కలలు నిజం చేసుకునేందుకు తప్ప తెలంగాణ మీద ప్రేమ కాదు….ఆమె కు తెలంగాణకు సంబంధం లేదు…తెలంగాన అనే పదమే ఒక ఉద్యమ కణిక…ఎన్నేళ్లైనా దాని సెగ తగ్గేది కాదు…దోచుకునేవారికి ఇక్కడ చోటు లేదు…ప్రజలు కూడా ఇవ్వరు…! షర్మిల భ్రమల్లో బతకడం మానుకుంటే చాలు!! పిచ్చి వాగుడు వాగినందుకు తెలంగాణ ప్రజలకు ముందు క్షమాపణ చెప్పు!!!

జిల్లాలో కంటి వెలుగును సద్వినియోగం చేసుకుంటున్న ప్రజలు.

ఏం డోకా లేదు ఇలలోని అందాలను మేము చూడగలం… పేదల కళ్ళలో అద్దాలు ఒక వరం జిల్లాలో 20 బృందాలతో కంటి పరీక్ష లు కంటి వెలుగు కార్యక్రమము తో దురమౌతున్న కంటి సమస్యలు.

జిల్లాలో కంటి వెలుగును సద్వినియోగం చేసుకుంటున్న ప్రజలు.కంటి వెలుగుపై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్న జిల్లా కలెక్టర్ 

యస్. క్రిష్ణ ఆదిత్య. 

ములుగు జిల్లా నేటిధాత్రి

 

అద్దాలు పొందిన వారి మాటల్లో ఆనందం చుక్కల మందులు ఇచ్చిండ్రు అద్దాలు ఇచ్చిండ్రు.

పెద్దల రమ వృత్తి కూలి , భర్త సాంబయ్య, శ్రీనివాస కాలనీ, ములుగు.

నా పేరు పెద్దల రమ నాకు ముగ్గురు అమ్మాయిలే కొడుకులు లేరు పెద్ద బిడ్డ బీటెక్ చదువుతుంది. ఇద్దరు బిడ్డలు తాడువాయి లో ఇంటర్ చదువుతున్నారు. దగ్గర చూపు కనపడకపోయేది కంటి వెలుగు వల్ల కంటి పరీక్షలు చేయించుకుంటే ఉచితంగా చుక్కల మందులు ఇచ్చిండ్రు అద్దాలు ఇచ్చిండ్రు అద్దాలు మంచిగా కనబడుతున్నాయి. అద్దాలు పెట్టుకుంటే సూదిల దారం పెడుతున్న… ఈ కంటి వెలుగు మంచిగ అనిపించింది.

 

ఉచితంగా కంటి అద్దాలు ఇచ్చారు గొల్లపల్లి స్వామి వృత్తి కూలీ

 

నేను బార్దన్ షాపులో పనిచేస్తా మా ఊరు బండారుపల్లి నాకు దగ్గర చూపు కనబడకపోయేది. ఇక్కడ కంటి వెలుగు పథకంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి అద్దాలు కూడా ఇస్తున్నారని చెప్పడంతో ఇక్కడికి వచ్చా. డాక్టర్లు కంటి పరీక్షలు చేసి, దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించి ఉచితంగా కళ్లద్దాలు ఇవ్వడంతో గతంలో కంటే ఇపుడు చూపు స్పష్టంగా కనిపిస్తున్నది.

 

ప్రభుత్వం మంచి కార్యక్రమం చేపట్టింది.

అచ్చ సాంబయ్య, తండ్రి లక్ష్మయ్య, బంజారా కాలనీ, ములుగు.

 

ప్రభుత్వం మంచి కార్యక్రమం చేపట్టింది ఉచితంగా కంటి పరీక్షలు చేసి అద్దాలు ఇవ్వడం చాలా సంతోషం. ప్రైవేటు దవఖానాలో ఐతే శానా పైసలు అయితుండే ఈ కంటి వెలుగు లో మందులు అద్దాలు ఉచితంగా ఇచ్చిండ్రు.

 

 శేష్మ అచ్ఛా దిక్రా. మేరా నామ్ హశ్మత్, 53 వయసు గడిగడ్డ, ములుగు.

 

శేష్మ అచ్ఛా దిక్రా నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు వాళ్ళ పెళ్లిళ్లు అయిపోయినాయి. నా భార్త చనిపోయాడు. నాకు కంటి సమస్య కొద్ది నెలల నుండి ఉంది. ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకోవడానికి డబ్బులు లేక చుపించుకోలేదు. కంటి వెలుగు కార్యక్రమము ప్రభుత్వం చేపట్టినదని చెప్పిడ్రు. ఉచితంగా మందులు ఇచ్చిండ్రు, అద్దాలు ఇచ్చిండ్రు. ఈ సర్కారు చల్లగా ఉండాలే. ఈ పథకంతో మాలాంటి పేదలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.

 

కంటి వెలుగు సూపర్ కే. శ్రీనివాస్, వయసు 46 దేవగిరిపట్నం.

 

కంటి వెలుగు సూపర్ నాకు పేపర్ చదువుతుంటే దగ్గర చూపు ఇబ్బందిగా ఉండేది. కంటి వెలుగులో కంటి పరీక్షలు చేయించుకుంటే ఉచితంగా అద్దాలు ఇచ్చిండ్రు ఇప్పుడు సూపర్ గా కనబడుతున్నాయి. కేసీఆర్ పెట్టిన కంటి వెలుగు పథకంతో కొత్తచూపు వచ్చినట్లు ఉంది. ఇంకా ఇలాంటి పథకాలు కెసిఆర్ సారు మరెన్నో చేపట్టాలి.

 

 కంటి వెలుగు గిట్లనే కొనసాగించాలే హైమావతి వయసు 45 గొల్లవాడ ములుగు

 

నాకు కంటి వెలుగు కొత్త చూపునిస్తోంది. రూపాయి ఖర్చు లేకుండా కంటి పరీక్షలు చేసి మందులు, కళ్లద్దాలు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. కేసిఆర్ సారు కంటి వెలుగు గిట్లనే కొనసాగించాలే.

 

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో దశ కంటి వెలుగు కార్యక్రమంలో ములుగు జిల్లా ప్రజలమాట ఇక ఏం డోకా లేదు కంటి దగ్గర చూపు.. దూరం చూపు… ఇబ్బందిగా ఉండే మాకు కంటి అద్దాలు కంటి వెలుగులో ఇచ్చినవి. పెట్టుకుంటే అంత మంచిగా కనబడుతున్నాయని అంటున్నారు స్వరాష్ట్ర ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా, వారి కళ్లలో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని జనవరి 19 నుంచి జూన్ 15 వరకు 100 రోజుల కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య పర్యవేక్షణలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పలు శాఖల అధికారులతో సంయుక్తంగా కలిసి శిబిరాల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించి పకడ్బందీగా అమలు చేస్తున్నారు. జిల్లాలోని 9 మండలాలలో 174 గ్రామపంచాయతీలలో 3,30,031 జనాభా ఉండగా అందులో 18 సంవత్సరాలు పై బడిన జనాభా 2,08,000 మంది ఉన్నారు. వీరందరికి కంటి పరీక్షలు నిర్వహించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలోని 15 పిహెచ్ సి లలో, 20 బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన కంటి వెలుగు పరీక్షల శిబిరాలలో 68059 మందికి పరీక్షలు నిర్వహించారు. కంటి పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో అవసరం ఉన్న 9312 మందికి అక్కడిక్కడే రీడింగ్‌ గ్లాస్ లను సైతం అధికారులు అందించారు. ప్రత్యేక అద్దాలు అవసరం ఉన్న మరో 6155 మందికి అద్దాలను అందించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ప్రతిపాదనలు పంపగా దానిలో నుంచి 1392 ప్రత్యేక అద్దాలను ములుగు వైద్య ఆరోగ్య శాఖకు పంపించారు. దీనిలో 661 ప్రత్యేక అద్దాలను అవసరం ఉన్న వారికి అందించారు. కంటి వెలుగు శిబిరాలలో పరీక్షలు చేయించుకుంటున్న ప్రజలకు అద్దాలతో పాటు ఎదురవుతున్న కంటికి సంబంధించి చిన్న చిన్న సమస్యలకు మందులతో పాటు కంటిలో వేసుకోడానికి చుక్కల మందులను సైతం పంపిణీ చేస్తున్నారు.

 

కంటి వెలుగుపై కలెక్టర్ ప్రత్యేక శ్రద్ద.

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగును విజయవంతం చేసేందుకు ములుగు జిల్లా కలెక్టర్‌ ఎస్. క్రిష్ణ ఆదిత్య జిల్లాలో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ జిల్లా వైద్యాధికారితో పాటు ఇతర శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులతో కంటి వెలుగు శిబిరాలను తనిఖీలు చేపడుతూ శిబిరాల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, వైద్య ఆరోగ్యశాఖతో పాటు అన్ని శాఖల అధికారులు పూర్తిస్థాయిలో కంటి వెలుగు నిర్వహణలో భాగస్వాములై కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు.జిల్లాలో వేగవంతంగా కంటి పరీక్షలు.ప్రజల కంటి సమస్యలను తీర్చేందుకు చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లాలో ప్రజలు కంటి పరీక్షలకు వేగవంతంగా హజరవుతున్నారు. పీహెచ్‌సీ పరిధిలోని గ్రామాల్లో ప్రత్యేకంగా షెడ్యూల్‌ను రూపొందించుకొని జీపీ కార్యాలయాల్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రజలకు సోమవారం నుంచి శుక్రవారం వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య శిబిరాలకు విశేష స్పందన జిల్లాలో అత్యధికంగా దగ్గరిచూపు కనిపించక ఇబ్బందిపడే వారే అధికంగా ఉన్నట్లు శిబిరాలలో నమోదవుతున్న లెక్కలు చెబుతున్నాయి. 40 ఏళ్ల వయస్సు పైబడిన చాలామందికి దగ్గర చూపు కనిపించడం లేదని శిబిరానికి వస్తున్నారు. ఇలాంటి వారికి తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించి, రీడింగ్ గ్లాసెస్ అందజేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version