నూతన వధూవరులను ఆశీర్వదించిన..

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండలం రామకృష్ణాపూర్ గ్రామంలో సంతోష్ – రచన వివాహం ఇటీవల జరుగగా నూతన వధూవరులను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ జక్కుల ముత్తయ్య బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు

మంథని అసెంబ్లీ ఇంచార్జ్ సునీల్ రెడ్డి పిలుపు..

మేధావులారా.. ఉపాధ్యాయులారా
ఆలోచించండి..ఆదరించండి..

ఎమ్మెల్సీ ఓటర్లకు పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు ,మంథని అసెంబ్లీ ఇంచార్జ్ చంద్రుపట్ల సునీల్ రెడ్డి పిలుపు.

మంథని :- నేటి ధాత్రి

మంథని నియోజకవర్గంలో టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్కా కొమురయ్య లకు మద్దతుగా పార్టీ నాయకులతో కలిసి మంథని పట్టణం లో సునీల్ రెడ్డి ఎంఎల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించి అభ్యర్థులకు మీ ప్రాధ్యాన్యత ఓటు వేయాలని పిలుపునిచ్చాడు.నమ్మించి మోసం చేస్తున్న కాంగ్రెస్ కు బుద్ధి రావాలంటే ఈ ఎన్నికల్లో బీజేపీనీ గెలిపించాలి చట్టసభల్లో మీ తరపున ప్రశ్నించే గొంతులు ఉండాలంటే బీజేపీ ఎంఎల్సీ అభ్యర్థులు గెలవాల్సిందే మోసం చేసిన కాంగ్రెస్ కు ఓటుతో గుణపాఠం చెప్పాలని ఈ గెలుపు చాలా కీలకం మేదావులంతా తెలంగాణ భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను వల్ల భవిష్యత్ కోసం బీజేపీ నీ గెలిపించండి అంటూ 317 జీవో కి వ్యతిరేకంగా బిజెపి పోరాటం చేసింది నీరుద్యోగ సమస్యలపై బిజెపి చేసినా పోరాటాలను ఓటర్లు గమనించాలని అన్నారు
ఆదిశగా మేధవులంతా.. ఆలోచిస్తారని.. పార్టీ అభ్యర్థులను ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాము రాబోయే రోజుల్లో బీజేపీ గెలుపు తధ్యం ఓటర్లుఅంతా మీ మొదటి ప్రాధాన్యత ఓటును అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్య లకు వేసి మద్దతు తెలపాలని కోరారు ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు చల్ల నారాయణ రెడ్డి ,బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి మంథని అసెంబ్లీ ఎంఎల్సీ ఎన్నికల ప్రభారీ నీలకంఠం పాండు ,ఎంఎల్సీ అసెంబ్లీ కన్వీనర్ బిరుదు గట్టయ్య ,అసెంబ్లీ కో కన్వీనర్ నాంపల్లి రమేష్ ,మంథని పట్టణ ,మండల అధ్యక్షులు సంతోష్ ,రాజేందర్,జిల్లా కౌన్సిల్ సభ్యులు బోగోజు శ్రీనివాస్ ,మంథని మాజీ పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదాశివ్ ,కామన్పూర్ మండల ఇంచార్జి చిలువేరి సతీష్ సీనియర్ నాయకులు సామల అశోక్ ,నరమళ్ల కృష్ణ,లక్ష్మణ్, ఎడ్ల సాగర్ ,శ్రవణ్ ,సత్యం,అయింటి మల్లేష్ ,మహేష్ ,కార్యకర్తలు పాల్గొన్నారు.

జి సి సి, వైస్ చైర్మన్ గా బుచ్చక్క ఖరారు అయినట్టే.?

జి సి సి, వైస్ చైర్మన్ గా బుచ్చక్క ఖరారు అయినట్టే.?

ఆదివాసి గిరిజన బిడ్డల నాయకురాలుగా సేవలు ఎన్నో.

గిరిజన ఆదివాసి గ్రామాలకు అభివృద్ధిని నోచుకునేలా చేసింది బుచ్చక్క.

నలుగురు జిసిసి డైరెక్టర్లు బుచక్క కు మద్దతుగా.!?

ప్రశ్నించకుండా అమాయక వైస్ చైర్మన్ కొరకు డైరెక్టర్లను ఒక అధికారి పోగు చేస్తున్నట్లు సమాచారం.!?.

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

vice chairman

గిరిజన సహకార సంస్థ జి సి సి డైరెక్టర్ల ఎన్నికలు పూర్తి కావడం జరిగింది. జిసిసి పరిధిలోని ఐదు మండలాలకు సంబంధించిన గిరిజన ఆదివాసి సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకొని డైరెక్టర్లను ఎన్నుకోవడం జరిగింది. జిసిసి మహదేవ్పూర్ పరిధిలో ఐదు మండలాలకు ఐదుగురు డైరెక్టర్లను ఎన్నుకోవడం జరిగింది. వాటిలో మహిళా రిజర్వేషన్ యునాని మాస్ గా ఇద్దరు మహిళలు డైరెక్టర్లుగా నియమితులు కాక సోమవారం రోజున ముగ్గురు డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఎన్నికల్లో ఏడుగురు సభ్యులు డైరెక్టర్లకు పోటీ చేయగా, మహాదేవపూర్ నుండి ఒక డైరెక్టర్, మహా ముత్తారం మండలం నుండి ఇద్దరు డైరెక్టర్లు గెలుపొందడం జరిగింది. గిరిజన సహకార సంస్థ వైస్ చైర్మన్ గా డైరెక్టర్లు ఎన్నుకొనుటకు పొన్నగాలు ప్రారంభం కావడం జరిగింది. జిసిసి వైస్ చైర్మన్ నియామకం ప్రస్తుతం ఒక ట్రెండ్ గా మారింది. ఇతర ఎన్నికల విధంగా జిసిసి వైస్ చైర్మన్ పదవి కొరకు గెలుపొందిన డైరెక్టర్ లతోపాటు జిసిసి ఓ అధికారి కూడా తమ కనుసైగల్లో ఉండే వైస్ చైర్మన్ కొరకు పావులు కలుపుతున్నట్లు విశ్వనీయ సమాచారం.

—————–

గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో 5 మండలాలకు సంబంధించిన ఆదివాసి గిరిజన కుటుంబాలకు ఎంతో అండగా ఉండి వారికి విద్యా ఉపాధి పై ప్రత్యేక దృష్టి సాధించి అటవీ ఉత్పత్తుల కొనుగోలు అటవీ ఉత్పత్తుల కొరకు ప్రోత్సాహం, ఇలాంటి మరెన్నో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల నిధుల నుండి ఆదివాసి గిరిజన కుటుంబాలకు అండగా ఉంటుంది. ప్రస్తుతం జిసిసి అనేక సంవత్సరాలుగా వైస్ చైర్మన్ ఎన్నికైనప్పటికీ ఆదివాసి గిరిజనులు ట్రైబల్ కుటుంబాలకు, వైస్ చైర్మన్ యొక్క ఉపయోగం విధులు తెలువకపోవడంతో ఆదివాసి గిరిజన కుటుంబాలు అభివృద్ధికి నోచుకోలేదని ప్రస్తుతం గిరిజనులు చెప్పుకుంటున్న విషయం. ఇదే క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిసిసి నిధులు అందించి ఉపాధి విద్య తోపాటు ప్రత్యేకంగా మహాదేవపూర్ మండలంలో పెట్రోల్ బంక్ తో పాటు స్వయం సహాయక యూనిట్లను మంజూరు చేయడం, ఇప్పటికే కొందరు విద్యావంతులుగా ఉన్న ఆదివాసి గిరిజనులు, పథకాలను పొంది ఉపాధి పొందడం జరుగుతుంది.

—————–

ఐదు మండలాలకు సంబంధించిన గిరిజన సహకార సంస్థ డైరెక్టర్ల ఎన్నికల్లో మాజీ ఎంపీపీ పలిమెల మండలానికి చెందిన కురుసం బుచ్చక్క డైరెక్టర్ గా జినానిమాస్ ఎన్నిక కావడం జరిగింది. పలివెల నూతన మండలం ఏర్పడిన అనంతరం మొట్టమొదటి గిరిజన ఆదివాసి మహిళా ఎంపీపీగా బుచ్చక్క గిరిజన ఆదివాసి గ్రామ ప్రజలకు అనేక అభివృద్ధి పథకాలతో పాటు, ఆదివాసి గిరిజనుల కుటుంబాల్లో చైతన్యం, గిరిజను ఆదివాసి ప్రజల గొంతువై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి కొరకు అనేక నిధులు పథకాలను పలిమెల మండలం తో పాటు ఇతర ఆదివాసి గ్రామాలకు అంతేగా చూసిన ఘనత కూడా కురుసం బుచ్చక్కకు దక్కింది. ఒక ఆదివాసి బిడ్డ అయిన కురుసం బుచ్చక్క అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ లో పదవులు లేకున్నప్పటికీ కూడా ఆదివాసి గిరిజనుల సమస్యలపై పోరాడటం లో వెనుకడుగు వేయలేదని ఇప్పటికీ పలివెల మండలం తో పాటు నికిత ఆదివాసి గిరిజన ప్రాంతాల్లో చెప్పడం జరుగుతుంది. ఇదే క్రమంలో ప్రస్తుతం జీసీసీ పరిధిలో ఐదు డైరెక్టర్లు ఉండగా నలుగురు డైరెక్టర్లు కురుసం ఉచ్చక్క వైస్ చైర్మన్ నియమించుటకు ముగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.

——————

మరోవైపు గిరిజన సహకార సంస్థ 5 మండలాల పరిధిలో తమ రేషన్ షాపుల నిర్వహణ, హెచ్.పీ గ్యాస్ సప్లై, తోపాటు ఎంఎల్ఎస్ గోడౌన్, ప్రస్తుతం జీసీసీ పరిధిలో ఉంది, మరికొద్ది రోజుల్లో గిరిజన సహకార సంస్థకు పెట్రోల్ బంక్ సైతం కేటాయించడం జరిగింది. ఇలా జిసిసి సంస్థ ఐదు మండలాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ తో పాటు ఇతర ఆదాయ వనరులు సమకూర్చడంలో కాస్త ఎక్కువ మోతాదులో పాత్ర పోషించడంతో, వైస్ చైర్మన్ జిసిసి చేతుల్లో ఉండేలా అమాయకులను వైస్ చైర్మన్ గా నియమిస్తే ప్రశ్నించేవారు ఎవరు ఉండరని జిసిసి ఓ అధికారి భావించి డైరెక్టర్లను తమ వైపు పోగు చేసుకోవడం లో నిమగ్నమై ఉన్నట్లు సమాచారం. కానీ ప్రస్తుతం జీసీసీ వైస్ చైర్మన్ ఎన్నిక గతంలో సాధారణ సొసైటీ ఎన్నికలు కాకుండా గిరిజన సహకార సంస్థ 5 మండలాల్లో తన పాత్ర క్రియేషీలక పోషించడంతో గిరిజన్
నుల్లో కూడా చైతన్యం కలగడంతో ప్రస్తుతం వైస్ చైర్మన్ రాజకీయంగా, విద్యావంతులుగా, సమాజ సేవ అనుభవం ఉన్న వారిని వైస్ చైర్మన్ గా ఎన్నుకొనుటకు గిరిజనులు ఆదివాసీల కోరిక, వీటిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికైన డైరెక్టర్లు మాజీ ఎంపీపీ కురుసం బుచ్చక్క వైపు మొగ్గు చూపడం జరుగుతుందని ప్రస్తుతం మహదేవపూర్ పలివెల మండలంలో హాట్ టాపిక్ గా నడుస్తుంది.

ఎమ్మెల్యే రేవూరికి అభినయ్ వివాహ ఆహ్వాన పత్రిక…

ఎమ్మెల్యే రేవూరికి అభినయ్ వివాహ ఆహ్వాన పత్రిక

పరకాల నేటిధాత్రి
మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు మాజీ కౌన్సిలర్ మార్క ఉమా రఘుపతి గౌడ్ ల కుమారుడు ఎన్ఎస్యుఐ జాతీయ కోఆర్డినేటర్ మార్క అభినయ్ వివాహ మహోత్సవ కార్యక్రమానికి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డికి పెండ్లి శుభలేఖ అందజేశారు.ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు పరకాల మున్సిపల్ మాజీ చైర్మన్ సోదా రామకృష్ణ,ఏఎంసీ చైర్మన్ చందుపట్లరాజిరెడ్డి,కుంకుమేశ్వర ఆలయ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు, పరకాల మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్,ఏకు రాజు,నల్లెల్ల జ్యోతి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

రైతన్నలకు మద్దతుగా బిఆర్ఎస్ నేతలు…

రైతన్నలకు మద్దతుగా బిఆర్ఎస్ నేతలు

కాంగ్రెస్ ప్రభుత్వంను గద్దె దించడానికి సిద్ధంగా ఉన్న రైతులు

రైతన్నకు మద్దతు ధర ఇవ్వకుండా, రైతన్న కడుపు కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంను, అదే రైతన్నలు గద్దే దించడానికి సిద్ధంగా ఉన్నారు.
* మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.*

వరంగల్, ఎనుమాముల నేటిధాత్రి

 

 

BRS leaders

ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన ఎనుమాముల మార్కెట్ ను సందర్శించిన బి ఆర్ ఎస్ నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి పంట ధరలు పడిపోయి ఆందోళన చెందుతున్న రైతన్నలకు సంఘీభవంగా బిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే లు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ లు కలిసి ఏనుమముల మార్కెట్ ను సందర్శించి రైతన్నల కష్టాలను మద్దతు ధర లేక వాళ్లు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతు.. రైతన్నలకు కనీస మద్దతు ధర లేక పెట్టిన పెట్టుబడి రాక ఈ రోజు రైతన్నలు రోడ్డున పడి ఆగమవుతున్నారు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ధర కూడా ఇవ్వకుండా రైతన్నల పొట్టగొడుతున్నారు అని, ఇలా రైతన్నల జీవితాలతో ఆడుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంను తొందరలోనే అదే రైతన్నలు భూస్థాపితం చేస్తారు అని చెప్పారు. రైతన్నలకు మద్దతు ధర ఇవ్వడంలో కాని, ఎరువుల సప్లై లో కాని, రైతు బీమాలో కాని రైతన్నను కేసీఆర్ చూసుకున్నట్లు ఎవరు చూడట్లేదని, ఆయనను మించిన నాయకుడు ఈ దేశలోనే లేడు అని అన్నారు. స్థానిక జిల్లా మంత్రి కొండా సురేఖ ఈ ఏనుమముల మార్కెట్ లో మద్దతు ధర కాని రైతన్నలు పడుతున్న ఇబ్బందులు మరియు గుమస్తాలు, దడవాయిలు, హమాలీ కార్మికులు పడుతున్న సమస్యలు ఇబ్బందులు ఏమీ కూడా పట్టించుకోవడం లేదు అని అన్నారు. ఇలా మద్దతు ధర ఇవ్వకుండా రైతన్నలను నానా గోసలు పెడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చే వరకు రైతన్న పక్షాన కొట్లాడటానికి మా బిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని నరేందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణ రెడ్డి, వరంగల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, తూర్పు కార్యకర్తలు, రైతన్నలు తదితరులు పాల్గొన్నారు.

BRS leaders

అలీ అద్వర్యంలో జెర్సీ పంపిణి..

మాజీ మైనారిటీ అధక్షులు అలీ అద్వర్యంలో జెర్సీ పంపిణి

ముఖ్య అతిథులుగా హాజరైన ఏఎంసి చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, మండల అధ్యక్షులు కట్కూరు దేవేందర్ రెడ్డి

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణానికి చెందిన మైనారిటీ యువకుల గ్రీన్ టైగెర్స్ క్రికెట్ టీంనకు మాజీ మైనారిటీ అధ్యక్షుడు ఎండి అలీ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,మండల అధ్యక్షలు కట్కూరి దేవేందర్ రెడ్డి అతిధులుగా హాజరై జెర్సీలు పంపిణీ చేయడం జరిగింది.అనంతరం సభ్యులతో పరిచయ కార్యక్రమం చేసుకొని క్రికెట్ జట్టు సభ్యులతో కలిసి ఆడి ఆటను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మల్లక్కపేట మాజీ సర్పంచ్ అల్లం రఘునారాయణ,పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మంద నాగారాజు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గూడెల్లి సదన్ కుమార్,ఉడుత సంపత్,దొమ్మటి దాసు,డాక్టర్ రోహిత్,వెంకటేష్ రాకేష్ లు పాల్గిన్నారు.

తిరుమల కొండను కాపాడుకునే బాధ్యత మాదే..

*తిరుమల కొండను కాపాడుకునే బాధ్యత స్థానికులుగా మొదట మాదే..

కోలా లక్ష్మీపతి

*పవిత్రత ప్రశాంతత పరిరక్షణ ధ్యేయంగా..

*తిరుమల పరిరక్షణ సైన్యం ఏర్పాటు…

*రెవెన్యూ పంచాయతీ అడ్డగోలుగా వ్యవహరిస్తే అడ్డుకుంటాం…

తిరుపతి(నేటి ధాత్రి) 

తిరుమల కొండపై ఇష్టానుసారంగా తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా స్థానికులుగా మేము ఉనికి కోల్పోయి కొండపై పవిత్రత ప్రశాంతత కరువై పరిరక్షణ ప్రమాదకరంగా మారిందని. ఇక్కడ పుట్టి, పెరిగిన స్థానికులుగా తిరుమలను కాపాడుకునే బాధ్యతతో మొదటగా మేము సంఘటితంగా తిరుమల పరిరక్షణ సైన్యం గా ఏర్పడ్డామనీ తిరుమల స్థానికుడు కోలా లక్ష్మీపతి వెల్లడించారు.‌ మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ,
తిరుమల శ్రీవారి ఆలయం అభివృద్ధి కోసం దశాబ్దాల తరబడి కొండపై నివసిస్తున్న స్థానికులైన మేము మా స్థలాలు ఇతరత్రా వాటిని టిటిడి అభివృద్ధి కోసం అప్పగించి, ప్రత్యామ్నాయంగా జీవనోపాధి క్రింద షాపులు, హాకర్ లైసెన్స్ లు బాలాజినగర్ లో ఇండ్లు కేటాయించారు. అప్పటి నుండి కూడా టిటిడి ధర్మకర్తల మండలితో పాటు ఉన్నతాధికారులు అందరూ కూడా తిరుమల స్థానికులకే మొదటి ప్రాధాన్యత ఇచ్చి కొండపై అన్నింటిలోనూ అవకాశాన్ని స్థానికులకే ఉండేలా చేశారు. అటు తర్వాత గత 6 ఏళ్లుగా ఈవిధానానికి స్వస్తి పలికి స్థానికులకు ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా స్థానికేతరులందరికీ రాజకీయ ఒత్తిడిలతో కొండపై పలు విధాలుగా స్థానం కల్పించడంతో స్థానికులైన మేము జీవనోపాధి కోల్పోయి మా ఉనికి ప్రమాదంలో పడింది. పైగా ప్రస్తుత టిటిడి యాజమాన్యం తిరుమల కొండపై స్థానికులకు మాత్రమే అవకాశం కల్పించాలనే నిర్ణయాన్ని పట్టించుకోవడం లేదు. ఫలితంగా టిటిడి రెవెన్యూ, పంచాయితీ విభాగం పూర్తిగా అవినీతిమయమై ఇష్టారాజ్యంగా వందలాది తట్టలు, హాకర్ లైసెన్స్ లు విచ్చలవిడిగా కొండపై వెలిశాయి.
ప్రతినిత్యం ఏదోఒకచోట లైసెన్స్ లు లేకుండానే పంచాయితీ, రెవెన్యూ, విజిలెన్స్, ఆరోగ్యశాఖ విభాగం అధికారులు అనధికారికంగా తట్టలు పెట్టిస్తూనే వున్నారు. ఈవిధంగా వ్యవహరించుకుంటూ పోతే తిరుమలలో స్థానికేతరులు ప్రాబల్యం పెరిగిపోయి అసాంఘిక శక్తుల ప్రమేయంతో ప్రమాదకరమైన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. దీనికి మీరు పూర్తిగా తిరుమల ప్రక్షాళన మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. దీనికి మావంతుగా స్థానికుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది.ఇకపై అనధికారికంగా ఎటువంటి ఆక్రమణలకు పాల్పడినా తిరుమల పరిరక్షణ సైన్యంగా మా ముఖ్య సైనికులు అడ్డుకుంటామని. చట్టపరంగా కూడా చర్యలు తీసుకునేందుకు పూనుకుంటామని కోలా లక్ష్మీపతి వివరించారు.
మరో ముఖ్య సైనికుడు వి కృష్ణ, కే హరిప్రసాద్, వాసుదేవన్ లు మాట్లాడుతూ పాలకమండలి ఉన్నతాధికారులు తిరుమలలో టిటిడి రెవెన్యూ పంచాయతీ విభాగం అవినీతి కారణంగా సంస్థ ఉనికి ప్రమాదకరంలో పడిందని అన్నారు.
దయచేసి ప్రక్షాళన మీరు మొదలు పెడితే మావంతు సహకారం అందించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. తిరుమలలో ఆక్రమణలు అనధికారిక తట్టలపై ఫిర్యాదు చేసినప్పుడల్లా దుకాణాలపై కక్ష తీర్చుకునేలా దాడులు నిర్వహించడం ఇబ్బందులకు గురి చేయడం పంచాయతీ రెవిన్యూ విభాగానికి పరిపాటిగా మారిందన్నారు. ఇకపై కొండపై రాజకీయ ఒత్తిడితో పంచాయతీ రెవిన్యూ విజిలెన్స్ ఆరోగ్య శాఖ ఎవరైనా సరే అనధికారికంగా తట్టలు పెట్టాలని చూస్తే తిరుమల పరిరక్షణ సైన్యం మూకుమ్మడిగా అడ్డుకుంటుందని హెచ్చరించారు. తిరుమల పరిరక్షణ కోసం దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు పోరాటాలు నిర్వహించేందుకు 250 మంది సభ్యులతో ఏర్పడిన తిరుమల పరిరక్షణ సైన్యం 15 మంది ముఖ్య సైనికులతో కార్యాచరణ కు దిగుతుందని వెల్లడించారు.ఈ సమావేశంలో పాల్గొన్న
ముఖ్య సైనికులు ఎమ్.వేలు,కె. ప్రహ్లాద, పి.భాస్కర్, జి.వరప్రసాద్, కె.వెంకటేశ్వర్లు, పొన్నా నాగరాజు పి.త్రిలోక్ కుమార్, ఎం.మణి, ముని నాయుడు,చెంజి సురేష్, ఎం.ఆర్.బాలాజి తదితరులు పాల్గొన్నారు.

గుమ్మడి శ్రీదేవిని సన్మానించిన ఏఐసీసీ మహిళా ప్రెసిడెంట్.

గుమ్మడి శ్రీదేవిని సన్మానించిన ఏఐసీసీ మహిళా ప్రెసిడెంట్.

చిట్యాల నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు భూపాలపల్లి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అయినా గుమ్మడి శ్రీదేవి ని మంగళవారం రోజున హైదరాబాదులోని గాంధీభవన్లో శాలువాతో సన్మానించిన ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబా, ఏఐఎంసి తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఇంచార్జి కమలాక్షి
హైదరాబాద్ గాంధీభవన్ లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు ఆధ్వర్యంలో నిర్వహించిన నారి న్యాయ సమ్మేళన్ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబా హాజరై మాట్లాడుతూ దేశంలోనే లక్షకుపైగా సభ్యత్వలు నమోదు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మహిళా కాంగ్రెస్ అని పేర్కొన్నారు.. తదనంతరం భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా సభ్యత్వలు నమోదు చేసిన సందర్భంగా *మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అయిన గుమ్మడి శ్రీదేవి ని శాలువాతో సన్మానించినారు, పార్టీ కోసం కష్టపడిన వారికి భవిష్యత్తులో చట్టసభలకు అవకాశం కల్పించేలా తన వంతు సహకారం ఉంటుందని ఆమె అన్నారు
కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షురాలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

బహుజన్ సమాజ్ పార్టీ బొమ్మ సురేందర్ గౌడ్ ఎన్నిక.

బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులుగా బొమ్మ సురేందర్ గౌడ్ ఎన్నిక.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం కేంద్రంలో లో మంగళవారం రోజున బహుజన సమాజ్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి బహుజన్ సమాజ్ పార్టీ జయశంకర్ జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షున్ని ఎన్నుకోవడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజులు బహుజనులదే అని అగ్రవర్ణ రాజకీయ పార్టీలను బొందపెట్టాలని మన ఓటు బీఎస్పీకే అని భూపాలపల్లి జిల్లాలో పార్టీ నిర్మాణాన్ని క్షేత్రస్థాయిలో చేపడుతున్నామని పార్టీ నిర్మాణంలో భాగంగా చిట్యాల మండల అధ్యక్షుడిగా బొమ్మ సురేందర్ గౌడ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు ఎన్నికకు సహకరించిన జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ఈసీ మెంబర్ సంగీ రవి జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకార్ భూపాలపల్లి నియోజకవర్గం ఇన్చార్జి వేల్పుగొండ మహేందర్ గారు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి..

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ని గెలిపించాలని జోరుగా ప్రచారం

వీణవంక,( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి

వీణవంక మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డి నీ గెలిపించాలని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు మంగళవారం రోజున పోతిరెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారు.ఈ కార్యక్రమంలో పంజాల సతీష్ మాజీ సర్పంచ్ పానుగంటి మధుకర్ ,దుర్గం బిక్షపతి, చేపూరి రాజు, రాపర్తి కొండల్, రాపర్తి శ్రీనివాస్ ,రాపర్తి రవి తదితరులు పాల్గొన్నారు.

చలివేంద్రాన్ని ప్రారంభించిన మొహమ్మద్ తన్వీర్..

చలివేంద్రాన్ని ప్రారంభించిన టి జి ఐ డి సి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండల్ చింతల్ ఘట్ ఎక్స్ రోడ్లో టిప్పు సుల్తాన్ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రం ముఖ్యఅతిథిగా పాల్గొని టి జి ఐ డి సి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం టి జి ఐ డి సి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ మాట్లాడుతూ ఎండాకాలం ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోష కరం అన్నారు టిప్పు సుల్తాన్ సోషల్ సర్వీస్ స్పోక్ పర్సన్ నసీర్ రుద్దీన్ మాట్లాడుతూ తండ్రి బాటలో తనయుడు అంకితభావం సేవ గుణంతో ముందుకెళ్తున్నటువంటి తన్వీర్ గారికి మైనార్టీ వర్గంతో పాటు అన్ని వర్గాల మద్దతు ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

బీసీల జోలికి వస్తే ఊరుకునేది లేదు.

పైడిపల్లి నర్సింగ్ ఖబడ్దార్ బీసీల జోలికి వస్తే ఊరుకునేది లేదు.

మందమర్రి నేటి ధాత్రి: 

మందమర్రి స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పట్టణ అధ్యక్షుడు సకినాలశంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నేరెళ్ల వెంకటేష్, గౌరవ అధ్యక్షులు పోల్ శ్రీనివాస్, మందమర్రి పట్టణ యువజన అధ్యక్షుడు మూడారపు శేఖర్, లు మాట్లాడుతూ గత వారం రోజుల క్రిందట బీసీలపై మాల సంఘం పైడిమల్ల నర్సింగ్ బీసీలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బీసీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని వారు కోరారు రాబోయే రోజుల్లో క్షమాపణ చెప్పినట్లయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వాటికి పూర్తి బాధ్యత పైడిమల్ల నర్సింగ్ పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. అసలు ఏ పార్టీలో ఉండి ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా ఉంది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు కుల ఘననకు అనుకూలంగా మాట్లాడిన ముఖ్యమంత్రిని కాదని బీసీల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఇలాంటి వాక్యాలు చేయడం సిగ్గుచేటు అన్నారు అసలు మాల l సంఘంలో ఎవరికి ఏం పోస్టు ఉందో కూడా తెలియకుండా ఆ సంఘ సభ్యుల కు అర్థం కాకుండా ఉంది అన్నారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలన్నీ కలుపుకొని ముందుకు వెళ్లాల్సిన సమయంలో ఇలాంటి వాక్యాలు చేయడం సరైనది కాదన్నారు బే షరతుగా క్షమాపణ చెప్పి తీరాలని వారి కోరారు ఈ కార్యక్రమంలో రామస్వామి శేఖర్. బేరా వేణుగోపాలరావు. దేవరపల్లి ప్రభాకర్. పోల్ సంపత్. మునిసెట్టి సత్యనారాయణ. మాడకుండా శంకర్. తదితరులు పాల్గొన్నారు

స్వామి పూజలో మాజి ఎంపీ రావుల..

వనపర్తి లో శ్రీ సీతరామలక్ష్మణ సహిత శ్రీ వీరాంజనేయ స్వామి పూజలో మాజి ఎంపీ రావుల
వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి పట్టణంలో పాతబజార్ 3 వ వార్డులో శ్రీ వీరంజనేయ దేవాలయం ప్రతిష్ట సందర్భంగా పూజలో మాజి ఎంపీ రావుల చంద్ర శేఖర్ రెడ్డి పాల్గొన్నారు
ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు స్వామిని దర్శించుకుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రావుల మాట్లాడుతూ ఆలయ పున నిర్మాణం అద్భుతంగా జరిగిందని ఇందుకు కృషి చేసిన ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు.రోడ్ల విస్తరణలో తర్వాత నూతనంగా రూపుదిద్దుకున్న ఆలయాలు,దర్గాలు,మసీదులు అద్భుతంగా ఉన్నాయని వీటికి కృషి చేసిన మాజి మంత్రి నిరంజన్ రెడ్డిని రావుల అభినందించారు
ఆలయం నిర్మించడంతో పాటు రోజు ధూపదీప నైవేద్యాలతో నిత్యం స్వామి వారిని పూజించాలని ఇందుక నా సహకారం ఉంటుందని రావుల హామీ ఇచ్చారు. కమిటీ సభ్యులు సాదరంగా రావుల చంద్రశేఖరరెడ్డి ని ఆహ్వానించి ఘనంగా సన్మానించారు.
అనంతరం నూతన బొడ్రాయి శిలాకు పూజలు నిర్వహించారు.
రావు ల వెంట జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్,గంధం.పరంజ్యోతి,బండారు.కృష్ణ,డాక్టర్. దానియాల్,సూర్యవంశపు
గిరి,సునీల్ వాల్మీకి,ఇమ్రాన్,మునికుమార్ ఆలయ కమిటీ సభ్యులు గోనూరు.వెంకటయ్య గుప్త ,వసంత శ్రీనివాసులు, నీల స్వామి,బాలస్వామి తదితరులు ఉన్నారు.

వనపర్తి అభివృద్ధికి అడ్డుపడద్దు..

వనపర్తి నియోజకవర్గానికి అభివృద్ధికి అడ్డుపడద్దు

ఎమ్మెల్యేకు సవాల్ విసిరిన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి
వనపర్తి నేటిధాత్రి ;

వనపర్తి నియోజకవర్గం అభివృద్ధికి అడ్డు పడ వద్దని రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి కి సవాల్ విసిరారు ఆదివారం సాయంత్రం చిన్నారెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించానని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని ఒకసారి0 మంత్రిగా పనిచేశానని చెప్పారు .గోపాల్ పెట్ మండలం లో పోలికేపాడు గ్రామం గుట్టల మధ్యన మార్కెట్ యార్డ్ శంకుస్థాపన ఎమ్మెల్యే మెగా రెడ్డి మార్కెట్ యార్డ్ నిర్మాణానికిమంత్రి తుమ్మల నాగేశ్వర్ రెడ్డితో శంకుస్థాపన చేయించారని ఆయన పేర్కొన్నారు గోపా ల్ పే ట్ మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలం 76 ఎకరాలు ఉన్నదని మండలానికి అనుకూలంగా తన సొంత గ్రామం తిరుమలాపుర o ఉన్నదని వివిధ గ్రామాలు ఉన్నాయని గోపాల్ పెట్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ నిర్మిస్తే అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యే మెగా రెడ్డి గెలుపుకు పెద్దమందడి మండలంలో అనేక గ్రామాల్లో ప్రచారం చేశా నని గెలుపు కు కృషి చేశానని చిన్నారి రెడ్డి చెప్పారు . తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ బీ ఎ సి కమిటీకి కే సీ వేణుగోపాల్ ఇన్చార్జిగా ఉన్నారని ఆ కమిటీలోనేను కూడా ఉన్నానని చిన్నారెడ్డి చెప్పారు . సీఎం రేవంత్ రెడ్డి తన.పై నమ్మకంతో బేగంపేట్ ప్రజాపాలన కార్యాలయం ప్రజల వినతి పత్రాలు స్వక రి o చు ట అప్ప గించారని చెప్పారు ప్రతి శుక్రవారం 8 వేల నుండి 12 వేల వరకు ప్రజలు. వస్తుంటారని వారితో. ఫిర్యాదులు స్వీకరించి అప్పటికప్పుడు సంబంధిత కలెక్టర్లతో అధికారులతో ఫోన్లో సంప్రదించి ప్రజల సమస్యలకు పరిష్కారం కావడానికి కృషి చేస్తున్నానని చిన్నారెడ్డి చెప్పారు. ఓపి క తో ప్రజల వినతి పత్రాల స్వీక రి స్తు.న్న నని ఆయన పేర్కొన్నారు .పార్లమెంట్ ఎన్నికల్లో డాక్టర్ మల్లు రవి గెలవడానికి వనపర్తి నియోజకవర్గ మొత్తం పర్యటించానని గెలుపుకు కృషి చేశానని ఆయన పేర్కొన్నారు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి ఇంటికి వెళ్లి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని సీఎం రేవంత్ ముఖ్యమంత్రి ఆయాతారని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రచారంలో చేశానని ప్రజలను కోరానని చెప్పారు శ్రీమతి సోనియా గాంధీ పాదాభివందనం అసెంబ్లీ ఎన్నికలలో నాకు టికెట్ ఇవ్వడానికి నా యొక్క పేరును టికెట్ రావడానికి లిస్టులో టిక్ చేశారని చెప్పారు .ప్రస్తుత ఎమ్మెల్యే మెగా రెడ్డి సర్వే చేసిన బృందానికి గల్లీ నుంచి ఢిల్లీ వరకు డబ్బులు ఇచ్చి అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారని విమర్శించారు 46 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ కి సేవలందించానని ఇప్పుడు కూడా నా వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకోవద్దని నాకు అన్ని తెలుసునని అన్నారు ఎమ్మెల్యే కు ఒకటి చెబుతున్న నీ వెంబడి ఉన్న నాయకుల అభిప్రాయాలు తీసుకొని ఇతర నాయకుల అభివృద్ధికి అడ్డుపడితే సహించనని హెచ్చరించారు ఈ విలేకరుల సమావేశంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి కృష్ణ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్ న్యాయవాది కిరణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కులం మతం పేరుతో చేసే రాజకీయాలు నమ్మొద్దు

— కులం మతం పేరుతో చేసే రాజకీయాలు నమ్మొద్దు
• యువత కాంగ్రేస్ కు ప్రాధాన్యత ఇవ్వాలి

నిజాంపేట: నేటి ధాత్రి

కులం, మతం పేరుతో రాజకీయం చేసే బీజేపీ పార్టీని పట్టభద్రులు నమ్మవద్దనీ మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రేస్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంత రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో పట్టభద్రుల సమావేశానికి హయారై మాట్లాడారు.. బీజేపీ పార్టీ నీ నమ్మి పట్టభద్రులు మోసపోవద్దని కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. నరేందర్ రెడ్డి గెలిచిన వెంటనే నిరుద్యోగుల కోసం ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తానని తెలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అంజయ్య, సరాఫ్ యాదగిరి, చెప్పేట ముత్యం రెడ్డి, బెజవాడ నాగరాజు, బక్కన్న గారి లింగంగౌడ్, వెంకట్ గౌడ్, సత్యనారాయణ, గుమ్ముల అజయ్, బాజా రమేష్, రాంచందర్ నాయక్, అందె స్వామి, మ్యాదరి నర్సిములు, కుమార్ లు ఉన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు,మహాశివరాత్రి జాతర నిర్వహణ

పటిష్టమైన ప్రణాళికతో, ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ (MLC) ఎన్నికలు,మహాశివరాత్రి జాతర నిర్వహణ.

ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం అధికారులు,సిబ్బంది ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్

వేములవాడ నేటిధాత్రి

ఈనెల 27న జరగనున్న ఉపాధ్యాయ,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ,25,26,27 తేదీల్లో జరుగు మహాశివరాత్రి జాతరకు సంబంధించి ఈరోజు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో డిఎస్పి లు, సి.ఐ,ఆర్.ఐ,ఎస్.ఐలతో భద్రతాపరంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పి గారు మాట్లాడుతూ….ఈ నెల 27 తేదీన జరుగు ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల సమయంలో పోలీసు అధికారులు ఎలక్షన్ ముందు,ఎలక్షన్ రోజు,ఎలక్షన్ తర్వాత, తీసుకోవలసిన చర్యల గురించి క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని,పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండలని,ఎన్నికల సమయంలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని,పోలింగ్‌ ప్రక్రియ సజావుగా,నిష్పక్షపాతంగా సాగేందుకు వారు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అదికారులను ఎస్పి గారు ఆదేశించారు.

జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ,పట్టభద్రుల పోలింగ్ కి సంబందించి 41 పోలింగ్ కేంద్రలో 23,347 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకుంటారని పోలింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుండి పూర్తి అయేంత వరకు పోలీస్ అధికారులు,సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్స్ లను పటిష్టమైన ఎస్కార్ట్ తో స్ట్రాంగ్ రూమ్ లకు తరలించవలసి ఉంటుందన్నారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడిన ఎన్నికల నియమావళి ప్రకారం ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

మహాశివరాత్రి జాతర సందర్భంగా పటిష్ట భద్రత..

ఈ నెల 25,26,27 తేదీల్లో జరుగు మహాశివరాత్రి జాతర సందర్భంగా పోలీస్ శాఖ తరుపున సుమారు 1500 పోలీస్ అధికారులు, సిబ్బంది తో పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.వివిధ ప్రాంతాల్లో బందోబస్తు లో ఉంటే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ వివిధ శాఖల సమన్వయంతో సుదూర ప్రాంతాల నుండి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో రాజన్న దర్శన అయ్యేలా చూడాలన్నారు. పట్టణంలో ప్రధాన కూడళ్ల వద్ద,పార్కింగ్ ప్రదేశాల్లో విధుల్లో ఉండే అధికారులు ,సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ట్రాఫిక్ నియంత్రణ చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,సి.ఐ లు, ఆర్.ఐ లు,ఎస్.ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.

అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ఇందిరమ్మ కాలనీలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డికిమొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వీప్ జిల్లా అధ్యక్షులు వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీనియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డితంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ ఆదేశానుసారం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఇందిరమ్మ కాలనీ గ్రామంలో ఉన్నటువంటి పట్టు బద్రులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి ఓటు వేసి అత్యధిక మెజార్టీతోగెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు పట్టుభద్రులకిఏ సమస్య వచ్చిన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారి గురించి వారి సమస్యలకు పరిష్కారమయ్యే దిశగా పాటు పడదామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీరామ్ నరేష్ కొంపెల్లి శ్యామ్ మాజీ వార్డు సభ్యులు దూస మహేందర్ గోరెంట్ల రాజమల్లు బల్ల లక్ష్మీపతి అంబటి ఆంజనేయులు మాటీటీ రాజు ముసం విలాస్ కొండి నరేష్ తదితరులు పాల్గొన్నారు

సర్వే అంతా తప్పులు తడక. రాజ్యసభ సభ్యులు “వద్దిరాజు రవిచంద్ర”.

బీసీల పట్ల కాంగ్రెస్కు చులకన భావం ఉంది.

కులగరణ సర్వేలో తప్పులను వెంటనే సరిదిద్దాలి.

క్యాబినెట్ విస్తరణలో నలుగురు బీసీలకు స్థానం కల్పించాలి.

“నేటిధాత్రి” హైదరాబాద్, ప్రతినిధి.
రాష్ట్ర ప్రభుత్వం జరిపించిన కులగణన సర్వే తప్పులతడకగా,కాకి లెక్కలతో అశాస్త్రీయంగా ఉందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.కేంద్ర ప్రభుత్వం 2011లో జరిపించిన లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3 కోట్ల 50 లక్షల 3674కాగా,2014 సమగ్ర కుటుంబ సర్వే (SKS)ప్రకారం 3 కోట్ల 68లక్షల 76వేల 544, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన సర్వేలో జనాభా 3 కోట్ల 70 లక్షల 77 వేల 544 గా నమోదయ్యిందన్నారు.పదేళ్లలో తెలంగాణ జనాభా కేవలం 2లక్షలు మాత్రమే పెరిగిందని ఈ ద్వారా పేర్కొనడం విడ్డూరంగా ఉందని ఎంపీ రవిచంద్ర ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 2014లో జరిపించిన SKS ప్రకారం బీసీలు (ముస్లింలలోని బీసీలు కాకుండా) 52% అని నిర్ధారణ కాగా,అదిప్పుడు 46%శాతమేనని ప్రభుత్వం వెల్లడించడం,6% తగ్గించి చూపడం దారుణమని ఆవేదన చెందారు.బీసీల జనాభాను తగ్గించి చూపడమే కాక,ఈ తప్పులతడక సర్వే నివేదికను మంత్రిమండలి ఆమోదించడం, చట్టసభల్లో ప్రవేశపెట్టి ప్రజలకు తప్పుడు సమాచారమిచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం తీవ్ర అభ్యంతరకరమన్నారు.రాజ్యాధికారంలో బీసీలను భాగస్వాములను చేయాలన్న చిత్తశుద్ధి అధికార పార్టీలో పూర్తిగా లోపించిందని ఎంపీ వద్దిరాజు మండిపడ్డారు.కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఏ కోశానా కూడా లేదనేది ఈ అశాస్త్రీయ కులగణన సర్వేతో తేటతెల్లమయ్యిందన్నారు.బీసీల పట్ల కాంగ్రెస్ పాలకులకు చాలా చులకన భావం నెలకొందని చెప్పడానికి మంత్రిమండలి కూర్పే ఒక ప్రబల నిదర్శనమని ఎంపీ రవిచంద్ర చెప్పారు.బీసీలలో అత్యధిక సంఖ్యలో ఉన్న మున్నూరుకాపు,యాదవ, ముదిరాజ్,కుర్మలకు మంత్రివర్గంలో చోటివ్వకపోవడం,రాజ్యాధికారంలో న్యాయమైన వాటా దక్కకపోవడం శోచనీయమని ఎంపీ రవిచంద్ర ఆవేదన వ్యక్తంచేశారు.కులగణన సర్వేలో చోటుచేసుకున్న తప్పులను వెంటనే సరిదిద్దాలని, ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్స్ కల్పించాలని, కేబినెట్ విస్తరణలో 4 గురు బీసీలకు స్థానం కల్పించాలని ఎంపీ వద్దిరాజు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు.అన్ని రంగాలలో తీవ్ర అన్యాయానికి గురవుతున్న బీసీలను బీఆర్ఎస్ మరింత సంఘటితపరుస్తూ న్యాయమైన హక్కులు,వాటా కోసం నిరంతరం పోరాడుతుందని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు.

మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్

మహారాష్ట్ర కొత్త సీఎంపై క్లారిటీ వచ్చేసింది. కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఆయన పేరును ఆమోదించారు. గురువారం ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈమేరకు మహారాష్ట్ర బీజేపీ చీఫ్‌ అధికారికంగా ప్రకటించారు. దీంతో మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫఢ్నవీస్‌ రెండోసారి పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. గురువారం ఆజాద్‌ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ఎన్​డీఏ కీలక నేతలు దీనికి హాజరుకానున్నారు. సీఎంగా ఫడణవీస్‌తో పాటు శివసేన నేత ఏక్‌నాథ్‌ శిందే , ఎన్​సీపీ నేత అజిత్ పవార్‌ ఉప ముఖ్యమంత్రులగా ప్రమాణస్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. రానున్న రోజుల్లో మనకు కొన్ని అనుకూల అంశాలతో పాటు ప్రతికూల అంశాలు కూడా ఉంటాయని దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు. అయితే రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం కలిసి పని చేసి అనుకున్న లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్ర బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన తర్వాత ఫఢ్నవీస్​ ఈ ప్రకటన చేశారు.

టిజి బడుగులకు అండగా కాంగ్రెస్‌

-ఏపి అగ్రకులాల పక్షాన బిఆర్‌ఎస్‌.

-కొండా సురేఖ మీద సినీ వర్గం మూకుమ్మడి దాడి.

-సీని అగ్ర కులాలకు బాసటగా బిఆర్‌ఎస్‌ పార్టీ.

-తెలంగాణ ఆడబిడ్డకు అండగా కాంగ్రెస్‌ పార్టీ.

-బిఆర్‌ఎస్‌పై తొలగిన తెలంగాణ ముసుగు.

-అసలైన తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ గొడుగు.

-కొండా, వర్సెస్‌ కేటిఆర్‌ అంశాన్ని సినీ లోకానికి ముడిపెట్టింది బిఆర్‌ఎస్‌.

-హుందాగా తనదైన శైలిని ప్రదర్శించింది కాంగ్రెస్‌.

-ఆది నుండి అగ్రకుల అహంకారం ప్రదర్శిస్తూనే వుంది బిఆర్‌ఎస్‌.

-బలహీన వర్గాలకు ఎప్పుడూ ఆపన్న హస్తం అందించేదే కాంగ్రెస్‌.

-బడుగులను నెగలనీయకుండా తరిమేసింది బిఆర్‌ఎస్‌.

-బడుగుల ఆడబిడ్డ సురేఖకు కష్టకాలంలో అండగా నిలిచింది కాంగ్రెస్‌.

-అపోహతో ఆనాడు రాజయ్యను భర్తరఫ్‌ చేసింది కేసిఆర్‌.

-తెలంగాణ ఆడపడుచుకు అండగా నేడు నిలిచింది రేవంత్‌.

-బడుగులను నిలువునా ముంచింది బిఆర్‌ఎస్‌.

-బడుగులకు రిజర్వేషన్లు పెంచాలన్న సంకల్పం కల్గింది కాంగ్రెస్‌.

-గులాబీ జెండా నాదన్నందుకు ఈటెలను తరిమేసింది బిఆర్‌ఎస్‌.

-ఎవరో ఆరోపణలు చేశారని గంగుల కమలాకర్‌ను తొక్కేయాలని చూసింది బిఆర్‌ఎస్‌.

-అగ్రకుల అహంకారానికి నిలువెత్తు సాక్ష్యం కేసిఆర్‌.

-అన్ని వర్గాలను కలుపుకుపోవడంలో మానవత్వం నిండిరది రేవంత్‌.

-పార్టీ నేతలపై అపవాదులొచ్చినప్పు కాపాడుకోలేని నాయకుడు కేసిఆర్‌.

-కాంగ్రెస్‌ నాయకుల మీద అవాకులు చెవాకులయ పేలితే అండగా నిలుస్తుంది రేవంత్‌.

-మాయమాటలతో రాజకీయం చేయడం కేసిఆర్‌కు అలవాటు.

-అసలైన మానవత్వ లక్షణాలు నిండిన నాయకుడు రేవంత్‌.

-ఆంధ్రులకు అడుగడుగునా అండగా నిలిచి తెలంగాణను చులకన చేసింది కేసిఆర్‌.

-తెలంగాణ వాళ్లకు ఎవరు అన్యాయం చేసినా చీల్చి చెండాడుతున్నది రేవంత్‌.

-రాజకీయ అవసరాల కోసం పరాయి వాళ్లకు పీటలేసింది కేసిఆర్‌.

-తెలంగాణకు అన్యాయం చేస్తే ఎంతటి వాళ్లనైనా ఉపేక్షించమని నిరూపిస్తోంది రేవంత్‌.

-అయిన వాళ్లకు ఆకులు కాని వాళ్లకు కంచాలు పంచింది కేసిఆర్‌.

-తెలంగాణ కంచాలు లాగితే కూసాలు కదులుతాయని చెబుతున్నది రేవంత్‌.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

పార్టీ నాయకుల కోసం అండగా నిలవలేని అగ్రనేతలు అధినేతలే కాదు. పార్టీ నాయకులకు విపత్కరపరిస్ధితులు ఎదురైనప్పుడు అండగా నిలవలేనప్పుడు అధి నాయకత్వమే కాదు. కాని మంత్రి కొండా సురేఖ విషయంలో పార్టీ అగ్రనాయకుడిగా, మంత్రి వర్గంలో తన తోటి సహచర మంత్రికి పూర్తి అండగా నిలిచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశంసనీయుడు. ఆయన చూపిన చొరవ మంత్రి వర్గానికే వన్నె తెచ్చినట్లైంది. ఆధిపత్య సీమాంధ్ర మీడియా చేస్తున్న హడావుడి ఉచ్చులో తెలంగాణ సమాజం పడిపోయింది. అందుకే కొందరు పనిగట్టుకొని కొండా సురేఖను టార్గెట్‌ చేశారు. ఇది చాలా దుర్మార్గం. ఇక్కడ అసలు విషయాన్ని ఓ సారి పరిశీలిస్తే మెదక్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా వున్న మంత్రి కొండా సురేఖ ప్రభుత్వ అధికారిక కార్యాక్రమానికి హజరయ్యారు. మెదక్‌ జిల్లాలో పద్మశాలి కుటుంబాలు ఎక్కువ. మంత్రి కొండా సురేఖ కూడా పద్మశాలి ఆడబిడ్డ కావడంలో మెదక్‌ ఎంపి రఘునందన్‌ రావు మర్యాద పూర్వకంగా మంత్రి కిండా సురేఖకు నూలదండను మెడలో వేసి ఆహ్వానం పలికారు. పద్మశాలి సమాజం సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇది బిఆర్‌ఎస్‌ నాయకులకు కంటకింపుగా మారింది. ఎలా మంత్రి సురేఖను ఇరుకున పెట్టాలని, అటు రఘునందన్‌ రావును అబాసులు పాలు చేయాలన్న ఆలోచనతో బిఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా విభాగం చేయకూడని తప్పు చేసింది. మంత్రి కొండా సురేక, ఎంపి. రఘునందన్‌ రావులు వున్న ఫోటోపై దుష్ప్రచారం చేశారు. ఇది కాంగ్రెస్‌ శ్రేణులకు ఆగ్రహాన్ని తెప్పించింది. మంత్రి కొండా సురేఖ మనస్తాపానికి గురైంది. కన్నీటి పర్యంతమైంది. అయినా బిఆర్‌ఎస్‌ దుష్ట గ్రహాల మనసు కరగలేదు. కాకపోతే జరిగిన పొరపాటును గ్రహించి వెంటనే తేరుకున్న మాజీ మంత్రి హరీష్‌రావు క్షమాపణ చెప్పారు. అక్కడితో ఆగిపోతే బాగుండేది. కాని బిఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా విభాగం అక్కడితో ఆపలేదు. ఆ విషయాన్ని మరింత ప్రచారం చేసింది. మళ్లీ మళ్లీ గాయాన్ని రేపేలా చేసింది. దాంతో మంత్రి కొండా సురేఖకు ఆగ్రహం తెప్పించింది. నూలు దండకు కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో సంబంధం వుంది. అది బిఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా విభాగానికి చెందిన వ్యక్తులకు తెలియదు. అసలు బిఆర్‌ఎస్‌ నేతలకే ఆ విషయం తెలియదు. కాంగ్రెస్‌ పార్టీ సహజంగా పూల దండలకు బదులుగా ఎప్పుడైనా నూలు దండలనే వినియోగిస్తుంది. ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జాతీయస్ధాయి సమావేశాలలో నూలు దండలనే వేసుకుంటారు. పూల దండలు నిషేదం. ఆ మాత్రం కామన్‌ సెన్స్‌ బిఆర్‌ఎస్‌ శ్రేణులకు లేకుండాపోయింది. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో విదేశీ వస్తు భహిష్కరణ, చేనేత వస్త్రాల నేతకు విడదీయ రాని అనుబంధం వుంది. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించిన పాత్ర నూలు పోగు. ఈ సంగతి బిఆర్‌ఎస్‌ నేతలకు కనీసం అవగాహన కూడా లేదు. అందుకే చెరపకుడార చెడేవు అన్న సామెతను మీద వేసుకున్నారు. నూలు దారం ఎంతో పవిత్రమైనది. అది దేశ స్వాతంత్య్రానికి చిహ్నం. దాన్ని అపవిత్రకు ఆపాదించిన బిఆర్‌ఎస్‌ శ్రేణుల తెలివి తక్కవ తనం మూలంగా పద్మశాలి ఆడబిడ్డకు కోపం తెప్పించింది. పైగా పద్మశాలి సమాజానికి నూలు పోగు ఎంతో పవిత్రమైనది. ఆ నూలు మాల ఎంతో శ్రేష్టమైనది. దాన్ని ఎంతో గౌరవం కోసం వేసుకుంటారు. అలాంటి దండకు అపవిత్రను ఆపాదించి బిఆర్‌ఎస్‌ పెద్ద తప్పు చేసింది. దాంతో మంత్రి కొండా సురేఖ సినీ హీరో నాగార్జున కుటుంబంలో జరిగిన అన్యాయానికి మాజీ మంత్రి కేటిఆర్‌ కారణం అని ఆరోపణ చేశారు. అయితే ఇక్కడ ఎక్కడా మంత్రి కొండా సురేఖ సినీ నటి సమంతను కించపర్చలేదు. ఆమెకు ఎలాంటి తప్పును ఆపాదించలేదు. ఆమె గౌరవాన్ని నిలబెట్టింది. అంతే కాని ఆమెకు ఎలాంటి తప్పును ఆపాదించలేదు. బిఆర్‌ఎస్‌ ఇక్కడ కూడా అతి తెలివి ప్రదర్శించింది. నాగార్జున కుటుంబాన్ని రెచ్చగొట్టింది. దాంతో సినీ లోకమంతా కదలింది. అసలైన విషయాన్ని సినీ ప్రముఖులు కూడా వదిలిపెట్టారు. నాగార్జునకు అండగా నిలిచారు. మంత్రి కొండా సురేఖ మీద మాటల దాడి మొదలు పెట్టారు. ఆఖరుకు నాగార్జున మంత్రి మీద పరువు నష్టం దావా దాకా వెళ్లారు. ఇదే సమయంలో మంత్రి కొండా సురేఖ ఎంతో హుందాగా తాను సమంతపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. సాటి మహిళలకు జరిగిన అన్యాయాన్ని మాత్రమే ప్రస్తావించాను. అందులోనూ ఆమె తెగువను కీర్తించాను అని చెబుతూనే ఒక వేళ నటి సమంత తన మాట వల్ల మనసు గాయమైతే క్షమించమని కూడా కోరింది. కాని బిఆర్‌ఎస్‌ ఈ వివాదాన్ని మరింత పెద్దది చేయాలనే చూసింది. నాగార్జునను రెచ్చగొట్టింది. దాంతో సినీ వర్గమంతా ఒక్కతాటి మీదకు వచ్చింది. కాని ఇక్కడ అందరూ నాగార్జునకు మద్దతుగా ఏమీ రాలేదు. కేవలం చిరంజీవి కుటుబం, ఎన్టీఆర్‌, ఇతర కమ్మకుల సినీ వర్గమే ఆయనకు తోడుగా నిలిచింది. ఇక్కడ మంత్రి కొండా సురేఖ సినీ పరిశ్రమలో తనకు వినిపించిన అంశాన్ని మాత్రమే ప్రస్తావించారు. ఆమె ఆరోపణలు చేయలేదు. సమంత మీద ఎలాంటి వివాదాలు సృష్టించాలని అనుకోలేదు. ఒక రకంగా సమంతకు మద్దతుగా , సాటి మహిళగా తోడుగానే నిలిచింది. కాని తిమ్మిని బమ్మిని చేయడంలో ఆరి తేరిన బిఆర్‌ఎస్‌ పార్టీ రాజకీయ పైశాచిక ఆనందం పొందాలని చూసింది. సినీ పరిశ్రమను కాంగ్రెస్‌పార్టీకి వ్యతిరేకంగా మారితే భవిష్యత్తులో తమకు వాళ్లంతా మద్దతుగా నిలుస్తారని ఆశించారు. కాని కథ అడ్డం తిరిగింది. మంత్రి కొండా సురేఖ మీద పెద్దఎత్తున మీడియాలో విపరీత ప్రచారం చేస్తే ఆమెపై చర్యలు తీసుకుంటారని బిఆర్‌ఎస్‌ భావించింది. కాని అది జరగలేదు. కాంగ్రెస్‌లో కదలిక కనిపించడం లేదని గ్రహించి పెద్దఎత్తున మీడియాను రంగంలోకి దించారు. జాతీయ స్ధాయిలో కూడా ఈ విషయాన్ని చర్చనీయాంశం చేశారు. రోజుల తరబడి మీడియాలో చర్చలు జరిపారు. ఏకంగా సోనియా గాంధీ, ప్రియాంకా గాందీ లాంటి వారు స్పందించినట్లు మీడియా లేని పోని కలరింగులిచ్చారు. అబద్దాలు విసృతంగా ప్రచారం చేశారు. కాని కాంగ్రెస్‌ పార్టీలో స్పందన కనిపించకపోవడంతో బిఆర్‌ఎస్‌ నెత్తిన చేతులు పెట్టుకున్నది. ఎలాగైనా మంత్రిని భర్తరఫ్‌ చేయించాలిన పన్నాగం పన్నింది. కాని మంత్రి కొండా సురేఖకు అండగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగారు. ఆమెకు మద్దతుగా నిలిచారు. పైగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బిసి నాయకులంతా ఏకమయ్యారు. ఒక బడుగుల ఆడబిడ్డపై లేని పోని వివాదాలు సృష్టించి ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించేలా బిఆర్‌ఎస్‌ చేసిన కుట్రలను పటాపంచెలు చేశారు. తెలంగాణ బిసిలంతా ఏకమై బిఆర్‌ఎస్‌ మీద యుద్దం ప్రకటించింది. నిజం అడుగు బైట పెట్టేలోపు అబద్దం ఆరు ఊర్లు తిరిగి వస్తుందన్నట్లు మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు విపరీతార్దాలు సృష్టించి లేని పోనివి ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ పార్టీని ఇబ్బందులు పెట్టాలని చూశారు. కాని కాంగ్రెస్‌పార్టీ తన పార్టీ నేత కొండా సురేఖను కాపాడడంలో సఫలమైంది. కాంగ్రెస్‌ పార్టీ అంటే బడుగులకు అండగా వుండే పార్టీ అని మరోసారి నిరూపించింది. బిఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో బడుగులను అడుగుగడుగునా అణచివేస్తూ వచ్చింది. బడుగుల నాయకులు ఎదడగాన్ని కేసిఆర్‌ తో సహా పెత్తందారి నీj నాయకులు సహించలేకపోయారు. దాంతో తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మీద లేని పోని అపోహలు సృష్టించి ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించారు. ఇప్పటి వరకు రాజయ్య చేసిన తప్పేమిటో మాత్రం చెప్పలేదు. పైగా అడుగడుగునా ఆయనను పార్టీ అవమానించింది. ఒక దశలో ఎన్నికల స్టేజీ మీద పక్కన కూర్చున్న రాజయ్య షేక్‌ హ్యాండ్‌ ఇవ్వబోతే కేసిఆర్‌ చీదరించుకున్న సందర్భం వుంది. మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ మీద ఓ సినీ నటి లేనిపోని ఆరోపణలు చేస్తే ఆయనను కూడా పదవినుంచి తొలిగించేందుకు సిద్దమయ్యారు. కాని ఆగిపోయారు. ఉద్యమ కాలం నుంచి కేసిఆర్‌కు అండగా నిలిచిన ఈటెల రాజేందర్‌, గులాబీ జెండాకు నేను కూడా ఓనర్నే అన్న ఒక్క మాట పట్టుకొని ఆయనను మెడపట్టి గెంటివేసినంత పనిచేశారు. ఆయనను భూ కబ్జా కోరురుగా చిత్రీకరించి బైటకు పంపించారు. మంత్రి పదవి నుంచి తొలిగించారు. ఇలా బడుగులకు అడుగడుగునా అవమానం చేసిన పార్టీ బిఆర్‌ఎస్‌. బడుగుల నాయకులకు ఆదప వచ్చినప్పుడు అండగా నిలిచింది కాంగ్రెస్‌ పార్టీ. వారికి కొండంత ధైర్యం నింపే నాయకుడు రేవంత్‌ రెడ్డి. అదీ ఒక నాయకుడికి వుండాల్సిన తత్వం. అదే అసలైన వ్యక్తిత్వం. అదే రేవంత్‌ రెడ్డి విశాలమైన మనసున్న నాయత్వం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version