మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తులు అరెస్ట్

మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తులు అరెస్ట్

సీఐ లోడిగా రవీందర్,ఎస్సై సైదా రహూఫ్

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

గుండాల ఎస్సై రహుఫ్ తమ సిబ్బందితో కలిసి సోమవారం పెట్రోలింగ్ కు వెళుతుండగా తురుబాక గ్రామం నందు రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించగా వారిని పట్టుకొని విచారించగా వారి పేర్లు
పాయం రాజేందర్ నడిమిగూడెం,ఆళ్లపల్లి మండలం కల్తీ పాపయ్య (అలియాస్ సర్పంచ్) ఘణపురం గ్రామం,గుండాల మండలం అను ఇద్దరు గతంలో ప్రజా ప్రతిఘటన దళంలో పనిచేశారు.
కల్తీ పాపయ్య 2010 సంవత్సరంలో హత్యా ప్రయత్నం కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి పోయి వచ్చాడు.పాయం రాజేందర్ గతంలో ప్రజా ప్రతిఘటన దళంలో పని చేసి ఆళ్లపల్లి పోలీస్ ఎదుట లొంగిపోయాడు వీరిద్దరూ జల్సాలకు అలవాటుపడి ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే ఉదేశ్యంతో మావోయిస్టు పార్టీ పేరు చెప్పి గుండాల,ఆళ్లపల్లి మండలాల వ్యాపారస్తులను గత రెండు,మూడు నెలల నుండి ఫోన్లు చేసి పార్టీ ఫండ్ కోసం డబ్బులు కావాలని బెదిరిస్తున్నారు.సోమవారం వీరిద్దరిని గుండాల పోలీస్లు అరెస్ట్ చేశారు.వీరి ఇరువురి నుండి 5000 రూపాయలు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత మావోయిస్టులది కాలం చెల్లిన సిద్దాంతాలని,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు ఉనికి అనేది లేదని ఇల్లందు డిఎస్పి చంద్రభాను తెలిపారు.ఎవరైనా మావోయిస్టుల పేరుతో ఫోన్లు చేసి బెదిరిస్తే ప్రజలు ఎటువంటి భయబ్రాంతులకు గురి కాకుండా పోలీస్ వారికి పిర్యాదు చేయవలసిందిగా కోరారు.వీరిని పట్టుకోవటం లో కృషి చేసిన గుండాల సిఐ లోడిగ రవీందర్,ఎస్ఐ సైదా రహుఫ్, పిసి వెంకటేశ్వర్లు ను డిఎస్పి అభినందించారు.

నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన.!

నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం

ఎమ్మెల్యే పాయంకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు

 

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి..

 

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాధపాలెంలో 20 లక్షల అంచనా ఖర్చుతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనంతరం కార్యాలయం స్థల దాతలు పోలెబోయిన కుటుంబస్తులు ప్రభాకర్ రావు, నరసింహారావు, కృష్ణమూర్తి, ముత్తయ్యను శాలువాతో సత్కరించి అభినందించారు, అనంతరం అన్ని శాఖల అధికారులతో పంచాయితీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ఎమ్మెల్యే ఈ సందర్బంగా ఆయా శాఖల అధికారులతో ప్రజల సమక్షంలోనే మాట్లాడి ఆయా పంచాయతీ పరిధిలో గల గ్రామలలో ప్రభుత్వం ప్రారంభించిన గ్యారెంటీ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు తెలియజేసారు అలాగే పంచాయతీలలో నీటి సరఫరా గురుంచి, కరెంటు సమస్యల గురుంచి, ఇరిగేషన్, విద్య, వైద్యం,అన్ని సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి వారం లోగ అన్ని సమస్యలు పరిష్కారం చేయాలనీ అదేశించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇల్లు అర్హులయినా ప్రతీ ఒక్కరికి ఇప్పించే బాధ్యత తనదని తెలియజేశారు అలాగే ప్రజలకి ఎలాంటి కష్టం రాకుండా అధికారులతో పనులు చేపిస్తూ ప్రభుత్వం చేపట్టే ప్రతీ పథకం అర్హులైన ప్రతీ ఒక్కరికి అందేలా చూసుకునే బాధ్యత తనై చూసుకుంటానని అని ప్రజలకు హామీ ఇచ్చారు అనంతరం స్థానిక ప్రజలు పలు సమస్యలపై ఎమ్మెల్యే పాయం వినతి పత్రాలు అందజేశారు.

ఈ యొక్క కార్యక్రమానికి కరకగూడెం ఎమ్మార్వో నాగప్రసాద్ , ఎంపీడీవో దేవ వర కుమార్అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ హుసేన్ , మాజీ సర్పంచ్ పోలేబోయిన శ్రీవాణి,, మండల నాయకులు ఎర్ర సురేష్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

బిఆర్ఎస్ పార్టీ మండల సోషల్ మీడియా.

బిఆర్ఎస్ పార్టీ మండల సోషల్ మీడియా కన్వీనర్ గా దాసి శ్రావణ్ కుమార్

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండల కేంద్రంలో.బిఆర్ఎస్ పార్టీ మండల సోషల్ మీడియా కన్వీనర్ గా దాసి శ్రావణ్ కుమార్ ఎన్నుకున్నారు. అభివృద్ధి ప్రదాత ప్రజల సంక్షేమం కోసం భూపాలపల్లి మాజీశాసనస భ్యులుగండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ రూరల్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ & బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షు రాలు గండ్ర జ్యోతి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో దాసి శ్రావణ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీ మండల సోషల్ మీడియా కన్వీనర్ గా, ప్రకటించినందుకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాజీ జెడ్పి చైర్మన్ గండ్ర జ్యోతి మండల నాయకులు గంగుల మనోహర్ రెడ్డి మెతుకు తిరుపతి రెడ్డి రామ్ శెట్టి లక్ష్మారెడ్డి మాజీ ఎంపిటిసి మాజీ సర్పంచ్ లకు బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులకు, గ్రామశాఖ అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శి లకు, ఉపాధ్యక్షులకు బిఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలకు, యూ త్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం.

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

నేటి ధాత్రి కథలాపూర్

 

కథలాపూర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్ లో 10 వ తరగతి చదివిన 1999-2000 సంవత్సరనికి చెందిన విద్యార్థులు 25 సంవత్సరాల తరువాత మండల కేంద్రంలో నీ SRR ఫంక్షన్ హాల్ లో సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పూర్వ విద్యార్థులందరూ పాల్గొని చిన్ననాటి జ్ఞాపకాలన్నిటిని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు,ఉపాధ్యాయులు భూమా చారి, అఖిల్ అహ్మద్, శ్రీనివాస్, అంజయ్య, రాజయ్య పాల్గొన్నారు.

జహీరాబాద్ విద్యార్థినికి గోల్డ్ మెడల్..

జహీరాబాద్ విద్యార్థినికి గోల్డ్ మెడల్..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మండలం రంజోల్కు చెందిన మహమ్మద్ కరీం కూతురు నూరిన్ ఫాతిమా లా విద్యాలో సత్తా చాటి గోల్డ్ మెడల్ సాధించింది. HYDలో లా పూర్తి చేసిన ఫాతిమా మూడు రోజులపాటు HYDలోని సుల్తాన్ ఉల్ ఉలమ్ కాలేజ్ ఆఫ్ లాలో హార్మనీ ఇన్ డిస్ప్యూట్స్ అనే అంశంపై నిర్వహించిన పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నాగేశ్వరరావు చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకుంది. దీంతో కుటుంబీకులు హర్షం వ్యక్తం చేశారు.

విద్యుత్ ప్రమాదంతో వృద్ధురాలు మృతి…

విద్యుత్ ప్రమాదంతో వృద్ధురాలు మృతి…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

స్నానం చేసి శౌచాలయం (బాత్ రూమ్) లోంచి బయటకు వస్తుండగా విద్యుత్ ప్రమాదానికి గురై ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. కుటుంబీకులు, హద్దునూరు ఎస్పై చెల్లా రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. న్యాల్కల్ మండలంలోని హుస్సేన్ నగర్ గ్రామానికి చెందిన వడగామ సిద్ధమ్మ (56) ఆదివారం ఉదయం స్నానం, కాళ కృత్యాలు చేసేందుకు శౌచాలయంలోకి వెళ్ళింది. స్నానం అనంతరం బయటకు వస్తుండగా ఓ ఇనుప రాడ్డును పట్టుకోవడంతో విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న సిద్ధమ్మ (56)ను గుర్తించిన సమీప స్థానికులు వెను వెంటనే బీదర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతి చెందిన సిద్ధమ్మకు ఓ కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. మృతురాలి సోదరి కుమారుడు సంజీవ్ కుమార్ (31) ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్పై చెల్లా రాజశేఖర్ కేసు నమోదు చేసి. శివ పంచనామ, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.

పురాతన శివలింగం నంది విగ్రహాం లభ్యం.

పురాతన శివలింగం, నంది విగ్రహాం లభ్యం

చోప్పదండి, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా చోప్పదండి మండలం దేశాయిపేట గ్రామ చెరువు వద్ద ఆదివారం పురాతన నంది, శివలింగం విగ్రహాలు లభ్యమయ్యాయి.

 

ఈవిషయం గ్రామంలోని ప్రజలకు తెలియడంతో విగ్రహాల దగ్గర కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు.

 

విగ్రహాలు లభ్యమైన చోటనే శివాలయం నిర్మించాలని కొందరు అభిప్రాయం తెలుపగా, పూజారులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని మరి కొందరు, ఆలయ నిర్మాణానికి వేరే స్థలం తీసుకొని విగ్రహాలు ప్రతిష్టించాలని గ్రామ నాయకుల మద్య చర్చ జరుగుతోంది.

 

ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుంట రవి, మాజీ ఉపసర్పంచ్ సింగిరెడ్డి వెంకటరాంరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ రవీందర్, దుబ్బాక మల్లేశం, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ శ్రీ శ్రీ దుర్గా భవాని జాతర మహోత్సవంలో పాల్గొన్న.

శ్రీ శ్రీ శ్రీ దుర్గా భవాని జాతర మహోత్సవంలో పాల్గొన్న

◆ జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్…

◆ *మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

కొహిర్ మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన మహిమాన్విత మన్య ప్రజల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ శ్రీ దుర్గా భవాని జాతర మహోత్సవంలో పాల్గొనడం జరిగింది.

అనంతరం ఆలయ అర్చకులు అతిథులను స్వాగతిస్తూ, ఆశీర్వచనం చేసి,తీర్థ ప్రసాదాలు అందించారు.ఈ కార్యక్రమంలో సెట్విన్ చైర్మెన్ గిరిధర్ రెడ్డి, మాజీ ఇండస్ట్రియల్ చైర్మన్ మహమ్మద్ తన్వీర్,మండల అధ్యక్షులు రామలింగారెడ్డి,హన్మంతరావు పాటిల్, శ్రీనివాస్ రెడ్డి,మాజీ జడ్పీటీసి భాస్కర్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ మల్లన్న పాటిల్,కాంగ్రెస్ నాయకులు ఉజ్వల్ రెడ్డి,శుక్లవర్ధన్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకులు అంజయ్య ,సాయిలు, దశరథ్, అరుణ్ తథితరులు పాల్గొన్నారు.

శ్రీ శ్రీ దుర్గా భవాని జాతర మహోత్సవం హాజరైన.

శ్రీ శ్రీ శ్రీ దుర్గా భవాని జాతర మహోత్సవం హాజరైన మాజి మంత్రివర్యులు ,సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

కోహిర్ మండలం నాగిరెడ్డి పల్లి లో జరుగుతున్న శ్రీ దుర్గా భవాని మాత జాతర ఉత్సవాలకు మాజీ మంత్రులు హరీష్ రావు , సబితా ఇంద్రారెడ్డి గారు,స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్,మాజి జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి గార్లతో తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారి దయతో రాష్ట్రం బాగుండాలని ఆకాంక్షించారు.రానున్న రోజుల్లో గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ లు గుండప్ప ,రామకృష్ణ రెడ్డి,మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,పాక్స్ చైర్మన్ స్రవంతి అరవింద్ రెడ్డి,ఆలయ కమిటీ , గ్రామస్థుల తదితరులు పాల్గొన్నారు.

శ్రీశ్రీశ్రీ జగద్గురు రేవణ సిద్దేశ్వర స్వామి.

శ్రీశ్రీశ్రీ జగద్గురు రేవణ సిద్దేశ్వర స్వామి-చండికాంభ మాత సమేత జయంతి మహోత్సవ ఆహ్వానము

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఈ కార్యక్రమునకు విచ్చేయుచున్న పూజ్యులు శివాచార్య మహా స్వాములు

1. ష బ్ర॥ శ్రీ108 శ్రీగురు శివయోగి శివాచార్య మహాస్వామి గారు, జంగమయ్య గుట్ట తంగెడపల్లి

2. శ్రీశ్రీశ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజ్ గారు, బర్దిపూర్

3. శ్రీశ్రీశ్రీ ష||బ్ర|| 108 వీరేశ్వర శివాచార్య మహారాజ్ గారు, హీరేమఠ్ ధనసిరి

4. శ్రీశ్రీశ్రీ షుబ్ర॥ చంద్రశేఖర శివాచార్య మహారాజ్ గారు, బేమలే ఖేడ్

5. శ్రీశ్రీశ్రీ బసవలింగ అవధూతగిరి మహారాజ్ గారు మల్లన్నగుట్ట ఆశ్రమము

గ్రామ శ్రీ సిద్ధేశ్వర మఠం నుండి స్వామి వారి పాదుకలను మంగళవాయిద్యములతో మరియు భజన
భక్తి గీతాలను ఆలపిస్తు మందిరమునకు తీసుకొని పోవుట.ద్వజరోహణము – శిఖర పూజ గురుస్వాములచే.మహన్యాస పూర్వక రుద్రాబిషేకము. తీర్థ ప్రసాదములు, రాత్రికి భజన కీర్తనములు
స్వామి వారికి రుద్రాబిషేకము శ్రీ చండికాంభ మాతకు సహస్ర కుంకుమార్చన హారతులు తదుపరి తీర్థప్రసాదములు

11 మంది దంపతులచే మహన్యస రుద్రాభిషేకము

రుద్రస్వాహాకార హోమము, యజ్ఞం, మహామంగళ హారతి తదుపరి భక్తులకు

తీర్ధప్రసాదము, అన్నదానం నిర్వహించబడును.

శ్రీ రేవణసిద్దేశ్వరస్వామి వారికి డోలారోహణము

శ్రీ వీరసోమేశ్వర చండికాంభ మాత సమేత పార్వతి పరమేశ్వరుల కళ్యాణము

అఖండ దీపారాధన (2500 జ్యోతులు వెలింగించుట)

మాహాత్ములచే ప్రవచనములు

సంగీత ధర్బార్ వివిద కళాకారులచే నిర్వహించబడును. తదుపరి భజనలు.

వర్షాకాలం పొంగుడు ఎండాకాలం ఎండుడు.

వర్షాకాలం పొంగుడు, ఎండాకాలం ఎండుడు.. 20 ఏళ్లుగా ఇదే గోస.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని గినియర్ పల్లి గ్రామంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. వర్షాకాలం వచ్చిందంటే గ్రామంలో ఉన్న బోరుబావులన్నీ నీటితో పైకి పొంగుతాయి. అదే ఎండాకాలం వచ్చిందంటే బోరు బావులలో నీరు అడుగంటి పోతుంది. నీటి కోసం గ్రామస్తులు ప్రతి ఏటా తంటాలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఇప్పటినుంచి కాదు, దాదాపు 20 సంవత్సరాల నుంచి కొనసాగుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి ఇక్కట్లు తీర్చాలని గ్రామస్తులు పలుమార్లు అధికారులు, నాయకుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని వాపోయారు. గ్రామంలో ప్రతి సంవత్సరం ఎందుకిలా జరుగుతుందో ఇప్పటివరకు ఎవరూ పరిశోధన చేయలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శాశ్వతమైన నీటి సమస్య పరిష్కారానికి పాలకులు, అధికారులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

సమస్యను పరిష్కరిస్తాం: ఎంపీడీవో.

గినియర్ పల్లి గ్రామంలో నీటి సమస్యపై ఝరాసంగం ఎంపీడీవో సుధాకర్‌ను వివరణ కోరగా, నీటి సమస్య ఉంటే తక్షణ పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో 4 నీటి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు. మిషన్ భగీరథ నీరు రావడం లేదని తమ దృష్టికి వచ్చిందని, సమస్యను పరిష్కరించేందుకు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

పిల్లలు చదువుతోపాటు దైవభక్తిని పెంపొందించుకోవాలి.

పిల్లలు చదువుతోపాటు దైవభక్తిని పెంపొందించుకోవాలి- జిల్లా సైకాలజిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎజ్రా మల్లేశం

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

 

పిల్లలు చిన్నప్పటి నుంచి చదువుతోపాటు దైవభక్తిని పెంపొందించుకోవాలని కరీంనగర్ జిల్లా సైకాలజిస్ట్ అసోసియేషన్ (టిపిఏ) అధ్యక్షులు మల్లేశం అన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలోని ఇమ్మానియేల్ ఏజి చర్చిలో పాస్టర్ మచ్చ తిమోతి ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన ఉచిత చిల్డ్రన్ బైబిల్ క్లాసులు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దైవభక్తి కలిగి ఉన్నప్పుడు పెద్దలను, తల్లిదండ్రులను గౌరవించే మంచి అలవాట్లు అలవాడతాయన్నారు. చదువుతోపాటు నీతి విలువలతో కూడిన జీవితాన్ని అలవర్చుకోవాలని సూచించారు. చిన్నప్పటినుంచి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని లక్ష్య సాధన కోసం పాటుపడుతూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా చిన్నారుల జీవితాలకు ఉపయోగపడే స్ఫూర్తిదాయకమైన మాటలను వివరించారు. అనంతరం ఇందులో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈకార్యక్రమంలో చర్చి నిర్వాహకులు మచ్చ తిమోతి, బైబిల్ క్లాస్ టీచర్లు రజిని, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

పక్కా కొలతలతో కిలో “మామిడికాయ ఆవ పచ్చడి”.

పక్కా కొలతలతో కిలో “మామిడికాయ ఆవ పచ్చడి” – ఎన్ని రోజులైనా ముక్క ఫ్రెష్, బూజు పట్టదు! –

◆ కొత్తవాళ్లైనా సరే! మామిడికాయ పచ్చడి ఇలా పెట్టండి – సంవత్సరం నిల్వ ఉంటుంది.

 

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లో మామిడి కాయ (ఆవ కాయ) పచ్చడి పెడుతుంటారు. అమ్మమ్మలు, నానమ్మల కాలంలో ఒక్కసారి పెడితే సంవత్సరమంతా నిల్వ ఉండడమే గాకుండా చక్కని రుచి ఉండేది. కానీ, కొంత మంది సరైన కొలతలు, నిల్వ చేయడంలో జాగ్రత్తలు పాటించకపోవడంతో ముక్క మెత్తబడడమే గాకుండా పచ్చడి బూజు పట్టేది. అందుకే ఇవాళ మామిడికాయ పచ్చడి పక్కా కొలతలతో ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. సరిగ్గా ఇవే టిప్స్ పాటించడం వల్ల ముక్క తాజాగా ఉండడంతో పాటు సంవత్సరమైనా సరే బూజు పట్టకుండా ఫ్రెష్​గా ఉంటుంది.

కావాల్సిన పదార్థాలు :

మామిడికాయ ముక్కలు – 1 కిలో

కల్లుప్పు – 200 గ్రాములు

ఆవాలు – 100 గ్రాములు

పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు – 80 గ్రాములు

మెంతులు – 1 టేబుల్​ స్పూన్లు

పచ్చడి కారం – 125 గ్రాములు

నువ్వుల నూనె లేదా పల్లీ నూనె – అర లీటర్​

పసుపు – అర టేబుల్ స్పూన్

 

ముక్క మెత్తబడకుండా, పచ్చడి బూజు పట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 

Mango Pickle.

 

 

 

మామిడి కాయ పచ్చడిలో కారం దినుసులు కలపడం కంటే కూడా అత్యంత ముఖ్యమైన విషయం శుభ్రత. పదార్థాలైనా, వాటిని ఉపయోగించే గిన్నెలైనా సరే అస్సలు తడి లేకుండా చూసుకోవాలి.ముక్కలకు ముందుగా నూనె పట్టించడం వల్ల అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. మెత్తబడకుండా కట్టిగా కరకరలాడుతుంటాయి.మామిడి కాయ నిల్వ పచ్చడి కోసం పెద్దవి కాకుండా మధ్యస్థంగా ఉన్న పుల్లని కాయలు ఎంచుకోవాలి.ముదురు రంగులో ఉన్న కాయలు రుచి బాగుంటాయి.పచ్చడిలో వేసే దినుసులు మొదలుకుని, వాడే పాత్రలు, జాడీల విషయంలో జాగ్రత్త వహించాలి.ఏ మాత్రం తేడా రాకుండా ఒక రోజు ముందుగానే ఎండలో ఆరబెట్టుకుని పచ్చడి కలపడానికి ముందు మిక్సీ పట్టుకోవాలి.పచ్చడి పింగాణీ జాడీలో నిల్వ చేసుకుంటే ఎక్కువ కాలం ఫ్రెష్​గా ఉంటుంది. ప్లాస్టిక్, స్టీల్ పాత్రల్లో నిల్వ చేయడం సరికాదు.

తయారీ విధానం :

మామిడి కాయలు ముక్కలు కొట్టించడానికి ముందుగానే వాటిని నీళ్లతో శుభ్రం చేసుకుని ఒక్కొక్కటి తీసుకుని క్లాత్​తో తుడిచి పెట్టుకోవాలి.అన్నింటినీ ఒకేసైజులో ముక్కలు కొట్టించి జీడితో పాటు టెంక లోపలి వైపు ఉన్న తెల్లని పీచు (పొర) లేకుండా తొలగించుకుని పక్కన పెట్టుకోవాలి.తేమ ఆరిపోయేలా ముక్కలన్నింటినీ శుభ్రం చేసుకుని ఫ్యాన్ కింద ఓ క్లాత్ పరిచి ఫ్యాన్​ గాలి కింద ఆరబెట్టుకోవాలి.ఇపుడు పచ్చడిలో కావాల్సిన ఉప్పు, కారం, ఆవాలు, మెంతులను రెడీ చేసుకోవాలి. వీటిని కూడా ముందు రోజే ఎండలో ఆరబెట్టుకుని విడివిడిగా మిక్సీ పట్టుకోవాలి.తీసుకున్న వెల్లుల్లిలో కొన్నింటిని కచ్చాపచ్చాగా రుబ్బుకొని మిగిలిన సగం పచ్చడిలో కలుపుకోవడానికి పక్కన పెట్టుకోవాలి

పచ్చడి కలుపుకొనే విధానం..

 

Mango Pickle.

పచ్చడి ముక్కలు కలుపుకోవడానికి వెడల్పాటి గిన్నెను తీసుకోవాలి. అందులో ఆరబెట్టుకున్న మామిడి కాయ ముక్కలు వేసుకుని ముందుగా పావు లీటర్ నూనె పోసుకుని బాగా పట్టించాలి.ఇవి పక్కనపెట్టి మరో గిన్నెలో కారం, ఉప్పు, ఆవ పిండి, మెంతులు లేదా మెంతి పిండి, పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత రుబ్బుకున్న వెల్లుల్లితో పాటు పక్కన పెట్టుకున్న వెల్లిపాయలు కూడావేసుకుని కలపాలి.ఇపుడు దినుసులన్నీ కలిపిన కారం, మామిడికాయ ముక్కలకు బాగా పట్టించాలి.ఈ సమయంలో మిగిలిన నూనె కూడా పోసుకుని మరో సారి కలుపుకోవాలి.

నిల్వ చేసే విధానం..

కలుపుకున్న పచ్చడిని ఓ జాడీలో పెట్టుకుని వస్త్రాన్ని చుట్టి మూడు రోజులు పక్కన పెట్టుకోవాలి.
ఈ లోగా నూనె, కారం అంతా ముక్కలకు బాగా పడుతుంది.మూడు రోజుల తర్వాత ఓ వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని మరోసారి చక్కగా కలుపుకోవాలి.
ఫైనల్ గా ఈ సమయంలో ఉప్పు, కారం రుచి చూసుకుని కలుపుకుంటే సరిపోతుంది.
తినడానికి సరిపోయే పచ్చడిని పక్కనపెట్టుకుని మిగిలినది జాడీలో నిల్వ చేసుకోవాలి.

వడ్ల కొనుగోలు పరిశీలించిన డిఎస్. చౌహాన్.

రైతులు, అధికారుల ముందే కొనుగోలు సమీక్ష.

ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలగొద్దని ఆదేశాలు.

రైతులకు చెల్లింపులలో జాప్యం జరగొద్దని సూచన.

హన్మకొండ జిల్లాలో వడ్ల కొనుగోలు జరుతున్న కేంద్రాలను రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి డిఎస్.చౌహాన్ శనివారం సందర్శించారు. వడ్ల కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. 

అందులో భాగంగా పి.ఎ.సి.ఎస్. ఉనికిచెర్ల,పి.ఎ.సి.ఎస్. ధర్మసాగర్, ఐకేపి ధర్మసాగర్, పి.ఎ.సి.ఎస్. తెల్లాకులగూడెంలలో వడ్ల కొనుగోలు తీరును పర్యవేక్షించారు. వడ్ల కొనుగోలు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. వడ్ల కొనుగోలు కేంద్రాలలోనే అటు అధికారులు, ఇటు రైతులతో చౌహాన్ మాట్లాడారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా జరగడానికి హార్వెస్టర్లను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయం నుండి అందే వాతావరణ సూచనల ఆధారంగా ప్రతి పిసిసి లో కొనుగోలు చర్యలను సక్రమంగా కొనసాగించాలని సూచించారు. వడ్ల నాణ్యత కోసం ప్రతి కేంద్రంలో ప్యాడీ క్లీనర్లు ఉపయోగించాలన్నారు‌. ట్యాబ్ ఎంట్రీలు వేగంగా పూర్తి చేయాలన్నారు. రైతులకు చెల్లింపులు త్వరగా చేయాలని ఆదేశించారు. వడ్లు కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, వడ్ల కొనుగోలు విధానాన్ని పారదర్శకంగా, వేగవంతంగా చేపట్టాలన్న కృత నిశ్చయంతో వుందని చౌహాన్ తెలిపారు. రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని చౌహన్ తెలిపారు.

కూకీ మిలిటెంట్లతో మణిపూర్‌లో అశాంతి

సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్న మిలిటెంట్లు

వీరు మనదేశ పౌరులు కాదు

మయన్మార్‌ నుంచి వచ్చి కూకీ ప్రజలపై ఆధిపత్యం

మత్తుమందుల అక్రమరవాణా, బలవంతపు వసూళ్లు, హత్యలు వీరి నిత్యకృత్యం

మైతేయీల మతసంప్రదాయాలను అడ్డుకుంటున్న కూకీలు

సుప్రీంకోర్టు జడ్జినే బార్‌ అసోసియేషన్‌లోకి అనుమతించని వైనం

మణిపూర్‌లో శాంతి ఎండమావేనా?
హైదరాబాద్‌,నేటిధాత్రి:
మణిపూర్‌లో మైతేయి, కూకీల మధ్య హింసాకాండ జరిగి మే 3తో సరిగ్గా రెండేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. ఇంపాల్‌, చురాచంద్‌పూర్‌, కంగ్‌పోక్పీ జిల్లా కేంద్రాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల చేశారు. ఈ సందర్భంగా మైతేయి వర్గానికి చెందిన సామాజిక సంస్థ ‘కోఆర్డినేటింగ్‌ కమిటీ ఆన్‌ మణిపూర్‌ ఇన్‌టిగ్రిటీ’ మే 3న ఒక సదస్సును ఏర్పాటు చేసింది. ప్రజలు తమ అన్ని పనులు మానుకొని మరీ ఈ సదస్సుకు రావాలని పిలుపునివ్వడంతో, ఎక్కడ ఏవిధమైన అల్లర్లు జరగకుండా పోలీసులు డేగ కళ్లతో నిఘాను కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో కూకీ మెజా రిటీ ప్రాంతాల్లో కూకీ విద్యార్థి సంఘం ‘ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ జోమీ స్టూడెంట్స్‌’ బంద్‌కు పిలుపుని చ్చింది. అంతేకాదు చురాచంద్‌పూర్‌ జిల్లా కేంద్రంలో ‘ఇండీజినియస్‌ ట్రైబల్‌ లీడర్స్‌ ఫోరం’ ఏ ర్పాటుచేసిన ఈవెంట్‌లో పాల్గనాలని ఈ విద్యార్థిసంఘం కూకీలకు పిలుపునిచ్చింది. రెండేళ్ల క్రితం జరిగిన హింసాకాండకు నిరసనగా ప్రజలు తమ ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేయాలని కూడా ఈ సంఘం కోరింది. మే 2023 నుంచి ఇంపాల్‌ లోయ వాసులైన మైతేయీలు, చుట్టుపక్కల పర్వత ప్రాంతాల్లో నివసించే కూకీ`జో గ్రూపుల మధ్య జరిగిన హింసాకాండలో 240 మంది ప్రాణాలు కోల్పోగా, 6వేలకు పైగా గాయపడ్డారు. మరో 60వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇక్కడి పరిస్థితులు అదుపులోకి రాకపోవడం ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్‌సింగ్‌ గత ఫిబ్రవరి 9న రాజీనామా చేయడంతో, కేంద్రం అదేనెల 13వ తేదీనుంచి మణిపూర్‌లో రాష్ట్రపతిపాలన విధించింది. ఇటీవల మైతేయీ, కూకీ తెగలకు చెందిన పౌరహక్కుల సంఘాల నాయకులు మరియు నా గా, మైతేయీ, కూకీ తెగలకు చెందిన ప్రజాప్రతినిధుల మధ్య సయోధ్య చర్చలకు ప్రోత్సహించి నా పలితం లేదు.
క్యాన్సర్‌లా పరిణమించిన కూకీ మిలిటెన్సీ
సస్పెన్షన్‌ ఆఫ్‌ ఆపరేషన్‌ (ఎస్‌ఓఓ) కింద కూకీ మిలిటెంట్‌ గ్రూపుల కార్యకలాపాలు ఇప్పుడు మణిపూర్‌ను క్యాన్సర్‌ రోగంలాగా పీడిస్తున్నాయి. నిజానికి ఈ ఒప్పందం కూకీ, మైతేయీ తెగల మధ్య శాంతి స్థాపనకోసం ఉద్దేశించింది. అయితే ఈ ఒప్పందాన్ని అడ్డంపెట్టుకొని, కూకీ మిలి టెంట్లు, కూకీ ప్రజల గ్రామాల్లో తిష్టవేసి, ప్రభుత్వ అధికార వ్యవస్థను ఎంతమాత్రం లెక్కచేయ కుండా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. నిజానికి ఈ కూకీ మిలిటెంట్లు భారతీయులు కా దు. మయన్మార్‌నుంచి సరిహద్దులు దాటి మనదేశంలో ప్రవేశించి కూకీ తెగల ప్రజలు నివసిం చే పర్యత ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాన్నే నడుపుతున్నారని చెప్పాలి. భారత్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌ ప్రాంతాల్లో నివసించే కూకీ తెగల ప్రజలతో కూడిన ‘కూకీలాండ్‌’ ఏర్పాటు వీరి ప్రధానడిమాండ్‌. నిజానికి కూకీ మిలిటెంట్లు ఎస్‌ఓఓ ఒప్పందాన్ని ఖాతరు చేయడంలేదు. బలవంతపు వసూళ్లు, ఆయుధాల అక్రమరవాణా, వేధింపులకు పాల్పడటం వీరికి నిత్యకృత్యమైంది. ఒకవిధం గా చెప్పాలంటే 2023 మే నెలలో రెండు తెగల మధ్య హింస ప్రజ్వరిల్లడానికి ముందే వీరు ఇటువంటి కార్యకలాపాలు యదేచ్ఛగా నిర్వహిస్తూ వచ్చారు. స్థానిక పోలీసుల నిర్లక్ష్య వైఖరి కూడా వీరిని ప్రోత్సహించినట్లవుతోంది. ఒక్కోసారి వీరు పాల్పడుతున్న స్థానిక నేరాలు, దేశ భద్రతకు ముప్పుగా మారుతుండటం వర్తమాన చరిత్ర.
మిలిటెంట్ల కాల్పులతోనే హింస ప్రారంభం
2023 మే నెలలో ప్రజ్వరిల్లిన హింస నిజానికి కూకీ మిలిటెంట్లు ఎస్‌ఓఎస్‌ ఒప్పందాన్ని ఉల్లం ఘించి, మైతేయీ గ్రామాలపై కాల్పులు జరపడంతో ప్రారంభమైంది. అప్పుడు మైతేయీ ప్రజ లు తమకు అందుబాటులో ఉన్న సంప్రదాయ తుపాకులతో ఎదురుదాడులకు దిగడంతో హింస తీవ్రరూపం దాల్చింది. తర్వాత గవర్నర్‌ అజయ్‌కుమార్‌ భల్లా ఆయుధాలను అప్పగించాలని కో రడంతో, మైతేయీ ప్రజలు తమవద్ద వున్న ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించారు. కానీ కు కీ తెగలవారు కొద్ది మంది మాత్రమే ఆయుధాలు అప్పగించడంతో ఇప్పటికీ వారివద్ద అధునాత న అయుధాలున్నాయన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా గ్రామరక్షక దళాలుగా వున్న కూకీల చేతిలో ఇటువంటి ఆయుధాలున్నాయని మైతేయీలు ఆరోపిస్తున్నారు.
ఉన్నతస్థాయివారికీ ఇబ్బందులు
ఇక్కడ కొనసాగుతున్న అరాచక పరిస్థితి ఉన్నతస్థాయికి చెందిన వారిని కూడా ఇబ్బందికి గురి చేస్తున్నది. ఉదాహరణకు ఈ ఏడాది మొదట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్‌.కోటేశ్వర్‌ (ఈయన మైతేయీ తెగకు చెందినవారు)ను చురాచంద్‌పూర్‌ స్థానిక బార్‌ అసోసియేషన్‌లోకి ప్రవేశిం చకుండా అడ్డుకున్నారు. నిజానికి ఈ సంఘటన స్థానిక లీగల్‌ మరియు పౌర హక్కుల సంఘాలను నిర్ఘాంతపోయేలా చేసింది. దేశ అత్యున్నత న్యాయస్థానానికి చెందిన న్యాయమూర్తిని కేవలం మైతేయీ తెగకు చెందిన వాడన్న కారణంగా ఈవిధంగా అనుమతించకపోవడానికి మించిన అ రాచకం మరేదైనా వుంటుందా? ఇది మిలిటెంట్లు చేసిన పనికాదు. చట్టం, రాజ్యాంగం బాగా తెలిసిన వారు పాల్పడిన చర్య.
మైతేయీలపై ఆంక్షలు
ఇదిలావుండగా మైతేయీ తెగల ప్రజలు ఏటా ఏప్రిల్‌ నెలలో ‘తాంగ్‌జిల్‌ పర్వతం’పైకి తీర్థయా త్రకు వెళ్లి అక్కడ మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ. కొన్ని తరాలుగా ఈ ఆచారాన్ని మైతేయీలు పాటిస్తున్నారు. అయితే కూకీ`జో తెగకు చెందిన ఆరు సంస్థలు ఈ యాత్ర జరుపకూడదని మైతేయీలకు హెచ్చరికలు జారీచేశాయి. ఇది మైతేయీ తెగ ప్రజల సాంస్కృతిక హక్కుపై నేరుగా జరిపిన దాడి! రాజ్యసభ ఎం.పి. తితులార్‌ కింగ్‌ సనజౌబా లీషిం బా తీవ్రంగా ఖండిరచారు. పౌరహక్కుల సంఘాలు కూడా కూకీ తెగల వ్యవహారశైలిని తీవ్రంగానిరసించాయి. కూకీాజో తెగకుచెందిన థాన్‌లాన్‌ వింగ్‌జాజిన్‌ వాల్టే హింస ప్రారంభమైన తొలినాళ్లలో తీవ్రంగా గాయపడ్డారు. కోలుకున్న తర్వాత ఒక టెలివిజన్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రెండు తెగల మధ్య శాంతి సుస్థిరతలు నెలకొనాల్సిన అవసరం వున్నదని చెప్పడంతో శాంతిపై ఆశలు చిగు రిరించాయి. కొద్దిరోజుల తర్వాత విచిత్రంగా ఆయన మాటమార్చి ‘ప్రత్యేక పాలన’ మాత్రమే మణి పూర్‌లో శాంతికి దోహదం చేస్తుందని మరో వీడియో విడుదల చేయడంతో కూకీ మిలిటెంట్లు ఆయనచేత అలా బలవంతంగా చెప్పించారన్న సంగతి స్పష్టమైంది. కూకీ తెగలో ఉదారవాదుల ను మిలిటెంట్లు తమ నియంత్రణలో వుంచుకుంటున్నారనేదానికి ఇది ఒక ఉదాహరణ.ఏప్రిల్‌ 21న కాంగ్‌పోక్పీ జిల్లా ఎస్‌.పి. ఆఫీస్‌ నుంచి ఒక ప్రకటన వెలువడిరది. కె.పొన్‌లెన్‌ గ్రామంలో, కాంగ్‌చుప్‌ ఏరియా ప్రొటెక్షన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ (కేఏపీడీసీ) ఏప్రిల్‌ 30న ఏర్పాటు చేసిన సమావేశం వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదంటూ స్థానిక సివిల్‌ పోలీసులు, మణిపూర్‌ రైఫిల్స్‌ (ఎంఆర్‌), ఇండియా రిజర్వ్‌ బెటాలియన్లను ఆదేశిస్తూ జారీచేసిన ప్రకటన ఇది. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది కూకీ ఇన్పీ తెగవారు.
రాష్ట్రపతి పాలనతో పరిస్థితి అదుపు
గత ఫిబ్రవరిలో రాష్ట్రపతిపాలన విధించిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితుల్లో మార్పువచ్చింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా నిర్దేశాలున్నప్పటికీ, రాష్ట్రంలో ఇప్పటికే స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. తెగలమధ్య అనుమానాలు ఇంకా సమసిపోలేదు. కేంద్ర సంస్థలు మౌనాన్ని పాటించడం కూడా ప్రజల్లో ఒకరమైన అస్పష్టత కొనసాగుతోంది. నిజం చెప్పాలంటే మణిపూర్‌ తన ‘ఉనికి’ కోసం పోరాడుతోంది. ముఖ్యంగా కూకీ మిలిటెంట్ల కార్యకలాపాలు, మాదక ద్రవ్యాల అక్రమర వాణా, తత్సంబంధిత హింసాత్మక సంఘటనలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. వీరి ప్రభావం పౌరసమాజం, రాజకీయాలు, శాంతిభద్రతలు, సాం స్కృతిక సంస్థల పై తీవ్రంగా వుంటోంది. తగిన చర్యలు తీసుకోవడంలో కేంద్రం తాత్సారం చేసే కొద్దీ, ఈ కూకీ మిలిటెంట్లు మరింత బలపడతారు. మతసహనం పాటింపులో పక్షపాత వైఖరి అనుసరించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. ఇది ప్రజాస్వామ్య సమర్థకుల్లో విశ్వాసాన్ని దె బ్బతీస్తుంది. వాస్తవానికి మైతీయీలు, కూకీలు పరస్పరం శాంతినే కోరుకుంటున్నారు. కానీ సమస్యల్లా మిలిటెంట్లతోనే! ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న రాష్ట్రపతిపాలన పరిపాలనా పరంగా ఒక సానుకూల దశగా వుండాలి. ముఖ్యంగా శాంతి సుస్థిరతలు నెలకొల్పేదిగా, తెగల మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి దోహదపడేదిగా వుండాలి. ఇదే సమయంలో అక్రమాలకు పాల్పడే ముష్క రులను నియంత్రించాలి. తద్వారా కొత్త ప్రభుత్వం సక్రమంగా పాలన కొనసాగించే వాతావరణాన్ని కల్పించగలగాలి. ఇది d సాధించేవరకు, మణిపూర్‌ను ‘చట్టం’ పాలిస్తుందా లేక తుపాకుల ఆధిపత్యం కొనసాగుతుందా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మిగిలిపోక తప్పదు!

పాలమూరు యూనివర్సిటీకి నాణ్యమైన విద్యుత్.

పాలమూరు యూనివర్సిటీకి నాణ్యమైన విద్యుత్ అందిస్తాం.

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

మహబూబ్ నగర్ /నేటి ధాత్రి:

 

మహబూబ్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని పాలమూరు యూనివర్సిటీకి నాణ్యమైన విద్యుత్ ను నిరంతరం అందిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాలమూరు యూనివర్సిటీ ఆవరణలో రూ.286.54 లక్షలతో నిర్మించనున్న 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ కు ఎమ్మెల్యే శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాలమూరు యూనివర్సిటీ ప్రాంగణంలో , ఇక్కడ చుట్టుప్రక్కల ఎన్నో విద్యాసంస్థలు రానున్నాయని , పాలమూరు యూనివర్సిటీ తో పాటు నూతనంగా రాబోయే విద్యాసంస్థలకు ఎలాంటి అంతరాయం కలగకుండా నిరంతరం విద్యుత్ అందించేందుకు ఇక్కడ సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని, రానున్న 6 నుంచి 8 నెలల లోపు ఈ సబ్ స్టేషన్ అందుబాటులోకి రానుందని, ఈ సబ్ స్టేషన్ అందుబాటులోకి వస్తే.. చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు సైతం నాణ్యమైన విద్యుత్ అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, ఎస్ఈ పివి రమేష్, డిఇ లక్ష్మణ్, పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.ఎన్ శ్రీనివాస్, పిజి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

బైపాస్ రోడ్డు నుంచి డంపు యార్డ్ ను తరలించాలి.!

బైపాస్ రోడ్డు నుంచి డంపు యార్డ్ ను తరలించాలి

డంపు యార్డు వద్ద పొగలు ఆర్పి వేయుటకు తక్షణ చర్యలు తీసుకోవాలి-సిపిఐ

కరీంనగర్ నేటిధాత్రి:

కరీంనగర్ నగర శివారు బైపాస్ రోడ్ లోని డంపు యార్డును తరలించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని, డంప్ యార్డ్ నుంచి వచ్చే పొగను వెంటనే ఆర్పివేయాలని కోరుతూ సోమవారం రోజున సిపిఐ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయ ముట్టడి నిర్వహించడం జరుగుతుందని దీనిలో వందలాదిగా ప్రజలు తరలి రావాలని సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజు,న్యాలపట్ల రాజులు ఒక సంయుక్త ప్రకటనలో నగర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈసందర్భంగా కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజులు మాట్లాడుతూ కరీంనగర్ నగరంలో ఉన్నటువంటి బైపాస్ రోడ్ లో గల డంప్ యార్డు వల్ల నగరంలోని దాదాపు పది డివిజన్లలో ముఖ్యంగా కోతిరాంపూర్, అల్కాపురి కాలని, హనుమన్ నగర్, గణేష్ నగర్, లక్ష్మీ నగర్, హౌసింగ్ బోర్డు, కట్టరాంపూర్, పోచమ్మ వాడ, శాషామహల్, మారుతి నగర్, అలుగునూర్, బొమ్మకల్ ప్రజలకు ఎండాకాలంలో మంటలు అంటుకుని పొగ రావడం వల్ల వాయు కాలుష్యం నెలకొని చాలామంది ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులతో ఆసుపత్రిల పాలవుతున్నారని, గర్భిణతో ఉన్న స్త్రీలు ఈపొగ పీల్చడం ద్వారా పుట్టే బిడ్డలకు కూడా ఇబ్బందులు జరుగుతున్నాయని కనీసం నగరపాలక అధికారులకు డంపు యార్డు తరలింపుపై ఆలోచన లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. గతంలో కరీంనగర్ మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్, మాజీ మేయర్ సునీల్ రావు కొన్ని కోట్ల రూపాయలతో చెత్తను శుద్ధి చేయడం కోసం మిషనరీని ఏర్పాటు చేశారని ఆమిషనరీ రెండు, మూడు రోజులు మాత్రమే నడిచి మూలకు పడ్డదని కోట్ల రూపాయల మిషనరీలో కుంభకోణానికి మేయర్, ఎమ్మెల్యే పాల్పడ్డారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. డంపు యార్డ్ మిసనరి కొనుగోలుపై న్యాయవిచారణ చేయాలన్నారు. దొంగే దొంగ అన్నట్లుగా మాజీ మేయర్ తన హయంలో స్మార్ట్ సిటీలో డంప్ యార్డ్ మిషనరీలో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి తన హాయంలో జరిగిన పనులలో అవినీతి జరిగిందని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. కరీంనగర్ లోని తీగల వంతెన, రివర్ ఫ్రంట్ లలో తీవ్ర అవినీతి జరిగిందని సాక్షాత్తు మాజీ మేయర్ సునీల్ రావు చెప్పడం చూస్తుంటే ప్రజలు వీస్తూ పోతున్నారని అన్నారు. తీగల వంతనపై నెలల తరబడి వీధి దీపాలు రాకపోవడం చూస్తుంటే నగరపాలక కమిషనర్ మొద్దు నిద్రలో ఉన్నారా అని వారు ప్రశ్నించారు. డంప్ యార్డ్ వల్ల ఇబ్బందులు పడుతున్నామని వివిధ వార్డులకు చెందిన ప్రజలు ప్రతి రోజు నిరసనలు తెలుపుతుంటే మున్సిపల్ అధికారులు తమకేమీ పట్టనట్లు మొద్దు నిద్రలో ఉండడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి డంప్ యార్డులో వస్తున్న మంటలను ఆర్పి వేయుటకు చర్యలు తీసుకోవాలని వెంటనే డంపింగ్ యార్డ్ ని ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు.

నిరుపేదలకే ఇందిరమ్మ ఇల్లు….

నిరుపేదలకే ఇందిరమ్మ ఇల్లు….

– ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలి….

– మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్…

కొల్చారం, (మెదక్) నేటిధాత్రి :-

 

 

నిరుపేదలకే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేలా పటిష్ట చర్యలు
తీసుకుంటున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. శనివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామంలో గృహ నిర్మాణ శాఖ, మండల ప్రత్యేక అధికారులు, ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల విచారణ ప్రత్యేక అధికారులతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ
ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అర్హులైన కుటుంబాలకు న్యాయం జరగేలా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా మరియు సమగ్రంగా నిర్వహించాలని సూచించారు.

 

Indiramma’s house

ఈ కార్యక్రమం ద్వారా నిజంగా అవసరమైన ఇండ్లు లేని పేద కుటుంబాలకు ఇండ్లు ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. గ్రామ, వార్డు స్థాయిలో అర్హులైన దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించి, వారిని ఎంపిక చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు లక్ష్యాల వారీగా నిర్దేశించుకొని అర్హుల ఎంపికను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలనలో ఎక్కడా కూడా ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా క్షేత్రస్థాయిలో సజావుగా సర్వే చేయాలని, ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా..అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు అందేలా చూడాలని స్పష్టం చేశారు.
అలాగే సర్వే చేసిన వివరాల పత్రాలను అత్యంత జాగ్రత్తగా భద్రపరచాలన్నారు. పరిశీలన చేసే క్రమంలో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకూడదని, సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ చేయడం జరుగుతుందని ఏదేని అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
గ్రామాల వారీగా పరిశీలన పూర్తి కాగానే మొదటి విడత లో ఎంపిక చేసిన అర్హుల జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయంలోని నోటీసు బోర్డులో ప్రదర్శించాలని వెల్లడించారు.
ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు తక్షణమే నిర్మాణం చేపట్టేలా అవగహన కల్పించాలని అన్నారు. విడతల వారిగా నిధులు మంజూరు చేయడం జరుగుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు వివరాలు .

ధాన్యం కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీలు చేయాలి….

– జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్…

కొల్చారం, (మెదక్) నేటిధాత్రి:-

 

కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీలు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు.
శనివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామంలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, సంబంధిత ఎంపీడీవో ఇతర అధికారులతో కలిసి
కలెక్టర్ పరిశీలించారు.

Grain

ధాన్యం సేకరణ, ట్యాబ్ ఎంట్రీలు . ఐకేపీ, కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటి దాకా సేకరించిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం సేకరించిన వెంటనే వాటి వివరాలను ట్యాబ్ ఎంట్రీ చేయాలని కలెక్టర్. సూచించారు. నాణ్యతా ప్రమాణాలు మేరకు ధాన్యం తీసుకువచ్చిన రైతుల నుంచి నిబంధనల ప్రకారం తూకం వేయాలని ఆదేశించారు. ధాన్యం డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడేలా చూడాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు వివరాలు ట్యాబ్ ఎంట్రీ చేయని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐకేపీ, డీసీఎంఎస్, ప్యాక్స్, ఆద్వర్యంలో ఇప్పటి దాకా 2715 మంది రైతుల నుంచి 53,602 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని వెల్లడించారు. మొత్తం రూ. 28కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో వేశామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, సుశీల్వా, కొల్చారం మండల సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల బంద్ విజయవంతం.

మంచిర్యాల బంద్ విజయవంతం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

 

జమ్మూ కాశ్మీర్ పెహల్గాం లో పాకిస్తాన్ ఉగ్రమూకలు హిందువులపై దాడి చేసి 25 మందిని కిరాతకంగా చంపేసిన దుశ్చర్యను నిరసిస్తూ శనివారం హిందూ సంఘాల ఐక్య వేదిక మంచిర్యాల బంద్ పిలుపు మేరకు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని సంపూర్ణ బంద్ కు మద్దతు ఇవ్వడం జరిగింది.పార్టీ కండువాలు పక్కనపెట్టి మనమంతా హిందువులం అంటూ బైక్ ర్యాలీకి పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయడం చేశారు.హిందూ సంఘాలకు ఐక్య వేదిక అధ్యక్షులు కార్యదర్శి,డేగ రవింద్, కర్ణకంటి రవీందర్ మాట్లాడుతూ హిందువులంతా ఏకమై గర్జించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ఉగ్రవాదం పై ఒక పాదం మోపి సమూలంగా పాతలానికి తొక్కేయాలని ప్రభుత్వాన్ని కోరారు.బందుకు మరియు బైక్ ర్యాలీకి సహకరించి మద్దతు తెలిపిన అన్ని వర్గాల ప్రజలకు,కుల సంఘాలకు,వ్యాపారస్తులకు, వివిధ పార్టీ ప్రజాప్రతినిధులకు ధన్యవాదములు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version