బడులా అవి బందెలదొడ్లా?

`ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేటు స్కూళ్లు

`లక్షలకు లక్షల ఫీజులు వసూలు

`పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న స్కూళ్లు

`తెలంగాణలో ప్రతి ఏటా కొన్ని వేల కొత్త స్కూళ్లు

`బ్రాంచీల మీద బ్రాంచీలతో కార్పొరేట్‌ స్కూళ్లు

`అరకొర సౌకర్యాలు.. గాలి కూడ ఆడని గదులు

`మూడు నాలుగు అంతస్తుల భవనాలు

`పిల్లలను గొర్రెల మందల్లా కుక్కేస్తున్నారు

`ప్లే గ్రౌండ్‌లకు దిక్కు లేదు

`ప్రశాంతమైన వాతావరణం అసలే వుండదు

`హైదరాబాదు తో పాటు శివారు ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో వెలుస్తున్న స్కూళ్లు

`జిల్లాలు, మండలాలు, గ్రామాలలో కూడా అనేక ప్రైవేటు స్కూళ్లు

`ఇబ్బడి ముబ్బడిగా ప్లే స్కూళ్లు

`ఉద్యోగాలు చేసుకునే వారి పిల్లల కోసం పెద్ద ఎత్తున ప్లే స్కూళ్లు

`గల్లీ స్కూళ్లలో వేలకు వేలు ఫీజులు

`కార్పొరేట్‌ స్కూళ్లలో లక్షలకు లక్షలు వసూలు

`జనవరి నుంచే కార్పొరేట్‌ స్కూళ్లలో అడ్మిషన్లు

`వేలకు వేలు అడ్వాన్సులు…ట్యూషన్‌ ఫీజులు

`అకాడమిక్‌ ఇయర్‌ పూర్తి కాకుండానే దోపిడీ మొదలు

`ఎక్కడికక్కడ ఇబ్బడి ముబ్బడిగా అడ్మిషన్ల జోరు

`ఇప్పుడు అడ్మిషన్లు తీసుకుంటే కొంత తగ్గింపు

`ఇప్పుడున్న ఫీజులు తర్వాత పెరగొచ్చు

`ఆలస్యం చేస్తే సీట్లే దొరక్కపోవచ్చు

`ఇవీ ప్రైవేటు స్కూళ్లు సాగిస్తున్న ప్రకటనలు

`విద్యా శాఖ అధికారుల అలసత్వం

`ప్రైవేటు స్కూళ్లపై కరువైన నియంత్రణ

`కార్పొరేట్‌ స్కూళ్లలో కూడా కనీస శిక్షణ లేని టీచర్లే ఎక్కువ

`తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు స్కూళ్ల దోపిడీకి అడ్డూ అదుపు లేదు

హైదరాబాద్‌,నేటిధాత్రి:
అవి బడులా బందెల దొడ్లా! హైదరాబాద్‌ నుంచి మొదలుపెడితే, ఆఖరుకు పల్లెల్లో కూడా పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేటు స్కూళ్లు ఎలా వుంటున్నాయో అధికారులు చూస్తున్నారా? కనీసం పట్టించుకుంటున్నారా? పర్వవేక్షిస్తున్నారా? అధికారుల పర్మిషన్లతోనే ప్రైవేటు స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నారా? అధికారులను లెక్క చేయకుండానే పుట్డుకొస్తున్నాయా? ఎక్కడిక్కడ వెలుస్తున్న ప్రైవేటు బడులు ఎలా వుంటున్నాయో, వున్నాయో పర్వవేక్షించిన తర్వాతనే అనుమతులిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు ఒక స్కూల్‌ ఏర్పాటు చేయాలంటే ఎలాంటి సౌకర్యాలు వుండాలో స్పష్టమైన లెక్కలున్నాయి. చట్టంలో సూచించబడ్డాయి. స్కూల్‌ ఎలాంటి వాతావరణంలో వుండాలో కూడా నిర్థిష్టంగా చెప్పబడి వుంది. అసలు పాఠశాల భవనం ఎలా వుండాలో స్పష్టంగా చట్టంలో సూచించడం జరిగింది. ప్రతి స్కూల్‌ విశాలమైన, ప్రశాంతమైన వాతావరణంలో అర్థ చంద్రాకారాపు ఆకారంలో భవన నిర్మాణం వుండాలి. గాలి వెలుతురు దారాలంగా రావాలి. ఒక తరగతి ఎలా డిజైన్‌ చేయాలో చెప్పబడి వుంది. ఒక తరగతిలో ఎంత మంది విద్యార్థులు వుండాలో కూడా విద్యా హక్కు చట్టంలో స్పష్టంగా రాసి వుంది. ప్రభుత్వ పాఠశాలలు అన్ని ఈ సౌకర్యాలు కలిగి నిర్మాణం చేసి వున్నాయి. మరి ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లు ఇలాంటి వాతావరణ పరిస్థితులలో నిర్మాణాలున్నాయా? ఆ మౌలిక సదుపాయాలు ఎన్ని ప్రైవేటు స్కూళ్లలో వున్నాయి? ఈ విషయాలు ఏ అధికారులన్నా పట్టించుకుంటున్నారా? ఆ చట్టం అమలు చేస్తున్నారా? చట్ట ప్రకారం నిర్మాణంలో లేని స్కూళ్ల అనుమతులు రద్దు చేశారా? చేస్తున్నారా? విద్యా హక్కు చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటే తెలంగాణలో వున్న ప్రైవేటు స్కూళ్లలో కనీసం ఎనభై శాతానికి పైగా స్కూళ్లు మూసివేయబడతాయి. హైదరాబాదులో తొంభై ఐదు శాతం ప్రైవేటు స్కూళ్లు మూసివేయొచ్చు. కానీ అధికారులు కదులుతున్నారా? చర్యలు తీసుకోగలరా? ఆ ఉదాసీనత ఎవరిది? ఆ నిర్లక్ష్యం ఎవరిది? ఆ అలసత్వానికి బాధ్యులెవరు? ప్రతి జిల్లాలో పదుల సంఖ్యలో ఉన్నతాధికారులున్నారు. జిల్లా, మండల స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు. మరి వాళ్లంతా ఏం చేస్తున్నారు. ఇకపోతే అలాంటి స్కూళ్ల దోపిడీ గురించి రాస్తే రామాయణం అవుతుంది. ప్రైవేట్‌ స్కూళ్లు అప్పుడే అడ్మిషన్ల దుకాణాలు తెరిచాయి! ఇంకా ఈ అకాడమిక్‌ ఇయర్‌ పూర్తి కాలేదు. పరీక్షలు నిర్వహించలేదు. ఫలితాలు ప్రకటించలేదు. వేసవి సెలవులు ఇవ్వలేదు. కానీ కొత్త అకాడమీ అడ్మిషన్లు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఆలోచించిన ఆశా భంగం అన్నట్లు సీట్లు నిండిపోతున్నాయంటూ ప్రచారం సాగిస్తున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్‌ స్కూళ్ల నుంచి చిన్నా చితకా స్కూళ్లలో పరీక్షల కోలాహలం కన్నా అడ్మిషన్ల హడావుడే ఎక్కువగా కనిపిస్తోంది. స్కూళ్ల ముందు జాతర తలపిస్తోంది. ప్రతి రోజు ప్రైవేటు స్కూళ్ల ముందు వందల సంఖ్యలో వాహనాలు. పిల్లలు, వాళ్ల తల్లిదండ్రులు. అడ్మిషన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. గతంలో కొత్త అకాడమీ ఇయర్‌ మొదలైన తర్వాత అడ్మిషన్ల ప్రక్రియ సాగేది. కొంత కాలానికి వేసవి సెలవులలో అడ్మిషన్లు సాగించే వారు. ఇప్పుడు ఏకంగా జనవరి నెలలోనే స్కూళ్ల ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అడ్మిషన్లు మొదలుపెడుతున్నారు. వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. పిల్ల పుట్టక ముందే కుళ్ల కుట్టి పెట్టుకున్నట్లు అడ్మిషన్లతోనే పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫామ్స్‌, షూజులు, బ్యాచులు, టిఫిన్‌ బాక్స్‌లు, ఇతర అన్ని రకాల వస్తువులు అడ్మిషన్ల నాడే తల్లిదండ్రులకు అంటగడుతున్నారు. ఇంతటి దుర్మార్గం గతంలో పెద్దగా కనిపించేది కాదు. తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు స్కూళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్నాయి. పేద ప్రజల బలహీనతను సొమ్ము చేసుకుంటున్నాయి. పెద్ద పెద్ద స్కూళ్లకు దీటుగా ఫీజులు ఇష్టానుసారం వసూలు వేస్తున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం వెనుకబడి వుంటున్నాయి. నిబంధనలు గాలికి వదిలేస్తున్నాయి. విద్యా హక్కు చట్టాన్ని యధేచ్చగా ఉల్లంఘిస్తున్నాయి. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం కూడా ఇందులో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఎలాంటి అనుమతులు లేని స్కూళ్లు అనేకం వున్నాయి. అధికారులు కనీస తనిఖీలు నిర్వహించింది లేదు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఎన్ని అనుమతులున్న ప్రైవేటు స్కూళ్లు వున్నాయో, అనుమతులు లేనివి ఎన్ని వున్నాయో కనీస సమాచారం కూడా వారి వద్ద పూర్తి స్థాయిలో లేదని తెలుస్తోంది. అందుకే ఎవరికి వారు, ఎక్కడ పడితే అక్కడ ఏటా కొత్త కొత్త స్కూళ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక అనేక కార్పొరేట్‌ స్కూళ్లు బ్రాంచీల మీద బ్రాంచీలు ఏర్పాటు చేస్తున్నారు. అటు కార్పొరేట్‌ స్కూళ్లు గాని, ఇటు చిన్నా చితకా స్కూళ్లలలో వసతుల లేమితోనే నిర్వహిస్తున్నారు. ఇరుకైన గదులు. సరైన మార్గం లేకుండా చిన్న చిన్న బిల్డింగ్‌ లలో నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు చాలా స్కూళ్లలో ఆట స్థలం వుండదు. కనీసం ప్రేయర్‌ చేయించడానికి సైతం స్థలం లేని స్కూళ్లే అధికం. ఇక బోధన విషయానికి వస్తే మాత్రం నిపుణులైన అద్యాపకులు ఎక్కడా కనిపించరు. అరకొర చదువులు వదిన వాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. పిల్లల నుంచి మాత్రం భారీగా ఫీజులు వసూలు చేస్తారు. ఒక స్కూల్‌లో ఉపాధ్యాయుడి నియామకం జరగాలంటే కనీస అర్హతలు నిర్థారించి వుంది. ప్రైమరీ స్కూల్‌ అయితే కచ్చితంగా టిటిసి చేసి వుండాలి. హై స్కూల్‌ అయితే బిఈడీ పూర్తి చేసి, టెట్‌ కూడా పాస్‌ అయి వుండాలి. ఎందుకంటే టీచర్‌ అనగానే పాఠాలు చెప్పడం మాత్రమే వస్తే సరిపోదు. టీచర్‌ అంటే కనీసం అర్థం, అవగాహన లేని వాళ్లు స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ట్రైయిన్డ్‌ టీచర్‌ అయితే బిఈడీ, టిటిసిలలో విద్యార్థుల మానసిక పరిస్థితులను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయిస్తారు. విద్యార్థుల మానసిక సామర్ధ్యాలపై పూర్తి ట్రైనింగ్‌ టీచర్ల అవగాహనతో వుంటారు. చైల్డ్‌ సైకాలజీ చదువుకొని వుంటారు. చైల్డ్‌ మెధడాలజీపై పట్డున్నవారుంటారు. ఏ విద్యార్థికి ఎలా పాఠం చెబితే అర్థం చేసుకోగలరన్న దానిపై పూర్తి జ్ఞానంతో వుంటారు. అంతే గాని స్కూళ్లను బందర దొడ్డిలా మార్చి గుంపంతటికీ ఒకేలా పాఠం చెబితే అందరూ అర్థం చేసుకోలేరు. ఒత్తిడిని తట్టుకోలేని పిల్లలకు ఎలా పాఠం చెప్పాలి. ఎలాంటి అవగాహన తో వారికి పాఠం బోధించాలన్నది కేవలం ట్రైన్డ్‌ టీచర్లకు మాత్రమే తెలుస్తుంది. చాలా మంది పిల్లల ఎంతో సెన్సిటివ్‌ గా వుంటారు. అలాంటి వారికి అర్థమయ్యే తరహాలో సబ్జెక్టు చెప్పడంలో శిక్షణ పొందిన అద్యాపకులకే సాధ్యమౌతుంది. అందువల్ల ప్రైవేటు స్కూళ్లు ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి పాఠశాలల నిర్వహణ మూలంగా ఇటీవల కొంత మంది విద్యార్థులు చనిపోయిన ఘటనలున్నాయి. తల్లిదండ్రులకు కడుపుకోతలను మిగిల్చుతున్నాయి. ఇక ఇటీవల స్కూళ్లతో పాటు ప్లే స్కూల్స్‌ కూడా విపరీతంగా ఏర్పాటు చేస్తున్నారు. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేయడం వంటి పరిస్థితులు వున్నవారు ఎక్కువగా తమ పిల్లల్ని ప్లే స్కూళ్లలలో జాయిన్‌ చేస్తున్నారు. కాస్త అడుగులు వేయడం వచ్చే పిల్లల్ని కూడా ఇలాంటి స్కూళ్లలో జాయిన్‌ చేస్తున్నారు. ఇది కూడా ఇప్పుడు మార్కెట్‌ లో ఒక వ్యాపారమైపోయింది. ఇంట్లో తమ పిల్లల్ని చూసుకునే తీరిక, వీలు, ఓపిక లేని తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతరులకు అప్పగిస్తున్నారు. వందల మందికి ఐదారుగులు మహిళా టీచర్లు, ముగ్గురు నలుగురు ఆయాలతో వాటిని నిర్వహిస్తుంటారు. వాళ్లు ఏ మాత్రం అలసత్వం వహించినా పిల్లల పరిస్థితి ఎలా వుంటుందని ఏ ఒక్క తల్లిదండ్రులు ఆలోచించడం లేదు. తల్లిదండ్రులు ఇలా వుండడం వల్ల విచ్చలవిడిగా ప్లే స్కూళ్లు వెలుస్తున్నాయి. కానీ అధికారులు పర్యవేక్షణ లేదు. సందర్శన అసలే లేదు. నియంత్రణ అన్నది కనుచూపు మేరలో లేదు.

ఉక్కుపిడికిలి…పోరు వాకిలి బిఆర్‌ఎస్‌’’.

`తెలంగాణ కోసం పద్నాలుగేళ్ల యుద్ధం కేసిఆర్‌.

`తెలంగాణ కోసం పుట్టిన ఉద్యమ ఖడ్గం కేసిఆర్‌.

`తెలంగాణ జాతి విముక్తి పోరాటం కేసిఆర్‌.

`ఉద్యమానికి కేసిఆర్‌ ఊపిరిపోసి ఇరవైఐదు వసంతాలు!

`కేసిఆర్‌ జై తెలంగాణ గొంతెత్తి జైకొట్టి ఇరవైఐదేళ్లు.

`పిల్లా, జెల్లాకు ఉగ్గు పాలతో నూరిపోసిన నినాదం జై తెలంగాణకు పచ్చీస్‌ సాల్‌.

`ఉడుకు నెత్తురు ఉప్పెనై పొంగిన ఆవేశం టిఆర్‌ఎస్‌.

`బక్క పలుచని కేసిఆర్‌ సింహ గర్జనకు పాతికేళ్లు.

`చెక్కు చెదరని తెలంగాణ ఆత్మ గౌరవ విశ్వాసానికి సిల్వర్‌ జూబ్లీ.

`తెలంగాణకు గులాబీ తిలకం దిద్ది ట్వెంటీ ఫైవ్‌ ఇయర్స్‌.

`రైతు నాగలి గుర్తుతో జై తెలంగాణ నినాదం గర్జించిన రోజులు.

 `సరిగ్గా ఇరవై ఐదేళ్ల నాడు ఎటు చూసినా కరువే.

`ఎవరిని కదిలించినా దుఖమే.

`ఆగమైన బతుకునుండి కన్నీటి మంటలతో రగిలిన తెలంగాణ.

`తెలంగాణ తెచ్చుకోకపోతే పల్లెలు వల్లకాడులై పోతాయన్న భయం నుంచి పట్టిన బాట జై తెలంగాణ.

`పటపట మంటూ పండ్లు నూరుకుంటూ పరుగు పరుగున సాగిన ఉప్పెన తెలంగాణ.

`ఒక్కడుగా మొదలై కోట్ల మందికి గర్జన నేర్పిన నేత కేసిఆర్‌.

`‘‘పుబ్బ’’ లో పుట్టి ‘‘మగ’’ లో మాడిపోతుందన్న వారిని ఎదిరించి నిలిచిన పార్టీ టిఆర్‌ఎస్‌.

`తెలంగాణ సాధించే వరకు పద్నాలుగేళ్ల అవిశ్రాంత పోరాటం టిఆర్‌ఎస్‌.

`పదేళ్ల పాలనలో బంగారు తెలంగాణ ఆవిష్కృతం బిఆర్‌ఎస్‌.

`తెలంగాణ చీకట్లను పారదోలిన పార్టీ బిఆర్‌ఎస్‌.

`మోడువాడిన తెలంగాణను చిగురింపజేసిన పార్టీ బిఆర్‌ఎస్‌.

`ఎడారి లాంటి తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన పార్టీ బిఆర్‌ఎస్‌.

`అన్నమో రామచంద్రా అనే ఆకలి కేకల నుంచి దేశానికి అన్నం పెట్టిన పాలన బిఆర్‌ఎస్‌.

`తెలంగాణ రైతును రాజును చేసిన పార్టీ బిఆర్‌ఎస్‌.

`తెలంగాణ తెచ్చింది ‘‘టిఆర్‌ఎస్‌’’… బంగారు తెలంగాణ చేసింది ‘‘బిఆర్‌ఎస్‌’’.

తెలంగాణ ఉద్యమ సృష్టికి మూలమైన బిఆర్‌ఎస్‌ పార్టీ ఎవరూ ఊహించనటు వంటి ఉద్యమాలకు, పోరాటాలకే కాదు, సభలకు, సమావేశాలకు కూడా పెట్టింది పేరు. రాజకీయ పార్టీల చరిత్రలో బిఆర్‌ఎస్‌పార్టీ నిర్వహించినన్ని సభలో ఏ పార్టీ నిర్వహించి వుండకపోవచ్చు. పద్నాలుగేళ్ల ఉద్యమ ప్రస్తానంలో కొన్ని వందల సభలు నిర్వహించిన ఘనత ఒక్క బి ఆర్‌ఎస్‌కే దక్కుతుంది. సభలల్లో చిన్న చిన్న సభలే కాదు, ఎవరి ఊహకందనటు భారీ భహిరంగ సభల నిర్వహణలో బిఆర్‌ఎస్‌దే పై చేయి. అలాంటి భారీ రాజకీయ, ఉద్యమ సభలు దేశంలో ఏ పార్టీ నిర్వహించలేదు. గతంలో హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో సభలు నిర్వహించి, వాటినే గొప్ప సభలుగా చెప్పుకున్న రోజులున్నాయి. ఎప్పుడైతే బిఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా నిర్వహంచిన భారీ భహిరంగ సభలతో పరేడ్‌ గ్రౌండ్‌ సభలకు కాలం చెల్లినట్లైంది. తెలంగాణలో ఏ పార్టీ రాజకీయ సభ పెట్టినా, బిఆర్‌ఎస్‌ సభలతో పోల్చుకుంటూ, మీడియా అనేక చర్చా వేధికలు ఇప్పటీకీ ఏర్పాటు చేస్తుంటాయి. సభల్లో బిఆర్‌ఎస్‌ను బీట్‌ చేయడం ఎవరి వల్ల కాదని ఆఖరుకు తీర్పునిస్తుంటాయి. అంతగొప్పగా సభలు నిర్వహించడంలో బిఆర్‌ఎస్‌ నాయకుల వ్యూహం ముందు ఏ పార్టీ సభలైనా బలారూరే అని చెప్పాలి. ఉద్యమ సమయంలో బిఆర్‌ఎస్‌ సభ అంటే పుట్టలు పగలి చీమలు వచ్చినట్లు జనం తండోపతండాలుగా వచ్చేవారు. ఎండా, వాన, చలిలను లెక్క చేయకుండా ఉద్యమ సభలను ప్రజలు విజయవంతం చేస్తుండేవారు. కరీంనగర్‌లో నిర్వహించిన సింహ గర్జనతో మొందలైన పెద్ద పెద్ద పెద్ద సభలు అప్పట్లో జిల్లాకొకటి జరగుతూ వుండేది. అప్పట్లో వరంగల్‌లో జరిగిన బిఆర్‌ఎస్‌ గురించి ప్రపంచమంతా మాట్లాడుకున్నదంటే ఆశామాషీ కాదు. వరంగల్‌ సభకు పదిహేను లక్షలమంది హజరైనట్లు లెక్కలున్నాయి. ఆ తర్వాత కూడా అనేక సభలు నిర్వహించి, ప్రజల్లో తెలంగాణ ఉద్యమాన్ని సజీవం చేసిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుంది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత గాని, అదికారంలో వున్న పదేళ్లలో గాని మళ్లీ అంత పెద్ద సభలు బిఆర్‌ఎస్‌ల నిర్వహణలు ఆపలేదు. 2014 ఎన్నికల సమయంలో కూడా ఎన్నికల సభలు పెద్దఎత్తున నిర్వహించారు. 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసిఆర్‌ చేసిన బస్సుయాత్రకు కూడా ప్రజలు తండోపతండాలుగా కదలి వచ్చారు. అంతకు ముందు నిర్వహించిన నల్గొండ సభకు కూడా ప్రజలు లక్షల సంఖ్యలో హాజరయ్యారు. బిఆర్‌ఎస్‌ పార్టీ పుట్టి 25 సంవత్సరాలు పూర్తి కావొస్తోంది. ఆ పార్టీ సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాల నిర్వహణకు ప్రణాళికలు సిద్దం చేసింది. అందులో భాగంగా తెలంగాణ ప్రజల్లో బిఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజాభిమానం చెక్కు చెదరలేదని నిరూపించేందుకు వరంగల్‌లో మరో భారీ భహిరంగ సభ నిర్వహించేందు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే గతంలో బిఆర్‌ఎస్‌సభలకు, ఈ నెల 27న వరంగల్‌లో జరిగే సభకు కొంత వ్యత్యాసముంది. గతంలో ఉద్యమ కోణంతోపాటు,రాజకీయ ఎన్నికల సభలు జరుగుతూ వుండేవి. కాని ఇప్పుడు బిఆర్‌ఎస్‌ పార్టీ పుట్టి ఇప్పటికీ 25 ఏళ్లు పూర్తి కావస్తుండడంతో ఈ సభ కూడా చరిత్రలో నిలిచేలా ప్లాన్‌ చేస్తున్నారు. గతంలో బిఆర్‌ఎస్‌కున్న రికార్డును బ్రేక్‌ చేయాలని చూస్తున్నారు. వరంగల్‌ సమీపంలోని ఎల్కతుర్తి సమీపంలో సుమారు 1200 ఎకరాలలో బిఆర్‌ఎస్‌ సిల్వర్‌ జూబ్లీసభ నిర్వహణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సుమారు 15 లక్షల మందిని సమీకరించే పనిలో బిఆర్‌ఎస్‌ శ్రేణులున్నాయి. తెలంగాణలో అధికారంకోల్పోయినా సరే, బిఆర్‌ఎస్‌పై ప్రజలకు ఏ మాత్రం అభిమానం తగ్గలేదని నిరూపించాలంటే ఉద్యమ సమయంలో జరిగిన సభలను మించి నిర్వహించాలని చూస్తున్నారు. అందుకోసం బిఆర్‌ఎస్‌ అద్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎప్పటికప్పుడు నాయకులతో చర్చలు జరుపుతున్నారు. సభ ఏర్పాట్లును ఎప్పటికికప్పుడు సమీక్షిస్తున్నారు. పనులు వేగం పెంచేందుకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఈ సభతో బిఆర్‌ఎస్‌ మరో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టేలా వుండనున్నది. బిఆర్‌ఎస్‌కు తెలంగాణలో ఎదురులేదని, తిరుగులేదని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాడిన్న కాలంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనంగా వుంటున్న కేసిఆర్‌ మొదటి సారి తన గళాన్ని వినిపించే వేదిక కావడంతో తెలంగాణ అంతా ఆ సభలో వుండేలా చూసుకుంటున్నారు. అందుకే 1200 ఎకరాల స్థలంలో సభ నిర్వహణను ఏర్పాటు చేస్తున్నారు.

బిఆర్‌ఎస్‌ అంటే రాజకీయాల కోసం పుట్టిన పార్టీ కాదు. ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ. కేసిఆర్‌ ఆలోచనతో మొగ్గ తొడిగిన పార్టీ. ప్రజల ఆవేదనల నుంచి పురుడు పోసుకున్న పార్టీ. ప్రజల ఆక్రందనల నుంచి మొలకెత్తిన పార్టీ. తెలంగాణ గోసలు తీర్చేందుకు ఏర్పాటైన పార్టీ. తెలంగాణ సాధన కోసం జ్వనించిన పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ధ్యేయంగా జ్వలించిన పార్టీ. ఉద్యమమై ఉరకలెత్తిన పార్టీ. పోరు దారిలో తెలంగాణ నినాదాన్ని దిక్కులు పిక్కటిల్లేలా వినిపించిన పార్టీ. తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరులూదిన పార్టీ. తెలంగాణ అనే నినాదాన్ని ఆకాశాన్ని తాకేలా గర్జించిన పార్టీ. తెలంగాణ అనాలంటే ముందు,వెనుక ఒకటికిపదిసార్లు ఆలోచించేవారు కూడా పిడికిలి బిగించి జై తెలంగాణ అని ఎలిగెత్తేలా చేసిన పార్టీ. గొంతు సవరించుకొని అప్పటి పాలకుల గుండెలు అదిరేలా జై తెలంగాణ అని నినదించిన పార్టీ. సమైక్య పాలకులు గుండెలు అదిరేలా జై తెలంగాణ జపం చేసిన పార్టీ. తెలంగాణను అడ్డుకున్న వారి వెన్నులో వణుకుపుట్టించిన పార్టీ. తెలంగాణ వ్యతిరేకులను, సమైక్య వాదులకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన పార్టీ. ఇక తెలంగాణ మనది కాదని సమైక్య వాదులు మూట ముల్లె సర్ధుకొని వెళ్లిపోయేలా చేసిన పార్టీ. ఇక ఎంత అడ్డుకున్నా తెలంగాణ ఆగేది లేదని, కాదని తెలుసుకొని సమైక్య వాదులచేత కూడా జై తెలంగాణ అని పించిన పార్టీ. తెలంగాణ నుంచి ఆకలి కేకలతో, బతుకెళ్లదీసుకునేందుకు వలసలు పోయిన ప్రజలు మళ్లీ ఆత్మగౌరవంతో బతికేలా చేసిన పార్టీ. వారి ఆకలి తీర్చి, అన్నం పెట్టిన పార్టీ. ఎడారి లాంటి తెలంగాణను సస్యశ్యామలం చేసిన పార్టీ. తెలంగాణలో నీటి పరవళ్లు నింపిన పార్టీ. ఎప్పుడో దశాబ్దాల తరబడి ఎండిపోయిన వాగుల్లో , వంకల్లో, ఒర్రెల్లో కూడా నీరు పారించిన పార్టీ. ఎప్పుడో ఎండిపోయి, తుమ్మలు మొలిచి ఆనవాలు లేకుండాపోయిన చెరువులను బాగు చేసి, ఊరుకు కల్పతరువు చేసిన పార్టీ. ఊరుకు చెరువే ఆదరవని నిరూపించిన పార్టీ. పదేళ్ల పాటు చెరులన్నీ గంగాళలంలా కళకళలాడేలా చేసిన పార్టీ. ఎండా కాలంలో కూడా చెరువులు మత్తళ్లు దుంకేలా చేసిన పార్టీ. పాడి పండలతో తెలంగాణ సిరి సంపదలతో తులతూగేలా చేసిన పార్టీ. ఇదంతా ఒక్క కేసిఆర్‌ సృష్టి. తెలంగాణ సాధనలో కేసిఆర్‌ కలలుగన్న ఆర్తి. తన కలలను తానే నిజం చేసి, తెలంగాణకు సిరుల తెలంగాణ చేసిన కీర్తీ కేసిఆర్‌. తెలంగాణను బంగారు తెలంగాణ చేసి సుసంపన్నం చేసిన ఘణకీర్తి కేసిఆర్‌. పద్నాలుగేళ్లపాటు అలుపెరగని పోరాటం చేసి, లక్ష్యం ముద్దాడిన పార్టీ. తెలంగాణ తెచ్చిన చరిత్రకు కీర్తి కిరీటం కేసిఆర్‌. తెచ్చిన తెలంగాణలో బంగారు సిరి రాసులను పండిరచేలా ప్రాజెక్టులను నిర్మాణం చేసిన అపర భగీరధుడు కేసిఆర్‌. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు తెలంగాణ రాకపోతే కలలో కూడా ఊహించలేం. తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్‌ లాంటి నాయకుడు లేకపోతే తెలంగాణలో జలసిరులు చూడలేకపోయేవాళ్లం. అందుకే కేసిఆర్‌ అనే మూడక్షరాల పదమే తెలంగాణకు జీవం. తెలంగాణ ప్రగతి వేదం. ఆయన చూపే ప్రజలకు వరం. ఆయన నవ్వే బంగారం. తెలంగాణ కోసం ఆయన జీవితమే ఒక త్యాగం. ఆ త్యాగ ఫలాలే మనం అనుభవిస్తున్న జీవితాలు అర్ధం…పరమార్ధం. పదేళ్లతో తెలంగాణ తల రాత మార్చిన ముక్కంటి శివునికి ప్రతిరూపం. తెలంగాణ భవిష్యత్తును తీర్చి బ్రహ్మరాతకు కేసిఆర్‌ జలయజ్ఞం నిదర్శనం. తెలంగాణను అన్ని రంగాలలో పదేళ్లల పరుగులు పెట్టించిన ఆధునిక ఆర్దిక వేత్త కేసిఆర్‌. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందేలా చేసిన వైతాళికుడు కేసిఆర్‌. తెలంగాణ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే జాతి పిత కేసిఆర్‌.

మమతా బెనర్జీలో పెరుగుతున్న అసహనం

వెంటాడుతున్న ఓటమి భయం

మితిమీరిన బుజ్జగింపు రాజకీయాలు మొదటికే మోసం తెస్తాయా?

ఆర్జీకర్‌ ఆస్పత్రి సంఘటన తర్వాత హిందూ ఓటర్లలో స్పష్టమైన మార్పు

తృణమూల్‌ వైఖరిపై కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం

వామపక్ష హిందూ ఓటర్ల ఆలోచనలో మార్పు

శ్రీరామనవమి ర్యాలీల ద్వారా హిందువుల ఐక్యతకోసం వ్యూహం

రాష్ట్రవ్యాప్తంగా 20వేల ర్యాలీల నిర్వహణకు నిర్ణయం

ఎప్పటిలాగే అనుమతివ్వని మమతా ప్రభుత్వం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలో ఇటీవల పెరిగిపోతున్న అసహన తీవ్రతను గమనించవచ్చు. ఒకవిధంగా చెప్పాలంటే ఆమె తీవ్ర ఒత్తిడిలో వున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని హిందువుల్లో పెరుగుతున్న జాగృతి స్పష్టంగా కనిపిస్తుండటంతో ఆమెలో ఒకవిధమైన ఆందోళన కనిపిస్తోంది. గత ఇరవయ్యేళ్ల పాలనలో ఆమె హిందువుల పండుగులకు ఏనాడు ఆంక్షలు విధించకుండా అనుమతులు ఇవ్వలేదు. ఇందుకు కారణం ముస్లింల ఓట్లు. ముస్లింల ఓట్లు గంపగుత్తగా పడతాయి కనుక ఆమె ఈ వర్గంవారిని సంతృప్తిపరచేందుకోసం వారికి అను కూల నిర్ణయాలు తీసుకుంటూ రావడం గమనార్హం. 2011 జనగణన ప్రకారం రాష్ట్రంలో ముస్లింల శాతం 27శాతం కాగా ఇప్పుడు దాదాపు 40శాతం వరకు చేరుకుంది. ఈ నేపథ్యంలో చీలిపోయే హిందువుల ఓట్లకంటే, ఏకమొత్తంగా పడే ముస్లింల ఓట్లు మమతా బెనర్జీని అధికారంలో నిలుపుతాయి. ఇదిలావుండగా రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో ముందు కెళుతున్న బీజేపీ హిందూ ఓట్లను సుసంఘటితం చేసే యత్నాలు గట్టిగా ప్రారంభించింది. గత అనుభవాలను దృష్టిలో వుంచుకొని మరీ అడుగులు ముందుకేస్తోంది. గతంలో వచ్చిన 38.5శాతం ఓట్లశాతానికి మరో ఐదు లేదా ఏడుశాతం ఓట్లు అధికంగా సాధించగలిగితే అసెంబ్లీలో పాగా వేయవచ్చన్నది పార్టీ వ్యూహం. ఇదే సమయంలో మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో అవధులు లేని స్థాయికి చేరుకున్న అవినీతి, అత్యాచారాలు, హత్యలు, ఆర్జీకర్‌ ఆసుపత్రి సంఘటన వంటివి హిందువుల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచేశాయి. ఈ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలచుకునేందుకు బీజేపీ ఇప్పటినుంచే వ్యూహాలు పన్నుతోంది.

ఈ వ్యూహంలో భాగంగా వచ్చే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా కోటిమందితో రాష్ట్రంలో పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించాలని ప్రణాళికను సిద్ధం చేసింది. గతంలో మాదిరిగానే పోలీసు లు శాంతిభద్రతల సమస్యను చూపుతూ ఇందుకు అనుమతినివ్వలేదు. ఉదాహరణకు శ్యాంపూర్‌లో రెండు`మూడు లక్షలమంది హిందూ జనాభా వుంటే, ఇక్కడ ర్యాలీలో కేవలం 2000` 2500 మంది మాత్రమే పాల్గనాలని పోలీసులు ఆంక్షలు విధించడం ఇందుకు గొప్ప ఉదాహరణ. ఇటు వంటి మితిమీరిన ఆంక్షలు రాష్ట్రవ్యాప్తంగా విధించడంతో విపక్షనేత సుబేందు అధికారిఇప్పుడు ప్రభుత్వంపై నేరుగా విమర్శల దాడిని పెంచారు. రాజ్యాంగంలోని 25`28 అధికరణ లు ప్రసాదిస్తున్న మతస్వేచ్ఛను మమత ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఆయన ఎదురుదాడికి ది గారు. ‘సనాతని’లను ఎక్కడికక్కడ అడ్డుకోవడం, అణచివేయడం మమతా ప్రభుత్వానికే చెల్లిం దంటూ ఆ యన ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా శ్రీరామనవమికి కోటి మందితో ర్యాలీలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఓట్లకోసం ఆమె జిహాదీ మూకలకు మద్దతు పలుకుతూ హిందువులపై దారుణంగా అణచివేత చర్యలకు పాల్పడుతున్నదన్నారు. ఆ యన విమర్శల మాట ఎట్లావున్నా, రాష్ట్రంలోని హిందువుల్లో గతంలో ఎన్నడూలేని విధంగా ఒకరమైన చైతన్యం వచ్చిందనే చెప్పాలి. హిందువుల ఓట్లు కాంగ్రెస్‌, వామపక్షాలు, బీజేపీల మధ్య చీలిపోయి వుండటం తృణమూల్‌ కాంగ్రెస్‌కు వరంగా మారింది. ఇదే సమయంలో ముస్లింల ఓట్లు గంపగుత్తగా సాధించడంతోపాటు, తనకు పడే హిందూఓట్లు ఆమె అధికారాన్ని చెక్కుచెదర కుండా కాపాడుతున్నాయి. కానీ ఆర్జీకర్‌ ఆసుపత్రి సంఘటనతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రజల ఆలోచనా సరళిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వామపక్షాలు సోదిలోలేకుండా పోయినా, వారికున్న హిందూ ఓటర్లు ఇప్పుడు తమ అభిప్రాయాన్ని మార్చుకొని బీజేపీకి అనుకూలంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

 తనను నిర్లక్ష్యం చేసినందుకు కాంగ్రెస్‌ పార్టీ గత డిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీని కోలుకోలేని దెబ్బకొట్టింది. ఇదే పంథా పశ్చిమ బెంగాల్‌లో కూడా అనుసరించాలన్నది కాంగ్రెస్‌ వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు వామపక్షాలతో కలిసి తృణమూల్‌ కాంగ్రెస్‌కు స్నేహపూర్వక మద్దతు ఇచ్చినా, మమత తమను ఎంతమాత్రం ఖాతరు చేయకపోవడం కాంగ్రెస్‌ అధినాయకత్వానికి మింగుడుపడటంలేదు. ఈసారి కాంగ్రెస్‌ ఓటుబ్యాంకు, తృణమూల్‌కు అనుకూలంగా ఓటు వే యనట్లయితే ఆమేరకు మమతా బెనర్జీకి నష్టం వాటిల్లే అవకాశాలే ఎక్కువ. ఎంత ముస్లిం ఓట్లు గంపగుత్తగా పడినా, హిందూ ఓట్లు రాకపోతే మమతా బెనర్జీ అధికారంలోకి రావడం కష్టం. తాజా పరిణామాల నేపథ్యంలో వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీల ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యే అవకా శాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే తృణమూల్‌ పుట్టి మునగడం ఖాయం.

ఈ పరిణామాలన్నింటిని దృష్టిలో వుంచుకొని బీజేపీ నాయకుడు సుబేందు అధికారి ఇప్పుడు నే రుగా సనాతని, హిందూత్వలకు అనుకూలంగా తన ప్రసంగాల వాడిని పెంచారు. ‘జో హమారే సాత్‌, హమ్‌ ఉన్‌కే సాత్‌’, ‘సబ్‌కా సాత్‌, సబ్‌గా వికాస్‌’ నినాదాలతో 2024 జులైనుంచి ఆయనతన ప్రసంగ ధోరణినే పూర్తిగా మార్చివేశారు. కొన్ని సందర్భాల్లో ‘కేవలం హిందువులు మాత్రమే హిందూస్తాన్‌ను పరిపాలిస్తారు’ అంటూ నినాదాలిస్తున్నారు. బహుశా ఈ దూకుడుకు ప్రధానకారణం వామపక్షాలు, కాంగ్రెస్‌ ఓటు బ్యాంకులోని హిందూ ఓటర్లను ఆకర్షించడానికేనని చెప్పక తప్పదు. 

నిజం చెప్పాలంటే 2019 పార్లమెంట్‌ ఎన్నికలనుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ను సవాలు చేసే స్థా యికి బీజేపీ ఎదిగింది. నాటి ఎన్నికల్లో ఏకంగా 40.7% ఓట్లతో 18 లోక్‌సభ స్థానాల్లో (మొ త్తం 42సీట్లు) గెలుపు సాధించింది. 2014లో పార్టీకి రాష్ట్రంలో కేవలం 17శాతం ఓట్ల మద్దతు మాత్రమే వుండేది. కేవలం రెండు అసెంబ్లీ సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చేంది. ఇక 2016లో అ సెంబ్లీలో మూడు సీట్లకు పరిమితమైన బీజేపీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 77 స్థానాలను గెలుచు కొని తృణమూల్‌కు సవాల్‌ విసిరింది. అప్పుడు పార్టీకి లభించిన ఓట్లశాతం 38.14%. 

ఇక తృణమూల్‌ కాంగ్రెస్‌ విషయానికి వస్తే 2021 ఎన్నికల్లో 48.02% ఓట్లతో 215 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం 38.73 శాతానికి పడి పోవడంతో పదిలోక్‌సభ సీట్లను కోల్పోయి 12 సీట్లకు పరిమితం కాగా, టీఎంసీ 29 స్థానాల్లో (45.76% ఓట్లు) గెలిచింది. 

పై గణాంకాలను పరిశీలిస్తే మరో ఆరు లేక ఏడుశాతం ఓట్లు సంపాదిస్తే బీజేపీకి అధికారాన్ని చేజిక్కించకునే అవకాశాలు అధికం. ఈ నేపథ్యంలోనే ‘సనాతని’ వాదంతో అన్ని పార్టీలకు చెందిన హిందూ ఓటు బ్యాంకులపై బీజేపీ దృష్టిపెట్టింది. వచ్చే శ్రీరామనవమికి కోటిమందితో ర్యాలీ నిర్వహించాలని తలపెట్టడం ఈ వ్యూహంలో భాగమే. ఈ నేపథ్యంలోనే శ్రీరామనవమి సంద ర్భంగా ఏప్రిల్‌ 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కోటిమంది హిందువులతో 20వేల ర్యాలీలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. గతంలో శ్రీరామనవమి ర్యాలీలపై పుబ్రా మిడ్నాపూర్‌ జిల్లాలోని ఈగ్రాలో మరియు ఇదే జిల్లాలోని శ్యాంపూర్‌లో దుర్గామాత విగ్రహాల విధ్వంసాలు జరిగిన అంశాలపై ఆయన మాట్లాడుతూ ఏప్రిల్‌ 8న ఈగ్రాలో, ఏప్రిల్‌ 7న శ్యాంపూర్‌లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తామని చెప్పడం గమనార్హం.

మంత్రులను, శాఖలను మార్చొద్దు!

`ఇప్పుడిప్పుడే శాఖల మీద మంత్రులు పట్డు సాధిస్తున్నారు

`అధికారులు చెప్పేవి నిజమో కాదో అర్థం చేసుకోగలుగుతున్నారు

`ప్రజల కోణంలో మంత్రులు నిర్ణయాలు తీసుకుంటున్నారు

`ఇంతలో మార్చితే మొదటికే మోసం వస్తుంది

`అధికారులలో అహం పెరుగుతుంది

`అధికారులలో మోనోపలి వస్తుంది

`మీడియా సంస్థలు కోరుకుంటే శాఖలు మార్చరు

`జర్నలిస్టులకు నచ్చనంత మాత్రాన మంత్రులను మార్చరు

`నాయకుల మధ్య విభేదాల కోసం తొందరపడొద్దు

`మంత్రులు తమ శాఖల మీద పట్టుకు కొంత సమయం పడుతుంది

`15 నెలల సమయం చాలా చిన్నది

`గతంలో శాఖల మార్పులు జరగిన సందర్భాలున్నాయి

`తక్కువ సమయంలో మార్చిన దాఖలాలు లేవు

`ఇప్పుడిప్పుడే పాలన పరుగందుకుంటోంది

`శాఖలు మార్చితే మంత్రులు మళ్ళీ పూర్తిగా అధికారుల మీద ఆధారపడాల్సి వస్తుంది

`ఆ శాఖల మీద పట్టుకు కుస్తీలు పట్టాల్సి వస్తుంది

`ఇంతలో పుణ్య కాలం గడిచిపోతుంది

`పొరపాటున కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు

`ఎన్నికలకు ఏడాదిన్నర ముందే మళ్లీ రాజకీయాలపై దృష్టి పెట్టాల్సి వస్తుంది

`నిజం చెప్పాలంటే పరిపాలన సరిగ్గా చేసేది ఓ రెండు సంవత్సరాలు మాత్రమే

`ఇలాంటి సందర్భంలో మంత్రుల శాఖలు మార్చితే కథ మొదటికి వస్తుంది

`ప్రజలకు మంత్రులు దూరమయ్యే పరిస్థితి ఎదురౌతుంది

`మంత్రులు ఎప్పటికప్పుడు పని తీరు చూసుకోవాలి

`నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలి

`జిల్లాల ప్రగతిపై సమీక్షలు జరపాలి

`పార్టీ కార్యక్రమాలలో పాలు పంచుకుంటుండాలి

`ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో వుండాలి

`ఇన్ని పనుల మధ్య శాఖలు మారితే అన్నింటికీ అంతరాయమే

`ప్రజా సమస్యలు గాలికి వదిలేయడమే!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కొత్త మంత్రులు త్వరలో కొలువు తీరనున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. రేపో, మాపో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుకూడా వార్తలు వస్తున్నాయి. గత కొంత కాలంగా త్వరలో, త్వరలో అనే వార్తలు నిజమయ్యే సమయం ఆసన్నమైంది. ఇంత వరకు బాగానే వుంది. కాని ఇటీవల కొంత మంది మంత్రులకు ఉద్వాసన తప్పదనంటూ కొత్త వార్తలు షికార్లుకొడుతున్నాయి. వాటికితోడు మంత్రుల శాఖల్లో కూడా మార్పులు వుండే అవకాశమందుంటూ కూడా రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. వీటిలో ఎంత వరకు నిజమందో లేదో? తెలియిదు? కాని మీడియా అత్యుత్సాహం మాత్రం ఎక్కువగా వుంది. ఇప్పుడున్న పరిస్దితుల్లో మంత్రులను తొలగించడం సాధ్యమౌతుందా? రెండోసారి మంత్రి వర్గ విస్తరణే ఇంత కాలం పట్టింది. ఒక వేళ ఇద్దరో, ముగ్గురినో మంత్రి వర్గం నుంచి తొలగిస్తే ఏర్పడే రాజకీయ అనిశ్చితి ఎలా వుంటుందనేది ఏ మాత్రం అవగాహన లేని మీడియా సంస్ధలు తమ ఇష్టాను రీతిన వార్తలు రాసేస్తున్నాయి. వాటిని ప్రజలు కూడా నిజమే అనుకునేలా మసాలలు దట్టించి వార్తలు వండి వారుస్తున్నారు. నిజానికి అందులో ఏ మాత్రం నిజం లేదు. మంత్రులను మార్చే అవకాశాలు కనిపించడం లేదు. పైగా ఎవరైనా మంత్రులకు వున్న అదనపు శాఖలను కొత్త మంత్రులకు ఇచ్చే అవకాశం వుంటుంది. కాని ఏకంగా ఇప్పటి వరకు చూస్తున్న శాఖలను మార్చి, కొత్త శాఖలను పాత మంత్రులకు అప్పగించే పరిస్ధితులు లేవు. వుండవు. ఒక వేళ పొరపాటున మంత్రుల శాఖలు మారితే అసంతృప్తి చెలరేగే అవకాశం వుంటుంది. నాయకులను బట్టి ప్రాధాన్యత శాఖలను అప్పగించడం పరిపాటి. అవే శాఖలను అటూ, ఇటూ మంత్రులకు మార్చితే పాలనా పరంగా నష్టం ఏర్పడే పరిస్దితులు ఎదురౌతాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన కేవలం 15 నెలలు మాత్రమే అవుతుంది. మధ్యలో పార్లమెంటు ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలతో కొంత సమయం వృదా అయ్యింది. ఈ కొద్ది సమయంలోనే ఆయా మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో మంత్రులను మార్చడం వల్ల ఉద్యోగ వర్గాలకు మరింత బలం చేకూర్చినట్లౌతుంది. ఉద్యోగ వర్గాల తిరుగుబాటుకు కూడా కారణమౌతుంది. ఇప్పుడిప్పుడే ప్రభుత్వానికి, మంత్రులకు అధికారులు ఇచ్చే సూచనలు, అందించే నివేదికలు సరైనవేనా..కాదా? అన్నది మంత్రులు పూర్తి స్దాయిలో తేల్చుకోలేని సందర్భాలే వున్నాయి. అలాంటి సమయంలో ఏకంగా మంత్రుల శాఖలు మార్చితే, మంత్రులు మొదటి నుంచి నేర్చుకోవాల్సి వుంటుంది. అప్పుడు పాలన గాడి తప్పుతుంది. రాష్ట్రంలో కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనుకుంటున్నారు. సన్నబియ్యం రేషన్‌ ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టారు. బిసి రుణాలు ఇచ్చేందుకు నోటిఫికెషన్‌ విడుదల చేశారు. రికార్డు పద్దు ప్రవేశ పెట్టారు. వీటన్నింటికీ దృష్టిలో పెట్టుకొని మంత్రులు ఒక ప్రణాళికతో ముందకు వెళ్లేందుకు ఇప్పుడిప్పుడే సన్నాహలు చేసుకుంటున్నారు. తమ శాఖలపై పూర్తి స్దాయి పట్టు సాదిస్తున్నారు. ఈ తరుణంలో ఒక వేళ మంత్రుల శాఖలు మారితే మళ్లీ పాలన మొదటికొస్తుంది. పాలన గాడితప్పుతుంది. మంత్రులనే మార్చితే సామాజిక వర్గాలలో అలజడి రేగుతుంది. రాజకీయం మరో వైపు దారి తీసుకుంటుంది. ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొత్త తలనొప్పి నెత్తిన పెట్టుకున్నట్లౌవుంది. సలహాలు ఇచ్చే వారు ఇస్తారు. కాని వాటిని ఎలా స్వీకరించాలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి తెలియందికాదు. కాని కొన్ని సార్లు పదే పదే కొంత మంది చెప్పే సూచనలు తీసుకోవాల్సి వస్తుంది. కాని మొదటికే మోసం వస్తుంది. గతంలో ఎన్టీఆర్‌ ఇలాగే చేశారు. దాంతో ఆయన పదవీ గండం తెచ్చుకున్నారు. ప్రాంతీయ పార్టీలో నిజానికి అలాంటి తిరుగుబాటు జరిగే అవకాశాలు వుండవు. కాని అదికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఎన్టీఆర్‌ అలాంటి ప్రయోగం చేశారు. ఫలితం అనుభవించారు. ఆనాడు లక్ష్మిపార్వతితోపాటు, కొంత మంది మంత్రులు చెప్పిన చెప్పుడు మాటలు ఎన్టీఆర్‌ వినడం వల్లనే ఆయనకు ఆ పరిస్ధితి వచ్చిందన్న సంగతి తెలియంది కాదు. గతంలో చంద్రబాబు నాయుడు, వైఎస్‌.రాజశేఖరరెడ్డిలు మంత్రుల శాఖలు మార్చిన సందర్భం వుంది. కాని ఇలా అర్ధాంతరంగా మార్చలేదు. అదును చూసి, పరిస్దితులను అవగాహన కల్పించుకొని చేశారు. పైగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రం. మంత్రులుగా పనిచేసిన వారు అప్పట్లో ఎంతో కొంత అనుభవం వున్నవారు. అప్పటికే మంత్రిత్వ శాఖల్లో పట్టు వున్న వారు కావడం వల్ల శాఖలు మార్చినా పెద్ద ఇబ్బందులు తలెత్తలేదు. కాని ఎన్టీఆర్‌ లాంటి నాయకుడు తీసుకున్న నిర్ణయం వల్ల మొత్తం క్యాబినేట్‌ మార్చేదాక వెళ్లింది. ఆయన పదవికే గండం వచ్చింది. ఒక్కసారి మంత్రిగా ప్రమాణం చేసిన ప్రతి నాయకుడు తనకిచ్చిన శాఖను సమర్ధవంతంగా పోషించిన నేతగా గుర్తింపు తెచ్చుకోవాలనకుంటారు. మంత్రిగా మంచి పేరు సంపాదించాలని చూస్తారు. కాని కొన్ని సార్లు అవరోదాలు ఎదురుకావొచ్చు. వాటిని అధిమించాలంటే కొంత సమయం పడుతుంది. పైగా మంత్రి అంటే రాజకీయాలకు అతీతులు కాదు. రాజకీయం చేస్తూనే మంత్రిగా కర్తవ్యం నిర్వర్తించాల్సివుంటుంది. ఆ సమయంలో అనేక సవాళ్లు ఎదుర్కొవాల్సివుంటుంది. మంత్రుల ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోణంలో తీసుకుంటారు. కాని ఉన్నతాధికారులు రాష్ట్ర ఆర్దిక పరిస్దితిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు చెబుతుంటారు. ఇక్కడే మంత్రుల పనితీరు ఆదారపడి వుంటుంది. సహజంగా మంత్రులు ఏ పనిచేయాలనుకున్నా అధికారులు ఆర్దిక పరిస్ధితులు సహకరించకపోవచ్చు. అనే సూచనలే చేస్తారు. అది వాళ్ల తప్పు కాదు. రాష్ట్రాన్ని అప్పుల వైపు నడవాలని ఏ ఉన్నతాధికారి అనుకోరు. కాని అదే ఉన్నతాదికారులు పనులు చేయడంలో కూడా కొంత మంది తీవ్ర జాప్యం చేస్తుంటారు. కొత్తగా మంత్రులైన వారిని తప్పుదోవ కూడా పట్టిస్తుంటారు. సరైన సమాచారం సకాలం ఇవ్వకుండా కాలయాపన చేస్తుంటారు. ఇలాంటి సమయంలో అధికారుల మీద మంత్రులు కేకలేయడం తప్ప మరేం చేయలేరు. వారిని మార్చుకునే అవకాశం కూడా రాకపోవచ్చు. ఎందుకంటే ఉన్నతాదికారుల సంఖ్య చాలా తక్కువగా వుంటంది. అటు నుంచి, ఇటు నుంచి అటు మార్చుకోవడం తప్ప వారిని పక్కన పెట్టే అవకాశం వుండదు. గత ప్రభుత్వ హాయాంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న అదికారులే ఇప్పుడూ కూడా కీలకంగా పనిచేస్తున్నారు. అలాంటి అదికారుల మూలంగా కొంత మంది మంత్రుల పని తీరుపై ప్రభావం చూపుతుందని చెప్పక తప్పదు. ఇప్పుడిప్పుడే మంత్రులు తమ శాఖలపై పట్టు సాదిస్తూ, సంస్కరణలు చేసేందుకు సిద్దమౌతున్నారు. ఈ సమయంలో మంత్రుల శాఖలు మార్చితే ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు ఎదురౌతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అదికారలు చేతుల్లో మంత్రులు కీలుబొమ్మలౌతారు. అదికారులు ఏది చెప్పిందే నిజమని నమ్మే పరిస్ధితి వస్తుంది. అదికారుల్లో మోనోపలి మొదలౌతుంది. మంత్రి పనితీరు సరిగ్గా లేదంటూ ఆ శాఖ అధికారులే లీకులిచ్చి వార్తలు రాయించే పరిస్దితి వస్తుంది. గతంలో ఇలాంటివి అనేకం జరిగిన సందర్భాలున్నాయి. ఎందుకంటే ఒకశాఖలో తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రమే మంత్రులను పక్కన పెడతారు. కాని మీడియా వార్తలను ఆదారం చేసుకొని మంత్రుల మార్పు సరైంది కాదు. ఒక వేళ అదే జరిగితే మంత్రుల శాఖలు మారిన మరు క్షణం నుంచి మళ్లీ మంత్రుల మీద కొత్త వార్తలు మొదలౌతాయి. ప్రతిపక్షాలకు ఆయుదాలౌతాయి. కోరికోరి ప్రభుత్వమే ప్రతిపక్షాల ముందు చులకనయ్యే పరిసి ్దతి ఎదురౌతుంది. నిజం నిష్టూరంగానే వుంటుంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికూడా ఒక సందర్భంలో నాకు మంత్రుల సహకారం సరిగ్గా లేదంటూ వ్యాఖ్యానించారు. వాళ్లను దారికి తెచ్చుకోవడం కోసమని శాఖలను మార్చితే మరింత వ్యతిరేకత మూటగట్టుకోవడం తప్ప మరొకటి వుండదు. ఏది ఏమైనా మంత్రుల శాఖల మార్పుల్లో తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. సమస్యలు సృష్టించుకోవద్దు.

పంతుళ్ల ప్రాపకం..నాయకుల జాతకం!

-నేతలు..జాతకాలు..ఉగాది సంబరాలు.

-ఒక్కో పంతులు ఒక్కో జోస్యం.

-పంచాంగ లెక్కలందరూ ఒకటే చెబుతారు.

-అది ప్రామాణికమని అందరూ నమ్ముతారు.

-జాతకాల విషయంలో ఎవరికి తోచింది వారు చెబుతారు.

-నాయకుల చేత జేజేలు కొట్టించుకుంటారు.

-ఉగాది సాక్షిగా పండగ రోజే ఇన్ని అబద్దాలా!

-తొలి రోజే లెక్కలేనన్ని అసత్యాలా!

-జోస్యం ఎవరికైనా ఒకటే వుండాలి.

-పార్టీల పరిస్థితి నిజాయితీగా చెప్పగలగాలి.

-నిజం చెబితే సంభావన కష్టం. నిజం నిష్టూరం.

-కష్టాల గురించి చెబితే వచ్చే ఉగాదికి పిలువరు.

-ఎవరి కష్టాలు వారివి…పంతుళ్ల తిప్పలు పంతుళ్లవి.

-తెలంగాణలో సిఎం రేవంత్‌ రెడ్డి కి తిరుగులేదంటారు.

-వచ్చే సారి కూడా రేవంత్‌ రెడ్డే సిఎం అని ఓ పంతులు చెప్పాడు.

-మూడు నెలల్లో కేసిఆర్‌ సిఎం అవుతారని మరో పంతులంటారు.

-తెలంగాణ వచ్చే ఎన్నికలలో బిజేపి గెలుస్తుందని మరో పంతులు చెబుతాడు.

-చంద్రబాబు ఆరు సార్లు సిఎం అవుతారని అక్కడంటారు.

-వచ్చేది జగనే మరో పంతులు సెలవిస్తాడు.

-పవన్‌ కళ్యాణ్‌ ఇంకా పదిహేనేళ్లు చంద్రబాబు వుండాలంటాడు.

-పంతులేమో పవన్‌ కళ్యాణ్‌ సిఎం అవుతారని అంటారు.

-ఇంకా ఎన్నికలకు నాలుగేళ్ల సమయం వుంది.

-ఈ ముచ్చట్లు ఇప్పుడెందుకు చెబుతారో అర్థం కాదు.

-గతంలో కాలాల గురించి మాత్రమే చెప్పే వారు.

-గ్రహ గతుల వల్ల ప్రాంతాలకు ఎదురయ్యే సమస్యలు ప్రస్తావించే వారు.

-ప్రతి సారి వర్షాలు విపరీతంగా కురుస్తాయంటారు.

-కరువొచ్చిన కాలంలో కూడా ఇలా చెప్పే ఊరడిరచారు.

-విని సంతోషించాలనే పంచాంగ శ్రవణం అంటారేమో!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

మారేదే అయితే జాతకమెలా అవుతుంది. కలిసొచ్చేదే అదృష్టమైతే ఎందుకు దాగి వుంటుంది. లాక్కొచ్చి పరిహారం చెల్లిస్తేగాని పని చేయనిది భవిష్యత్తు ఎలా అవుతుంది. బతుకు జీవుడా అని ఏళ్లకేళ్లు బాదించి, ఆఖరుకు కలిసొస్తే అది కలిసొచ్చే కాలమెలా అవుతుంది. బతకలేని బతుకులు బతుకంతా ఏడిపించి, కన్నీళ్లను కూడా మిగల్చకుండా చేస్తుంటే అది బతుకెలా అవుతుంది. భగవంతుని కరుణెలా అవుతుంది. నమ్మకం మన బలం. ఆ నమ్మకమే కొంపలు ముంచడం..చదువుకున్న వాళ్ల మూడత్వం..ఈ జన్మకే దిక్కులేని సంబరం..ఏడేడే జన్మలు తెచ్చేదంతా ఆనందం. అంటే ఎవరైనా సంతోషిస్తారా? వచ్చే జన్మ కోసం ఈ జన్మంతా కష్టపడతారా? దేవుణ్ణి తిట్టుకోకుండా వుంటారా? ఈ జన్మకు మోసిన కష్టాలు..మళ్లీ జన్మొద్దు. ఈపుట్టకే వద్దనే కదా? కైలాసం కోరుకుంటారు..అలాంటి వారిలో ఆశలు నింపడం కోసమే జ్యోతిష్యులుంటారు. వారి ప్రాపకం గడుపుకుంటారు. ఆశలో జీవి జీవితాంతం ఎదురుచూస్తుంటారు. కోటి విద్యలు కూటి కొరకే అంటారు. ఉగాది రోజున పంచాంగ శ్రవణ పాండిత్యం వున్న పండిత సిద్దాంతులు పడే యాతన అంత ఇంతా కాదు. ఏ పార్టీ పంచాంగ శ్రవణానికి వెళ్తే ఆ పార్టీ గొప్పదని చెప్పకుండా వుండలేరు. ఒక్కసారి విశ్వావసు నామ సంవత్సర పంచాంగ ఫలితాలు చెప్పిన సిద్దాంతులు పడిన బాధలు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్ర ఒకటే. పాలన ఒకటే. కాని రాజకీయాల మీద రకరకాల అభిప్రాయాలు, రకరకాలుగా చెప్పారు. అందరూ అన్ని పార్టీల జాతకాలు అద్భుతమనే అన్నారు. మరి అన్ని పార్టీల జాతకాలు అధ్భుతమే అయినప్పుడు అన్ని పార్టీలు గెలవలేవు. ఏదో ఒకపార్టీ మాత్రమే గెలుస్తుంది. అన్ని పార్టీలకు ఆ అవకాశం లేదు. కాని చెబుతారు. పార్టీలను నమ్మిస్తారు. నాయకులను రంజింప జేస్తారు. ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురించి సంతోష్‌ కుమార్‌ శర్మ చెప్పిన జాతక ఫలితాలు ఎలా వున్నాయో చూద్దాం. రేవంత్‌ రెడ్డిది తులా రాశి అని చెప్పుకుంటూ ఆయనకు నరగోష వుందన్నారు. ఆయనపై నరఘోష చెప్పాలంటే ఇప్పుడు కాదు, ఆయనపై ఎప్పటి నుంచో వుందనే చెప్పాలి. ఈ విషయం చెప్పడానికి పంచాంగమే అక్కర్లేదు. ఎందుకంటే రేవంత్‌రెడ్డి స్వతహాగా పైకొచ్చిన నాయకుడు. ఆయనను ఎవరూ నాయకుడిగా తయారు చేయలేదు. రాజకీయ గురువు ఆయనకు ఎవరూ లేరు. ఒక్కసారిగా రాజకీయ యవనిక మీదకు ఉత్తుంగతరంగంలా వచ్చారు. వస్తూ వస్తూనే జడ్పీటీసి అయ్యారు. తర్వాత ఏడాదిన్నరకే ఎమ్మెల్సీ అయ్యారు. మరో రెండేళ్లకే ఎమ్మెల్యే అయ్యారు. తెలుగుదేశం పార్టీలో అందరూ అసూపడేలా ఎదిగారు. చిన్న వయసులోనే తెలుగుదేశం పార్టీలో వర్కింగ్‌ ప్రెసిడెంటు అయ్యారు. ఒక దశలో తెలంగాణ తెలుగుదేశంపార్టీకి అధ్యక్షుడు కావాలనుకున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్దితుల దృష్ట్యా కాంగ్రెస్‌లో చేరారు. అక్కడ కూడా వర్కింగ్‌ ప్రెసిడెంటుగానే తన ప్రస్దానం ప్రారంభించారు. గత ఎన్నికలకు మూడేళ్ల ముందే పిపిసి. అధ్యక్షుడయ్యారు. తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనపై నరదిష్టి అనేది ఆయన తెలుగుదేశం పార్టీలో ఎదుగుతున్న క్రమంలోనే మొదలైంది. ఏ నరదిష్టి ఆయనను ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే జాతకం బాగుంది. అసలు ఆయన ఎమ్మెల్సీ అయినప్పుడే తాను ముఖ్యమంత్రి అవుతా! అన్నారు. అప్పటికి తెలంగాణ రాలేదు. ఒక్కరోజైనా సరే నేను ముఖ్యమంత్రికావాలన్నదే తన లక్ష్యం అని చెప్పారు. తెలంగాణ వచ్చిందే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసమా? అన్నట్లు ఆయన జాతకం కాలాన్నే మార్చేసింది. ఇప్పుడుకొత్తగా ఆయనపై దిష్టి వుందన్న సంగతి ప్రత్యేకంగాచెప్పాల్సిన పనిలేదు. కాని చెప్పాలి. చెప్పకుంటే పంచాంగ శ్రవణం పూర్తికాదు. అందుకే ఓ వైపు రేవంత్‌రెడ్డికి తిరుగులేదు. ఎదురులేదు. మరో పదేళ్లపాటు ఆయన పాలనకు తిరుగుండదని చెప్పిన సిద్దాంతి నరోఘోష వుందని పరిహారం చేసుకోవాలని సూచించారు. అందరిలోనూ ఆనందం నింపారు. ఇది నిజమా? అబద్దామా? అనేది కాలం తేల్చుతుంది. ఇక బిఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణంలో మరో విశేషం జరిగింది. ఇకపై ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బిఆర్‌ఎస్‌దే గెలుపు అంటూ సిద్దాంతి చెప్పుకోచ్చారు. ఇంత వరకు బాగానే వుంది. మరి ప్రభుత్వం తరుపున పంచాంగ శ్రవణం చెప్పిన సిద్దాంతి సిఎం. రేవంత్‌ రెడ్డికి పదేళ్లపాటు తిరుగులేదన్నాడు. మరి బిఆర్‌ఎస్‌ జాతకం చెప్పిన సిద్దాంతి ఈసారి సిఎం. అయ్యేది కేసిఆరే అంటున్నారు. ఇదెలా సాధ్యం. లెక్కలంటే లెక్కలాగానే వుండాలి. పక్కాగా వుండాలి. లెక్కలకు సూత్రాలెన్ని వున్నా, ఆన్సర్‌ మాత్రం ఎప్పుడూ ఒక్కటే వుండాలి. ఒకే లెక్కను సూత్రానికొక సమాధానం వస్తే అది లెక్కెలా అవుతుంది. దానికి విలువేమిటుంటుంది. ఇక బిజేపి కార్యాలయంలో జరిగిన పంచాంగ శ్రవణంలో ఇక వచ్చేదంతా బిజేపి కాలమే అని సిద్దాంతి సెలవిచ్చారు. అదేంటి ఒకే రాష్ట్రంలో మూడు పార్టీల జాతకం బాగానే వుంది. కాని అదికారం ఏదో ఒకపార్టీనే వరిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అదికారంలో వుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిఎంగా వున్నారు. ఆయన పదవికి పదేళ్లు ఢోకాలేదన్నప్పుడు, ఈ రెండు పార్టీలు ఎలా అదికారంలోకి వస్తాయో? అర్ధం కాని విషయం. అయినా ఎన్నికలు మరో ముడున్నరసంవత్సరాలకు గాని రావు. ఇప్పటికిప్పుడు ఎన్నికల వస్తే అని సర్వే సంస్ధలు చెప్పినట్లు జోస్యం చెబితే పంచాగానికి విలువేముంటుంది. పంచాంగం అంటే అన్నీ నిజాలే చెప్పాలి. సిద్దాంతులు అదే చెప్పాలి. గ్రహగతులు అన్ని పంచాంగాలలో ఒకటే వుంటుంది. ఎప్పుడు పౌర్ణమివస్తుందో..ఎప్పుడు గ్రహణాలు వస్తాయో? లెక్క పొల్లు పోకుండా పంచాంగంలో రాస్తారు. ఇప్పటికీ సైన్స్‌కు అందని మిస్టరీ. అంత కరక్టుగా పంచాంగం రూపకల్పన జరిగినప్పుడు నేతల జాతకాలు, పార్టీల భవిష్యత్తును ఇలా మర్చి చెప్పిడం కరక్టు కాదు కాదా? నిజం చెప్పాలంటే సిద్దాంతుల విజ్ఞానం సామాన్యమైంది కాదు. ఎంతో విద్వత్తు వుంటే గాని సిద్దాంతులు కాలేరు. మరి అలాంటి సిద్దాంతులు ఉగాది పూట ఎందుకు అబద్దాలు చెప్పడం. ఉన్నది ఉన్నట్లు చెబితే జనం నమ్మరు. అంతా బాగుందంటేనే నమ్ముతారు. వ్యక్తిగా కష్టాలొస్తాయంటే నమ్ముతారు. కాని రాజకీయాల్లో వున్నవారు పదవులు పోతాయంటే జీర్ణించుకోలేరు. అందుకే సిద్దాంతులు కూడా లోకకల్యాణం కోసమే అబద్దాలు ఆడుతుంటారేమో? అనుకోవాలేమో?? ఇక ఏపిలో మాడుగుల నాగఫణి శర్మ లాంటి గొప్ప సిద్దాంతి కూడా చెప్పింది వింటే విచిత్రమనిపిస్తుంది. అదేంటో సిద్దాంతులు సామాన్యులను కష్టాలున్నాయని భయపెడతారు. నాయకులకు అంతా బాగుందని చెప్పి సంతోషపెడతారు. మీరు పదవిలో నుంచి దిగిపోతారని ఏ నాయకుడి ముందు, ఏ సిద్దాంతి చెప్పరు. ఇదే అసలు ట్విస్టు. ఏపి.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొత్తంగా ఆరు సార్లు ముఖ్యమంత్రి యోగముందని నాగఫణిశర్మ చెప్పారు. ఇప్పటికి నాలుగు సార్లు పూర్తి చేశారు. ఇంకా రెండుసార్లు మిగిలి వుంది. మరి స్వయంగా మంత్రి లోకేష్‌ ఆ మధ్య మాట్లాడుతూ ఎమ్మెల్యేలకైనా, మంత్రులకైనా, ఎమ్మెల్సీలకైనా మూడుసార్లే అవకాశం. నేను కూడా అదే ఆచరిస్తానని చెప్పారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడుకు వర్తింపజేస్తారా? అంతే కాకుండా లోకేష్‌ అప్పటి వరకు ముఖ్యమంత్రికాకుండా వుండగరలా? ఇదిలా వుంటే పవన్‌ కల్యాన్‌కు కూడా రాజయోగం వుందని సిద్దాంతులు అంటున్నారు. పవన్‌ కల్యాణేమో చంద్రబాబుమరో మూడుసార్లు సిఎంగా వుండడమే నేను కోరుకుంటున్నానంటున్నారు. జాతకం ప్రకారం ఆరుసార్లు సిఎం. చంద్రబాబు అయ్యే అవకాశంవుంటే పవన్‌కు సిఎం.అయ్యే చాన్స్‌ లేనట్లే. మరి ఇతర సిద్దాంతులు పవన్‌కు ఆ వరం వుందంటున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్‌ విషయానికి వస్తే ఆయన వచ్చే ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధిస్తారని పంచాంగ సిద్దాంతి సూరి నారాయణ మూర్తి అన్నారు. అదెలా సాధ్యమౌతుంది. వరుసగా ఇంకా రెండు సార్లు చంద్రబాబు సిఎం. అయ్యేదే వుంటే వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఎలా సిఎం అవుతారు. అసలు అక్కడ కూడా ఇంకా నాలుగేళ్లకు పైగా సమయం వుంది. కూటమి బలంగా వుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలువచ్చే అవకాశమే లేదు. ఇకపోతే జగన్‌ విజయనగర రాజు శ్రీ కృష్ణదేవరాయలంత కీర్తిని సంపాదిస్తారట. ఇలా పంతుళ్లు పోటీ పడి మరి నాయకులను కీర్తించారు. గతంలో ఎప్పుడు పంచాంగ శ్రవణాలు చెప్పినా నాయకుల జాతకాలు చెప్పేవారు కాదు. వాతవారణ పరిస్ధితులు, భూకంపాలు, వర్షాలు, వరదలు, కరువు కాటకాల గురించి చెప్పి, ప్రభుత్వాలను అప్రమత్తం చేసేవారు. ఇప్పుడు నాయకులు జాతకాలు చెప్పి వారిని సిద్దాంతులు ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇదీ మ్యాటర్‌.

కష్టం మా వంతు…పదవులు మీ వంతు!

కష్టం మా వంతు…పదవులు మీ వంతు!

`ఎన్నికలలో గెలపు కోసం అహర్నిశలు పని చేసేది కార్యకర్తలు

 

`పార్టీని బలోపేతం చేసేది కార్యకర్తలు

`జెండాలు మోసేది కార్యకర్తలు

 

`పార్టీ ప్రచారంలో పాలు పంచుకునేది కార్యకర్తలు

`ఎన్నికలలో గెలుపు కోసం సర్వం త్యాగం చేసేది కార్యకర్తలు

`పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూటలు తెచ్చే వారే ఆప్తులు

`పార్టీలు మారిన వారికి పదవులు

`కష్టపడిన వాళ్లకు ఇంకోసారి చూద్దామని భుజ్జగింపులు

`కార్యకర్తల మనోవేధన పట్టించుకోరు

`ప్రతిపక్షంలో వున్నప్పుడు కార్యకర్తలు కావాలి

`అధికారంలోకి వచ్చాక కార్యకర్తలను దూరం పెట్టాలి

`అన్ని పార్టీలు అనుసరిస్తున్నదిదే

`కార్యకర్తల సంక్షేమం పట్టించుకోవంతే.కష్టం మా వంతు…పదవులు మీ వంతు!

`ఎన్నికలలో గెలపు కోసం అహర్నిశలు పని చేసేది కార్యకర్తలు

`పార్టీని బలోపేతం చేసేది కార్యకర్తలు

`జెండాలు మోసేది కార్యకర్తలు

`పార్టీ ప్రచారంలో పాలు పంచుకునేది కార్యకర్తలు

`ఎన్నికలలో గెలుపు కోసం సర్వం త్యాగం చేసేది కార్యకర్తలు

`పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూటలు తెచ్చే వారే ఆప్తులు

`పార్టీలు మారిన వారికి పదవులు

`కష్టపడిన వాళ్లకు ఇంకోసారి చూద్దామని భుజ్జగింపులు

`కార్యకర్తల మనోవేధన పట్టించుకోరు

`ప్రతిపక్షంలో వున్నప్పుడు కార్యకర్తలు కావాలి

`అధికారంలోకి వచ్చాక కార్యకర్తలను దూరం పెట్టాలి

`అన్ని పార్టీలు అనుసరిస్తున్నదిదే

`కార్యకర్తల సంక్షేమం పట్టించుకోవంతే

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రాను రాను రాజకీయాలంటే యువతలో నిరాసక్తత ఎదురౌతోంది. ముఖ్యంగా ఉన్నత విద్యావంతులు రాజకీయాల వైపు ఆకర్షితులు కావడం లేదు. రాజకీయాలపై అందిరకీ ఆసక్తి వుండదు. ఒక ఊరులో వెయ్యి మంది వుంటే రాజకీయాలు చేసే వారు పట్టుమని పది మంది కూడా వుండరు. కాని రాజకీయ పార్టీల అభిమానులు చాలామంది వుంటారు. గతంలో రాజకీయాలంటే ఒక యజ్ఞంగా వుండేది. రాజకీయాలు చేస్తే పదవులు వస్తాయన్న ఆశ వుండేది. కాని ఇప్పటి రోజుల్లో పదవులు ఎవరికి వస్తాయో? ఎప్పుడు వస్తాయో? ఎలా వస్తాయో? ఎవరికి రావాల్సిన పదవులు ఎవరు పొందుతారో? ఎందుకు పొందుతారో? ఎలా పొందుతున్నారో కూడా తెలియనంత సీక్రెట్‌గా పదువులు పొందుతున్నవారున్నారు. దాంతో జెండా మోసిన కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంటోంది . రాజకీయాలంటేనే నిరాసక్తత ప్రదర్శిస్తోంది. అంతే కాకుండా అదికారంలో వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ద పదవులు పూర్తిగా భర్తీ చేయక వాటిని చూపించి, ఐదేళ్లు నాయకులను రాజకీయ పార్టీలు వంచిస్తున్నాయి. ఆ పదవి నీకే నీకే అంటూ పుణ్యకాలం పూర్తి చేస్తున్నాయి. ప్రశ్నిస్తే వచ్చేది మన ప్రభుత్వమే అప్పడు మొదటి విడతలో పదవి నీకే అంటారు. ఇలా ఇప్పుడు కాదు, గత కొన్ని దశాబ్ధాలుగా సాగుతూనే వుంది. కాకపోతే ఇప్పుడు మరో రాజకీయం సాగుతోంది. గతంలో పార్టీ మారే నాయకులు పెద్దగా వుండేవారు కాదు. సిద్దాంతాలు వదలి, మరో పార్టీలో చేరేవారు తక్కువగా వుండేవారు. పదవులు రాకపోయినా సరే, అదే పార్టీలో వుంటూ వచ్చేవారు. కాని ఇప్పుడు నాయకులు, కార్యకర్తల పరిస్ధితి మారిపోయింది. ఎవరు ప్రాదాన్యతనిస్తే వారి పార్టీలోకి వెళ్తున్నారు. ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీలోకి వెళ్తున్నారు. మళ్లీ అధికారం మారగానే మళ్లీ నిస్సిగ్గుగా సొంత గూటికి అని చెప్పి చేరిపోతున్నారు. మళ్లీ పదవులు పొందుతున్నారు. ఇలా ఏ ఎండకాగొడుడు పట్టే నాయకులు అంతో ఇ ంతో బాగుపడుతున్నారు. పదవులు పొందుతున్నారు. నాయకులుగా వెలుగుతున్నారు. అంతే కాని ఆది నుంచి జెండా మోసిన కార్యకర్త అడుగడుగునా మోసపోతున్నాడు. రాజకీయాల్లో ఆగమౌతున్నాడు. జీవితం నాశనం చేసుకుంటున్నాడు. బైట గొప్పలు చెప్పుకోవడానికి అలవాటు పడి రాజకీయాలు వదులుకోలేకపోతున్నారు. అప్పులు చేసి నాయకుడుగా చెలామణి కావడం మానుకోవడంలేకుండా వున్నారు. నిత్యం తెల్లబట్టలేసుకోవాలి. ఉదయమే రాచ కార్యం వెలగబెట్టినట్లు ఇంట్లోనుంచి వెల్లాలి. అ ంతే ఇంట్లో వున్న వాళ్లు తింటున్నారా? తినడం లేదా? తన కోసం ఎదురుచూస్తున్నారా? లేదా? అన్న ఆలోచన వుండదు. రాత్రి దాకా నాయకులకు భజన చేసుకుంటూ వుండి రాత్రికి ఇంటికి చేరుకోవడం, మళ్లీ తెల్లారిందంటే వెళ్లిపోవడం ఇ ంతకన్నా కార్యకర్తలు చేసేదేమీ లేకుండాపోయింది. పదవులు పొంది నాలుగు రూపాయలు సంపాదిం చుకున్నది లేదు. గతంలో గ్రామ స్దాయి నుంచి, మండల,జిల్లా స్దాయి వరకు నాయకులకు ఏవో పనులు వుండేది. అభివృద్ది పేరిట విడుదలయ్యే నిధులతో చిన్నా చితకపనులు చేసేవారు. కాని ఇప్పుడు ఆపని కూడా లేదు. ఆదాయం రూపాయి రాదు. అయినా పార్టీ జెండా మోస్తూనే వుంటున్నారు. గతంలో లేని, ఇప్పుడు కొత్తగా కార్యకర్తలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో పోలీసులు కేసులు అదనం. ఇప్పటి రాజకీయాల్లో ఇది ఒక నూతన పోకడ. రాజకీయపార్టీల కార్యకర్త ఎప్పుడు కేసులు ఎదుర్కొంటాడో తెలియదు. అదికార పార్టీపై ఏం మాట్లాడినాసరే కేసులు ఎ దుర్కొవాల్సిందే. ఏం మాట్లాకుండా వున్నా, మాట్లాడిన నాయకుడి పక్కన వున్నా చాలు కేసుల్లో ఇరుక్కోవాల్సిందే. ప్రతిపక్షాలకు చెందిన కాస్తో, కూస్తో బలమైన నాయకుడైతే చాలు. కేసులు వి పరీతం. అది గ్రామ నాయకుడైనా సరే, మండల స్దాయి నాయకుడైనా సరే ఎప్పుడూ ఏదో ఒక కేసు ఎదుర్కొవాల్సిందే. ఇక జిల్లాలకు,మండలాలకు మంత్రులు పర్యటనలకు వస్తే చాలు ప్రత్యర్ది పార్టీల నాయకులను ముందస్తు అరెస్టులు చేయాల్సిందే. బైండోవర్లు చేసి రోజుల తరబడి స్టేషన్‌లో వుంచాల్సిందే. మంత్రుల పర్యటనలు పూర్తయిన తర్వాత గాని వదిలే అవకాశం లేకుండాపోయింది. ఇన్ని నిర్భందాల మద్య రాజకీయం చేసినా, కేసులు ఎదుర్కొన్నా, పోలీసు దెబ్బలు తిన్నా, కేసులకు ఎన్ని డబ్బులు ఖర్చైనా, పార్టీ అదికారంలోకి వచ్చాక పదవి వస్తుందా? రాదా? అన్నది మళ్లీ నాయకుల చేతుల్లోవుండదు. నాకే పదవి అని చెప్పుకునే పరిస్దితి నాయకులు వుండదు. పైగా నాకు పదవి ఎందుకు ఇవ్వవని నిలదీసే హక్కు కూడా వుండదు. ఒక వేళ సంబంధిత ఎమ్మెల్యేనో, మంత్రినో గట్టిగా నిలదీస్తే అదికార పార్టీలో వున్నా సరే కేసులు ఎదుర్కొవాల్సిందే. లేకుంటే అంతకు ముందుకన్నా ఎక్కువ నిర్భందం చూడాల్సిందే.ఎందుకంటే అదికార పార్టీలో వున్నప్పుడు పదవులు అడుక్కొవాలి. ఇచ్చేదా ఎదురుచూడాలి. రాకుంటే ప్రశ్నించకూడదు. ఒకవేళ నమ్మకంలేకపోతే పార్టీ మారిపోవచ్చు. ఓ స్ధాయిన నాయకులకు తప్ప, ద్వితీయ శ్రేణి నాయకులకు తప్పని తిప్పలివి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, కేంద్రంలోనూ ఇదే పరిస్దితి వుంది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు ఏడాదిన్నర కాలమౌతోంది. కాని ఇంకా పూర్తి స్ధాయిలో పంపకాలు జరగడం లేదు. ఆ పదవులేమీ ఐదేళ్లు వుండవు. కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే. ఇప్పటికే ఏడాదిన్న కాలం పూర్తయిపోయింది. వాటికి ఎవరినో ఒకరిని భర్తీ చేస్తే, మరో ఆరు నెలల్లో కొత్త వాళ్లకు అవకాశమిస్తే చాల మంది నాయకులను సంతృప్తిపర్చినట్లు వుండేది. కాని ఇప్పటికే మొదటి దఫా పదవులు అందలేదు. దాంతో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక మండల, నియోజకవర్గ, జిల్లా స్ధాయి పదవులు కూడా ఇంకా పావు వంతు కూడా భర్తీ కాలేదు. ఇంకా స్ధానిక సంస్ధల ఎన్నికలు రావాల్సి వుంది. వాటి కోసం కూడా చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. ఇలా గతంలో కూడా రాజకీయ పార్టీలు చేశాయి. కొన్నిసార్లు ఎన్నికలకు ఓ ఏడెనమిది నెలల ముందు పదువులు ఇవ్వడం అలవాటు చేసుకుంటున్నారు. పార్టీ మళ్లీ అదికారంలోకి వస్తేనే ఆ పదవి వుంటుంది. లేకుంటే పోతుంది. ఇలా కూడా నాయకులను పార్టీలు మోసం చేస్తున్నాయి. గత ప్రభుత్వం కూడా తెలంగాణలో ఇదే చేసింది. ఇచ్చిన నాయకులకే మళ్లీ మళ్లీ పదవులు పంచింది. పదేళ్లలలో కూడా పదవులు అందని వారు ఎంతో మంది వున్నారు. పద్నాలుగేళ్లపాటు ఉద్యమంలో పాలు పంచుకొని, పోరాటం చేసి, ఎన్నికలప్పుడు పార్టీని గెలిపించుకుంటూ ఆస్ధులు పోగొట్టుకున్న వాళ్లు బిఆర్‌ఎస్‌లో కొన్ని వేల మంది వున్నారు. బిఆర్‌ఎస్‌ పదేళ్లపాటు అదికారంలో వున్నా, పదవులు రాకుండా పోయిన వారు కొన్ని వేల మంది వున్నారు. తెలంగాణ తెర్లు కావొద్దన్న ముచ్చట చెప్పి, ఇతర పార్టీలనుంచి వచ్చిన, తెచ్చుకున్న నాయకులకు ప్రాధాన్యతలనిస్తూ, అసలు ఉద్యమకారులను పక్కన పెట్టి పదవులు పంచిన సందర్భం వుంది. ఇప్పుడు ఏపిలో కూడా అదే పరిస్ధితి మళ్లీ కనిపిస్తోంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పుడు కూడా పూర్తి స్ధాయిలో పదవులు పంచిన సందర్భం ఎప్పుడూ లేదు. ఇప్పుడు కూడా జరుగుతుందన్న నమ్మకం నాయకుల్లో లేకుండాపోతోంది. గత ప్రభుత్వ హాయాంలో నిర్భంధాలను ఎదుర్కొని, కేసుల్లో ఇరుక్కొని, పోలీసుల చేతిలో కౌకు దెబ్బలు తిని, ఆస్ధులు పోగొట్టుకున్న వాళ్లు కొన్ని వేలమంది వున్నారు. వాళ్లలో చాలా మందికి పదవులు అందడం లేన్న విమర్శలున్నాయి. కూటమిగా జట్టు కట్టి ఎలాంటి పోరాటాలు చేయని జనసేనకు పదవులు పోతుంటే తెలుగు తమ్ముళ్లు నోరు మూసుకొని వుండాల్సి వస్తుంది. తమకు రావాల్సిన పదవులు జనసేన నాయకులు ఇస్తుంటే వారికి జేజేలు కొట్టాల్సి వస్తుంది. ఏ పార్టీలో వున్న కార్యకర్తలకైనా ఇలాంటి పరిస్ధితులు రావొద్దు. ఇక జనసేనలో మరో విచిత్రం వుంది. పదవులు కోసం ఆశించి ఎవరూ రావొద్దంటూ జనసేనాని చెప్పడం విడ్డూరం. జనసేన కోసం తమ జీవితాలను త్యాగంచేయాలి కాని, పదవులు ఆశించకూడదని అనడం వల్ల ఆ పార్టీ నాయకుడి ఆలోచన ఏమిటో ఇప్పటికే జనసైనికులకు అర్ధమౌతోంది. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా, పదవులు ఎవరు పంచుకుంటున్నారో చూస్తూనే వున్నారు. ఇలా కార్యకర్తల జీవితాల్లో విషాలు నింపుతున్నారు. అందుకే కార్యకర్తలో నిస్తేజం ఆవహించుకుంటోంది. పదవుల పంపకాల కాడ మీరు..జెండాలు మోసే కాడ మేమా? అని ప్రశ్నిస్తున్నారు.

కేరళలో ‘నొక్కు కూలీ’ ప్రహసనం

శ్రామిక కామ్రేడ్ల ధాటికి సామాన్యుల విలవిల

‘చూసినందుకు’ కూలీ చెల్లించకపోతే దాడులు తప్పవు

ఇష్టారాజ్యంగా సామాన్యులను దోచుకుంటున్న శ్రామిక కామ్రేడ్లు

కార్ల్‌ మార్క్స్‌ ఊహించని ‘శ్రామిక స్వర్గం’ కేరళ!

 

రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందకపోవడానికి ఈ ‘శ్రామిక దందా’ కూడా కారణం

ఇక్కడినుంచి వలసలుంటాయి కానీ, ఇక్కడికి వలసలుండవు

ఇల్లుమారాలన్నా, పనులు మొదలుపెట్టాలన్నా బెదిరిపోతున్న సామాన్య జనం

కేరళ సాధించిన విప్లవ విజయానికి అంతా జేజేలు పలకాల్సిందే

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ప్రాచీన కాలంలో వివిధ దేశాల్లో స్థానిక సంస్కృతులు ప్రాధాన్యం వహిస్తే మధ్యయుగాల్లో మత ఛాందస వాదం పెరిగి క్రూసేడ్లు (మతయుద్ధాలకు) ప్రపంచ నాగరికతలను కుదిపేసాయి. ఇం గ్లండ్‌లో పారిశ్రామిక విప్లవం తర్వాత పెట్టుబడిదారీ విధానం పెరగడం, అందులో శ్రామికుల ను పెట్టుబడిదారుల దోపిడీనుంచి కాపాడే లక్ష్యంతో ఉద్భవించిన కమ్యూనిజం (శ్రామికవాదం),ఇదే సమయంలో పెట్టుబడిదార్లు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ప్రపంచంలో మార్కెట్ల అ న్వేషణ కారణంగా పుట్టికొచ్చిన వలసవాదం, ఇందుకోసం దేశాల ఆక్రమణ, ఆధిపత్య యుద్ధాలతో సామ్రాజ్యవాదం పెచ్చరిల్లి 19, 20 శతాబ్దాల్లో ప్రపంచం అట్టుడికిపోయింది. నిజం చెప్పా లంటే ప్రపంచ సమాజం నిరంతర గతిశీలతతో ఎప్పటికప్పుడు పరిణామాలకు లోనవుతూ రావడం చరిత్రగతిలో గమనిస్తాం. ప్రస్తుతం మనం సృజనాత్మక పెట్టుబడిదారీ విధానంలో వున్నాం. ఈ సృజనాత్మకతకు బీజాలు 17 నుంచి 19వ శతాబ్దాల మధ్యకాలంలోనే పడ్డాయనేది సుస్ప ష్టం. ఈ మధ్యకాలంలో జరిగినన్ని శాస్త్రీయ నూతన ఆవిష్కరణలు గతంలో ఎప్పుడూ జరగ లే దు. అయితే ఈ పరిణామక్రమంలో అనుకూల పరిస్థితులు లేకనో లేక తాము లేవనెత్తిన సమస్యలు పరిష్కారమవడంవల్లనో కొన్ని వాదాలు కనుమరుగైపోయాయి.
నేడు మనం చూస్తున్న పెట్టుబడిదారీ విధానం, 19వ శతాబ్దంనాటి రూపంలో లేదు. తన రూపాన్ని పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవడం వల్లనే పెట్టుబడిదారీ విధానం కొత్తరూపంలో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశం అనుసరించడానికి అనుకూలంగా మారింది. మరి పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన కమ్యూనిజం, కాలానుగుణమైన మార్పులను అంగీకరించకపోవడం, 19వ శతాబ్దపు నాటి శ్రామిక స్థితిగతులు నేడు లేకపోవడంతో అర్థం లేకుం డా పోయింది. పెట్టుబడిదారీ వ్యవస్థ సృజనకు ప్రోత్సాహం కల్పిస్తుంటే, కమ్యూనిజం రొడ్డకొట్టుడు సైద్ధాంతిక బూజునే పట్టుకొని వేలాడుతోంది. ఏతావాతా చెప్పాలంటే నేడు కొనసాగుతున్న పెట్టుబడిదారీ విధానానికి, 19వ శతాబ్దపు కమ్యూనిజం సిద్ధాంతాలు పనిచేయవు. మార్పును అంగీకరించలేని వాడు కనుమరుగైపోతాడన్నది ఒక నానుడి. ప్రస్తుతం మనదేశంలో సైద్ధాంతిక నిబద్ధత కలిగిన కమ్యూనిస్టులు కనుమరుగైపోవడానికి ప్రధాన కారణం తమ పద్ధతులు మార్చు కోకపోవడమే. కాలానికి అనుగుణంగా మారకపోవడమే! అన్నింటికంటే విచిత్రమేమంటే ఈ క మ్యూనిజం మిగిల్చిన ఒక భయంకరమైన అవశేషం ‘బాధ్యత లేని హక్కుల పోరాటం’. కేవలం ఈ కారణంగానే 34ఏళ్ల కమ్యూనిస్టుల పాలనలో బెంగాల్‌ వెనకబడిపోయింది. స్వాతంత్య్రానికి ముందు పశ్చిమ బెంగాల్‌లో కనిపించిన సాంస్కృతిక చైతన్యం దేశంలో మరెక్కడా కానరాదు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో మేధావులు ఇవ్వాళ ఆలోచించిన దాన్ని, బెంగాల్‌ మేధావులు చాలారోజుల ముందే ఆలోచిస్తారన్న నానుడి వుండేది. నాటి బెంగాల్‌ చరిత్ర తెలిసినవారికి, నేడు ఆ రాష్ట్ర దుస్థితిని చూస్తే జాలి, ఒకరకమైన నైరాశ్యం కలుగుతాయి.
ఏతావాతా చెప్పొచ్చేదేమంటే, మన శరీరంలో కొన్ని అవశేష అవయవాల (అపెండిక్స్‌) మాదిరి గానే వ్యవస్థలో కూడా కొన్ని వాదాలు మిగిల్చిన అవశేషాలు ప్రజలను పీడిస్తూనే వుంటాయి. కాకపోతే ఇవి పెద్దగా ప్రచారంలోకి రావు. కమ్యూనిజం తీసుకొచ్చిన ట్రేడ్‌ యూనియన్‌ వ్యవస్థలో భాగంగా ఇప్పుడు కేరళలో ‘నొక్కు కూలీ’ (చూస్తే కూలీ చెల్లించడం) విధానం అనేది ఒక అవవేష అవయవంగా కొనసాగుతూ మధ్య, తిగువ మధ్యతరగతి, సామాన్యులను విపరీతమైన దోపిడీకి గురిచేస్తోంది. ఎవరైనా తమకు అవసరమైన పనులకోసం ట్రేడ్‌ యూనియన్లకుసంబంధం లేని కూలీలను నియమించుకుంటే, ట్రేడ్‌ యూనియన్లకు లంచాల రూపంలో వారు డిమాండ్‌ చేసి నంత సమర్పించుకోవడమే ఈ నొక్కు కూలీ లేదా ‘గాకింగ్‌ వేజెస్‌’ లేదా ‘చూస్తే కూలీ చెల్లించే’ విధానం. విషాదమేంటంటే కేరళలో రాజకీయ పార్టీల మద్దతు వీరికి పుష్కలంగా వుండటం. అంతే కాదు ఈ వ్యవస్థ ఒక క్వాసీ`లీగల్‌ వ్యవస్థగా కొనసాగుతుండటం విచిత్రం! మిగిలిన రా ష్ట్రాల్లో ఇది కనిపించదు. దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామన్ని చెప్పుకునే కమ్యూనిస్టుల అనుబంధ ట్రేడ్‌ యూనియన్లు ఈవిధంగా మధ్య, దిగువ మధ్యతరగతి ప్రజలను ‘పీడిరచడాన్ని’ ఏవిధంగా నిర్వచించాలి? కోచి పారిశ్రామిక ప్రాంతంలో ‘హెడ్‌ లోడ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ బోర్డ్‌’ ఒక వేతన జాబితాను రూపొందించింది. దీని ప్రకారం ఈ ప్రాంతంలో పనులకు యంత్రాలను ఉపయోగిస్తే, సదరు యంత్రం వినియోగం వల్ల ఎంతమంది శ్రామికులు ఉపాధి కోల్పోతున్నారో లెక్కగట్టి ఆమొత్తం వసూలు చేస్తారు. అంటే ఇక్కడ యంత్రాలలో పనిచేయించుకున్నందుకూ, ఈ నొక్కు కూలీకి కలిపి రెట్టింపు చెల్లించాలి! దీనికి చట్టబద్ధత కల్పించడం…ఇక్కడ అనుసరిస్తున్న న్యాయం!!
రాష్ట్రంలోని ప్రతి పారిశ్రామిక, నివాస ప్రాంతాలను జోన్లుగా విడగొట్టి అక్కడ శ్రామిక యూనియన్లు ‘లుకౌట్ల’ను ఏర్పాటు చేస్తాయి. వీరికి ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌ వుంటుంది. వీరు అన్నికూడళ్లలో తిష్టవేసుకొని, సామాన్లను మోసుకెళ్లే వాహనాలను గమనిస్తుంటారు. ఎప్పుడైతే అటువంటి వాహ నాన్ని గుర్తిస్తారో తక్షణమే అందుబాటులో వున్న యూనియన్‌ నాయకులకు ఈ సమాచారాన్ని చేరవేస్తారు. వెంటనే యూనియన్‌ సభ్యులు సదరు సరుకు ఎక్కడ దిగుమతి అవుతున్నదో అక్కడ ప్రత్యక్షమై ‘పని`హక్కు’ పేరుతో ఆ యజమానిని ఇష్టారాజ్యంగా డబ్బులు డిమాండ్‌ చేస్తారు. జరిగే పనికి వారు డిమాండ్‌ చేసే మొత్తానికి చాలా సందర్భాల్లో అసలు పొంతనే వుండదు. చివరకు సరుకు లేదా ఇల్లు మారడానికి సామాన్లు తెచ్చుకున్న యజమానులు వీరిని బతిమాలి, బామాలి ఎంతోకొంత బేరం కుదర్చుకొని వారు అంగీకరించిన మొత్తాన్ని ‘నొక్కు కూలీ’ కింద సమర్పించుకొని, తాము అంతకుముందు మాట్లాడుకున్న పనివారితో సామాన్లు లేదా సరుకులు దిగుమతి చేసుకుంటారు. ఇల్లు కట్టుకోవాలన్నా, ఇల్లు మారాలన్నా, బదిలీపై వచ్చినవారికి వీరితో ఇక్కట్లు తప్పవు. అంతెందుకు సామాన్యుడు ఏపని చేపట్టాలన్నా ముందుగా వీరితో పెద్ద తలనొప్పిని ఎదుర్కొనడానికి సిద్ధపడాలి. ఎందుకంటే తాను చేయించుకునే పనికి, రెట్టింపు చెల్లించడానికి సిద్ధపడితేనే ముందుకెళ్లాలి. అంటే తాను మాట్లాడుకున్న కూలీలకు, ఈ ‘నొక్కు కూలీల’కు చూసినందుకు సమర్పించుకుంటేగాని పనికాదు! ఈ యూనియన్లు ఎంతటి శక్తివంతమైనవంటే, 2021 సెప్టెంబర్‌లో ఇస్రోకు చెందిన అతి పెద్ద యంత్రపరికరాన్ని కూడా దిగుమతి కానివ్వకుండా నిలి పేశారు. సంబంధిత అధికార్లు ఈ సమస్య నుంచి బయటపడటానికి నానా తిప్పలుపడాల్సి వచ్చింది. ప్రస్తుతం కేరళలో కొత్త వ్యాపారాలులేదా కొత్త పరిశ్రమలు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రారు. ఎందుకంటే ఈ శ్రామిక యూనియన్ల భయమే. ఇందువల్లనే కేరళనుంచి వలసలు వుంటాయి కానీ, ఆ రాష్ట్రానికి వలసలు వెళ్లే వారెవరూ వుండరు.
ఒకదశలో హైకోర్టు కూడా ఈవిధానం చట్టవిరుద్ధమని దీన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకో వాలని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కోరినా ప్రయోజనం లేదు. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటామని చెబుతుంది కానీ, శ్రామిక యూనియన్లు తమకు అనుబంధ సంస్థలు కనుక చూసీచూడనట్టు వ్యవహరిస్తాయి. ఇక రాజకీయ నాయకులకు ఓట్లు ముఖ్యం కనుక వీరివైపు కన్నెత్తి కూడా చూడరు. ఎవరైనా ఈ సమస్యలను శ్రామిక యూనియన్ల దృష్టికి తీసుకెళితే, ‘‘మేం ఇటువంటి కార్యకలాపాలను ప్రోత్సహించం. ఒకవేళ అటువంటి సమస్య వస్తే తక్షణం లేబర్‌ కమిషనర్‌ కు ఫిర్యాదు చేయండి’’ అని చెబుతారు. ఇంటి ముందు సరుకులు పెట్టుకొని, ఆ యజమాని లేబర్‌ కమిషనర్‌ చుట్టూ తిరగాలా? ఎంతటి దారుణ పరిస్థితి!!
పౌల్‌ జఛారియా అనే ఒక మళయాళం రచయిత ఈ నొక్కు కూలీ గురించి ఈవిధంగా రాశారు.
‘‘ఒకవేళ మీరు ఇల్లు మారాలనుకున్నారనుకుందాం. అప్పుడు ఈ శ్రామిక కామ్రేడ్‌లు సామాన్లు ఎగుమతి/దిగుమతి కూలీని చెల్లించాలంటూ ఆక్కడ ప్రత్యక్షమవుతారు. ఒకవేళ మీరు ఆ మొత్తాన్ని చెల్లించలేకనో లేక ఇష్టంలేకనో మీ స్నేహితులు, బంధువులతో కలిసి ఆ సామాన్లను దించు కున్నారనుకోండి. అప్పుడు దూరంగా ఈ వ్యవహారమంతా చూసిన శ్రామిక కామ్రేడ్‌లు ఆ శ్రమను తాము చూసినందుకు కూలీ చెల్లించాలని డిమాండ్‌ చేస్తారు. ఇదెక్కడి న్యాయమని మీరు ప్రశ్నించారనుకోండి, మీపై దాడి తప్పదు. కేరళలో విప్లవం ఏస్థాయిలో వున్నదంటే ‘ఒక శ్రామికు డు పనిచేయకపోయినా అతనికి చెల్లింపులు జరపాల్సిందే’. బహుశా ఇటువంటి శ్రామిక స్వర్గా న్ని కార్ల్‌ మార్క్స్‌ కూడా ఊహించి వుండడు!!’’
2018, మే 1న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మాట్లాడుతూ ‘‘ట్రేడ్‌ యూనియన్లు కూడా ఈ నొక్కుకూలీని రద్దుచేసేందుకు పూర్తి మద్దతునిస్తున్నాయి’’ అని చెప్పారు. కానీ ప్రస్తుతం త్రిరువనంతపురంలో ఇది యదేచ్ఛగా కొనసాగుతోంది. కేరళ ప్రభుత్వం ఎగుమతి/దిగుమతి చార్జీలను నిర్ణయించి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావన్‌కూర్‌ ద్వారా నొక్కు కూలీలకు చెల్లింపులు జరపా లంటూ ఒక చట్టం తెచ్చింది. ఆవిధంగా వేధింపులు తగ్గుతాయన్నది ప్రభుత్వ ఉద్దేశం. కానీ ఆ మొత్తాలను నొక్కు కూలీకింద శ్రామిక కామ్రేడ్‌లకు చెల్లించి, ప్రైవేటు వర్కర్లచేత సామాన్లు దిం పించుకోవడం ప్రస్తుతం జరుగుతోంది. ఎందుకంటే ‘పని హక్కు’ కింద పనిచేసే కామ్రేడ్‌ సోద రుల నిర్లక్ష్యానికి ఎన్ని విలువైన వస్తువులు ధ్వంసమవుతాయోనన్న భయం సామాన్యులను అను క్షణం వెన్నాడుతుంది. అందుకనే ఎక్కువ మొత్తం చెల్లించి ప్రైవేటు వర్కర్లచేత తమ పనులు కానిచ్చేసుకుంటున్నారు. ఇదీ ఘనత వహించిన కేరళ సాధించిన విప్లవ విజయం!!

సీతక్క ఆదివాసీ ప్రతినిధి…పేదల పెన్నిది.

`రజాకార్‌ వారసులకు సీతక్క లాంటి త్యాగశీలిని ప్రశ్నించే హక్కు అసలే లేదు.

`అక్భరుద్దీన్‌ తెలంగాణ వ్యతిరేకి.

`సీతక్క గురించి మాట్లాడే అర్హత అక్భరుద్దీన్‌కు లేదు.

`అక్భరుద్దీన్‌ వెకిలి భావన! అహంభావన!!

`సీతక్క మీద నోరు పారేసుకోవడం అక్భర్‌ కుసంస్కారం.

`తెలంగాణ మాతృభాష తెలుగు.

`తెలుగు రాకపోవడానికి అక్భర్‌ సిగ్గుపడాలి.

`అక్బర్‌ కేవలం ముస్లింలు ఓట్లేస్తేనే గెలవలేదు.

` అక్భర్కు తెలుగు రాకపోకపోవడం సిగ్గు చేటు.

`సీతక్క ‘‘లా’’ చదివిన ఆదివాసీ బిడ్డ

`సీతక్క పిహెచ్‌డి చేసిన మహిళా విద్యావంతురాలు.

`తెలంగాణ సమాజం కోసం తపన పడిన నాయకురాలు.

`తమ ప్రజల హక్కుల కోసం పోరాటం చేసిన ధీర వనిత.

`ప్రజా జీవితంలోకి వచ్చి మూడు సార్లు ఎమ్మెల్యే అయిన ప్రజా ప్రతినిధి.

`సీతక్క ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో బాధ్యత కలిగిన మంత్రి.

`సీతక్కకు ఉర్దూ రావాల్సిన అవసరం లేదు.

`ఇంగ్లీష్‌ కచ్చితంగా రావాలన్న రూలేమీ లేదు.

`తెలంగాణ రాజ భాష సీతక్కకు వచ్చు.

`తన మాతృభాషలు గోండు, కోయ భాషలు వచ్చు.

`సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు ప్రజలు మాట్లాడుకునే తెలుగు వచ్చు.

`అక్బర్‌ కు తెలుగు రాకపోవడం ఆయన దౌర్భాగ్యం.

`తెలంగాణలో ప్రజా ప్రతినిధిగా వుంటూ అక్బర్‌ తెలుగు నేర్చుకోకపోవడం తప్పు.

`సీతక్కకు ఉర్దూ, ఇంగ్లీష్‌ రావాల్సిన అవసరం అసలే లేదు.

`అక్బర్‌ అహంకారం పూరిత వ్యాఖ్యలు సమర్థనీయం కాదు

తెలంగాణలో పుట్టి పెరిగి, చాంద్రాయణ గుట్ట నుంచి ప్రజా ప్రతినిధిగా ఎన్నుకోబడుతూ, దశాబ్దాలుగా రాజకీయాలు సాగిస్తున్న ఎంఐఎం. ఎమ్మెల్యే అక్భరుద్దీన్‌ ఓవైసి నాకు తెలుగు రాదు. అర్ధం కాదని చెప్పడమే దౌర్భాగ్యం. సిగ్గు చేటు. పైగా మంత్రి సీతక్కకు ఇంగ్లీష్‌ రాదు, ఉర్ధూ రాదు అని ఎద్దేవా చేయడం పొరపాటు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాజ భాషగా అమలౌతున్న రాష్ట్రంలో మంత్రి సీతక్కకు ఇతర భాషలు రావంటూ నిండు అసెంబ్లీలో అనడం తప్పు. ఈ విషయంపై ఎమ్మెల్యే అక్భర్‌ మంత్రి సీతక్కకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే సీతక్కకు ఉర్దూ రావాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్‌ రావాల్సిన అవసరం అంతకన్నా లేదు. కోర్టు తీర్పులే తెలుగులో ఇస్తున్న ఈ సందర్భంలో మంత్రి సీతక్కకు రెండు బాషలు రావంటూ అక్భర్‌ మాట్లాడడం ఆయన అహాంకారానికి నిదర్శం. అయినా తెలంగాణ నడి గడ్డలో వున్న అక్భర్‌కు తెలుగు ఎందుకు రాదు? నాకు రాదని చెప్పడం గొప్ప అనుకుంటున్నాడేమో? ఇంత వరకు ఈ విషయం ఎవరూ పట్టించుకోలేదు. కాని అక్భర్‌ నోరి తన కొరివితో తలగోక్కున్నట్ల్లైంది. సీతక్కకు అచ్చమైన తెలుగుభాష స్పష్టంగా వస్తుంది. ఆమె అనర్గళంగా తెలుగు రాస్తుంది. ఆమె ఉన్నత విద్యావంతురాలు. న్యాయశాస్త్రం చదవిన పట్టభద్రురాలు. అంతే కాదు పిహెచ్‌డి కూడా చేస్తోంది. అలాంటి సీతక్కకు బాషలు రావంటూ వెక్కిరించడాన్ని తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతోంది. అయినా ఉమ్మడి రాష్ట్రంలో వున్నప్పుడు ఏపికి చెందిన ఏ నాయకుడు ఎప్పుడూ హిందీలో మాట్లాడిన సందర్భం లేదు. ఎన్టీఆర్‌ కూడా ఎన్నడూ అసెంబ్లీలో ఉర్ధూ మాట్లాడలేదు. చంద్రబాబు మాట్లాడలేదు. రాజశేఖరరెడ్డి మాట్లాడలేదు. రోశయ్య మాట్లాడలేదు. ఆఖరుకు కిరణ్‌కుమార్‌ రెడ్డికూడా మాట్లాడిరది లేదు. అప్పుడు ఎలా అర్ధమైంది అక్భరుద్దీన్‌ ..ఆ రోజుల్లో ఈ మాట ఎందుకు మాట్లాడలేదు? ఎందకంటే అప్పుడు అన్న అసద్దుద్దీన్‌ ఓవైసి, ఇటు అక్భర్‌ద్దీన్‌ తాట తీశారు. చంద్రబాబు హాయాంలో, కిరణ్‌కుమార్‌ రెడ్డి కాలంలో వీపు విమానం మోత మోగించారు. అందుకే అప్పుడు కుక్కిన పేనులా వున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు గౌరవిస్తుంటే చులకనగా కనిపిస్తుందా? గత ప్రభుత్వాలు వున్న తీరుగా వుంటేనే వింటారా? తెలంగాణలో ప్రజా ప్రతినిధిగా వుంటూ అసెంబ్లీలో 95శాతం చర్చలు పూర్తిగా తెలుగులోనే జరుగుతుంటాయి. మరి అవి ఎలా అర్ధమౌతున్నాయి. ఏం అర్దం చేసుకుంటున్నారు? ఎంఐఎం పార్టీలో తెలుగు నాయకులు లేరా? వారు చెప్పే సమస్యలు ఎలా వింటున్నారు. ఆదివాసీ బిడ్డ సీతక్క మంత్రి చెప్పినప్పుడే అర్ధం కావడం లేదా? మంత్రి సీతక్క ఉర్దూ, ఇంగ్లీష్‌ నేర్చుకోవడం కాదు..ముందు అక్భర్‌ తెలుగు నేర్చుకో.. అక్భర్‌కు వచ్చిన బాషలోనే సభలో సమాదానమివ్వాలని రూలేం లేదు. ఇకపై తెలంగాణ రాష్ట్రంలో తెలుగుబాష రాని వారిని ప్రజలు ఎన్నుకోవద్దన్న నిర్ణయం తీసుకుంటే అప్పుడు తెలుస్తుంది తెలుగు విలువ. తెలంగాణ విలువ. తమిళ నాడులో ఎక్కడికి వెళ్లినా తమిళమే కనిపిస్తుంది. తమిళంలో తప్ప మరో బాషలో వాళ్లు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ల బాష అంటే వాళ్లకు అంత అభిమానం. అది వాళ్ల ఆత్మగౌరవం. తెలంగాణ ప్రజలకు చాలా మందికి ఉర్దూ వస్తుంది. మరి మీకు తెలుగు ఎందుకు రాదు! తెలుగు కవువులు ఎంతో మంది ముషాయిరాలు రాశారు. మాజీ ప్రధాని పివి. నర్సింహారావు లాంటి వారు ఉర్ధూలో అనేక పుస్తకాలు రాశారు. అంతకన్నా ఎంఐఎం.నాయకులు అంతకన్నా గొప్పవారా? తెలంగాణలో వుంటూ తెలుగు రాదంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎంఐఎం. నాయకులు దెబ్బతీయడమే. తెలంగాణను అవమానించడమే అవుతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యాంధ్ర కావాలనికోరుకున్నది ఎంఐఎం. తెలంగాణ ఇచ్చేది వుంటే రాయల తెలంగాణ కావాలని కోరుకున్నది ఎంఐఎం. అలాంటి పార్టీకి కూడా తెలంగాణ ప్రభుత్వాలు ఎంతో గౌరవాన్ని ఇస్తున్నాయి. కాని ఆ గుర్తింపును ఎంఐఎం నిలుపుకోవడం లేదు. అక్భర్‌ లాంటి వారు ఆ గౌరవాన్ని పొందడానికి అర్హులు అసలే కాదు. అక్భర్‌ పిడికెడుమంది ప్రజలకు మాత్రమే ప్రతినిధిని అనుకుంటున్నారు. కాని సీతక్క అలా కాదు. యావత్‌ తెలంగాణ రాష్ట్రానికి సీతక్క ప్రతినిధి. తెలంగాణ రాష్ట్రంలో మంత్రి. ఆ సంగతి మర్చిపోయి అక్భర్‌ చిల్లర వ్యాఖ్యలు చేయడాన్ని తెలంగాణ సమాజం తీవ్ర అభ్యంతరం తెలియజేస్తుంది. ఇక్కడ కాంగ్రెస్‌ నాయకులకు కూడా తప్పు పట్టాల్సిన అవసరం వుంది. నిండు సభలో అక్భరుద్దీన్‌ సీతక్కను అవమాన పర్చే అర్ధం సృరించేలా వ్యాఖ్యలు చేసినప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయడం కూడా సరైంది కాదు. అప్పుడే అక్భర్‌ను నిలువరించేది వుండే..అక్భర్‌ చేత సభలో క్షమాపణ చెప్పించాల్సి అవసరం వుండే. కనీసం సీతక్కకు ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే సపోర్టుగా మాట్లాడకలేకపోయారు. సీతక్క తన ప్రజల కోసం పడినశ్రమ అంతా ఇంత కాదు. ఆమె జీవితమంతా పేద ప్రజల కోసమే సాగింది. రాజాకార్‌ వారసుడైన అక్భరుద్దీన్‌కు సీతక్క లాంటి త్యాగశీలిని ప్రశ్నించే హక్కు లేదు. సీతక్క పేరు పలికేందుకు కూడా అర్హత లేదు. అక్భరుద్దీన్‌ది వెలికి భావన. తెలంగాణ రాజభాష తెలుగు. అక్భరుద్దీన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న చాంద్రాయణ గుట్టలో సగం మంది హిందువులు,తెలుగు ప్రజలే వుంటారు. తెలుగు ప్రజల ఓట్లతో గెలిచిన అక్బర్‌కు తెలుగు రాకపోవడం సిగ్గు చేటు. సీతక్క పీడిత ప్రజల కోసం చేసిన పోరాటంలో అక్బర్‌ ఒక్క శాతం కూడా చేసింది లేదు. సీతక్క తన ప్రాణాలను ఫణంగా పెట్టి పీడిత, తాడిత ప్రజలకోసం అడవికెళ్లి పోరాటం చేసింది. పీడిత ప్రజల్లో చైతన్యం నింపింది. జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత తన ప్రజల కోసం రక్త దారపోస్తోంది. తన నియోజకవర్గ ప్రజలకోసం కొండలు, కోనులు, వాగులు, వంకలు దాటుతూ వారి కోసం నిత్యావసర వస్తువులు నెత్తి మీద పెట్టకొని తీసుకెళ్లి ఇస్తుంది. అలాంటి ప్రజా ప్రతినిధి మన దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడా వుండకపోవచ్చు. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే కారు నుంచి కాలు కింద పెట్టకుండా రాజకీయం చేసేవారే ఎక్కువ. కాని సీతక్క తాను ఎమ్మెల్యేను అనే భావన కూడా వుండదు. నిత్యం ప్రజల్లో వుంటుంది. ప్రజల కోసమే ఆమె జీవిస్తోంది. వానాకాలంలో వాగులు వంకలు దాటుకుంటూ వెళ్లి ఆమె చేసే సేవలు చూసే వారిలో కూడా కన్నీళ్లు తిరుగుతాయి. నడి ఎండా కాలంలో సీతక్క కొండలు కోనలు దాటుకుంటూ తన ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడం ప్రపంచమంతా చూసింది. ఇక కరోనా సమయంలో ఆమె చేసిన సేవలు మరెవరూ చేసి వుండరు. అలాంటి సేవలు ఏ ఒక్క నాడైనా అక్భరుద్దీన్‌ చేశాడా? కరోనా కాలంలో ప్రజల మధ్య ఏనాడైనా వున్నాడా? తెలంగాణను చిన్నా భిన్నం చేసిందే రజాకార్లు. కాసింరజ్వీ స్దాపించిన ఎంఐఎం పార్టీని ఇంకా తెలంగాణలో ప్రజలు ఆదరించడమే గొప్ప. కాసిం రజ్వి పోయిన తర్వాత అలాంటి పార్టీని నడిపిస్తూ, రాజకీయాలు చేస్తుంటే కూడా తెలంగాణ సమాజం ఎంఐఎంను సహిస్తోంది. ఆదరిస్తోంది. అది తెలంగాణ ప్రజల గొప్ప గుణం. అలాంటి ప్రజల ఓట్లతో గెలుస్తూ తెలుగును కించపర్చే అర్దం వచ్చేలా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. తెలంగాణ కోసం కొట్లాడిన నాయకురాలు సీతక్క. గిరిపుత్రుల హక్కుల సాధన కోసం పోరాటం చేసిన ధీర వనిత సీతక్క. ప్రజా జీవితంలో సేవ చేసుకుంటూ మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుతం మంత్రిగా సేవలు చేస్తున్నారు. ప్రజా సేవ చేసేవారికి బాషతో పనిలేదు. ప్రజల మనసు తెలిస్తే చాలు. ప్రజల సమస్యలు తెలిస్తే చాలు. వాటిని ఎలా పరిష్కరించాలో తెలిస్తే చాలు. అంతే కాని ఉర్ధూ రావాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇదే మాట ఉమ్మడి రాష్ట్రంలో అనేదే వుంటే తాట తీసేవారు. చార్మినార్‌ వద్ద పోలీసులు ఎలాంటి చికిత్స చేశారో..అలాంటి చికిత్స అసెంబ్లీలో కూడా జరిగేది. తెలంగాణ ఎమ్మెల్యేలలో చాలా మందికి ఉర్ధూ రాదు. వాళ్లు మంత్రుల అయ్యే అవకాశం లేనట్లా? నీకు ఇంగ్లీష్‌ వస్తుందని వాళ్లకు రాకుంటే ఎంఐఎం దృష్టిలో వారికి విలువ వుండదా? ఇప్పటికైనా అక్భరుద్దీన్‌ ఇలాంటి తిక్క మాటలు మానుకోకపోతే తెలంగాణ ప్రజల చేతిలో ఎంఐఎంకు నూకలు చెల్లక తప్పదు.

వరంగల్‌ రాజకీయాలకు కొండంత అండ కొండా!

`తెలంగాణ గడ్డ మీద మహిళా కెరటం కొండా సురేఖ!

`మహిళా చైతన్య నినాదం కొండా

`ప్రశ్నించే సమాజానికి గొంతుక కొండా

`అన్యాయాన్ని ఎదిరించి నిలబడిన మేరు పర్వతం కొండా

`తెలంగాణ రాజకీయాలను కొన్నేళ్ల పాటు తన చుట్టూ తిప్పుకున్న రాజకీయం కొండా

`బీసీ బిడ్డ మీద ఓసిల కక్ష!

`ఒకప్పుడు వరంగల్‌ అంటే కొండా!

`కొండా అంటేనే తెలంగాణ ఫైర్‌ బ్రాండ్‌

`ఆదిపత్య రాజకీయాలు కొండాకు కొత్త కాదు

`కొండాకు తెలియని రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు కాదు

`నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడిన కుటుంబం కొండా

`అనుచరుల కోసం ఎంత దూరమైనా వెళ్లే సాహసం కొండా

`పేద ప్రజల కోసం జీవితాంతం త్యాగం కొండా

`పదవులు కొండా ముందు పూచిక పుల్లలు

`కష్టాలకు ఏనాడు వెరవలేదు, నిర్భందాలకు ఎప్పుడూ వెరవలేదు

`ఎదురించి నిలబడిన పోరాటం కొండా

`నమ్మిన పార్టీలను నిలబెట్టిన కొండంత ధైర్యం కొండా

`దిగజారుడు రాజకీయాలపై సింహ స్వప్నం కొండా

`వ్యక్తులకైనా, వ్యవస్థకైనా అండగా నిలవడమంటేనే కొండా

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఉమ్మడి వరంగల్‌ రాజకీయాలకు కొండా కుటుంబం కొండంత అండ. ఆ కుటుంబం ఏ పార్టీతో వున్నా ఆ పార్టీకి కట్టుబడి పనిచేయడం వారి నైతికత. తిరుగుబాటు రాజకీయాలకు పెట్టింది పేరు. పేదల కోసం వారి త్యాగం ఇంటిపేరు. మూడున్నర దశాబ్ధాలుగా ఆ కుటుంబం పేద ప్రజల కోసం కట్టుబడి సేవలందిస్తున్నారు. నమ్ముకున్నవారి కోసం జీవితాలను త్యాగం చేస్తూ వస్తున్నారు. నిత్యం ఒడిదొడుకుల రాజకీయాలలో అలుపెరగని పోరాటం సాగిస్తున్నారు. ప్రజల కోసం నిలబడుతున్నారు. వారు తయారు చేసిన ఎంతో మంది రాజకీయ జీవితాల్లో స్ధిరపడిన వారున్నారు. ఉన్నతమైన స్దానాలలో పదవులు పొందిన వారున్నారు. తమ అనుచరులకోసం ఎంత దూరమైనా వెళ్లే అంకితభావం వున్న కుటుంబం కొండాది. వారి రాజకీయం ముందు ఇప్పుడున్న ఏ నాయకుడైనా దిగదుడుపే అని చెప్పాలి. ఉమ్మడి వరంగల్‌ జిల్లా రాజకీయాలను ఇంత కాలం శాసించిన కుటుంబం మరొకటి లేదు. అయినా వారి మీద ఎప్పుడూ ఏదో రకమైన కక్షపూరిత రాజకీయాలు చేయాలని చూసిన వారు కనుమరుగైపోయారే గాని వాళ్ల రాజకీయం ఎప్పుడూ ఓడిపోలేదు. పరిస్ధితులు అనుకూలించక కొన్ని సార్లు ఓడిపోయినా వ్యక్తిగత రాజకీయాల్లో వారికి ఎప్పుడూ ఓటమి లేదు. ప్రజల్లో వారికి ఎప్పుడూ వ్యతిరేకత రాలేదు. పదవుల కోసం కొండా కుటుంబం ఎప్పుడూ రాజకీయాలు చేయలేదు. పదవులే వారిని వరించుకుంటూ వచ్చాయి. పదవులు కోసం ఎవరి ముందు అర్రులు చాచలేదు. వారి ప్రజా సేవకు పార్టీలే పిలిచి పెద్ద పీఠ వేశాయే గాని, పైరవీలతో పదువులు పొందిన చరిత్ర కొండా కుటుంబానికి లేదు. నమ్మిన సిద్దాంతం కోసం పదవులను తుణ ప్రాయంగా వదిలేసిన చరిత్ర కొండా దంపతులది. పదవులు పట్టుకొని వేళాడిన చిరత్ర ఆ కుటుంబం వ్యతిరేకులది. అయితే ఆ కుటంబం రాజకీయాల్లో ఓడిపోలేదు. కాని సొంత పార్టీలలోనే కొంత మంది వారిని రాజకీయంగా ఇబ్బందుల పాలు చేయాలని ప్రతిసారి చూస్తూనే వున్నారు. వారిని ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేయాలని చూస్తూనే వున్నారు. ఈ తంతు ఇప్పుడు సాగుతున్నది కాదు. కొండా కుటుంబానికి ఎత్తు పల్లాలు కొత్తవి కాదు. రాజకీయాల్లోకి వచ్చిన నిమిషం నుంచి, ప్రతి క్షణం కాలంతో పోరాటం చేస్తూనే వున్నారు. తమ వ్యతిరేకులపై పై చేయి సాధిస్తూనే వున్నారు. ఎప్పటికైనా కొండా కుటుంబం మీద ఆధిపత్యం చేయాలని చూసిన వారు రాజకీయంగా తెరమరుగైన వాళ్లే కాని, ఇప్పటి వరకు కొండా కుటుంబాన్ని రాజకీయంగా దూరం చేసిన వాళ్లు లేదు. అదీ వారికి ప్రజలతో వున్న అనుబంధం. ప్రజలకు కొండా కుటుంబం మీద వున్న బలమైన నమ్మకం. ఈ రెండిరటి మధ్య ఎవరొచ్చినా రాజకీయంగా కాలగర్భంలో కలిసిన వారే కాని, కొండా కుటుంబాన్ని రాజకీయంగా దూరం చేసిన వారు ఎవరూ లేరు. కొండా కుటుంబాన్ని ఎన్ని రకాలుగా రాజకీయాలకు దూరం చేయాలని చూసినా, ప్రతిసారి అంతే వేగంగా రాజకీయాలను శాసిస్తూ వస్తున్నారు. రాజకీయాలను ఏలుతూ వస్తున్నారు. మంత్రి కొండా సురేఖ అంటేనే ఒక బ్రాండ్‌. కేవలం వరంగల్‌ జిల్లా రాజకీయాలే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఆ కుటుంబానికి ఒక పేరుంది. కొండా సురేఖ తెలియని ప్రాంతం లేదు. కొండా కుటుంబానికి అభిమానులు లేని జిల్లా లేదు. అంతే కాదు ఏపిలో కూడా కొండా కుటుంబం అప్పటికీ ఎంతో అభిమానించే వాళ్లు కొన్ని లక్షల్లో వున్నారు. రాష్ట్రం విడిపోయినా సరే ఆమె ఏపికి వెళ్తే వేలాది మంది పోగౌతుంటారు. వారి అభిమానాన్ని తెలియజేస్తుంటారు. అయితే ఇక్కడ కొండా కుటుంబం అంటేనే త్యాగానికి పేరు. ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ జీవితాన్ని నిలబెట్టిన రాజశేఖరెడ్డి కుటుంబం అంటే ఆమెకు ఎనలేని ప్రేమ వుండేది. నమ్మిన సిద్దాంతం కోసం, అండగా నిలిచిన రాజశేఖరరెడ్డి కుటంబం కోసం ఆమె చేసిన త్యాగం అంతా ఇంతా కాదు. తన రాజకీయ జీవతం గురించి ఏనాడు ఆమె ఆలోచించలేదు. 2009 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొండా సురేఖ మంత్రి అయ్యారు. రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో కీలకభూమిక పోషించారు. అయితే రాజశేఖరరెడ్డి మరణించడం కొండా సురేఖతో తనపదవికి రాజీనామా చేశారు. జగన్‌ను ముఖ్యమంత్రి చేయడం కోసం ఆమె తన పదవినే వదులుకున్నారు. కాని రాజశేఖరెడ్డి చలువతో రాజకీయాలు చేసిన ఎంతో మంది ఆ కుటుంబానికి దూరమయ్యారు. జగన్‌ను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని తెలియడంతో దూరమయ్యారు. కాని కొండా సురేఖ మాత్రం మళ్లీ పదవి తీసుకోలేదు. తర్వాత జగన్‌ కోసం రాజకీయ జీవితాన్ని త్యాగం చేసిన ఘనత కొండా సురేఖకుమాత్రమే దక్కుతుంది. కాని ఆయన ఆ కృతజ్ఞత మర్చిపోయారు. కొండా మురళికి అన్యాయంచేశారు. ఒక దశలో తెలంగాణ అంతా కొండా కుటుంబంపై పగబట్టినంత పనిచేసినా, నమ్మితే ప్రాణమిచ్చే అంకితభావం తమ సొంతమని నిరూపించారు. తెలంగాణ వాదుల చేత అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. అయినా ఏనాడు వాళ్లు చలించలేదు. చంచల స్వభావం చూపించలేదు. అది వారి గొప్పదనం. అలాంటి నాయకులు దేశం మొత్తం వెతికినా ఒక్కరు కూడా కనిపించరు. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాలన్నీ అవకాశ వాద రాజకీయాలే..కాని తమ రాజకీయ జీవితంలో ఏనాడు కొండా దంపతులు స్వార్ధపూరిత రాజకీయాలు చేయలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత బిఆర్‌ఎస్‌లో చేరారు. ఆ పార్టీ కూడా వారిని మోసం చేసింది. రెండోసారి కొండా సురేఖకుటికెట్‌ ఇవ్వలేదు. అయినా కొండా సురేఖ వెరవలేదు. మళ్లీ పడిలేచిన కెరటంలా కాంగ్రెస్‌ నుంచి గెలిచారు. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఆమె మంత్రి కావడం ఇష్టం లేని కొంత మంది వరంగల్‌ జిల్లాకు చెందిన నాయకులు ఏదో వివాదం సృష్టించాలని చూస్తూనే వున్నారు. అడుగడుగునా కొండా సురేఖను విమర్శల పాలు చేయాలని చూస్తున్నారు. ఆమె మంత్రి అయిన నుంచే ఆమె పదవి రావడం గిట్టని వారు కాంగ్రెస్‌లోనే వున్నారు. పరకాల వివాదంతో కొండా దంపతులపై రాజకీయాధిపత్యం చేయాలని చూశారు. అయినా తెలంగాణలోనే కాదు, ఏపిలో కూడా ఎంతో మంది అభిమానులు, అనుచరులున్న కొండా దంపతుల విలువ తెలియని వాళ్లు గిట్టని వేషాలు వేస్తున్నారు. మంత్రి కొండా సరేఖ ప్లెక్సీలు ఏర్పాటుచేస్తే వాటిని చించేసి రాజకీయం చేయాలని చూశారు. కాని అయినా వారి చిల్లర చేష్టలు చెల్లలేదు. ఇక ఇటీవల మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని తెలిసి, కొంత మంది కొండా సురేఖ మంత్రి వర్గం నుంచి తొలగిస్తారంటూ రకరకాల వార్తలు రాయిస్తున్నారు. గతంలోనే మంత్రి పదవిని పూచిక పుల్లతో వదులుకున్న కొండా సురేఖ ఇప్పుడు భయపడుతుందని అనుకుంటే పొరపాటు. అయినా తెలంగాణలో బిసిలలో ముప్పై ఏళ్లుగా చైతన్యం నింపుతున్న కుటుంబం కొండాది. అలాంటి కుటుంబాన్ని రాజకీయంగా టార్గెట్‌ చేయడం అంటే కొరివితో తలగోక్కున్నట్లే. కొండా మురళీదర్‌రావు తెలంగాణ బిసిలలో అతి పెద్ద సామాజికవర్గమైన మున్నూరు కాపు. తెలంగాణలో మరో బలమైన సామాజిక వర్గం పద్మశాలి అడబిడ్డ కొండా సురేఖ. ఇలా రెండు సామాజిక వర్గాలు కలిసిన కుటుంబం కొండాది. ఓసిలు కొంత మంది తమ రాజకీయ ఆధిపత్యం కోసం ఇప్పుడు కొండా సురేఖపై ఎలాంటి రాజకీయాలు చేయాలని చూసినా అది వారి రాజకీయ సమాదికే దారి తీస్తుంది. కొండా సురేఖ మీద లేని పోని రాతలు రాయిస్తూ తమ వెలికి రాజకీయాన్ని చూపించాలని చూసినా సాధ్యమయ్యేది కాదు. మంత్రులు కావాలని ఎవరైనా కోరుకోవచ్చు. కాని వారి వ్యక్తిగత రాజకీయాలతో పదవులు పొందాలి.లేదా ప్రజల్లో వారికున్న పరపతితో పదవులు పొందాలి. అంతే కాని పదవుల్లో వున్నవారిని పదవులపై పుల్లలు పెట్టి మంత్రులు కావాలంటే జరిగేది కాదు. కొండా సురేఖ మంత్రి పదవి పోయేది కాదు. రెండు బలమైన సామాజిక వర్గాలకు ప్రతినిధులుగా వున్న కొండా సురేఖ మంత్రి పదవికి ఏమాత్రం ఇబ్బంది వచ్చినా, తెలంగాణ ఈ రెండు సామాజిక వర్గాలలో అలజడి మొదలైంది. కాంగ్రెస్‌ పార్టీకి మొదటికే మోసం వస్తుంది. అంతటి సాహసం కాంగ్రెస్‌ చేయదు. అయినా కొండా దంపతుల రాజకీయ శక్తి ఏమిటో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి తెలుసు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానానికి తెలుసు. నిన్న మొన్న రాజకీయాలు చేయడం తెలిసిన వారు కొండా దంపతుల రాజకీయాన్ని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. అది తెలియక ఆధిపత్యం చేయాలనుకుంటున్నారు. అడ్రస్‌ లేకుండా పోవడానికి వాళ్లకు వాళ్లే దారులు వేసుకుంటున్నారు.

బీసీ విధానం ఎవరిది.. నినాదం ఎవరిది?

`జనం ఏ పార్టీని నమ్మొచ్చు! ఏ పార్టీని నమ్మకపోవచ్చు!!

`బీసీ నినాదంతో బలపడేదెవరు! బాగుపడేదెవరు!

`ఇప్పుటి దాక వున్న బీసీ కమీషన్లు ఏం సాధించాయి!

`బీసీ కార్పోరేషన్లు ఎంత మందిని ఉద్దరించాయి?

`బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పార్టీలకు లాభమా!

`ప్రజలకు మేలు జరుగునా?

`బీసీలు కుర్చీలో కూర్చుంటే ఆ కులాలకు మేలు చేస్తారా?

`బీసీ రాజకీయ రిజర్వేషన్లు ఏ పార్టీకి లాభిస్తాయి?

`స్థానిక సంస్థల ఎన్నికలలో ఎవరికి మేలు!

`42శాతం అమలు చేసిన కాంగ్రెస్‌కు వరమౌతుందా?

`ప్రతిపక్షాలు గెలవటానికి కారణమౌతుందా?

`బీసీ బిల్లుతో కాంగ్రెస్‌ మెజారిటీ స్థానాలు గెల్చుకుంటుందా?

`పల్లె రాజకీయాలలో పార్టీల పాత్ర పని చేస్తుందా?

`ఇప్పటికిప్పుడు బీసీ నినాదం కాంగ్రెస్‌ కు మేలు చేస్తుందా?

`ప్రతిపక్షాలకు వరమౌతుందా?

`ఇంతకీ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుకు ఆమోదం తెలుపుతుందా?

`లేకుంటే జనరల్‌ స్థానాలన్నీ బీసీలకు కేటాయిస్తారా?

`పల్లెల్లో పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలంగా వున్నాయా!

`పల్లెల్లో రైతులు సంతోషంగా వున్నారా?

`ప్రజల ఆకాంక్షలు కాంగ్రెస్‌ నెరవేర్చిందా?

`ఉద్యోగ కల్పనతో పల్లెల్లో ప్రజలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారా?

`ప్రజా వ్యతిరేకత బీసీ బిల్లులో కొట్టుకుపోతుందా?

`బీసీ, ఓబీసీ రుణాలు స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్‌ పట్టం కడతాయా?

`తాజాగా ప్రభుత్వం యువతకిచ్చే రుణాలు ఓట్లు రాల్చుతాయా!

`కాంగ్రెస్‌ ప్రచారం చేసుకోవడంలో సఫలమౌతుందా!

`ప్రతిపక్షాలకే మేలు జరిగేలా వుంటుందా!

,హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 తెలంగాణ రాజకీయాలలో బిసి నినాదం తుఫాను సృష్టించేలా వుందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇటీవల జరిగిన కరీంనగర్‌ పట్టభద్రుల ఎన్నికల్లో బిసి ఓటర్లు తమ ప్రభావాన్ని చూపారని తేలింది. అంతే కాకుండా గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కామారెడ్డి బిసి డిక్లరేషన్‌ ప్రకటించింది. అప్పటి నుంచి బిసి నినాదం ఊపందుకున్నది. ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాన్ని ముందు మొదలుపెట్టింది కాంగ్రెస్‌ పార్టీ. కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడు చిన్నారెడ్డి అద్యక్షతన తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ ఏర్పాటైంది. 42 మంది కాంగ్రెస్‌ఎమ్మెల్యేల సంతకాలతో తెలంగాణ వాదానికి మలి దశ ఊపిరి పోసింది. తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. కాకపోతే తెలంగాణ తీర్మాణం 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపుకు ఎంతో దోహదంచేసింది. అదే సమయంలో బిఆర్‌ఎస్‌కు రాజకీయంగా కూడా పనికి వచ్చింది. తర్వాత పద్నాలుగు సంవత్సరాలకు తెలంగాణవచ్చింది. కాని కాంగ్రెస్‌కు మేలు జరగలేదు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి పాలయ్యింది. కాని తెలంగాణ కల నెరవేర్చినట్లైంది. తెలంగాణ కాంగ్రెస్‌ ఇచ్చిందన్న పేరు చరిత్రలో నిలిచిపోయింది. అలాగే గతంలో ఎన్ని బిసి ఉద్యమాలు వచ్చినా రాజ్యాధికారం కోసం ఏనాడు వాణ వినపడలేదు. ఎంత సేపు ఉద్యోగాలలో రిజర్వేషన్లు, ప్రమోషన్లలో రిజర్వేషన్లపై పోరాటాలు సాగేవి. అంతే కాకుండా బిసి కార్పోరేషన్‌ ద్వారా బిసి యువతకు రుణాల కోసం పోరాటాలు జరిగేవి. ఎప్పుడైతే కాంగ్రెస్‌ పార్టీ బిసి డిక్లరేషన్‌ ప్రకటించిందో ఒక్కసారిగా బిసి సంఘాలలో కదలిక వచ్చింది. బిసి కుల సంఘాలలో చైతన్యం నిండిర ది. రాజకీయ పార్టీలన్నీ జై బిసి నినాదం అందుకున్నాయి. ఇక్కడ కూడా ఆ పుణ్యం కాంగ్రెస్‌కే దక్కుతుంది. కాని దాని ఫలితం ఎవరికి దక్కుతుందనేది మాత్రం ఇప్పటికిప్పుడు చెప్పలేకుండా వుంది. గత ఎమ్మెల్సీ ఎన్నికలలో బిసిలకు టికెట్లు ఇచ్చేందుకు పార్టీలు కూడా ముందుకొచ్చాయి. గతంలో ఈ వాతావరణం కనిపించలేదు. ఇప్పుడు జనరల్‌ సీట్లలో మొత్తానికి మొత్తం ఓసిలకు కట్టబెట్టేందుకు రాజకీయ పార్టీలు ఒకటికిపదిసార్లు ఆలోచించే పరిస్దితి వచ్చింది. ఇక తాజాగా మంత్రి వర్గ విస్తరణలో కూడా బిసిల ప్రాధాన్యం పెంచాలని చూస్తున్నారు. మరో వైపు బిజేపి బిసి నినాదాన్ని ఎంచుకున్నది. గత ఎన్నికల సమయంలోనే బిసి ముఖ్యమంత్రి నినాదం ప్రకటిస్తారని అనుకున్నారు. కాని కుదరలేదు. బిఆర్‌ఎస్‌ పార్టీ కూడా బిసి విధానాన్ని, నినాదాన్ని కూడా వినిపిస్తూ వుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బిసి విధానమే ఏకైక ఎజెండాగా రాజకీయాలకు ఎంచుకున్నది. బసిలకు రాజ్యాదికారం కోసం బిఆర్‌ఎస్‌ కూడా ముందుకు రావాల్సి వస్తోంది. కవిత మూలంగా బిఆర్‌ఎస్‌ కూడ బిసి నినాదం అందుకోవాల్సి వస్తోంది. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. కల్వకుంట్ల కవిత గత రెండు సంవత్సరాలకు పైగా బిసి నినాదాన్ని వినిపిస్తోంది. కాని కాంగ్రెస్‌ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌ తర్వాతే బిసిలలో మరింత చైతన్యం నిండిరది. ఎందుకంటే సామాజిక న్యాయం అన్నది కాంగ్రెస్‌లోనే సాద్యం. బిఆర్‌ఎస్‌లో అది సాధ్యం కాదు. పదేళ్ల అదికారంలో సాద్యం కాలేదు. కనీసం ఓ నలుగురు బిసి మంత్రులు లేరు. ఇక బిజేపి ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ బిసి అంటూ చెప్పుకుంటారు. కాని ఇప్పటి వరకు వారి బిసి విదానాన్ని ప్రకటించలేదు. అయినా బిసిలు బిజేపిని మిగతా పార్టీలకన్నా ఎక్కువ నమ్ముతున్నారన్నది ఇతర పార్టీలు గుర్తించాలి. పైగా ఇటీవల బిసి కృష్ణయ్యను పిలిచి మరీ రాజ్యసభ ఇచ్చారు. బిసిల విషయానికి వస్తే సామాజిక న్యాయం జరగాలంటే సహజంగా జాతీయపార్టీలతోనే సాద్యమౌతుంది. అయితే బిఆర్‌ఎస్‌ పార్టీ కూడా జాతీయ పార్టీగా అవతరించాలని అనుకుంటోంది. భవిష్యత్తులో బిసిల రాజ్యాధికారం విషయంలో బిఆర్‌ఎస్‌ ఒక అడుగు ముందుకు వేస్తుందా? లేదా? అన్నది తెలుస్తుంది. కాని బిసిలకు తగిన న్యాయం చేయడంలో జాతీయ పార్టీలకే సాధ్యమౌతుందని చెప్పాలి. కొన్ని నిజాలు కటువుగా వుంటాయి. వాటిని జీర్ణించుకోవడం కొన్ని పార్టీలకు కష్టంగానే వుంటుంది. ఒక వేళ రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ అదికారంలో వుంటే బిసి నినాదం వుండేదా? బిసి నినాదం చేపట్టేవారుండేవారా? వున్నా బిఆర్‌ఎస్‌ పట్టించుకునేదా? కేసిఆర్‌ బిసిలకు సపోర్టు చేసేవారా? బిసి బిల్లు తెచ్చేందుకు అంగీకరించేవారా? అంటే అసలే వుండేది కాదు. బిసి అనే ఉద్యమమే పురుడు పోసుకునేది కాదు. ఇంత త్వరగా బిసి బిల్లు వచ్చేదే కాదు. కాని కాంగ్రెస్‌ వల్లనే సాధ్యమైంది. కాని ఆ క్రెడిట్‌ కాంగ్రెస్‌కుఎంత వరకు దక్కుతుందనేది కూడా ప్రశ్నార్ధకమే. ఇప్పడు బసి బిల్లుకు మేం సంపూర్ణ మద్దతు తెలిపామంటూ బిఆర్‌ఎస్‌ చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. బిజేపి కూడా బిసి కార్డు వినియోగించుకునేందుకు ఏ మాత్రం వెనుకాడదు. ఇలాంటి పరిస్తితుల్లో కాంగ్రెస్‌కు ఏ మేర రాజకీయంగా ఉపయోగపడుతుందనేది ఎన్నికలు జరిగితే గాని తెలియకపోవచ్చు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అసవరం వుంది. లేకుంటే రాజకీయంగా ప్రయోజనం కన్నా, నష్టమే ఎక్కువ జరుగుతుంది. దశాబ్దాల బిసి పోరాటం ఇప్పుడు నిజమైంది. ఎంతో కొంత ఫలితాలు మోసుకొస్తుంది. బిసిలకు రాజకీయంగాఎంతో ఉపకరిస్తుంది. ఓసిల ఆధిపత్యం పల్లెల్లోనే కాదు, పట్టణాల్లో కూడ చాల వరకు తగ్గుతుంది. ఇంత ముందుకు జనరల్‌ అంటే ఓసిలే అన్నట్లుగా భావిస్తూ వచ్చేవారు. అందువల్ల బిసిలు పెద్దగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చే వారు. ఎవరైనా ముందుకొచ్చినా వారికి అవకాశాలు అంతగా దక్కేవి కాదు. కాని ఇప్పుడు అటు జనరల్‌లో అయినా, ఇటు బిసి రిజర్వేషన్లలో అయినా బిసిలకు తప్పని పరిస్ధితులత్లో టికెట్లు ఇవాల్సిన అవసరం ఏర్పడుతుంది. రాజకీయ పార్టీలు బిసి నాయకులకు జై కొట్టాల్సి వస్తుంది. ఇంత వరకు బాగానే వుంది. కాని ఇప్పటికిప్పుడు తెలంగాణలో రాజకీయ పరిస్ధితులు ఎలా వున్నాయన్నది కూడా ఎంతో ముఖ్యం. ఇప్పటికిప్పుడు పంచాయితీ ఎన్నికలు నిర్వహించడం ఏ మాత్రం మంచిది కాదు. పల్లెల్లో ఎవరు ఔనన్నా, ఎంత కాదన్నా కాంగ్రెస్‌కు అంత అనుకూలమైన పరిస్ధితులు లేవు. ఎంత గొప్పగా చెప్పుకున్నా రైతుల్లో కొంత నిస్తేజం ఆవహించి వుంది. పల్లెల్లో సాగు నీటి వసతి తగ్గింది. ఈ విషయం కాంగ్రెస్‌ పార్టీ కూడా అంగీకరించని పరిస్ధితి ఎదురౌతోంది. ఎన్నికల హామీల అమలుపై ప్రజల్లో అనేక సందేహాలున్నాయి. రైతు బంధు విషయంలో కాంగ్రెస్‌ మాటలకన్నా, బిఆర్‌ఎస్‌ మాటలే ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. రైతు బంధుపై అపోహలను ప్రజలకు వివరించే ప్రయత్నాలు కాంగ్రెస్‌పార్టీ నాయకులు, మంత్రులే చేయలేకపోతున్నారు. ఏక కాలంలో రైతు రుణమాఫీ జరిగిందన్న వాస్తవాలు కళ్లముందే వున్నా, అవి అందరికీ అందలేదన్న అసంతృప్తి కూడా వుంది. ఇక ఇ ందిరమ్మ ఇండ్ల విషయానికి వస్తే ఎంత వరకు కాంగ్రెస్‌ సక్సెస్‌ అవుతుందన్నదానిలో అంచనాలు లేవు. మరో వైపు కళ్యాణ లక్ష్మి వంటి పధకాలు అమలు జరుగుతున్నా, తులం బంగారం విషయం ప్రజల్లో అసంతృప్తి వుంది. ఇక నాలుగు వేల పింఛన్లపై అందుకుంటున్న వారిలో కూడా ఎప్పుడెప్పుడా అన్న ప్రశ్నలే నెలకొని వున్నాయి. ఇక రేషన్‌ కార్డులు ఇప్పటికిప్పుడు ఎంత మందికి అందుతాయన్నదానిపై పూర్తి క్లారిటీ లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినా సరే, అది ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టినట్లు కనిపించడం లేదు. ఇలా ఎన్నికల హమీల అమలుపై ప్రజల్లో అసహనం వుంది. ముఖ్యంగా రైతాంగానికి ఎంతో కొంత అసంతృప్తి వుంది. పదేళ్ల కాలంలో చెరవులు నిండుకుండుల్లా కాలంతో సంబంధం లేకుండా నీళ్లుండేవి. అవి కాంగ్రెస్‌ నేతలు కూడా అంగీకరించాల్సిన పరిసి ్దతి. చెరువులను ఎప్పటికిప్పుడు నింపే ప్రయత్నం చేస్తే తెలంగాణలో భూగర్భ జలాలు అడుగంటేవి కాదు. రైతులు కొత్తగా బోర్లు వేసుకునే పరిస్దితి వచ్చేది కాదు. ఇంకా వేసవి ముదరలేదు. పంటలు చేతికొచ్చే సమయం వరకు పంటల పరిస్దితి ఎలా వుంటుందో ఎవరూ చెప్పలేని పరి స్ధితి. గత పదేళ్ల కాలంలో అసెంబ్లీకి ఎండిన వరి కర్రలు కాంగ్రెస్‌ ఎప్పుడూ పట్టుకురాలేదు. కరంటు లేదని కందిళ్లు తెచ్చే అవసరం రాలేదు. ఇప్పుడు అవకాశం దొరికితే చాలు బిఆర్‌ఎస్‌ ఈ సమస్యలను ముందు పెడుతోంది. వానా కాలంలోనే చెరువులు నింపితే ఈ పరిస్ధితి వచ్చేది కాదు. బిఆర్‌ఎస్‌ మాట్లాడేందుకు అవకాశముండేదే కాదు. గత పంట కాలంలో రికార్డు స్ధాయి పంటలు పండినా, ఇప్పుడు ఒక్క ఎకరా ఎండినా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది.. అలాంటి సమయంలో బిసి బిల్లు తెచ్చిన సంతోషం నాయకుల్లో కనిపించినా, ఓట్లుగా మల్చుకోవడంతో కాంగ్రెస్‌ పార్టీ ఏ మేరకు కృషి చేస్తుందో చూడాలి. లేకుంటే బిసి బిసి బిల్లు పేరుతో పంచాయతీ గెలుపు బిఆర్‌ఎస్‌ చేతుల్లో పెడుతుందో చూడాలి. అంతే కాకండా ఇటీవల బిసి యువతకు సుమారు రూ.6వేల కోట్ల రూపాయలలో కొన్ని లక్షల మందికి రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. దరఖాస్తులు కూడా ఆహ్వానిస్తోంది. బిసిల నినాదం ఎంచుకొని అమలు దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్‌కు ఏ మేరకు సహకరిస్తారన్నది కూడా చూడాలి. మరో వైపు ఉద్యోగ కల్పనలో బిఆర్‌ఎస్‌ కన్నా ఒక అడుగు ముందుకు వేసి, ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఆ ప్రభావం కూడా స్ధానిక సంస్దల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కలిసి వస్తే మాత్రం తెలంగాణలో ఇక కాంగ్రెస్‌కు ఎదురుదండదు. తిరుగుండదు. చూద్దాం…బిసిలు ఎటు వైపు నిలుస్తారో..ఎటు వైపు నడుస్తారో…

మళ్లీ బీజేపీ `ఏఐడీఎంకేల మధ్య పొత్తు?

తమిళనాడులో మారుతున్న రాజకీయాలు

 అమిత్‌ షాను కలిసిన ఏఐడీఎంకే నేత పళనిస్వామి

 సినీనటుడు విజయ్‌ కొత్త పార్టీతో ద్రవిడ పార్టీలకు సరికొత్త సవాలు

 జయలలిత భజన ఏఐడీఎంకేకు ఎంతోకాలం లాభించకపోవచ్చు

 ఛరిష్మా నాయకుడు లేక కునారిల్లుతున్న పార్టీ

 స్టాలిన్‌ తర్వాత డీఎంకే పరిస్థితీ ఇంతే

 క్రమంగా ప్రజల్లో పట్టు సాధిస్తున్న సనాతనధర్మ వాదం

 బీజేపీతో మైత్రి తప్ప ఏఐడీఎంకేకు మరో మార్గంలేదు

 ఎన్నికలకు ఏడాదిముందునుంచే పదునెక్కుతున్న వ్యూహాలు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఒకప్పుడు కలిసుండి తర్వాత ఎడమొ హం పెడమొహంగా మారిన పార్టీలు ఎన్నికలు సమీపంలోకి వచ్చేసరికి, జ్ఞానోదయమై మళ్లీ ‘అవసరం’రీత్యా తిరిగి సన్నిహితం కావడం రాజకీయాల్లో అత్యంత సహజ పరిణామం. ఇక్కడ అధికారమే అవసరం కనుక విభేదిస్తే మునిగిపోతామన్న సత్యం రాజకీయ నాయకులను, శాశ్వత శత్రువులుగా కొనసాగనివ్వదు. ప్రస్తుతం తమిళనాడులో ఇదే జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చి లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఇప్పటినుంచే రాజకీయంగా హాట్‌హాట్‌ గా వున్న రాష్ట్రంలో పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయనడానికి మంగళవారం ఏఐడీ ఎంకే నాయకుడు పళనిస్వామి, కేంద్ర హోమంత్రి అమిత్‌ షాను ఢల్లీిలో కలవడం ఒక ఉదా హరణ. నిజానికి 2016లో జయలలిత మరణం తర్వాత ఏఐడీఎంకే, భారతీయ జనతాపార్టీతో జట్టు కట్టింది. అయితే ఈ రెండు పార్టీలు కలిసి పనిచేసినా 2019 లోక్‌సభ ఎన్నికలు, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అప్రతిహత విజయం సాధించిన తర్వాత ఈ పొత్తు అచ్చిరాలేదన్న ఉద్దేశంతో 2023లో పళనిస్వామి బీజేపీకి రాంరాం చెప్పారు. అయినప్పటికీ అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పలేదు. అయితే పొత్తు లేకపోవడంతో, బీజేపీ ఫైర్‌బ్రాండ్‌ అధ్య క్షుడుగా తనను తాను నిరూపించుకున్న మాజీ ఐపీఎస్‌ ఆఫీసర్‌ అన్నామలై, ఎన్నికల ప్రచారంలో ద్రవిడ పార్టీలను తన విమర్శల వాగ్ధాటితో చీల్చి చెండాడారు. ఈ ఎన్నికల్లో ఏఐడీఎం కే సోదిలో లేకుండా పోవడానికి, అన్నామలై అప్రతిహత విమర్శల దాడులే కారణమని తమిళ నాడు రాజకీయ పండితులు మాత్రమే కాదు, అన్నాడీఎంకేలోని తలపండిన నాయకులుకూడా అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అన్నామలై అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితను కూడా విమర్శించకుండా వదిలిపెట్టలేదు. జయలలిత భజనను నమ్ముకున్న ఏఐడీఎంకే నాయకులకు అన్నామలై వ్యవహారశైలి నచ్చకపోవడం కూడా పొత్తునుంచి విరమించుకోవడానికి ఒక కారణంగా చెబుతారు. పొత్తునుంచి బయటకు వచ్చినా ఏఐడీఎంకే గత లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయింది. బీజేపీకి రాష్ట్రంలో బలం లేదు కనుక పెరిగే ఓట్లశాతం పరంగా లాభం తప్ప, సీట్లు సాధించే స్థాయికి ఎదగలేదు. ఇక్కడ ఏఐడీఎంకేలో ఛరిష్మా నాయకుడు లేకుండా, ఇంకా జయలలిత భజనతో సీట్లు సాధించలేరన్నది గత ఎన్నికలు స్పష్టం చేశాయి. 

తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త మార్పు సినీ స్టార్‌ విజయ్‌ రూపంలో రాబోతున్నది. మరో సినిమానటుడు కమల్‌హసన్‌ ప్రభావం తమిళ రాజకీయాలపై లేదన్న సంగతి తేలిపోయింది. మరి విజయ్‌ ‘తమిళ వెట్రి కజగం’ (టీవీకే) అనే కొత్త పార్టీని పెట్టి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. తమిళనాడులో ఆయనకు గొప్ప పాలోయింగ్‌ వున్నదన్న సంగతి అందరికీ తెలిసినప్పటికీ, ఈ ‘ఛరిష్మా’ ఎంతవరకు ‘ఓటు బ్యాంకు’ను సృష్టిస్తుందనేది ఇప్పుడే చెప్పడం కష్టం. కాకపోతే ప్రస్తుతం ప్రధానంగా తలపడే రెండు ద్రవిడపార్టీల అవకాశాలను విజయ్‌ దెబ్బకొట్టే అవకాశాలే ఎక్కువ. గత ఎన్నికల పోరాటాల్లో ఘోరంగా ఓటమిపాలై తిరిగి సత్తువ కూడగట్టుకో లేని స్థితిలో ఉన్న ఏఐడిఎంకేపైనే విజయ్‌ ప్రభావం పడకూడదనేం లేదు. ఆయన అధికారంలోకి వస్తారా, రారా అన్నది కాదు ప్రశ్న. ఆయన చీల్చే ఓట్లు ఎవరి కొంప ముంచుతాయన్నది అసలు పాయింటు. ఈ లెక్కలు వేసుకున్న అన్నాడీఎంకే నాయకులు, తాము ముందుగా మేల్కనక పోతే పార్టీ అడ్రస్‌లేకుండా పోయే ప్రమాదం ఉన్నదని గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యమే పళనిస్వామి ఢల్లీిపయనం, అమిత్‌షాతో ములాఖాత్‌ జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. నిజం చెప్పాలంటే ఏఐడీఎంకేకు ప్రస్తుతానికి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఎందుకంటే ప్రస్తుతం అన్నామలై స్టార్‌ లీడర్‌గా ఎదుగుతున్నారు. ఆయన ప్రసం గాల ప్రభావం ప్రజలపై చాలా అధికంగా వుంటోంది. ఇదే ట్రెండ్‌ కొనసాగితే ఆయన నేతృత్వం లో బీజేపీ రాబోయే ఎన్నికల్లో మరింత పుంజుకొని తమిళ యవనికపై తన గుర్తింపును ప్రస్ఫు టంగా చూపగలిగే అవకాశాలే ఎక్కువ. ఇప్పటికే క్రమంగా ఓట్ల శాతం పెంచుకుంటూ వస్తున్న బీజేపీ రాబోయే ఎన్నికల నాటికి సీట్లు సాధించే స్థాయికి ఎదిగితే ఇక ద్రవిడవాదానికి ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం కూడా అన్నాడీఎంకే నేతల్లో వుంది. 

అధికార డీఎంకే కూడా ద్రవిడవాద పార్టీయే కనుక ప్రస్తుతం తనకున్న అధికార హంగు, ఆర్భా టాలతో బీజేపీని యధాశక్తి కట్టడిచేయడానికి అన్నిరకాలుగా ప్రయత్నాలు సాగిస్తోంది. భాషా వివాదం, డీలిమిటేషన్‌ సమస్యలు ఇందులో భాగమే. అయితే డీఎంకే ఇక్కడ భాష పేరుతో పెంచు తున్న వివాదం దానికే బూమరాంగ్‌ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో, ఉద్యోగావకాశాలు కేవలం తమిళనాడుకు మాత్రమే కాదు, భారతదేశం యావత్తు విస్తరించాయి. హిందీ, ఇంగ్లీషు భాషల్లో ప్రావీణ్యం వుంటేనే ఉద్యోగార్థులు రాణిస్తార న్న సత్యం ద్రవిడ పార్టీలకు తెలియంది కాదు. కాకపోతే భావోద్వేగ రాజకీయాలను నెరపడం ద్వారా తమ స్థానాన్ని పదిలం చేసుకోవడం వాటి లక్ష్యం తప్ప, నిజమైన భాషాభిమానం కనిపిం చదు. నిజమైన భాషాభిమాని అన్ని భాషలను సమానంగా ప్రేమిస్తాడు. తన మనుగడకు అవసర మైన ప్రతి భాషను నేర్చుకొని, జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి యత్నిస్తాడు. ప్రస్తుతం తమిళనాడులో పాతతరం వారికి భాషా దురభిమానం ఉపయోగపడినా, నేటి తరానికి ఈ వా దం ఎంతమాత్రం ఉపయోగకరమైంది కాదనేది క్షేత్రస్థాయిలో వెల్లడవుతున్న నిష్టుర సత్యం.

దేశవ్యాప్తంగా విస్తరించాలన్న లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్న బీజేపీ, తమిళనాడులో ద్రవిడవాదాన్ని ఎదుర్కోవడానికి సనాతనధర్మ వాదం అనే అస్త్రాన్ని ఉపయోగిస్తోంది. ఇది ఫలితాలనిస్తోంది కూడా. ఏఐడీఎంకేకు ఇది తెలియంది కాదు. ఏ వాదమైనా కొంతకాలం వరకే ప్రభావం చూపుతుందనేది చరిత్ర చెబుతున్న సత్యం. కొత్త వాదాల హోరులో పాత వాదాలు కొట్టుకుపోవడం సహజం. ఈ నేపథ్యంలో ఏఐడీఎంకే తన స్థానాన్ని కాపాడుకోవడానికి, బీజేపీ అధికాయకత్వంతో బేరసారాలు అడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే, దీన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించేందుకు ఒక ‘స్టీరింగ్‌ కమిటీని’ ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే నాయకులు కోరుతున్నట్టు తెలుస్తోంది. అంటే స్టీరిం గ్‌ కమిటీ పేరుతో అన్నామలే స్వేచ్ఛను కట్టడి చేయాలన్న వ్యూహాన్ని అనుసరిస్తున్నదని చెబుతు న్నారు. 

బుధవారం ఎడప్పాడి కె.పళనిస్వామి ఢల్లీిలో విలేకర్లతో మాట్లాడుతూ కేవలం రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరడానికి మాత్రమే తాను అమిత్‌ షాను కలిసానని యధాలాపం గా చెప్పినప్పటికీ, ఏ రాజకీయ ఉద్దేశము లేకుండా ఇటువంటి సమావేశాలు జరగవన్నది అందరికీ తెలిసిందే. న్యూఢల్లీిలో కొత్తగా ఏఐడీఎంకె పార్టీ ఆఫీసు ప్రారంభం పేరుతో వచ్చిన పళని స్వామి అమిత్‌ షాతో 45 నిముషాలు భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న భాషావివా దం, టీఏఎస్‌ఎంఏసీపై ఈడీ దాడులు, కోర్టులో ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేయడం వంటి అంశాలను చర్చించి, ముల్లయార్‌ పెరియార్‌ డ్యామ్‌ను పటిష్టం చేయడం, కావేరి, గోదావరి న దుల అనుసంధానంతో పాటు రాష్ట్ర సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం జోక్యాన్ని కోరినట్టు ఆయన చెబుతున్నప్పటికీ అంతర్గత వ్యూహం మాత్రం వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినది మాత్రమే అయివుంటుందన్నది తమిళనాడు రాజకీయాలను పరిశీలిస్తున్న వారికి ఇట్టే అర్థమవుతుంది. ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై విలేకర్లతో మాట్లాడుతూ అమిత్‌ సా`పళనిస్వామిల మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి మరింత విస్త రించే అవకాశాలున్నాయని చెప్పడం గమనార్హం.

నవోదయ ఫలితాల్లో గీతాంజలి డిజి.!

నవోదయ ఫలితాల్లో గీతాంజలి డిజి ప్రైమరీ విద్యార్థుల ప్రభంజనం

నర్సంపేట,నేటిధాత్రి:

 

2025 జనవరి న జరిగిన నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదల కాగా ఈ ఫలితాల్లో నర్సంపేట
పట్టణంలోని గీతాంజలి డిజి ప్రైమరీ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం సృష్టించారు.ఈ ఫలితాల్లో విద్యార్థులు పి. అభిరామ్, కే. అశ్విత మరియు వి. హిమబిందులు సీట్లు సాధించారని చైర్మన్ వేముల సుబ్బారావు గారు ఒక ప్రకటనలో తెలిపారు.తమ పాఠశాల విద్యార్థులు ఉన్నత విద్య కోసం సీట్లు సాధించడం చాలా సంతోషకరమని చైర్మన్ పేర్కొన్నారు.కష్టపడితే ఎప్పటికైనా ఫలితం దానంతట అదే వస్తుందనే దానికి నిదర్శనమని తెలిపారు.ఈ సందర్బంగా పాఠశాల లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీట్లు సాధించిన విద్యార్థులకు సన్మానం చేశారు.అనంతరం కష్టపడ్డ ప్రతీవిద్యార్ధికి,ఉపాధ్యాయులకు,సహకరించిన పోషకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సౌజన్య రావ్, వైస్ ప్రిన్సిపాల్ విమల,ఇంచార్జి జాగృతి, మాథ్స్ ఉపాధ్యాయులు రాజు, అశోక్, చిరంజీవిలు పాల్గొన్నారు.

తమిళనాడు లిక్కర్‌ స్కామ్‌లో కొత్త ట్విస్ట్‌

ఈడీ దాడులపై విచారణనుంచి తప్పుకున్న ఇద్దరు న్యాయమూర్తులు

వెయ్యికోట్ల స్కాం జరిగిందని ఆరోపిస్తున్న బీజేపీ

రూ.40వేల కోట్ల స్కామ్‌ అంటూ ఆరోపిస్తున్న ఏఐడీఎంకె నేత పళనిస్వామి

పెద్దఎత్తున అవకతవకలు జరిగాయంటున్న ఈడీ 

ఇది కక్షసాధింపుచర్య: డీఎంకె

డిఫెన్స్‌లో డీఎంకే

రాష్ట్రప్రభుత్వ సంస్థలపై విచారణకు ఈడీకి అధికారం లేదంటున్న డీఎంకె

భాషావివాదం రేపిన స్టాలిన్‌కు, లిక్కర్‌ స్కామ్‌ తలనొప్పి

హాట్‌హాట్‌గా తమిళ రాజకీయాలు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

రాష్ట్రప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న టీఏఎస్‌ఎంఏసీ శాఖలు, ఉద్యోగులపై ఈడీ అధికార్ల దాడులను ఆపాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ విచారణలో మార్చి 25న ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఈ కేసు విచారిస్తున్న ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌ ‘నిష్పాక్షికత సమస్య ఉత్పన్న మవుతున్నందున’ ఈ కేసు విచారణనుంచి తాము తప్పుకుంటున్నామని, మరో బెంచ్‌ దీనిపై విచారణ జరుపుతుందని పేర్కొనడం సంచలనం సృష్టించింది. ఇప్పటికే లిక్కర్‌ స్కామ్‌ విషయం తమిళనాడులో దుమారం సృష్టిస్తున్న నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తులు విచారణనుంచి తప్పుకోవడంతో ఈ కేసు విచారణపై మరికొంతకాలంపాటు య ధాతథ స్థితి కొనసాగనుంది. 

తమిళనాడు ప్రభుత్వ ఆధీనంలోని తమిళనాడు స్టేట్‌ మార్కెటింగ్‌ కార్పొరేషన్‌ (టీఏఎస్‌ఎంఏసీ) మరియు దాని అనుబంధ విభాగాల్లో మార్చి 6వ తేదీనుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తనిఖీలుకొనసాగుతున్నాయి. రాష్ట్రంలో లిక్కర్‌ అమ్మకాలను ఈ సంస్థే నియంత్రిస్తుంటుంది. ఈ సంస్థలో బోగస్‌ లావాదేవీలు నడుస్తున్నాయని, దాదాపు వెయ్యికోట్ల రూపాయల వరకు స్కామ్‌ జరిగిం దంటూ బీజేపీ, ఏఐడీఎంకే పార్టీలు చాలాకాలంగా తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్న నేప థ్యంలో ఈ దాడులు జరుగుతుండటం గమనార్హం. ఏఐడీఎంకే నాయకులు ఎడప్పాడి పళనిస్వామి ఏకంగా ఈ స్కామ్‌ మొత్తం రూ.40వేల కోట్లకు పైమాటేనని ఆరోపిస్తూ మరింత లోతుగా విచారిస్తే అసలు బాగోతం బయటపడుతుందని చెప్పడం విశేషం. చాలాకాలంలో అధికార, విపక్ష పార్టీల మ ధ్య ఈ లిక్కర్‌ స్కామ్‌పై పరస్పర ఆరోపణలు, విమర్శల దాడులు కొనసాగుతున్నా యి. ప్రస్తుతం ఈడీ జరుపుతున్న దాడులు ప్రధానంగా 2001`2006 మరియు 2011`2021 మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని డైరెక్టరేట్‌ విజిలెన్స్‌ అండ్‌ యాంటీ కరప్షన్‌ (డీవీఏసీ) నమోదు చేసిన కేసుల ఆధారంగా కొనసాగుతున్నాయనేది డి.ఎం.కె. నేతల ఆరోపణ. ఈ న మోదైన కేసులు అప్పటి ఏఐడీఎంకే మరియు డీఎంకే ప్రభుత్వాల హయాంలలో నమోదైనవేనని వారంటున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల యూనిట్లలో నమదైన దాదాపు 40 కేసుల ఆధారం గా ఈ దాడులు జరుగుతున్నాయని కూడా డీఎంకే నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఈడీ మాత్రం తమ తనిఖీల్లో అవకతవకలపై స్పష్టమైన ఆధారాలు లభించాయని పేర్కొంది. ఈ కేసుల్లో నమోదైన కేసులు ప్రధానంగా మూడు కేటగిరీలుగా వున్నాయి. మొదటిది నిర్దేశిత రిటైల్‌ ధరకంటే ఎక్కువ ధరకు అమ్మడం, రెండవది సరఫరా చేసినందుకు డిస్టిలరీ నుంచి వసూళ్లు చేయడం, ఇక మూడవది టీఏఎస్‌ఎంఏసీ సిబ్బంది బదిలీలకోసం జరిపిన వసూళ్లు. ఇదిలావుండగా తమిళనాడు ఎక్సైజ్‌ శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజీపై ప్రస్తుతం ఈడీ నిఘా కొనసాగుతోంది. టీఏఎస్‌ఎంఏసీ కేంద్ర కార్యాలయం, ఈ స్కామ్‌తో సంబంధమున్న ప్రైవేటు డిస్టిల్లరీ సంస్థలపై ఈడీ దాడులు నిర్వహించింది. ఈ స్కామ్‌లో డిస్టిల్లరీలు, అధికార్లు, రాజకీయనాయకులకు ప్రమే యమున్నదని ఈడీ పేర్కొంటున్నది. మరింత లోతైన విచారణ జరిపిన తర్వాత మరిన్ని అరెస్ట్‌లు కొనసాగే అవకాశముందని సంస్థ సూచనప్రాయంగా వెల్లడిరచింది. డీఎంకే నాయకుల ప్రమేయంపై మరింత లోతైన విచారణ జరుపుతామని పేర్కొంది. డిస్టిల్లరీలు, బాటిలింగ్‌ యూనిట్లలో పెద్దఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగాయని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికార్లు చెబుతున్నారు. అక్రమ చెల్లింపులు, అకౌంట్లలో చూపని నగదు, నకిలీ కొనుగోళ్లు వంటి అనేక గోల్‌మాల్‌ వ్యవహారాలు నడిచాయని ఈడీ పేర్కొంది. ఈవిధంగా అన్నిరకాల అక్రమాల ద్వారా రూ.వెయ్యికోట్ల మేర ‘లెక్కల్లో చూపని నగదు’ లావాదేవీలు జరిగాయని చెబుతోంది. అయితే దీనిపై విచారణ కొనసా గుతున్నదని ఈడీ పేర్కొంది.అయితే విషయం హైకోర్టుకు చేరడంతో ఈడీ కార్యకలాపాలకు తాత్కాలిక బ్రేక్‌ పడిరది.

డీఎంకే మాత్రం ఇదంతా కేవలం రాజకీయ కక్షసాధింపు మాత్రమేనని ఆరోపిస్తోంది. ఇటువంటి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాల ద్వారా డీఎంకేను దెబ్బకొట్టలేరని రాష్ట్ర న్యాయశాఖ మంత్రిఎస్‌. రఘుపతి పేర్కొన్నారు. పార్టీ ప్రతినిధి విలేకర్లతో మాట్లాడుతూ, ‘ఇంకా ఈడీ దాడులు మొదలుకాకముందే బీజేపీ అధ్య క్షుడికి రూ.వెయ్యికోట్ల స్కామ్‌ జరిగిందని ఎట్లా తెలుసు? ఢల్లీి, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అనుసరించే లిక్కర్‌ పాలసీలు, తమిళనాడుకు పూర్తి భిన్నం. అటువంటప్పుడు విచారణ పూర్తికాకముందే రూ.వె య్యికోట్ల స్కామ్‌ జరిగిందని ఈడీ ఎట్లా చెబుతుంది’ అని ప్రశ్నించారు.

ఈడీ దాడుల నేపథ్యంలో టీఏఎస్‌ఎంఏసీ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు అక్రమమని, వీటిని తక్షణం నిలిపేసేలా ఆదేశాలివ్వాలని’ కోర్టును అభ్యర్థించింది. మద్యం విధాన రూపకల్పన రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది కాబట్టి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తన అధికారపరిధిని దాటి ఈ దాడులకు పాల్పడుతున్నదని తన పిటిషన్‌లో పేర్కొంది. దీం తో ఈనెల 20న టీఏఎస్‌ఎంఏసీ అధికార్లపై ఏవిధమైన చర్యలు తీసుకోవద్దని అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎఆర్‌.ఎల్‌. సుందరేశన్‌కు మౌఖికంగా సూచిస్తూ జస్టిస్‌ ఎం.ఎస్‌. రమేష్‌, జస్టిస్‌ ఎన్‌. శాంతికుమార్‌లతో కూడిన బెంచ్‌, దీనికి కౌంటర్‌ దాఖలు చేయడానికి ఈడీకి మార్చి 25వరకుఅవకాశం ఇచ్చింది. అప్పటివరకు టీఏఎస్‌ఎంఏసిపై దాడులు జరపవద్దని ఈడీని ఆదేశించింది. విచిత్రంగా మార్చి 25న జరిగిన విచారణలో, ఈ ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌ ‘నిష్పాక్షికత సమస్య ఉత్పన్న మవుతున్నందున’ ఈ కేసు విచారణనుంచి తాము తప్పుకుంటున్నామని, మరో బెంచ్‌ దీనిపై విచారణ జరుపుతుందని పేర్కొనడం సంచలనం సృష్టించింది. దీంతో ఈడీ దాడుల విచారణపై మరికొంతకాలం సస్పెన్స్‌ కొనసాగనుంది. 

ప్రస్తుతం తమిళనాడులో కొనసాగుతున్న లిక్కర్‌ స్కామ్‌ వివాదం అధికార డీఎంకేను స్వీయరక్షణలో పడేసిందనేది సత్యం. బీజేపీ, ఏఐడీఎంకేలకు లిక్కర్‌ స్కామ్‌ ఒక ప్రధాన అస్త్రంగా మారింది. నిజానికి టీఏఎస్‌ఎంఏసీని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1983లో ఏర్పాటు చేసింది. లిక్కర్‌కు సంబంధించిన సర్వాధికారాలు ఈ సంస్థ చేతుల్లోనే వుంటాయి. ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే ఈ సంస్థ హోల్‌సేల్‌ మరియు రిటైల్‌ మద్యం పంపిణీ వ్యవహారాలను చూస్తుంది. ఆవిధంగా తమిళనా డులో మద్యం మొత్తం ప్రభుత్వ నియంత్రణలోనే కొనసాగుతుంటుంది. డిస్టిల్లరీలనుంచి మద్యాన్ని సేకరించి ప్రభుత్వం ఔట్‌లెట్‌ల ద్వారా పంపిణీ చేస్తుంటుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4700 ఔట్‌లెట్‌లుండగా, మొత్తం మద్యం పంపిణీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.45వేల కోట్ల మేర ఆదాయం లభిస్తుంది. ఆవిధంగా లిక్కర్‌ రాష్ట్రప్రభుత్వానికి ప్రధాన ఆదాయవనరుగా మారింది. అయితే టీఏఎస్‌ఎంఏసీ అనుసరిస్తున్న పద్ధతిలో పారదర్శకత లోపించడంతోపాటు, విపరీతమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఈడీ చేసిన దాడుల్లో టీఏఎస్‌ఎంఏసీలోని అవినీతి నెట్‌వర్క్‌ మొత్తం బయటపడినట్టు తెలుస్తోంది. ఇందులో రాజకీయ నాయకులు, అధికార్లు, మద్యం తయారీదార్లు కుమ్మక్కయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా అమ్మకాలు, టెండర్లు, మద్యం సేకరణ విషయాలో అవినీతి విపరీతంగా వున్నట్టు స్పష్టమైంది.

ఈడీ ప్రధానంగా తెలుసుకున్నట్టుగా చెబుతున్న అంశాలీవిధంగా వున్నాయి: 1. డిస్టిల్లరీలో మ ద్యం కొనుగోళ్ల రికార్డుల ను తారుమారుచేయడం. తద్వారా ధరలను విపరీతంగా పెంచేసి షెల్‌ కంపెనీల ద్వారా బదిలీచేయడం. కొన్ని కంపెనీలు బోగస్‌ ఇన్‌వాయిస్‌ల ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడటం. 2. లిక్కర్‌ తయారీదార్లు టీఏఎస్‌ఎంఏసీ అధికార్లకు విపరీతంగా లంచాలు ఇచ్చి మద్యం ధరలను ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారు. కొన్ని డిస్టిలరీ కంపెనీలకు ఇందులో ప్రధానపాత్ర వుంది. 3. సరైనపత్రాలు లేనివారికి కూడా బార్‌లైసెన్స్‌లు ఇష్టారాజ్యంగా ఇచ్చారు. కొ న్ని కంపెనీలకు అనుకూలంగా రవాణా టెండర్లు ఆమోదించడంవల్ల, ఏటా టీఏఎస్‌ఎంఏసీ ఇటువంటి కంపెనీలకు అక్రమంగా రూ.100కోట్ల వరకు చెల్లింపులు జరుపుతోంది. 3. కేవలం లెక్కల్లో చూపని నగదు లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రాజకీయ పార్టీలకు పంపడం. డిస్టిల్లరీ సంస్థలు ఎగ్జిక్యూటివ్‌లకు మరియు టీఏఎస్‌ఎంఏసీ అధికార్లకు మధ్య ప్రత్యక్ష లావాదేవీలను ఈడీ దాడుల్లో గుర్తించారు. అంటే ఇక్కడ క్విడ్‌ ప్రొ కో నడుస్తోంది. అంతేకాదు టీఏఎస్‌ఎంఏసీ స్టోర్లలో నిర్దేశిత ధరలకంటే 30 నుంచి 40శాతం అధిక ధరలకు విక్రయాలు జరుపుతున్నట్టు కూడా గుర్తించింది.

రేవంత్‌కు ఎదురులేదు..పొంగులేటికి తిరుగులేదు!

`అధిష్టానం వద్ద ఈ ఇద్దరికే ప్రాధాన్యం

`బిఆర్‌ఎస్‌ ను ఎదరించి నిలిచింది రేవంత్‌ రెడ్డి

`తొడగొట్టి సవాలు చేసి గెలిపించింది పొంగులేటి

`ఆరు నెలల్లో తెలంగాణ రాజకీయ వాతావరణం మార్చింది ఈ ఇద్దరే!

`ఆది నుంచి కేసిఆర్‌ మీద అలుపెరగని పోరాటం చేసింది రేవంత్‌ రెడ్డి

`నమ్మక ద్రోహానికి తగిన బుద్ధి చెప్పింది శ్రీనివాస్‌ రెడ్డి

`ఈ ఇద్దరు ఉత్తర, దక్షిణ దృవాలుగా పార్టీని నిలబెట్టారు

`పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ను గెలిపించి అధికారంలోకి తెచ్చారు

`అందుకే పార్టీ పెద్దలు రేవంత్‌ రెడ్డి నిర్ణయాలకే సై అంటున్నారు

`జీర్ణించుకోలేకపోతున్న కొందరు కీలక సీనియర్లు

`సీనియర్ల చెప్పుకునే గొప్పలన్నీ ఇక్కడే

`అధిష్టానం వద్ద వారి మాటలకు చెల్లు చీటే!

`సీనియర్ల మాటలు బారెడు..చేతలు మూరెడు

`ఇప్పటికే సీనియర్లు పదవులందుకున్నారు

`ఇంకా పెత్తనం కోసం పాకులాడుతున్నారు

`సిఎం. రేవంత్‌ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు

`పార్టీ బలోపేతానికి సీనియర్లు చేస్తున్న ప్రయత్నమేమీ లేదు

`పదవులు అనుభవించుకుంటూనే ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు

`అధిష్టానం వద్ద రేవంత్‌ రెడ్డికున్న ప్రాధాన్యతతో ఖంగుతింటున్నారు

`తమ మాట చెల్లు బాటు కావడం లేదని మధనపడుతున్నారు

`సీనియర్లమంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదు

`పదేళ్ల కాలంలో నాయకులు కాంగ్రెస్‌ ను వీడుతుంటే ఆపింది లేదు

`కారెక్కకుండా ఆపే ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు

`అధిష్టానానికి అబద్దాలు మోయడం మాత్రమే సీనియర్లకు అలవాటు

`పార్టీ కోసం త్యాగం చేయమంటే సీనియర్లు ఒక్కరు కూడా పార్టీలో వుండరు

`మేమే గొప్ప అని చెప్పుకునే వారిలో పార్టీని వీడి వచ్చిన వారున్నారు

`ఇంకా వాళ్లనే నమ్మితే పార్టీని నట్టేట్లో ముంచేస్తారు

`ఇప్పటికీ సీనియర్లకు ఇచ్చిన గుర్తింపే ఎక్కువ

                                  హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కాంగ్రెస్‌ పార్టీలోనేనే సీనియర్‌. నాకంటే సీనియర్‌ ఎవరూ లేరు. పార్టీలో నేనెంత చెబితే అంత. అదిష్టానానికి నేనంటే ప్రేమ. అని చెప్పుకోకపోతే రాజకీయాలు చేయలేరు. అలా ఇంత కాలం రాజకీయం చేసుకుంటూ వచ్చిన సీనియర్లకు ఇప్పుడు మింగుడు పడడం లేదు. వారి రాజకీయం చెల్లడం లేదు. వారికి తెలిసి ఏ పని జరగడం లేదు. అధిష్టానం వారి అభిప్రాయాలు తీసుకోవడం లేదు. వారిని సంప్రదించడం లేదు. గతంలో సీనియర్లు ఎప్పుడూ డిల్లీలో వుండేవారు. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూ వుండేవారు. కాని వారి వల్ల పార్టీకి ఒక్కశాతం కూడా లాభం వుండేది కాదు. అయినా వారికి పదవులు వస్తూ వుండేవి. ప్రాదాన్యత దక్కుతూ వుండేది. కాని ఇప్పుడు సీనియర్ల ఆటలు సాగడం లేదు. అంతో ఇంతో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ కాలంలో కూడా కొంత మంది పదవులు పొందేవారు. అధిష్టానం వద్ద సానుభూతిని పొందుతూ వుండేవారు. కాని తెలంగాణ వచ్చిన తర్వాత సీనియర్ల మాటలు నమ్మడానికి పార్టీ ఇష్టపడడం లేదు. వారి సూచనలు సలహాలు తీసుకోవడానికి సిద్దపడడం లేదు. ముఖ్యంగా రాహుల్‌ గాంధీ పార్టీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీనియర్లను అసలు పరిగణలోకే తీసుకోవడం లేదు. సరిగ్గా గత ఐదు సంవత్సరాలుగా సీనియర్లమని చెప్పుకుంటున్నవారికి అధిష్టానం సమయం కూడా ఇవ్వడం లేదు. డిల్లీకి వెళ్లిపడిగాపులు కాసినా వారి ముఖం కూడా చూడడం లేదు. ఇక రాష్ట్రంలో కాంగ్రస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఆ మాత్రం ఎంట్రీకూడా లేకుండా పోయింది. లేకుంటే ఇప్పటికే ఇల్లు పీకి పందిరేసేవారు. అయినా కొంత మంది సీనియర్లు అవకాశం దొరికితే చాలు ఏదో ఒకటి చెప్పాలని చూస్తున్నారు. కాని వారికి ఆ అవకాశం పార్టీ ఇవ్వడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిచిన వెంటనే లాబీయింగ్‌ చేయని నాయకుడు లేడు. సీనియర్లంతా మాకంటే, మాకే అవకాశమివ్వాలంటూ డిల్లీపెద్దలను కోరుతూ వచ్చారు. కాని పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే ఎంపిక చేసింది. అప్పటి దాకా మూడు రోజులపాటు సీనియర్ల హైడ్రామా నడిపారు. దాంతో వారిని పూర్తిగా ఇప్పుడే పక్కన పెట్టడం వల్ల ఆదిలోనే అపశృతులు వద్దనుకొని అధిష్టానం కొంత మందికి అవకాశమిచ్చింది. నిజానికి ఇప్పుడున్న మంత్రి వర్గంలో కూడా సీనియర్లు మరి కొంత మంది వున్నారు. కాని వాళ్లు ఎప్పుడూ డిల్లీ చెవుల్లో ఏదో చెప్పేందుకు వెళ్లేవారు కాదు. డిల్లీ పెద్దలు రమ్మంటే తప్ప వారి వద్దకు వెళ్లరు. అలాంటి వారితో వచ్చిన ఇబ్బందేమీ లేదు. కాని ఓ ముగ్గురు నలుగురు సీనియర్ల మూలంగానే పార్టీకి ఇంకా తిప్పలుతప్పడం లేదు. సీనియర్లమని చెప్పుకోవడం , పార్టీని వదిలిపెట్టి వెళ్లలేదని చెప్పడం తప్ప పార్టీ కోసం కష్టపడ్డామని చెప్పడానికి వారికి ఒక్క సాక్ష్యం లేదు. కాని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వచ్చిన నాటి నుంచి ఆయన చేసినంత పోరాటం ఎవరూ చేయలేదు. పైగా రేవంత్‌రెడ్డి పోరాటం చేస్తుంటే అడుగడుగునా అడ్డు పుల్లలు పెట్టారు. మాకంటే ముందు వెళ్తున్నాడని ఆయనకు బ్రేకులువేసే ప్రయత్నాలు చేశారు. రేవంత్‌రెడ్డి పిసిసి అయిన నాటి నుంచి ఆయనను ఏదో రకంగా ఇరుకన పెట్టాలని చూశారు. వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తూ మాట్లాడాల్సినన్ని మాటలు మాట్లాడారు. పిపిసి. కొనుక్కున్నారంటూ కూడా విమర్శలు చేసిన సందర్భం వుంది. ఓ సందర్భంలో నేనంటే కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ అంటే నేను అని పార్టీకి పేరు తెచ్చేలా రేవంత్‌రెడ్డి గొప్పగా చెబితే కూడా దాన్ని కూడా జీర్ణించుకోలేకపోయారు. వివాదం చేసి, పార్టీకి చెడ్డపేరు తెస్తున్నాడంటూ విమర్శలు చేశారు. అసలు ఆ మాట చెప్పుకోవడానికి రేవంత్‌ రెడ్డి ఎవరు అంటూ ప్రశ్నించారు. ఏకంగా పిపిసి. అధ్యక్షుడుగా రేవంత్‌ రెడ్డి వున్న సమయంలో మా ఉమ్మడి జిల్లాకు రావాల్సిన అవసరం లేదు అని కూడా కొందరు నాయకులు ప్రకటించిన సందర్భం వుంది. ఇక రేవంత్‌రెడ్డి పిసిసి ప్రెసిడెంటు అయిన తర్వాత ఆయన కింద మేం పనిచేయాలా అంటూ ప్రశ్నించిన వారున్నారు. పార్టీ అదికారంలోకి రాకముందు రేవంత్‌ రెడ్డి మీద సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎంతగా నోరు పారేసుకోవాలో అంత పారేసుకున్నారు. అసలు రేవంత్‌ రెడ్డి పెత్తనమేమిటంటూ ప్రశ్నిస్తూ వుండేవారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకుడంటూ కూడా ఎద్దేవా చేస్తూ వుండేవారు. కాని ఆయన బిఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన కాంగ్రెస్‌లో చేరారు. 2014 ఎన్నికల్లో ఓడిపోగానే బిజేపిలో చేరి మెదక్‌ నుంచి ఎంపిగా పోటీచేశారు. ఓడిపోయి, మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. కాని ఆయన పార్టీన సంగతి మర్చిపోయి, రేవంత్‌ రెడ్డిపై నోరు పారేసుకునేవారు. అయినా అవన్నీ ఏనాడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లెక్కపెట్టుకునేవారు కాదు. ఆయన లక్ష్యం వేరు. ఆయన ఆలోచనలు వేరు. ఇతర నాయకులు ఎంత మంది ఏది మాట్లాడినా ఎక్కడా పార్టీకి చెందిన నాయకుల మీద ఎలాంటి ఆరోపణలు చేసిన దాఖలాలు లేవు. అంతా మన మంచికే అన్నట్లు ఇన్నింటినీ చిరునవ్వుతో స్వాగతించేవారు. అలా పార్టీ కోసం పనిచేస్తూ, మరోవైపు అప్పటి బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మీద నిత్యం పోరాటం చేసిన ఏకైక నాయకుడు రేవంత్‌రెడ్డి మాత్రమే. కాంగ్రెస్‌లో ఇంత పెద్ద నాయకులున్నారు. కాని ఏనాడైనా, ఏ ఒక్క నాడైనా బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మీద పోరాటం చేసింది లేదు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గాని, కోమటి రెడ్డి వెంకటరెడ్డిగాని ఈ పదేళ్ల కాలంలో ఏనాడు జైలుకు వెళ్లలేదు. కనీసం అరెస్టు కాలేదు. ఎలాంటి ఉద్యమం చేపట్టలేదు. ఏ వర్గానికి కొమ్ము కాయలేదు. పోరాటాలకు శ్రీకారం చుట్టలేదు. కాని రేవంత్‌రెడ్డి ప్రతి నిత్యం పోరాటంచేశారు. ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. అలా ఆయన చేపట్టిన ఉద్యమాలకు హజరు కావడానికికూడా ఇష్టపడేవారు కాదు. ఓ సందర్భంలో కేసిఆర్‌ హాయాంలో వరి వేస్తే ఉరి అంటూ అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. దానికి నిరసనగా కేసిఆర్‌ పొలంలో వరి ఎందుకు వేశారంటూ రేవంత్‌ రెడ్డి ధర్నాకు పిలుపునిచ్చారు. ఆ సమయంలో నా జిల్లాలో నాకు తెలియకుండా కేసిఆర్‌ మీద పోరాటం చేయడానికి రేవంత్‌రెడ్డి ఎవరు? అని జగ్గారెడ్డి ప్రశ్నించిన సందర్భం వుంది. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక సమయంలో రేవంత్‌రెడ్డికి ఎదరుపడిన మీడియా అభ్యర్ధి ఎంపిక గురించి ఓ ప్రశ్న అడిగే సమిష్టి నిర్ణయం వుంటుందని చెప్పారు. ఆ మాట చెప్పడానికి రేవంత్‌రెడ్డి ఎవరు? అంటూ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మీడియా ముందు రేవంత్‌రెడ్డి పరవు తీసినంతపనిచేశారు. కాని ఇప్పుడు అందరూ సుద్దులు చెబుతున్నారు. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీద కూడా కావాలని కొంత మంది కుట్ర చేస్తున్నారు. ఆయనపై రకరకాల వివాదాలు సృష్టిస్తున్నారు. ఆయనపై ఆరోపణలు చేసేందుకు కొంత మంది పని గట్టుకొని మాట్లాడుతున్నారు. కాని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి లేకపోతే ఖమ్మం జిల్లాలో పార్టీలోనే కాదు, తెలంగాణలో 27 నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ గెలుపు కష్టమయ్యేది. ఉమ్మడి ఖమ్మంతోపాటు, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ వరకు సుమారు 27 నియోజకవర్గాలను తన కనుసన్నల్లో గెలిపించిన ఘనత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిది. ఆ సంగతి సీనియర్లు మర్చిపోతున్నారు. బిఆర్‌ఎస్‌ను ఖమ్మం నుంచి అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనంటూ శపధం చేసిన ఏకైక కాంగ్రెస్‌ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. అలా ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఖమ్మం మొత్తం సీట్లను గెలిపించుకున్నారు. పొరపాటున బిఆర్‌ఎస్‌నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావ్‌ను కాంగ్రెస్‌లోకి తెచ్చేశారు. అలా సీనియర్‌ నాయకులమని చెప్పుకుంటున్న వాళ్లెవరైనా చేశారు. ఒక్క నాయకుడినైనా బిఆర్‌ఎస్‌ నుంచి తెచ్చారా? బిఆర్‌ఎస్‌ అదికారంలో వున్నంత కాలం ఆ పార్టీకి కోవర్టులు అని ముద్ర వేయించుకున్న వాళ్లే కొందరు సినీయర్లు. వారికి చెందిన వారసులు కూడా ఇప్పుడు బిఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారు. అంటే వారికి పార్టీ మీద ఎంత చిత్తశుద్ది వుందో అర్దంచేసుకోవచ్చు. వారి నాయకత్వ పటిమ ఎంత బలంగా వుందో ఈ ఒక్క విషయంతో తెలుసుకోవచ్చు. మంత్రి వర్గ విస్తరణలో కూడా మాకంటే మాకే కావాలంటూ ఆ సీనియర్‌ నాయకులు కోరడం విడ్డూరం. అసలు కాంగ్రెస్‌పార్టీ పని అయిపోయిందని, బిజేపిలో చేరి అక్కడ ప్రాదాన్యత దక్కక తిరిగి కాంగ్రెస్‌లో చేరిన రాజగోపాల్‌రెడ్డి కూడా నేనే మంత్రిని అంటున్నారు. నాకు ఎన్నికల ముందు హమీఇచ్చారనిచెబుతున్నారు. ఇలాంటి వారికి కోసం బిసి. మహిళామంత్రికొండా సురేఖను పక్కన పెట్టేందుకుకూడా కుట్ర చేస్తున్నారన్న వార్తలువస్తున్నాయి. కాని అధిష్టానం అన్నీ గమనిస్తూనే వుంటుంది.పైగా దేశంలో అదికారంలోవున్న మూడు రాష్ట్రాలలో తెలంగాణ అత్యంత కీలకమైంది. అందవల్ల తెలంగాణలో ఏ నాయకుడు ఏమిటో అదిష్టానానికి అంతా తెలుసు. రేవంత్‌ రెడ్డి పార్టీని ఎంతకష్టపడి గెలిపించారో తెలుసు. అందుకు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎంత శ్రమించారో పార్టీ పెద్దలందరికీ తెలుసు. ఎందుకంటే అన్నీ వున్న విస్తరి అణిగి మణిగి వుంటుంది. ఏమీ లేని విస్తరులే ఎగిరెగిరి పడుతుంటాయన్న సామెతను మర్చిపోతున్నారు.

బంగ్లపల్లి లో ఉచిత పశువైద్య శిభిరం ఏర్పాటు.

బంగ్లపల్లి లో ఉచిత పశువైద్య శిభిరం ఏర్పాటు………….
చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్
గుమ్మడి శ్రీదేవి…………వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ ……….

మొగుళ్లపల్లి నేటి ధాత్రి

మండలంలోని బంగ్లపల్లి గ్రామంలో, వ్యవసాయమార్కెట్ కమిటీ చిట్యాల ఆధ్వర్యంలో. పశుసంవర్ధక శాఖ సౌజన్యంతో. ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గుమ్మడి శ్రీదేవి పాల్గొని మాట్లాడుతూ.

Chityala Market

మొగుళ్లపల్లి మండలంలోని రైతుసోదరులు తమ పాడి పశువులు ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉండేందుకు ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాట్లు చేశామని రైతు సోదరులు తమ పశువులను పశు వైద్య అధికారికి చూపించి డాక్టర్ సలహాలు పాటించి పశువులకు వ్యాధులు సోకకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు.ఆమెవెంట ఏ ఎం సి. వైస్ చైర్మన్ ఎండి రఫీ, డైరెక్టర్లు లింగయ్య, సతీష్ రెడ్డి, మార్కెట్ కమిటీ సెక్రటరీ కనుక .శేఖర్, మండల పశువైద్యాధికారి డాక్టర్.G. రాకేష్ శర్మ, ఎం .వెంకటేష్(జె వి వో), గోపాలమిత్ర శ్రీనివాస్, రాజన్న, అశోక్ , మార్కెట్ కమిటీ సిబ్బంది బొచ్చు రాజు, పడదల దేవేందర్ రావు, అల్లం సమ్మయ్య రైతు సోదరులు పాల్గొనడం జరిగింది.

మైనారిటీల కోసం తోఫా మర్చిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం.

మైనారిటీల కోసం తోఫా మర్చిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం.

• మైనార్టీలకు మోసం కాంగ్రెస్ ప్రభుత్వం..

• టిఆర్ఎస్ యువ నాయకుడు షేక్ సోహెల్…

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం మండల ఝరాసంగం టిఆర్ఎస్ యువ నాయకుడు షేక్ సోహెల్ మాట్లాడుతూ… మైనారిటీల కోసం తోఫా మర్చిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక మైనారిటీకి మంత్రి పదవి లేకపోవడం చాలా బాధాకరం మీకు మైనారిటీల ఓట్లు కావాలి కానీ మైనారిటీల మంత్రి పదవి వద్ద గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ మైనార్టీలకు తోహ ఇచ్చారు. మరియు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఈ ప్రభుత్వానికి మైనారిటీ అవసరం లేదా అని మీ యువ నాయకుడు షేక్ సోహెల్ ప్రశ్నిస్తున్నారు.

మద్యం బెల్ట్ షాపులపై గంజాయి పై దశలవారీగా పోరాటాలు.

మద్యం బెల్ట్ షాపులపై గంజాయి పై దశలవారీగా పోరాటాలు

డివైఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా కమిటీ

భూపాలపల్లి నేటిధాత్రి

 

జిల్లా అధ్యక్షుడు భూక్య నవీన్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ డివైఎఫ్ఐ జిల్లా మహాసభలు కొన్ని అనివార్య కారణాలవల్ల మే 25 26 కు వాయిదా వేయడం జరిగిందని దీనిని మేధావులు పెద్దలు మిత్రులు గమనించాలని ఈ మధ్యకాలంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మద్యం బెల్టు షాపులపై గంజాయి నిర్మూలన పై నూతన కార్యచరణకు ఈ జిల్లా కమిటీ శ్రీకారం చుట్టిందని ఇకనుంచి దశలవారీగా జిల్లాలో యావత్ యువకులను బానిసలను చేస్తూ వారి ప్రాణాలను కోల్పోయే విధంగా మనుషుల విలువలను దెబ్బతీసే విధంగా రోజు రోజుకు జిల్లాలో ఏరులై పారుతున్న మద్యం షాపులపై దఫళవారీగా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించిందని ఎన్నోసార్లు అధికారులకు వినతులు స్వయంగా పట్టించిన కూడా జిల్లాలు అధికారులేనట్టుగా నిమ్మకు నీరెత్తినట్లుగా జిల్లా యంత్రాంగం వ్యవహరిస్తుందని, దీనిపైన డివైఎఫ్ఐ అధికారులు సిండికేట్ యాజమాన్యాలు బెల్టు షాపులు కుమ్మక్కయ్యే యువకులను నాశనం చేసేందుకు ధనార్జినేయంగా వాళ్ళ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఈ దంధాలు నడిపిస్తున్నారని స్పష్టమైన అవగాహనకు వచ్చిందని అందుకోసమే ఈ జిల్లాలో యువకులు మద్యం తాగుతూ తద్వారా గంజాయి డ్రగ్స్ కూడా బానిసలు అవుతున్నారని దీనిపై అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూనే పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అంతవరకు డివైఎఫ్ఐ పోరాటాలు ఉంటాయని యువకులకు ఈ జిల్లాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సిమెంట్ కర్మాగారం గాని, కోల్ శుద్ధి కర్మాగారం, గాని ఉక్కు పరిశ్రమ, గాని ఏర్పాటు చేస్తే ప్రజల్లో ఆర్థిక ఇబ్బందులు ఉండమని యువకులు కూడా గంజాయి డ్రగ్స్ మద్యం నుంచి బయటపడతారని వీలైనంత త్వరగా ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే దీని మీద దృష్టి సారించి జిల్లాలో ఉన్న యువకులందరికి ఉద్యోగ ఉపాది అవకాశాలు కల్పిస్తూనే రోజురోజుకు పెరుగుతున్న మద్యం బెల్ట్ షాపులపై తక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తామని.
అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలు పడుతున్న సమస్యలపై త్వరలోనే సందర్శనలు చేసి సమగ్రమైన సమాచారంతో పోరాటాలు నిర్వహించబోతున్నామని ప్రభుత్వాసుపత్రుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి తెలియజేసేందుకు దశల వారి పోరాటాలు కూడా డివైఎఫ్ఐగా నిర్వహించబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం కవిత, గుడి కందుల దేవేందర్, బందు సుజాత, జిల్లా కమిటీ సభ్యులు, జ్ఞానేశ్వరి బుర్ర స్వాతి, అజ్మీర సరిత, ఎర్ర సుజాత, భాస్కర్లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

దక్షిణాదిపై డీలిమిటేషన్‌ కత్తి!

ఈ ప్రక్రియను మరో 25ఏళ్లు వాయిదా వేయాలంటున్న జేఏసీ

ఉత్తరాది రాష్ట్రాల నిర్లక్ష్యం, దక్షిణాదికి ఇబ్బందికరం

డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలకు దన్నుగా నిలవని ఉత్తరాది పార్టీలు

ప్రాంతీయ ప్రయోజనాలే ఇందుకు కారణం

బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు జట్టుకట్టలేవన్న సత్యం మరోసారి బట్టబయలు

గుంపులో గోవిందయ్య స్థాయికి దిగజారిన కాంగ్రెస్‌

దక్షిణాదికి తానే నాయకుడుగా ఎదగాలని స్టాలిన్‌ తహతహ

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై మార్చి 22న చెన్నైలో జరిగిన సమావేశంలో ఏడు రా ష్ట్రాలనుంచి ప్రజాప్రతినిధులు హాజరుకావడమే కాకుండా, ఈ అంశంపై ఒక జాయింట్‌ యాక్షన్‌ కమిటీని ఏర్పాటు చేయడం తాజా పరిణామం. ఈ జాయింట్‌ యాక్షన్‌ కమిటీలో తమిళనాడు, కేరళ, తెలంగాణ, పంజాబ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు కర్ణాటక, తెలంగాణ, ఒడిషాల నుంచి సీనియర్‌ నాయకులు సభ్యులుగా వున్నారు. తాము నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతి రేకం కాదని, కాకపోతే ఇది, సామాజిక న్యాయం, జనాభా నియంత్రణతో పాటు ఆర్థికాభివృద్ధి సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేవిధంగా వుండకూడదని సమావేశంలో పా ల్గన్న నాయకులు స్పష్టం చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల ప్రకారం తాము నియోజకవర్గాల పునర్విభజనను ఆమోదించలేమని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే పునర్విభజనలో పారదర్శకతల లేదంటూ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.ఆర్‌.సి.పి. అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి కూడా మార్చి 22న ప్రధానికి ఒక లేఖరాస్తూ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో పారదర్శకతను పాటించాలని కోరినప్పటికీ, ఈ సమావేశానికి తమ పార్టీ తరపున ప్రతి నిధిని పంపకపోవడం గమనార్హం. ఇక ఆహ్వానం అందిన పశ్చిమబెంగాల్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా తన ప్రతినిధులను పంపలేదు. ప్రస్తుతం తమ రాష్ట్రంలో ఓటర్ల గుర్తిం పు కార్డుల సమస్య కొనసాగుతున్న నేపథ్యంలో మరో సమస్యలో తలదూరిస్తే తమ రాష్ట్రసమస్య బలహీనపడుతుందని అందువల్లనే మిన్నకుండిపోయామని పార్టీ తెలిపింది. ఒడిషా మాజీ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ మాత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశంలో పాల్గనడం గమనార్హం. తమిళనాడు, అంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిషా, వెస్ట్‌ బెంగాల్‌, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ముందున్న సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తన మామూలు ధోరణిలో మాట్లాడుతూ ఈ పునర్విభజన ప్ర క్రియ దక్షిణాది రాష్ట్రాల నెత్తిన కత్తిలా వేలాడుతోందన్నారు. 1976నాటి కేంద్ర ప్రభుత్వ కు టుంబ నియంత్రణ విధానాన్ని చిత్తశుద్ధితో అమలుచేసిన ఈ రాష్ట్రాలను శిక్షించడం తగదని పే ర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఒక్కటైౖ నిలబడాలని కోరారు. ‘జనాభాపరంగా ఈ రాష్ట్రాలను శిక్షించడం అన్యాయ’మన్నది ఆయన వాదన. ఏతావాతా జాయింట్‌ యాక్షన్‌ కమిటీ మాత్రం 1971 జనగణన ప్రకారమే నియోజక వర్గాల సంఖ్యను కొనసాగించాలని, ఈ డీలిమిటేషన్‌ ప్రక్రియను మరో 25 సంవత్సరాల పాటు వాయిదావేయాలని స్పష్టం చేసింది. 

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 2021 జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనను చేప ట్టాలని భావిస్తోంది. అంటే ఇప్పటికే ఇది ఆలస్యమైంది. అందువల్ల 2026లో చేపట్టబోయే జనగణన ప్రకారం ఈ డీలిమిటేషన్‌ ప్రక్రియను చేపట్టాలన్నది కొందరి అభిప్రాయం. ఇందుకోసం మళ్లీ రాజ్యాంగ సవరణ చేపట్టాల్సి వుంటుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టడానికి కేవలం జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలు కూ డా వ్యక్తమవుతున్నాయి. జనాభా నియంత్రణ పాటించిన వివిధ రాష్ట్రాలు ఇప్పటికే కేంద్ర ఆర్థిక సంఘం కేటాయింపులు తగ్గిపోయి ఇబ్బందులు పడుతుండగా, ఇప్పుడు డీలిమిటేషన్‌ ‘బాంబు’ వాటిని మరింత ఆందోళనకు గురి చేస్తున్నది.

పరిశీలిస్తే చెన్నైలో జరిగిన ఈ డీలిమిటేషన్‌ వ్యతిరేక సమావేశానికి ఎన్డీఏ యేతర పక్షాల నుంచిపూర్తిస్థాయి మద్దతు లభించలేదన్న అంశం స్పష్టమైంది. ముఖ్యంగా ఫెడరల్‌ యాంటీ`బీజేపీ ఫ్రంట్‌ ఏర్పాటు విషయంలో అభిప్రాయ భేదాలు స్పష్టమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన స మాజ్‌వాదీ పార్టీ, బిహార్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జేడీ), పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్‌ కాంగ్రెస్‌లు గైర్హాజరీకి కారణాలు ఏమి చెప్పినా, డీలిమిటేషన్‌ వల్ల సీట్లు పెరిగి ప్రయోజనం కలుగుతున్నప్పుడు, సీట్లు తగ్గే దక్షిణాదికి మద్దతివ్వడానికి అవి ముందుకు రాలేదన్నదిస్పష్టమైంది. అయితే ఈ పార్టీలు గైర్హాజరైనప్పటికీ, దక్షిణాది రాష్ట్రాల సమావేశం తన అభిప్రా యాలను స్పష్టంగా వెల్లడిరచడంలో విజయం సాధించిందనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ఈ డీలిమిటేషన్‌పై ఇప్పటివకు ఎటువంటి రోడ్‌మ్యాప్‌ ప్రకటించలేదు. కాకపోతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా మాత్రం, ఈ డీలిమిటేషన్‌ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి అన్యాయం జరగబోదంటున్నారు. అది ప్రాతిథ్య పరంగానా లేక నైష్పత్తిక ప్రాతినిధ్య పరంగానా అన్న అంశాన్ని ఆయన స్పష్టం చేయలేదు. 

లోక్‌సభలో అన్ని ప్రాంతాలకు సరైన ప్రాతినిధ్యం లభించాలంటే జనాభానే ప్రాతిపదికగా తీసుకోవాలా అన్నది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే ఒక పౌరుడు, ఒక ఓటు అనే విధానంలో జనాభానే ప్రాతిపదికగా తీసుకోవాల్సివుంటుంది. కానీ స్వాతంత్య్రం వచ్చిన దగ్గరినుంచి నియోజకవర్గాల ఏర్పాటులో జనాభాను ప్రాతిపదికగా తీసుకున్న దాఖలాలు లేవు. పరిపాలనాపరమైన సౌలభ్యత,దేశంలోని అన్ని ప్రాంతాలకు సరైన ప్రాతినిధ్యం వుండాలన్న ప్రాతిపదికనే అనుసరించినట్టు గతాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. ముఖ్యంగా లక్షద్వీప్‌, లద్దాఖ్‌ నియోజకవర్గాలు ఈవిధంగా ఏర్పడినవే. జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే నియోజకవర్గ ఏర్పాటుకు తగినంత జనాభా ఈ ప్రాంతాల్లో లేదు. అందువల్ల భౌగోళిక ప్రాతిపదికన వీటి ఏర్పాటు జరిగింది. ప్రస్తుతం జనాభా ప్రాతి పదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే, దెబ్బతినేవి దక్షిణాది రాష్ట్రాలే. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్‌ ప్రక్రియపై జరుగుతున్న చర్చలు ప్రధానంగా రెండు అంశాలను తెరపైకి తెస్తున్నాయి. మొదటిది ఆర్థికం కాగా రెండవది జనాభా ప్రాతిపదిక. ఈ రెండు అంశాలు దేశ పురోభి వృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారాయనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఎందుకంటే జనా భా నియంత్రణను పాటించి, ఆర్థికాభివృద్ధి సాధించడమే కాకుండా ఉద్యోగావకాశాల కల్పనలో దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది కంటే ఎంతో ముందంజలో వున్నాయి. ఈ విషయంలో తీవ్ర నిర్ల క్ష్య వైఖరి అనుసరించిన ఉత్తరాది రాష్ట్రాలు పెరిగిన జనాభా భారంతో పాటు, పేదరిక వృద్ధి, కుంటుపడిన ప్రగతి వంటి అనేక అవలక్షణాలతో కునారిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ లేవనెత్తిన అంశాలను కేంద్రం తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి. కేవలం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళితే, ఉత్తర`దక్షిణ ప్రాంతాల మధ్య ప్రాధాన్యతల్లో తేడాలు ఏర్పడతాయి. 

చెన్నైలో జరిగిన సమావేశం ప్రాంతీయ పార్టీల్లో నెలకొన్న స్వార్థపరత్వాన్ని మరోసారి బహిర్గతం చేసింది. అంతేకాదు బీజేపీకి వ్యతిరేకంగా ఏకం కావడంలో కూడా వీటి చిత్తశుద్ధిని శంకించాల్సి వస్త్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఏదోవిధంగా ప్రముఖంగా ప్రచారంలో వుండాలని కోరుకుంటున్నారు. ఇందులో భాగమే భాషా వివాదం మరియు డీలిమిటేషన్‌ వివాదం. ఈ రెండు అంశాల్లో దక్షిణాదికి తనను తాను నాయకుడిగా ప్రచారం చేసుకోవడానికి తహతహలాడుతున్నారు. కానీ ప్రాంతీయ పార్టీలంటేనే కుటుంబ పార్టీలు, పక్కాగా స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తాయి. ఇక్కడ వాటికి బీజేపీకి వ్యతిరేకంగా జట్టు కట్టేకంటే, తమ ప్రయోజనాలు దెబ్బతినకుండా వుంటే చాలన్న ధోరణి మరోసారి బట్టబయలైంది. సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌జేడీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలు తమ ప్రతినిధులను చెన్నైకి పంప డం వల్ల డీలిమిటేషన్‌ ప్రక్రియలో ఆయా రాష్ట్రాలకు పెరిగే సీట్లు తగ్గిపోవు. తమ సహచర తమ సహచర రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నప్పుడు దన్నుగా నిలవకుండా తప్పించుకోవడం వాటికే చెల్లింది. ఇటువంటి పార్టీలు, దేశ ప్రయోజనాలకోసం పనిచేస్తాయని ఎట్లా అనుకోవాలి? జాతీయభావంలేని పార్టీల వల్ల దేశానికి తీరని నష్టం. ఎవరికి వారే నాయకులం కావాలనుకుంటారు పరస్పర సహకారం విషయంలో ముందుకు రారు. ఎప్పటికప్పుడు ప్రాంతీయ సమస్యలను లేవనెత్తి ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడం తప్ప, వీటివల్ల రాష్ట్రాలకు, దేశానికి ఎటువంటి ప్రయోజనం వుండబోదు. కుటుంబపాలనతో రాచరికాన్ని వెలగబెట్టడం తప్ప ప్రజా స్వామ్యం వీటికి ఎంతమాత్రం పట్టదు.

రోడ్డు నిబంధనలు పాటించని వారిపై చర్యలు.

“రోడ్డు నిబంధనలు పాటించని వారిపై చర్యలు”
– ఎస్సై సంగమేశ్వర్

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలని లేనిపక్షంలో నిబంధనలు పాటించని వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఝరాసంగం ఎస్సై సంగమేశ్వర్ తెలిపారు. జహీరాబాద్ నుండి రాయికోడ్ కు వయా ఝరాసంగం వెళ్లే ప్రధాన రోడ్డు పై మల్లన్న గట్టు కు వెళ్లే కూడలి రామయ్య జంక్షన్ వద్ద సోమవారం సాయంకాల సమయంలో పోలీస్ సిబ్బంది తో కలిసి వాహనాలు తనిఖీ చేశారు.

Ramaiah Junction

ఈ సందర్బంగా ఆయన వాహనదారులకు పలు సూచనలు సలహాలు చేసి, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడ్డ వారికి చలాన్లు వేశారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించి డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, సంబందిత పత్రాలు కల్గి ఉండి మంచి కండిషన్ గల వాహనల్ని నడపాలని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, మానవ ప్రాణం అత్యంత విలువైనదాని, అతి వేగంతో వాహనాల్ని నడపారాదని, రహదారులు పచ్చని చెట్ల నీడతో కప్పబడాలి తప్ప మనిషి రక్తంతో తడవకూడదని వాహనాలు ఢీకొనడం గాని రోడ్డు ప్రమాదాలు జరగడం వల్ల అంగ వికలాంగులు కావడం కుటుంబ సభ్యులకు దూరమావడం తన పై ఆధారపడ్డ వారికి దుఃఖం ను మిగిల్చకూడదని వారి జీవితం అగమ్య గోచరంగా మారుతుందని అందుకు
ప్రతి ఒక్కరు బరువుగా కాకుండా బాధ్యత గా హెల్మెట్ ధరించాలని సూచించారు. చిన్నపిల్లలకు బైకులు ఇవ్వరాదని మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని ఆయన సూచించారు.

కార్యదర్శులపై ‘పంచాయతీ’ భారం.

కార్యదర్శులపై ‘పంచాయతీ’ భారం…

ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి ఆగిన నిధులు

రెండున్నరేండ్లుగా స్టేట్ ఫైనాన్స్ నిధులూ వస్తలేవు

మెయింటెనెన్స్ పనుల కోసం సొంతంగా ఖర్చుపెడుతున్న కార్యదర్శులు

ఒక్కో సెక్రటరీపై రూ.3 లక్షల నుంచి 10 లక్షల దాకా అప్పు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపో వడంతో కేంద్రం నుంచి పల్లెలకు రావాల్సిన నిధులు ఆగిపో యాయి. నిరుడు జనవరి నుంచి ఇదే పరిస్థితి, ఇటు రెండున్న రేండ్లుగా రాష్ట్రం నుంచి స్టేట్ ఫైనాన్స్ నిధులు కూడా రావడం లేదు. మరోవైపు ఆస్తిపన్నులు వసూలు కావట్లేదు. దీంతో పం చాయతీల నిర్వహణ భారం కార్యదర్శులపై పడింది. నిధుల్లేక పల్లెల్లో అభివృద్ధి పనులు చేసే పరిస్థితి లేదు. పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరా, ట్రాక్టర్ మెయింటనెన్స్, డీజిల్, ట్యాంకులు క్లోరినేషన్, బ్లీచింగ్, మోటార్ల రిపేర్ లాంటి పనులకు సెక్రటరీలు తమ జేబుల్లోంచి ఖర్చు చేయాల్సి వస్తున్నది. రెండేండ్లుగా ఇదే పరిస్థితి ఉండడంతో ఒక్కొక్కరు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా అప్పులు చేశామని కార్యదర్శులు వాపోతున్నారు. అప్పులు తెచ్చిపనులు చేస్తున్నాకొందరు ఉన్నతాధికారులు ఫీల్డ్ విజిట్ పేరుతో ఎక్కడో ఓ లోపం పట్టుకొని తమపై చర్యలు తీసు కుంటున్నారని, ఇది ఎంత వరకు సమంజసమని సెక్రటరీలు ప్రశ్నిస్తున్నారు.

Panchayat

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ మేరకు కనీసం స్టేట్ ఫైనాన్స్ నిధులైనా విడుదల చేసి అప్పుల బాధ నుంచి తమకు విముక్తి కల్పిం చాలని కోరుతున్నారు.

పంచాయతీలకు రూ.6,500 కోట్లు పెండింగ్

పంచాయతీలకు గతేడాది ఫిబ్రవరిలో పాల కవర్గాల గడువు ముగిసింది. ఏడాది దాటినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు ఆగిపోయాయి. అలాగే, కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం రూ.1,514 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. పాలకవర్గాలు కొ లువుదీరితే తప్ప ఈ నిధులు వచ్చే పరిస్థితి లేదు. రెండున్నరేండ్లుగా దాదాపు రూ.5 వేల కోట్ల స్టేట్ ఫైనాన్స్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదు. గత బీఆర్ఎస్ హయాం నుంచే ఈ పరిస్థితి ఉంది. అప్పటి సర్పంచులు అప్పు చేసి పల్లెలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టగా, దానికి సంబంధించిన బిల్లులు నేటికీ చెల్లించకపోవడం తో వారు ఇబ్బందులు పడుతున్నారు. 15 నెలల కింద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పంచాయతీలు గాడిన పడ్తాయని అందరూ భావించారు. గతంలో కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులైనా వచ్చేవి. కానీ, ఎన్నికలు జరగ కపోవడంతో ఆ నిధులు కూడా రాకపోవడంతో పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్లు అయింది.

నిర్వహణ భారమంతా కార్యదర్శులదే

సర్పంచుల పదవీకాలం ముగియడంతో పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తున్నది. ఒక్కో అధికారికి నాలుగైదు గ్రామాల బాధ్యతలు ఉండడంతో ఇప్పుడు పంచాయతీల నిర్వహణ భారమంతా పంచాయతీ కార్యదర్శలపై పడింది. కేంద్రం, రాష్ట్రాల నుంచి ఫండ్స్ రాకపోవడం. టార్గెట్ మేరకు ఆస్తిపన్నులు వసూలు కాకపోవ డంతో కార్యదర్శులే అప్పులు చేసి పంచాయతీల ను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఇంటింటా చెత్త సేకరణకు ట్రాక్టర్ను గ్రామంలోకి పంపాలంటే అందులో డీజిల్ పోయించాల్సి ఉంటుంది.
నెలనెలా డీజిల్ కు రూ.10 వేల నుంచి 20 వేలకు పైగా ఖర్చుచేయాల్సి వస్తోంది. చాలా గ్రామాల కు మిషన్ భగీరథ నీళ్లు అందడం లేదు. దీంతో లోకల్ బోర్లు, మోటార్లు, పైపుల రిపేర్లు చేయించక తప్పట్లేదు. రహదారులపై మొరం పోయించడం, గుంతలు పూడ్చడం, మొక్కలకు నీళ్లు పట్టడం, స్ట్రీట్ లైట్ల నిర్వహణలాంటి పనులు సరేసరి. ప్రత్యేక అధికారుల పాలనలో ఏ చిన్న మీటింగ్ జరిగినా తమ జేబు నుంచే పెట్టుకో వాల్సి వస్తోందని కార్యదర్శులు వాపోతున్నారు. ఇలా ఒక్కో నెలకు రూ.50 నుంచి రూ.80 వేల వరకు, పెద్ద పంచాయతీలకు రూ.లక్ష నుంచి రూ. ఐదు లక్షల వరకు మెయింటెనెన్స్ ఖర్చవు తున్నదని చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా అప్పు చేశామని వాపోతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version