
దుర్గమ్మ సేవలో ఎంపీ వద్దిరాజు
విజయవాడ, అక్టోబర్, 4: దసరా నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిలోని కనకదుర్గ అమ్మవారిని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అమ్మవారికి కానుకలు సమర్పించి, తీర్ద ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన ఎంపీ రవిచంద్ర, ఆయన సతీమణి విజయలక్ష్మి, కూతురు గంగా భవాని లను అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అంతరాలయంలో రాజ రాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఎంపీ కుటుంబ…