సీఎం రేవంత్ రెడ్డి మండలంలో కారు జోరు..

ఎంపీ అభ్యర్థికి మద్దతుగా కొడంగల్ గ్రామ ప్రజలు..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా…
కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలంలోని నాచారం, తోగపూర్, సర్జఖన్ పేట గ్రామంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి కి మద్దతుగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.ఆ గ్రామం లోని మహిళలు హారతులతో ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డికి స్వాగతం పలికారు.
కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి పాల్గొని కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు…
కార్యక్రమానికి రాష్ట్ర మాజీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వేంకటేశ్వర రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు,రైతులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మన్నే శ్రీనివాస్ రెడ్డి కి మద్దతు పలికారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!