జి సి సి, వైస్ చైర్మన్ గా బుచ్చక్క ఖరారు అయినట్టే.?
ఆదివాసి గిరిజన బిడ్డల నాయకురాలుగా సేవలు ఎన్నో.
గిరిజన ఆదివాసి గ్రామాలకు అభివృద్ధిని నోచుకునేలా చేసింది బుచ్చక్క.
నలుగురు జిసిసి డైరెక్టర్లు బుచక్క కు మద్దతుగా.!?
ప్రశ్నించకుండా అమాయక వైస్ చైర్మన్ కొరకు డైరెక్టర్లను ఒక అధికారి పోగు చేస్తున్నట్లు సమాచారం.!?.
మహాదేవపూర్ -నేటి ధాత్రి:

గిరిజన సహకార సంస్థ జి సి సి డైరెక్టర్ల ఎన్నికలు పూర్తి కావడం జరిగింది. జిసిసి పరిధిలోని ఐదు మండలాలకు సంబంధించిన గిరిజన ఆదివాసి సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకొని డైరెక్టర్లను ఎన్నుకోవడం జరిగింది. జిసిసి మహదేవ్పూర్ పరిధిలో ఐదు మండలాలకు ఐదుగురు డైరెక్టర్లను ఎన్నుకోవడం జరిగింది. వాటిలో మహిళా రిజర్వేషన్ యునాని మాస్ గా ఇద్దరు మహిళలు డైరెక్టర్లుగా నియమితులు కాక సోమవారం రోజున ముగ్గురు డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఎన్నికల్లో ఏడుగురు సభ్యులు డైరెక్టర్లకు పోటీ చేయగా, మహాదేవపూర్ నుండి ఒక డైరెక్టర్, మహా ముత్తారం మండలం నుండి ఇద్దరు డైరెక్టర్లు గెలుపొందడం జరిగింది. గిరిజన సహకార సంస్థ వైస్ చైర్మన్ గా డైరెక్టర్లు ఎన్నుకొనుటకు పొన్నగాలు ప్రారంభం కావడం జరిగింది. జిసిసి వైస్ చైర్మన్ నియామకం ప్రస్తుతం ఒక ట్రెండ్ గా మారింది. ఇతర ఎన్నికల విధంగా జిసిసి వైస్ చైర్మన్ పదవి కొరకు గెలుపొందిన డైరెక్టర్ లతోపాటు జిసిసి ఓ అధికారి కూడా తమ కనుసైగల్లో ఉండే వైస్ చైర్మన్ కొరకు పావులు కలుపుతున్నట్లు విశ్వనీయ సమాచారం.
—————–
గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో 5 మండలాలకు సంబంధించిన ఆదివాసి గిరిజన కుటుంబాలకు ఎంతో అండగా ఉండి వారికి విద్యా ఉపాధి పై ప్రత్యేక దృష్టి సాధించి అటవీ ఉత్పత్తుల కొనుగోలు అటవీ ఉత్పత్తుల కొరకు ప్రోత్సాహం, ఇలాంటి మరెన్నో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల నిధుల నుండి ఆదివాసి గిరిజన కుటుంబాలకు అండగా ఉంటుంది. ప్రస్తుతం జిసిసి అనేక సంవత్సరాలుగా వైస్ చైర్మన్ ఎన్నికైనప్పటికీ ఆదివాసి గిరిజనులు ట్రైబల్ కుటుంబాలకు, వైస్ చైర్మన్ యొక్క ఉపయోగం విధులు తెలువకపోవడంతో ఆదివాసి గిరిజన కుటుంబాలు అభివృద్ధికి నోచుకోలేదని ప్రస్తుతం గిరిజనులు చెప్పుకుంటున్న విషయం. ఇదే క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిసిసి నిధులు అందించి ఉపాధి విద్య తోపాటు ప్రత్యేకంగా మహాదేవపూర్ మండలంలో పెట్రోల్ బంక్ తో పాటు స్వయం సహాయక యూనిట్లను మంజూరు చేయడం, ఇప్పటికే కొందరు విద్యావంతులుగా ఉన్న ఆదివాసి గిరిజనులు, పథకాలను పొంది ఉపాధి పొందడం జరుగుతుంది.
—————–
ఐదు మండలాలకు సంబంధించిన గిరిజన సహకార సంస్థ డైరెక్టర్ల ఎన్నికల్లో మాజీ ఎంపీపీ పలిమెల మండలానికి చెందిన కురుసం బుచ్చక్క డైరెక్టర్ గా జినానిమాస్ ఎన్నిక కావడం జరిగింది. పలివెల నూతన మండలం ఏర్పడిన అనంతరం మొట్టమొదటి గిరిజన ఆదివాసి మహిళా ఎంపీపీగా బుచ్చక్క గిరిజన ఆదివాసి గ్రామ ప్రజలకు అనేక అభివృద్ధి పథకాలతో పాటు, ఆదివాసి గిరిజనుల కుటుంబాల్లో చైతన్యం, గిరిజను ఆదివాసి ప్రజల గొంతువై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి కొరకు అనేక నిధులు పథకాలను పలిమెల మండలం తో పాటు ఇతర ఆదివాసి గ్రామాలకు అంతేగా చూసిన ఘనత కూడా కురుసం బుచ్చక్కకు దక్కింది. ఒక ఆదివాసి బిడ్డ అయిన కురుసం బుచ్చక్క అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ లో పదవులు లేకున్నప్పటికీ కూడా ఆదివాసి గిరిజనుల సమస్యలపై పోరాడటం లో వెనుకడుగు వేయలేదని ఇప్పటికీ పలివెల మండలం తో పాటు నికిత ఆదివాసి గిరిజన ప్రాంతాల్లో చెప్పడం జరుగుతుంది. ఇదే క్రమంలో ప్రస్తుతం జీసీసీ పరిధిలో ఐదు డైరెక్టర్లు ఉండగా నలుగురు డైరెక్టర్లు కురుసం ఉచ్చక్క వైస్ చైర్మన్ నియమించుటకు ముగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.
——————
మరోవైపు గిరిజన సహకార సంస్థ 5 మండలాల పరిధిలో తమ రేషన్ షాపుల నిర్వహణ, హెచ్.పీ గ్యాస్ సప్లై, తోపాటు ఎంఎల్ఎస్ గోడౌన్, ప్రస్తుతం జీసీసీ పరిధిలో ఉంది, మరికొద్ది రోజుల్లో గిరిజన సహకార సంస్థకు పెట్రోల్ బంక్ సైతం కేటాయించడం జరిగింది. ఇలా జిసిసి సంస్థ ఐదు మండలాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ తో పాటు ఇతర ఆదాయ వనరులు సమకూర్చడంలో కాస్త ఎక్కువ మోతాదులో పాత్ర పోషించడంతో, వైస్ చైర్మన్ జిసిసి చేతుల్లో ఉండేలా అమాయకులను వైస్ చైర్మన్ గా నియమిస్తే ప్రశ్నించేవారు ఎవరు ఉండరని జిసిసి ఓ అధికారి భావించి డైరెక్టర్లను తమ వైపు పోగు చేసుకోవడం లో నిమగ్నమై ఉన్నట్లు సమాచారం. కానీ ప్రస్తుతం జీసీసీ వైస్ చైర్మన్ ఎన్నిక గతంలో సాధారణ సొసైటీ ఎన్నికలు కాకుండా గిరిజన సహకార సంస్థ 5 మండలాల్లో తన పాత్ర క్రియేషీలక పోషించడంతో గిరిజన్
నుల్లో కూడా చైతన్యం కలగడంతో ప్రస్తుతం వైస్ చైర్మన్ రాజకీయంగా, విద్యావంతులుగా, సమాజ సేవ అనుభవం ఉన్న వారిని వైస్ చైర్మన్ గా ఎన్నుకొనుటకు గిరిజనులు ఆదివాసీల కోరిక, వీటిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికైన డైరెక్టర్లు మాజీ ఎంపీపీ కురుసం బుచ్చక్క వైపు మొగ్గు చూపడం జరుగుతుందని ప్రస్తుతం మహదేవపూర్ పలివెల మండలంలో హాట్ టాపిక్ గా నడుస్తుంది.