బిఆర్ఎస్ మాజీ సర్పంచి భర్తతో సహా 20 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని గుంటూరు పల్లె గ్రామ బిఆర్ఎస్ మాజీ సర్పంచి భర్తతో సహా దాదాపు 20 మంది బిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది, ఈ సందర్భంగా పువ్వాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి మా గ్రామంలోని బిఆర్ఎస్ కార్యకర్తలు అందరం మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అన్నారు, రానున్న రోజుల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని అన్నారు, బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు పువ్వాటి రాని వెంకటేశ్వర్లు మాజీ సర్పంచ్, పువ్వాటి వెంకటేశ్వర్లు, కొంక అప్పారావు, మన్యం శ్రీనివాసరావు*( బుజ్జన్న ), ఆదినారాయణ, కడియాల సాంబశివరావు, కడియాల పూర్ణచందర్, కడియాల వెంకన్న, నర్రెచౌదరయ్య, నర్ర వెంకటయ్య, నల్లూరి శ్రీనివాసు, దాదాపు 20 మంది బిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరినారు.