
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో మునిగల రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ నాలుగుసార్లు గెలిచిన కేటీఆర్ తన బాధ్యతను మర్చిపోతే ఎన్నికల్లో ఓడిన ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కేటీఆర్ కు బాధ్యతలు గుర్తు చేశారని ప్రజల్లో కష్టసుఖాల్లో పాలుపంచుకొని సిరిసిల్ల అభివృద్ధికై కృషి చేస్తుంటే అధికారం కోల్పోయి దోచుకోవడానికి వీల్లేకుండా పోయిందని అందుకే నేతలకు నిద్ర పట్టడం లేదని ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచామని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామని అలాగే గతంలో మీ ఆస్తులు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ప్రజలందరికీ తెలుసునని కేటీఆర్ మోచేతు నీళ్లు తాగి మాట్లాడటం సరికాదని సరైన సమయంలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మట్టి ఇసుక దందాలు చేస్తూ సహజ సంపాదన దోచుకుని ఎలా ఎదిగారు ప్రజలకు తెలుసునని అలాగే మీరు చేసిన అభివృద్ధితో మీరు రండి అభివృద్ధి పేరుతో అక్రమ చిట్టాలతో మేము వస్తాం మీరు ఎక్కడికి రమ్మన్నా మీ సిద్ధమని అలాగే ప్రశ్నించేటప్పుడు అబండాలు వేయరాదని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో లింగాల భూపతి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మచ్చ శ్రీనివాస్ కర్ణాకర్ కొత్త రవి గుగ్గిళ్ళ శ్రీకాంత్ మోర లక్ష్మీరాజు ఎగుర్ల ప్రశాంత్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు హమీద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు