Congress Slams BRS Over False Allegations
అసత్య ఆరోపణలతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్న బిఆర్ ఎస్ పార్టీ
సిరిగిరి సురేష్
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్
కొత్తగూడ,నేటిధాత్రి:
గత కొన్ని రోజులుగా ప్రభుత్వంపై, ముఖ్యంగా రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణభివృద్ధి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మహాత్యులు ధనసరి అనసూయ సీతక్క గారి పై వస్తున్న అవినీతి ఆరోపణలు కేవలం రాజకీయ ఉద్దేశంతో కూడుకున్నవని
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్ కొట్టిపారేశారు. పారదర్శకమైన పాలన అందిస్తుంటే, ఓర్వలేక ప్రతిపక్షాలు మరియు బిఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం నాయకులు స్వార్థ ప్రయోజన శక్తులు పనిగట్టుకొని మంత్రి సీతక్క పై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని వారు మండిపడ్డారు.
వాస్తవాలు ఇవే..నిరాధారమైన ఆరోపణలు: ఏ ఒక్క ఆధారమూ లేకుండా కేవలం మాటలతో నైతిక ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది.పారదర్శక టెండర్లు ప్రభుత్వంలో ప్రతి పైసా ఖర్చు డిజిటల్ రూపంలో, పారదర్శకమైన టెండర్ల ప్రక్రియ ద్వారానే జరుగుతోంది. ఇందులో అవినీతికి తావులేదు.ప్రజల మద్దతు క్షేత్రస్థాయిలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా చేరుతున్నాయి. ఈ విజయాలను చూసి భయపడే ఇలాంటి తప్పుడు కథనాలుసృష్టిస్తున్నారు.చట్టపరమైన చర్యలు తప్పవు ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా, మంత్రి సీతక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం
అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే శక్తులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.మేము చేసే ప్రతి పని ప్రజల సాక్షిగా, చట్టబద్ధంగానే జరుగుతోంది. ఇలాంటి గాలి వార్తలను ప్రజలు ఎవర నమ్మరని బిఆర్ ఎస్ పార్టీ నాయకులు ఇకనైనా బుద్ది మర్చికొని అభివృద్ధి లో భాగం కావాలని లేని యెడల ప్రజలే వచ్చే ఎన్నికలో తగిన బుద్ది చెప్తారని ఆయన హెచ్చరించారు…..
