గృహప్రవేశంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలం మేదపల్లి గ్రామానికి చెందిన యాకూబ్ షరీఫ్ ( రఫ్ షరీఫ్ ) నూతన గృహప్రవేశ వేడుకకు శుక్రవారం ఝరాసంగం గ్రామ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు పాల్గొనీ అన్నదాన కార్యక్రమంలో హాజురై తీర్థప్రసాదాలు స్వీకరించారు.యాకూబ్ రఫ్ షరీఫ్ శాలువా పూలమాలలతో సన్మానించారు అనంతరం గ్రామస్తులతో కూర్చుని కాసేపు మాట్లాడిన నాయకులు. ఈ కార్యక్రమంలో నూతన సర్పంచ్ వినోద బాలరాజ్ మాజీ సర్పంచ్ జగదీశ్వర్ మాజీ ఎంపీటీసీ సంతోష్ రజిని ప్రియ పటేల్ మాజీ ఎంపీపీ సంఘన్న పటేల్ మాజీ ఎంపీటీసీ విజయేందర్ రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ ఎజాస్ బాబా మేదపల్లి గ్రామ మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పటేల్ బూమ్ బూమ్ జావిద్ గ్రామస్తులు పార్టీ కార్యకర్తలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
